మూత్రం చికిత్సతో ఆరోగ్యం!!

మన ఆరోగ్యానికి సంబందించిన ఔషదాలలో మూత్రం ఒకటి. మూత్రం తో చికిత్చ చిచి అని అంటున్నారు కదా. మీరు అవునన్నా కాదన్నా మూత్రం తో చికిత్చ ఉందని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. మనకు అనారోగ్యం వస్తే ఎక్కడి కైనా వెళ్లి మందు తెచ్చు కుంటాము.ఆ మందు వేసుకున్నాకే రోగం తగ్గిందని భావిస్తాము.లేదా కొన్ని సందర్భాలలో ఆ మందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఖచ్చితంగా మనశరీర తత్వానికి సరిపడుతుందా అన్నదే ప్రశ్న?  అయితే మన ఆరోగ్యానికి శరీరానికి ఖచ్చితంగా సరిపడే మందు మనశరీరం లోనే ఉంది అని అంటున్నారు నాడి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. దానినే మూత్ర చికిత్చ.చిచి ఇదేం చికిత్చ అని మాత్రం అనుకోకండి సుమా ఇది అక్షరాలా నిజం.మన పూర్వీకులు మనకు అందించిన చికిత్చ గా ఏర్కొన్నారు.కృష్ణం రాజు.మన శరీరంలో జరిగే ప్రక్రియ ప్రకారం మనం నిద్రపోయే సమయం లో విష పదార్ధాలు వ్యర్ధ పదార్ధాలు కణాలతో పోరాడి వాటిని తొలగిస్తుంది.అలాగే ప్రత్యేక అవసరాలకు సరైన ఔషదాన్ని తయారు చేసుకుంటుంది.అదే మనకు అధిక మోతాదులో ఉదయం లేవగానే పోసే మూత్రం లో ఉంటుంది.ఈ రకం గా ఉదయాన్నే మొదటి సారి విడుదల అయ్యే మూత్రాన్ని తాగడం ద్వారా మనశరీరం యొక్క అవసరాలు,లవణాలు,వగైరా లభిస్తాయని ఇదే మూత్ర చికిత్చ యొక్క మూల సిద్దాంతం గా పేర్కొన్నారు.దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మూత్ర చికిత్చకు మూలాధారం ఏమిటి?.. మూత్ర చికిత్చ గురించి శివపురాణం లో,మహాభారాతం లో బైబుల్ లోనూ మతగ్రంధాలలో ఈ మూత్రము జీవామృత మని  వ్రాయ బడిందని అంటున్నారు.శివపురాణం లో దానిని మూత్రం తాగే విధానం చాలా బాగా తెల్పబదిందని కృష్ణం రాజు పేర్కొన్నారు.ఇందుకు ఉదాహరణగా పూర్వాకాలం లో నేరస్తులు మూత్రం తాగడం వల్ల వారిని పోలీసులు తీవ్రంగా హింసించినా ఏమి అనిపించేది కాదు.అలా కొన్ని రోజులు ఏ ఆహారం  తీసుకోకపోయినా వారు అలాగే దృడంగా ఆరోగ్యంగా ఉండగలిగే వారని అలాగే దీని ఆధారంగానే దీర్ఘకాలం ఉపవాసం ఉన్నా రంటే దానికి కారణం మూత్రం తాగడమే అని  పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే తాగమని భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి సెలవిచ్చారని వారి మూత్రాన్ని వారే  4౦ ఏళ్ళు తాగారని కృష్ణం రాజు గుర్తుచేశారు. అలా మూత్రాన్ని తాగుతూ 1౦౦ సంవత్సరాలు తీసుకుంటూనే ఉన్నరన్న విషయం దేశప్రజలకు బహుశా గుర్తుండి ఉండవచ్చని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.ఎవరి మూత్రం వారే సేవించడం సెల్ఫ్ యురిన్ తాగడం మంచది అన్న అంశం పై యు ఎస్ ఏ కు చెందినా డాక్టర్ బీ బ్రైసు చార్టర్ రాసిన పుస్తకాలాలో ఈ అంశాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు.శాస్త్రీయం గా నిరూపితమైందని కృష్ణం రాజు వాడుతున్నారు.  స్వయం గా మూత్రాన్ని ఎలా వాడాలి?... ఉదయం నిద్ర లేవగానే మొదటి సారి విడుదల చేసిన మూత్రం లో కొన్ని చుక్కలు పోనివ్వాలి. అప్పుడు ఒక శుభ్రంగా ఉన్న గ్లాసులోమూత్రాన్ని పట్టి త్రాగాలి.దీనిని ఇన్ టేక్ అప్లికేషన్ అని అంటారు దీనిని ఎక్స్  టర్నల్ అంటే పై పూతగా కూడా వాడచ్చుఅని అంటున్నారు కృష్ణం రాజు.ఇందుకు ఉదాహరణగా వాడవచ్చనిఅంటే ఎక్కడైనా రక్త శ్రావం అవుతున్నప్పుడు లేదా చర్మ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు,ఫేషియల్ అనేక సమస్యలకు సెల్ఫ్ యురిన్ స్వీయ మూత్రం వాడవచ్చని కృష్ణం రాజు విశ్లేషించారు. అసలు మూత్రం సేవిస్తే వచ్చే ఫలితాలు... ఎవరి మూత్రాని వారు తాగడం వల్ల ఆశ్చర్య కరమైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు. మీరు స్వీయ మూత్రం వినియోగించే ముందు ముందుగా దానిని దయ చేసి పరీక్షించాలని సూచించారు.ఎందుకంటే మనం వాడే మందుకు తినే తిండికి ఎక్కడైనా కాలుష్యం లేదావిష తుల్య మైతే ప్రామాదమని.ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు ఇతర చికిత్సలకు మందులు  వాడుతున్న వారు సెల్ఫ్ యురిన్ అంటే స్వీయ మూత్రం త్రగావద్దని అయితే పై పూత గా వాడవచ్చని వివరించారు.స్వీయ మూత్ర చికిత్చ వాడేందుకు ఎలాంటి ఖర్చులు,డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదని అయితే మూత్రాన్ని పరీక్షించిన తరువాత మాత్రమే ఉపయోగించాలని డాక్టర్ కృష్ణం రాజు సూచించారు. .

నాల్గో వేవ్ వచ్చేసిందా?

కోవిడ్ నాల్గో వేవ్ వస్తుందని అంచనా నిజమైందా అంటే నిజమే అని రుజువు చేస్తునాయి. అని అంటున్నారు నిపుణులు.ఇందుకు ఉదాహరణగా కోవిడ్ వ్యవహారం లో ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా కేసులు పెరగడం గమనించవచ్చు అని అంటున్నారు నిపుణులు.చాలా నెలల తరువాత భారత దేశం లో లక్షకు పైగా కేసులు పెరగడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.గత 24 గంటలలో భారత్ లో కోవిడ్ కేసులు 18,818 వెలుగు చూసాయని ఈ సంఖ్య గత నాలుగు నెలల క్రితం కన్నా ఎక్కువే అమెరికాలో ఒమైక్రాన్ నూతన వేరియంట్స్ బిఏ4 బిఏ5 కేసులు పెరగడం వెనుక కారణాలు పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు.ఒమైక్రాన్ కొత్త వేరియంట్ -పేరెంట్ వేరియంట్ కన్నా చాలా తీవ్రమైనదని ఈ కారణంగానే కేసులు త్వరితగతిన పెరుగుతున్నాయని భారత్ లో మహారాష్ట్రా తమిళనాడు లో బిఏ4 బి ఏ5 కేసులు వెలుగు చూసాయి. త్వరితగతిన విస్తరిస్తున్న బిఏ4 బిఏ5... సి డి సి విడుదల చేసిన డాటా ఆధారం గా కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తోందని వేరియంట్లు చాలా సులభంగా ఇమ్యునిటీ యాంటి బాడీ లను  బురిడి కొట్టించి వ్యాపించేందుకు విస్తరించేందుకు సహకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎవరైతే వ్య్సక్సిన్ లేదా బూస్టర్ వేయించు కున్న వారిలో కోరోనా ఇన్ఫెక్షన్ సోకుతుంది కరోనా విస్తరణకు బిఏ4 బిఏ5 కారణమని నిర్ధారించారు.  బిఏ4 బిఏ5 లక్షణాలు ఎలా ఉంటాయి?ఎలా గుర్తించాలి?... బిఏ4 బిఏ5 నుండి వ్యాక్సిన్లురక్షిస్తాయా?... వైద్య నిపుణులు అనుకుంటున్నట్లు గా వ్యాక్సిన్ అందరికీ అందించాలని, వ్యాక్సిన్ అందరికీ అందేవిధంగా ప్రణాలికలు రూపొందించుకుని వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేప్పట్టిన విషయం తెలిసిందే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వైరస్ ప్రభావం మరింత తీవ్రం కాకుండా కొంత మేర రక్షించ వచ్చు అని అంటున్నారు  నిపుణులు. భారత్లో వస్తున్న కొత్త వేవ్ నుండి ఎలారక్షించుకోవాలి?... ఎవరైతే కోవిడ్ లక్షణాలు ఉన్నాయాని భావిస్తున్నారో వారు పరీక్షలు చేయించుకోవాలి.నూతన వేరియంట్లు గుర్తించడం మరింత సులభం అవుతుంది అని నిపుణులు అంటునారు.ఇన్ఫెక్షన్ విస్తరించకుండా నిలువరించ వచ్చు.అందుకోసం అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.ఎప్పుడైతే మహమ్మారి ప్రారంభ మైందో అప్పుడే అప్పుడే డబ్ల్యు హెచ్ ఓ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేసింది. పరిశుభ్రత పాటించాలి... మనం ప్రతిరోజూ చేతిని శుభ్రంగా కడుక్కోవాలి ఇంటినుండి బయటికి వెళ్ళేటప్పుడు సేనితైజర్ ను వినియోగించాలి.తద్వారా కోవిడ్ విస్తరణకు అడ్డు కట్ట వేయచ్చు మన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చేతితో కడగకండి.అయితే భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోండి.అని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించండి... చాలా పరిశోధనలలో నిరూపిత మైన అంశం ఏమిటి అంటే మాస్క్ కోవిడ్ విస్తరించకుండా సంక్రమించకుండా అప్పుతుంది.సహకరిస్తుంది. కరోనా వైరస్ నివారణలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవో ఆసమయం లో మాస్క్ ప్రజలను రక్షించింది  వ్యాక్సిన్ బూస్టర్... ఇప్పటివరకూ వ్యాక్సిన్ మాత్రమే కోవిడ్ నుండి రక్షిమ్పబడే ఏకైక మార్గమని వ్యాక్సిన్ తో మాత్రమే కోవిడ్ వ్యాప్తిని సంక్రమించకుండా నివారించగలిగామని నియంత్రించ గలిగామని ఇన్ఫెక్షన్ తీవ్రం కాకుండా నిలువరించగలిగా మని నిపుణులు అభిప్రాయ పడ్డారు. కొత్త వేరియంట్ వచ్చినవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి... ఆరోగ్య నిపుణుల వైద్యుల వివరాల ప్రకారం ఎవరైతే సబ్ వేరియంట్ బారిన పడ్డారో వారు తీవ్ర జ్వరం,ముక్కు కారడం,లేదా ముక్కు బిగుసుకు పోయినట్లు ఉండడం,నీరసంగా అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ లక్షణాలు దాదాపు ౩-4 రోజులు ఉంటుంది లక్షనాలలో గొంతు నొప్పి,జ్వరం,ఒళ్ళు నొప్పులు,అలసటతో ప్రారంభ మౌతుంది.ఆతరువాత దగ్గు గొంతులో ఒకరక మైన ఇరి టేషన్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ లక్షణాల తీవ్రత పెద్దగా ఉండదని కోవిడ్ నుండి మనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.                                                                  

పీల్చే గాలే ప్రాణం తీస్తోంది....

ప్రపంచం లో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం  ప్రమాద ఘంటికలు మొగిస్తోందని వాతావరణం ప్రభావం అంశం  పై శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో  వివిధరకాల వాతావరణాలు,   వాతావరణ కాలుష్యం వల్ల కొన్నిరకాల గుండె శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తేల్చారు. వాతావరణం లో పేరుకు పోయిన కొన్నిరకాల అణువులు పార్టికల్స్, రసాయనాల ప్రభావం తో ఊపిరి తిత్తులలో అస్తమా  వంటి సమస్యలు మానవులను చుట్టుముడుతున్నాయని అవి ప్రాణాలను హరిస్తున్నాయని ఒక ఆధ్యయనం లో వెల్లడించారు. ప్రపంచం లో పెరుగుతున్న పట్టణీకరణ,పారిశ్రామికీకరణ ఆధునికత పేరుతో మనకు మనం గా ప్రకృతిని నాశనం చేస్తూ సృష్టిస్తున్న రసాయన వ్యర్ధాలు వివిదరకాల ఉద్ఘారాల వల్ల వాతావరణం లో మార్పులు రేడియేషన్ వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతోంది అని నిపులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, సైతం రసాయనాల చేరికతో కాలుష్యం తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రపంచం లో వెలుస్తున్న గ్రీన్ హౌస్ లు సాంకేతికత వృద్ధిలోభాగంగా పుట్టుకొస్తున్న ఉద్గారాల వల్ల భూమిపై రేడియేషన్ పెరిగి వివిద రకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. --మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుంది అనడం లో సందేహం లేదు. ఒక పరిశోదనలో కొన్ని ప్రాంతాలలో లేదా ప్రత్యేక ప్రాంతాలలోనివసిస్తున్న వారి ఆనారోగ్యం పాలవుతున్నారని. తద్వారా మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. ---ఇందులో కొన్ని కారణాలను కారకాలను పేర్కొన్నారు.గాలి కాలుష్యం,ఇంధనం ఎక్కువగా వినియోగించడం వల్ల వచ్చే పొగల ప్రభావం  గుండె సంబంధిత సమస్యలు మరణాల సంఖ్యకు కారణం అవుతోందని నూతన పరిశోదన వెల్లడించింది. శాస్త్రజ్ఞులు చేస్తున్న వాదన లలో మన వాతావరణం లో వస్తున్న మార్పులు కాలుష్యం వల్లే మన ఆరోగ్యం పెను ప్రమాదం లో పడిందని మరణాలకు దారి తీస్తుందని పరిశోదన వెల్లడించింది.  మరణాలకు కారణాల పై  అధ్యయనం... చాలా ప్రాంతాలలో శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు ప్రజలకు ప్రమాదకర మైన,,రేణువులు,గాలిలో ఉండడం,రసాయనాలు, ఇతర కారకాలు ప్రమాద కరం గా మరాయని మరణాలకు గల కారణాలను అధ్యయనం తెలిపింది .గుండె సంబందిత సమస్యల వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల జరిపిన ప్లాన్ వన్ వాతావరణ కాలుష్య కారకాలు మరణాలు కేవలం గుండె సంబంధిత మరణాల పై పరిశోదనలు చేయడం విశేషం. పరిశోధకులు గుండే సంబందిత మరణాలకు చాలానే కారణాలు ఉన్నాయని గాలి ఇంటిలో కాలుష్యం కూడా కారకంగా తేల్చారు. ఆరోగ్యం పై వాతావరణ ప్రభావం... చాలా రకాల కారకాలు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయని ఉదాహరణకు జనటిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని.కొన్నిరకాల డిజార్డర్స్ లేదా వ్యాధులకు  దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.ఏది ఏమైనప్పటికీ ప్రజలు వారి వ్యవహార శైలి వ్యాధులకు కారణం ఔతోందని వాతావరణం ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు. డబ్ల్యు హెచ్ ఓ లెఖల ప్రకారం 24%మరణాలు కేవలం వాతావరణం కారణమని నిర్ధారించారు. డబ్ల్యు హెచ్ ఓ కొన్నిరకాల వాతావరణ వాస్తవాలు మరణాలకు  దోహదం చేశాయని ఈకింద పేర్కొన్న అంశాలు ఉన్నాయని విశ్లేషించారు. *గాలి కాలుష్యం. *నీటి కాలుష్యం. *అపరిశుభ్రత. *హానికారక రసాయనాలు. *తీవ్రమైన వాతావరణ మార్పులు ప్రభావం ఎండవేడిమి పెరగడం,అత్యధిక శీతల వాతావరణం తో తీవ్ర సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అని నిపుణులు తేల్చారు. గాలి కాలుష్యం... గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకరం.అని అది ఊపిరి తిత్తులను గుండెను ప్రభావితం చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు.గాలిలో ఉండే రేణువులు శరీరంలో నుండి వ్యక్తి లోకి చేరి వారిలో మెదడు సంబంధిత సమస్యలకు కారణం అవుతోందని నిపుణులు నిర్ధారించారు. మెదడులో ఫ్లూయిడ్స్ గుర్తింపు... ఒక పరిశోదనలో కాలుష్యపు అణువులను మెదడులో ఉన్న ఫ్లూయిడ్స్ లో గుర్తించినట్లు దీనికారణం గానే బ్రెయిన్ డిజార్డర్స్ కు కారణంఅవుతున్నట్లు  నిపుణులు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఎలుకల పై చేసిన పరిశోదనలో కాలుష్యపు రేణువులు మానవుల ఊపిరి తిత్తుల నుండి రక్తం లోకి చేరుతుందని ఆకారణం గా మెదడులో రక్త ప్రవాహం లో ఏదైనా సమస్య తల ఎత్తి ఉండవచ్చు అని నిపుణులు తేల్చారు.గాలి కాలుష్యం కారణంగానే ఊపిరితిత్తులు గుండె సమస్యలకు కారణమని నిర్ధారించారు. నష్ట నివారణ సాధ్యమా ? నష్ట నివారణ సాధ్య మేనా -అన్నది ఒక పెద్ద ప్రశ్న కాలుష్య నివారణ సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. బెర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు చైనా సంస్థలు చేసిన పరిశోదనలో వాతావరణ కాలుష్యం నుండి వచ్చిన టో క్సిన్స్ రేణువులు మెదడుకు చేరతాయని కనుగొన్నారు. 25 మంది ప్రజల పై చేసిన పరిశోదనలో సేరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ను పరీక్షించగా రకరకాల మానసిక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అందులోనూ రకరకాల టాక్సిక్స్ ఉన్నట్లు సేరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ౩2% రోగుల రక్తం లో ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్నవారి వద్ద నుండి 26 రక్త్గం నమూనాలు సేకరించినట్లు ఒక వ్యక్తిలో కొన్ని రకాల టో క్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించి నట్లు తెలిపారు. పరిశోదనలు చేసిన బర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇసెల్ట్ లిగ్నిచ్ మాట్లాడుతూ మా పరిశోదనా జ్ఞానం వాతావరణం లో పుట్టుకొచ్చే ప్రామదకరమైన కాలుష్య ప్రభావం వల్ల గాలిద్వారా వ్యాపించే ఇతర రేణువులు పార్టికల్స్ ముఖ్యంగా మెదడు నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించడం వల్లే మెదడు పని తీరు  బలహీన పడి  శ్వాస సంబందిత సమస్యలు శరీరాన్ని చుట్టుముట్టి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు. వాతావరణ కాలుష్యం ప్రధాన అంశం... పి ఎం 1౦ పార్టికల్స్ 1౦ మైక్రోన్స్ ఇందులో గాలి ద్వారా వైరస్ బ్యాక్టీరియా, పొగ, ఇతర దుమ్ము ధూళి వంటి కారకాలు ఉండవచ్చు. --పి ఎం 2.5 లో కొన్నిరకాల పార్టికల్స్ 2.5 మైక్రాన్ల లో విద్యుత్ ఉత్పదక కేంద్రాల నుండి వెలువడే ధూళి,పొగలు వాహనాల నుండి వెలువడే పొగ ఇతర రసాయనాలు ఉన్నాయని తేల్చారు. ౦.1 పార్టికల్స్ వంటివి మానవుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని అది శరీరంలో వీటిని ఎదుర్కొనే శక్తి అంతర్గత బద్రత లేదా ఇతర ఫారెన్  బాడీలు  రోగనిరోదక శక్తి చాలా బలహీన మౌతోంది. ఇటీవల జరిగిన పరిశోదనలో సైతం ౦.1 మైక్రన్స్ రేణువులు అక్సిడెంట్స్ ఒత్తిడి ,గుండె సంబంధిత  టాక్సీటీ కి కారణంగా తేల్చారు. రానున్న భవిష్యత్తులో ఎదురయ్యే కాలుష్య సమస్యలను ఎదుర్కోడానికి సంపూర్ణ ఆరోగ్యానికి ఇప్పటినుండే నిర్దిష్ట ప్రణాళికల అమలుకు ప్రతిఒక్కరు సిద్దం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి-అటు ప్రజలు-స్వచ్చంద సంస్థలు ఉద్యమ స్పూర్తితో ప్రయత్నం చేస్తే తప్ప కాలుష్య రహిత ప్రపంచాన్ని సృష్టించాలేమని పేర్కొన్నారు. కాలుష్య రహిత ప్రపంచానికి ప్రతిఒక్కరు కృషిచేయాలి శాస్త్రజ్ఞుల పిలుపు.    

కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. చ‌నిపోతున్న అడవి పందులు..

వైరస్ ఇక మనుషుల నుంచి కాక జంతువుల నుంచి వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం శాస్త్రజ్ఞులను వేదిస్తున్న పెద్ద సమస్య. వైరస్ లు ఇక జంతువుల నుండి వచ్చే అవకాశాని  కొట్టి పారేయలేము అని అన్న కొద్దిరోజులకే కేరళలో ఆంత్రాక్స్ కలకలం ప్రజలలో తీవ్ర ఆందోళనకు  కారణమౌతోంది. ఆంత్రాక్స్ ఒకప్పుడు ఆ పేరు వింటేనే మనకు నరకం,  ప్రాణం పోయినంత పని అయ్యేది. గతంలో మన ఇంటికి వచ్చే పార్సిల్స్ లో ఆంత్రాక్స్ పొడిని పంపి నట్లు తెలిపెవారు. ఆరకంగా ఆంత్రాక్స్ కు భయపడే వారు ఆంత్రాక్స్ తో చనిపోతా మేమో అని ఆందోళనకు గురియ్యే వారు. ఆరకంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఆంత్రాక్స్ ఇప్పుడు కేరళలో వెలుగు చూసిందని  ప్రభుత్వ  అధికారులు వెల్లడించారు. తిరువనంతపురం లో ఇటీవల అధికసంఖ్యలో అడివి పందులు  మరణించాయని కేరళ లోని అతిరా పిల్లి అటవీ ప్రాంతం లో కొన్ని రోజులుగా ఇలా జరుగుతోందని, దీనికి కారణం ఆంత్రాక్స్ సోకడమే అని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కేరళా ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ అడవి పందులలో ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అతిరా పిల్లి అటవి ప్రాంతం లో పెద్ద సంఖ్యలో జంతువులు మరణించడం తీవ్ర ఆందోళనకలిగిస్తోందని.ఈమేరకు అధికారులు అటవీ ప్రాంతం లో సేకరించిన నమూనాల ఆధారంగా ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ గా తేల్చారు అని జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంత్రాక్స్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆంత్రాక్స్ బ్యాక్టీరియా సహజంగానే భూమిలో ఉంటుందని పెంపుడు జంతువులు, అటవీ ప్రాంతం లో ఉండే జంతువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంత్రాక్స్ అంటే ఏమిటి? ఆంత్రాక్స్ చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి. గ్రామ్ పోజిటివ్ అనే బ్యాక్టీరియా దీనికి కారణం అవుతుంది. దీనిని బెసిలిన్ అంత్రాసిస్ అని అంటారు. సహజంగా ప్రకృతిలో ఉండడం వల్ల పెంపుడు జంతువులలో వస్తుంది.ఆంత్రాక్స్ వల్ల జంతువులు చనిపోతాయి. ఆంత్రాక్స్ వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతారు.ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉత్పత్తులు ద్వారా ఆంత్రాక్స్ సంక్రమించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో జీవించే జంతువులలో మనుషులు వ్యాపరద్రుక్పదం తో పెంచే జంతువులు ఆవులు, గొర్రెలు నివసించే ప్రాంతాలలో ఆంత్రాక్స్ సోకే అవకాశం ఉంది అని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంత్రాక్స్ లక్షణాలు ఎలాగుర్తించాలి... ఆంత్రాక్స్ సోకిన జంతువులు అక్కడి కక్కడే చనిపోతాయి.జంతులు చనిపోడానికి ముందు తీవ్రమైన జ్వరం,ముక్కు నోటి నుండి రక్తం కారడం వంటి లక్షణాలు ఉంటాయి . అయితే ఈ లక్షణాలు చాలా జంతువులలో కనపడక పోవచ్చు. పెద్ద సంఖ్యలో జంతువులు చనిపోతున్నప్పుడు అది ఆంత్రాక్స్ గా గుర్తించక పోవడం వల్ల చనిపోవడం గమనించవచ్చు నని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంత్రాక్స్ కు అసలు కారణం పూర్తిగా తెలియరాలేదని పెద్దసంఖ్యలో ఆంత్రాక్స్ మహమ్మారి సోకినప్పుడు ఆంత్రాక్స్ నివారణ పూర్తిగా కష్ట సాధ్య మౌతుంది. అధికసంఖ్యలో జంతువులు మరణించినప్పుడు ముఖ్యంగా ఆవులు,గేదెలు,గొర్రెలకు ముందే ఆంత్రాక్స్ పరీక్షలు నిర్వహించి ఉంటె చనిపోయి ఉండేవి కాదనేది నిపుణుల వాదన. అయితే మానవులకు ఆంత్రాక్స్ సోకకుండా నివారించడం అవసరం. ప్రజలకు ప్రమాదం ఉంటుందా? ఆంత్రాక్స్ వల్ల పెద్దమొత్తం లో చనిపోయిన దాఖలాలు లేవని నిపుణులు అంటున్నారు.ఎవరైతే రైతులు చనిపోయిన జంతువుల కళేబరాలు తీస్తారో గోడల చావిళ్ళు,లేదా గొర్రెలు పెంచే షెడ్లలోఉండే వారు లేదా పని చేసే వారికి  వ్యాధి సోకిన జంతువునుండి ఇన్ఫెక్షన్ సోకవచ్చు లేదా మనకు తెలియకుండా ఆంత్రాక్స్ సోకిన జంతువుల మాంసం తీసుకున్నా ఆంత్రాక్స్ బారిన పడవచ్చునని నిపుణులు అంటున్నారు. 2౦౦7 లో తొలి సారి ఆంత్రాక్స్ వెలుగు చూసింది అప్పుడు చర్మం ఇన్ఫెక్షన్ కు గురియ్యింది. దానినుండి యాంటి బాయిటిక్స్ తో కోలుకోవచ్చు. ఆంత్రాక్స్ రాకుండా చేపట్టాల్సిన చర్యలు... *వ్యాధి విస్తరణ నిరోదించాలి. *పెంపుడు జంతువులు ఆంత్రాక్స్ రాకుండా జాగ్రత పడాలి. *లైవ్ స్టాక్స్  ఉత్పత్తులు ఎగుమతులు మార్కెట్లకు చేరకుండా జాగ్రత పడాలి. *ఆంత్రాక్స్ విస్తరించకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. *అత్యవర చికిత్సా విభాగాలు ముఖ్యంగా మొబైల్ వేటర్నరీ సేవలు అందుబాటులో ఉంచాలి.

బూస్టర్ వ్యాక్సిన్‌తో కరోనా వస్తుందా?

కరోనా ప్రమాదం ఇంకా పొంచిఉంది అప్రమత్తంగా ఉండడం అవసరం. అంటున్నారు నిపుణులు.రెండేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కరోనా ముప్పు ఇంకా తోలిగిపోలేదని వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోందని వివిధరకాలుగా రూపాంతరం చెందుతూ రాపిడ్ టెస్ట్ కు సైతం దొరక కుండా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది వైరస్ ఉదృతి లేక పోయినా మరణాలరేటు తక్కువగానే ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి వైరస్ వస్తుందో దానిలక్షణం ఏమిటి దాని తీవ్రత ఎలాఉంటుంది దానిప్రభావాం ఎక్కడ ఎలాఉంటుంది. దానిని ఎదుర్కోడానికి ఎలాంటి చికిత్స ఉంది అన్న అంశాలను మనం నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉండాలి వైరస్ తో పోరాడాలి.అందుకే కరోనా ఇంకాపోలేదని ప్రమాదం పొంచిఉందని.హెచ్చరిస్తున్నారు. ప్రమాదం పొంచ్గే ఉంది... మీరు కరోనా రాకుండా రక్షణ చర్యలు తీసుకున్న ప్రమాదం పొంచి ఉంది అని అంటున్నారు నిపుణులు.కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగం గా బూస్టర్ డోస్ ల కార్యక్రమం అన్నిదేశాలు అమలు చేసినప్పటికీ కోవిడ్ 19  వ్యాక్సిన్ కవరేజి 196.94 కోట్లకు చేరిందని ప్రస్తుతం ఉన్న ప్రాధమిక సమాచారం ప్రకారం జూన్ 24 నాటికి పిల్లలకు౩,62,2౦,781 మందికి 12 -14 సంవత్సరాల కు మొదటి విడత డోస్ వ్యాక్సిన్ అందించారు.అంటే4,౩6,17,58౩.వ్యక్తులకు అందించినట్టుగా అధికారులు తెలిపారు. వృద్ధులలో... ఇతరులకంటే వృద్దులలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఉందని ప్యాండమిక్ తెలియని రోజుల్లో వృద్దులలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఉందని.ప్యాండమిక్ గురించి తెలియని రోజుల్లో సైతం ఆరోగ్య శాఖ సేవా సంస్థలు వైరస్ వ్యాప్తి కాకుండా లాక్ డౌన్ అమలు చేసాయి.అయితే వృధులను రక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తీవ్రత అంటే దాని ఆర్ధం వారిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అత్యవసర చికిత్స అవసరం కావచ్చు.అంటే వారు తీవ్ర అనారోగ్యానికి  వృద్దులలో పెద్దవాళ్ళలో అవసరమని నిర్ధారించారు. పిల్లలు... పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల కు కోరోనా బారిన పడ్డసంఖ్య తక్కువే అని కారణం వారిలో బలమైన వ్యాధి నిరోధక శక్తి తో పోరాడే శక్తి ఉండటమే ప్రాధాన కారణమని పేర్కొన్నారు. వారిని కరోనా నుండి కాపాడేందుకు సహాయ పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని కేసులు మాత్రమే నామోదు అయ్యాయని అయితే తల్లి తండ్రులు భయపడ్డారని ఎందుకంటే వారు బలహీనం గా ఉన్నందున భయపడ్డారని తెలుస్తోంది. ఇతరఅనారోగ్య సమస్యలు... గతం లో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోవిడ్ బారిన పడ్డారని వారిలో తీవ్ర అనారోగ్యసమస్యలు ముఖ్యంగా వైద్య పరిభాషలో కోమార్బిడిటీ స్  ఉన్న విషయం తెలియదని అటు కోవిడ్ ఇటు ఇతర అనారోగ్య సమస్యలు వారికి ఉన్నాయన్న విషయం తెలియకపోవడం రోగి గత చరిత్ర తెలియక చికిత్స లో కొంత అల్లస్యం జరిగి ఉండవచ్చని నిపుణులు ఈ కారణంగానే చాలా మంది ఐ సి యు లో ఉండడం లేదా మరణించడం జరిగిందని కోవిడ్ వైరస్ దాని తీవ్రత తోపాటు దశ దిశమార్చుకుంటూ కోవిడ్ వచ్చినరోజుల్లో పరిస్థితి మరింత దిగజారే విధంగా జారెందుకు కారణం అయ్యిందని వ్యక్తి యొక్క వ్యాధి అనారోగ్య తీవ్రత ఆధారం గా వైద్య చికిత్స లు చేయాల్సి వచ్చిందని  యు ఎస్ కు చెందినా సి డి సి వెల్లడించింది. కోవిడ్ ప్రవర్తన ఎలా ఉంటుంది... వైరస్ దాడి నుండి ఇతరుల ను సంరక్షించడం అంటే దాని ఆర్ధం కోవిడ్ నిబంధనలను పాటించడమే అని అంటున్నారు.అందులో భాగంగా చేతులు శుభ్రంగా చేసుకోవడం మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం అన్నిటికంటే రోగి గత చరిత్ర గురించిన పూర్తివివరాలు డాక్టర్ కు వివరించడం ముఖ్యం అని నిపుణులు వ్యాదిలక్షణాలు తీవ్రత ఆధారంగా చికిత్స చేయడం రోగిని  కాపాడేందుకు వీలు అవుతుందని నిపుణులు తెలిపారు.

వెల్లుల్లి , దాల్చిన చెక్క టీతో షుగర్ పరార్...

డయాబెటిస్ రోగులకు లాభదాయక మైనది వెల్లుల్లి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.వెల్లుల్లి-దాల్చిని తో చేసిన టీ సేవిస్తే మీ చక్కర వ్యాధి దెబ్బకి పరార్ కావడం మీచక్కేర వ్యాధి మీషు గర్ లెవెల్స్ ట క్కున తగ్గిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ రోగులు వెల్లుల్లి దాల్చిని తో చేసిన టీ తాగ వచ్చు.ఇది మీ బ్లడ్ షుగర్ ను నియంత్రించడం తో పాటు.చాక్కేరశాతం తగ్గిస్తుంది. డయాబెటిస్ రోగులకు వెల్లుల్లి దాల్చిని టీ... డయాబెటిస్ రోగులకు వారి ఆహారపు అలవాట్ల తో పాటు మీ జీవన శైలి పై ప్రత్యేక పెట్టాల్సిన అవసరం ఉంది.డయాబెటిస్ తో బాధపడుతున్న రోగులకు ఈ విషయం తెలుసుకోవాలి. ఏది తీసుకోవాలో వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఎలాంటి ఆహారం వల్ల నష్టం కలుగుతుంది. అన్న విషయం తెలుసుకోవాలి. ఈ సమయం లోనే డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు సూచనల మేరకు కావాల్సిన మందులు ఏమి తీసుకుంటున్నారొ తెలుసుకోవాలి.ఎలాంటి వస్తువులుతీసుకోవాలి దీనివల్ల తీసుకోవాలి దీనివల్ల లాభందాయకం అన్నది తెలుసుకోవాలి. వారు వాడే మందులు ఇంటిలో లభించే వస్తువుల వాడకం అంటే వెల్లుల్లి.దాల్చిని వేసిన టీ చాలా సులభంగా చేయవచ్చు.ఇది మీచక్కేర స్థాయిని తగ్గించడం లో ఎలా పని చేస్తుందో  తెలుసుకుందాం. షుగర్ ను కూకటి వేళ్ళతో నిర్మూలన చేయవచ్చు.వేల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.వెల్లుల్లి కేవలం ఆహారం లో రుచిని పెంచడమే కాదు.ఆరోగ్యంగా ఉంచేందుకు కాస్త లాభదాయకం గా ఉంటుంది. అని నిపుణులు అంటున్నారు.ఇందులో ఉండే ఎమినో యాసిడ్స్,హోమో సిస్ట్రీస్ శాతం తగ్గించే ప్రయత్నం చేస్తుంది.ఈ కారణంగానే చక్కర స్థాయి నియంత్రణ లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దాల్చినీ లో సయితం ఔషద గుణాలు మెండుగా ఉన్నాయని.చాలా రకాల అనారోగ్య సమస్యలకు సహాయ పడుతుంది.ఇందులో ఇందులో యాంటి ఆక్సిడెంట్,యాంటి ఇంఫ్లామేటరీ  గుణాలు ఇందులో ఇందులో ఉన్నాయి.ఇదే వ్యక్తిలో ఉన్న చక్కెర శాతాన్ని నియంత్రించేందుకు రోగులు వెల్లుల్లి దాల్చినీ టీ తాగ వచ్చు.ఇది చక్కర శాతాని నియంత్రించడం తో పాటు. కొలస్ట్రాల్ లెవెల్ ను తగ్గించడం లో దాల్చినీ సహాయ పడుతుంది. వెల్లుల్లి దాల్చినీ టీ తయారు చేసే పద్ధతి తెలుసుకుందాం... *ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలు తోక్క తీసి కొంచం కచ్చ పచ్చ దంచండి *ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోయండి కొంచం పంచదార వేసి కలపండి. గిన్నెలో దంచిన వెల్లుల్లి కొంచం దాల్చిన చెక్క వెయ్యండి. *గిన్నెలో నీళ్ళు సగం వచ్చే దాకా బాగా మరిగించండి. *నీళ్ళు సగం కాగానే స్టవ్ ఆపి టీని వడగట్టండి. *ఇప్పుడు మీరు తయారు చేసుకున్న వెల్లుల్లి-దాల్చిని టీ ని తాగండి మీ శరీరంలో చక్కర శాతం తగ్గడం ఖాయం. 

టమోటా ఫీవర్ తో జర భద్రం!!

  చిన్న అజాగ్రత టమాటో ఫీవర్ విస్తరణకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టమోటా ఫీవఎర్ విస్తరించేందుకు చిన్న కారణం కావచ్చు. టమోటా ఫ్లూ నుండి రక్షించ బడడానికి తీసుకోవాల్సిన జాగ్రతలు ఏమిటి? అన్న సందేహం ప్రతిఒక్కరిలో ఉంటుంది.కరోనా మహమ్మారి తో పాటు టమోటా ఫీవర్ దేశం లో నేడు కనిపిస్తోంది.5 సంవతసరాల లోపు పిల్లల పై తీవ్రప్రభావం చూపిస్తుంది. టమోటా ఫీవర్ ఎలా విస్తరిస్తుంది.దీనినుండి ఎలా రక్షణ పొందాలి అన్న విషయాలను తెలుసుకుందాం.కేరళ లోని కొల్లం పట్టణం లో టొమాటో ఫీవర్ త్వరిత గతిన విస్తరిస్తోంది.ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు తక్కువ వయసు ఉన్న పిల్లల పై తీవ్రప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకూ టొమాటో ఫీవర్ కు  సంబందించిన కారణాలు తెలియరాలేదని నిపుణులు అంటున్నారు.ఆరోగ్య శాఖ దీనిపై దృష్టి సారించింది.ఈ ఫీవర్ మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ఆయా ప్రాంతాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం. టమోటా ఫీవర్ అంటే ఏమిటి?... టొమాటో ఫీవర్ ను టమాటో ఫ్లూ పేరుతో పిలుస్తారని అందరికీ తెలుసు.టొమాటో ఫీవర్ ముఖ్యంగా 5 సంవతసరాలలోపు వయసు తక్కువ వయసు ఉన్న పిల్లలో కనిపిస్తుంది.ఇప్పటి వరకూ స్పష్టం కాని అంశం ఏమిటి అంటే ఇది  వైరల్ ఫీవరా లేక డెంగ్యు చికెన్ గునియా వల్ల వచ్చే సమస్య అన్నది తెలియాల్సి ఉంది.టమాటో ఫ్లూ జ్వరం లో చర్మం పై ఎర్రటి దద్దుర్లు వస్తాయి.దీనిఅకారాం అంటే దద్దుర్ల ఆకారం టొమాటో ను పోలి ఉండం గమనించా మని నిపుణులు పేర్కొన్నారు.అందుకే దీనిని టొమాటో ఫీవర్ కు సంబందించిన కేసులు కొల్లం లో మాత్రమే చూడవచ్చు టమాటో ఫీవర్ కు సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ మరిన్ని రాష్ట్రాలలో విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు. టొమాటో ఫీవర్ ఎలా వ్యాపిస్తుంది?...టమాటో ఫీవర్ వ్యాది సోకిన వారు వేరొకరిని తాకడం వల్లవిస్తరిస్తుంది.ఒకవేళ టమాటో ఫీవర్ ఫ్లూ తో పాటు వస్తే అది తగ్గేవరకూ వారిని వేరు వేరుగా ఉంచాలి.టమోటో ఫ్లూ సోకిన పిల్ల వాడిని ఎంతవరకూ వీలైతే అంత దూరం గా ఉంచే ప్రయత్నం  చేయాలి.టమాటో ఫీవర్ ముఖ్యలక్షణాలు... ఎర్రటి దద్దుర్లు. చర్మం పై మంట. అలసట. మోకాళ్ళలో నొప్పులు  పొట్టలో నొప్పి, వాంతులు. అతి సారం. ముక్కు కారడం. తీవ్రమైన జ్వరం. దగ్గు ,తుమ్ములు. శరీరం లో నొప్పులు.వంటి లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత పడండి . టొమాటో ఫీవర్ నుండి రక్షించుకునే ఉపాయాలు... మీ చుట్టుపక్కల ప్రాంతలాలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి.దురద దద్దుర్లను గోకవద్దు.ఒకరి నొకరు తగల కుండా జాగ్రతలు పాటించాలి.టమాటో ఫీవర్ సోకిన వ్యక్తి వినియోగించే వస్తువులను తిరిగి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వాడకూడదు. వ్యాధి సోకిన వ్యక్తికి చలువ చేసే పదార్ధాలు ఎక్కువగా తినిపించాలి దీనువల్ల డీహైడ్రేషన్నుండి కాపాడ వచ్చు.                     

శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే...

ఇక్కడ ఒకవిషయం చెప్పాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి వయసు ఉండాగానే నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి అన్నారు. అంటే  దాని అర్ధం యూరిక్ యాసిడ్ రాళ్ళు పెంచుకోమని కాదు. ఒక్కసారి మీరక్తం లోకి  యూరిక్ యాసిడ్ చేరిందో మేకు ఆరోగ్య పరంగా ఎన్నో సమస్య లు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే సమస్యలు. యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు  లక్షణాలు,యూరిక్ యాసిడ్ నివారణకు చికిత్స అంశాల గురించి ఇందులో తెలుసుకుందాం. మోకాళ్ళలో నొప్పులు,కాళ్ళ పదాలలో నొప్పులు,కాళ్ళ వాపులే కదా అని నిర్లక్ష్యం గా వ్యవహరించారో అంతే సంగతులు.మీసమీపం లోని డాక్టర్ ను సంప్రదించండి. ఇది యూరిక్ యాసిడ్ లక్షణాలు కావచ్చు.యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గించాలంటే మీ నిత్యజీవితం లో మీరు తీసుకునే ఆహారం మార్పులు అవసరం అని  నిపుణులు సూచిస్తున్నారు. మీఇంట్లో కూడా ఎవరికైనా కాళ్ళు లేదా వేళ్ళు మోకాళ్ళు నొప్పులు,వాపులు ఉంటె సత్వరం సమీపం లో ఉన్న డాక్టర్ ను సంప్రదించండి.అది యూరిక్ యాసిడ్ అయి ఉండవచ్చు యూరిక్ యాసిడ్ శరీరం లో పెరిగితే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? సహజంగా దీనికి జవాబు చెప్పాలంటే అపసిస్ట్ అంటే అంటే శరీరం లో పెరిగే చేత్తఆ ని అర్ధం.మనం తీసుకున్న ఆహారం నుండే ఉత్పత్తి అవుతుంది.శరీరంలో ప్యురిన్ అంటే శుద్ధి చేసే ప్రక్రియ ఆగిపోయినప్పుడు లేదా తెగిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగి పోతుంది.మన నిత్యజీవితం లో కొన్ని ఆహార పదార్దాలాలో పెద్ద మొత్తం లో ప్యురిన్ జరుగుతుంది అంటే అందులో యూరిక్ యాసిడ్ చేరుతుంది. యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్న వారికి ఇంట్లో లభించే వస్తువులతో మార్గం ఉందని నొప్పి నుండి విముక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. యూరిక్ యాసిడ్ సమస్యలు ఎవరికీ వస్తాయి... *కొన్నిరకాల మాంసం. *కొన్ని రకాల చేపలు. *బీరు,లేదా కొన్ని ఎండిపోయిన పదార్ధాలు. శరీరం లో ప్యురిన్ చేరి అది శరీరంలో తెగిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ బయటికి వస్తుంది. మనశరీరం లో ప్రాధాన భాగమైన కిడ్నీ యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేస్తుంది.అది మూత్ర విసర్జన రూపం లో బయటికి పోతుంది.ఎవరైనా ఒకవ్యక్తి తన భోజనం లో పెద్దమొత్తం లో ప్యురిక్ తీసుకున్నప్పుడు దీనివల్ల శరీరం యూరిక్ యాసిడ్ శాతం  త్వరగా పెరుగుతుంది.బయటికి పోతుంది.అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ వ్యక్తి రక్తంలో చేరి శరీరం లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోతుందో దీనిని హైపెర్ యురినిమియా అని అంటారు.శరీరం లో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కండరాలలో వాపులు వస్తాయి.ఈ కారణంగా అక్కడ తీవ్రమైన నొప్పి కలుగుతుంది.ఈ నొప్పి ఎక్కువైతే గౌట్ అని అంటారు.గౌట్ వ్యాధి కీళ్ళ వాపు నిప్పులకు కారణం అవుతుంది.ఈ కారణంగానే వ్యక్తి యొక్క రక్తం మూత్రము యాసిడ్ తత్వం లోకి మారుతుంది. యూరిక్ యాసిడ్ ఎందుకు చేరుతుంది... శరీరం లో యూరిక్ యాసిడ్ ఎందుకు చేరుతుంది దీనికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.ఆ వివరాలు తెలుసుకుందాం. *చాలా విషయాలలో యూరిక్ యాసిడ్ సమస్య వంశ పారంపర్యం కావచ్చు. *ఒకరకమైన భోజనం కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ చేరుతుంది. *అధిక బరువు కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య రావచ్చు. *ఒత్తిది కారణంగా శరీరం లో యూరిక్ యాసిడ్ పెరగ వచ్చు. కొన్ని అనారోగ్య కారణాలు శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలు రావచ్చు... *ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటె యూరిక్ యాసిడ్ పెరగ వచ్చు. *డయాబెటిస్ రోగులలో యూరిక్ యాసిడ్ పెరిగితే సమస్యలు ఎదుర్కొనక తప్పదు. *కొన్ని రకాల క్యాన్సర్లు లేదా కీమో తెరఫీ కారణంగా యూరిక్ యాసిడ్ పెరగ పెరగ వచ్చు. *చర్మ వ్యాధులు సోరియాసిస్ కారణంగా యూరిక్ యాసిడ్ పెరగవచ్చు. యూరిక్ యాసిడ్ పెరిగితే లక్షణాలు... *సహజంగా యూరిక్ యాసిడ్ పెరిగితే పెద్దగా లక్షణాలు పెద్దగా కనపడవు.కీళ్ళలోమోకాళ్ళలో  వాపు, తీవ్రమైన నొప్పులు ఉంటాయి. *ఒకవేళ మీజీవన శైలిలో పెద్దమార్పు వచ్చినప్పుడు మీఅహార విహారాల లో మార్పు వచ్చినప్పుడు.మీశరీరంలో యూరిక్ యాసిడ్  శాతం పెరగడం కిడ్నీ సమస్యతీవ్రంగా ఉంటుంది.  * రక్తం లో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే లేదా కీమోతేరఫీ చికిత్సలో ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ శాతం పెరగడం కిడ్నీ సమస్య ఎదుర్కొనక తప్పదు. * యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పేరుకు పోవడం వల్ల జాయింట్స్ లో వాపులు దీనిని గౌట్ అని అంటారు. *యూరిక్ యాసిడ్ మూత్రంలో సమస్యలు సృష్టిస్తుంది.కిడ్నీలో రాళ్ళలా పేరుకు పోయే అవకాశం ఉంది. *యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల జాయింట్స్ లో భరించలేనంత నొప్పి ఉంటుంది.లేవడం కూర్చోవడం తీవ్ర సమస్యగా ఏర్పడుతుంది. *చేతులు కాళ్ళ వేళలలో వాపులు వస్తాయి.భయంకరమైన నొప్పి బాధిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనపడ్డ వెంటనే అప్రమత్త మవ్వండి. మీ ఆహారం లో యూరిక్ యాసిడ్ పెంచే వాటిని తీసుకోవడం మంచిది. యూరిక్ యాసిడ్ కు చికిత్స... శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి పోతే దీనిని నియంత్రించేందుకు మీరు మీడాక్టర్ సలహా మేరకు మీ ఇంలో ఉండే ప్రాత్యంనాయ వైద్య విధానాలు వినియోగించే యూరిక్ యాసిడ్ ని నియంత్రించ వచ్చు.ఇందుకోసం డాక్టర్ స్తేరాయిడ్ కాని యాంటి ఇంఫ్లామేటరీ వంటివు అంటే ఇబో ఫ్రోబిన్ ను వాడడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

ప్ర‌పంచ ఆరోగ్యానికి యోగా

విశ్వం కన్ను విప్పని నాడు వేదం వెలిసిన ధరణి ఇది అని ఒక మహా కవి అన్నాడు.వేదం నుండి అనునాదం. పుట్టిందనియుగ్ అనే పదం నుండి పుట్టింది యోగా అని యోగం అంటే జ్ఞానం అని సంపూర్ణ వికాసానికి దేహదారుద్యం  కోసం .మానసికంగా బలం గా ఉండడానికి  ఆరోగ్యం గా ఉండేందుకు శరీరం ఎటువైపైనా వొంపు సొంపులు యోగాతో సాధ్యమని ముఖకవళిక లో ఒకరక మైన గ్లౌ ఉంటుందని యోగసాధకులు అంటున్నారు.   శారీరక ధారుడ్యం,నాజూకుగా ఉంచుతుంది. అలాగే మొహం లో కళ ఉట్టిపడుతుంది.వేకువజామున చేసే యోగాసాధనానికి మెరుగైన ఫలితాలు ఉన్నాయని దీర్ఘకాలిక సమస్యలకు యోగా లో చక్కని ఫలితాలు ఉన్నాయని  నిపుణులువిశ్లేషిస్తున్నారు. యోగం అంటే అదృష్టం అని అంటారు.యోగం అంటే జ్ఞానం అని కొందరు అంటారు.యోగ సాధనం అంటే జ్ఞానా న్నిపొందడం అని కొందరు అంటారు. యోగం అంటే ఒక యజ్ఞం లాంటిది దానిని సాధన చేయాలని అంటారు. నిపుణులు. క్రమ పద్దతిలో చేసే యోగం వల్ల వ్యక్తి శారీరకంగా మానసికంగా అన్నిటికి సిద్ధం అవుతారు.మానసికంగా శారీరకంగా దృడంగా ఉంచేది యోగానే అని కొన్ని దీర్గ కాలిక అనారోగ్యాలకు ముఖ్యంగా శరీరంలోని పంచేంద్రియాలను అదుపులో ఉంచేది యోగాసాధానమే. అందుకే యోగా ను భారతీయులు పతంజలి యోగశాస్త్రం ప్రాచుర్యం లో ఉన్నప్పటికీ.యోగా ద్వారా శారీరకంగా ద్రుదత్వాన్ని కలిగిన వారు ఒక్కోసారి జిమ్నాస్ట్స్ లో రాణించారు అంటే యోగా వల్ల శరీరంలో శక్తి,శరీరాన్ని ఒడుపుగాకదిలిస్తూ చేసే వ్యాయామం వల్ల మనసు శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం ఎదుర్కునే సమస్య లకు యోగా చక్కటి పరిష్కారం చూపుతుందని అంటున్నారు యోగసాధకులు.  మనపోట్ట తగ్గాలంటే-ముఖం అందంగా కాంతివంతంగా పెంచుకోవాలంటే చాలా లాభాదాయక మైనది హలాసనం. హలాసనం వల్ల వచ్చే లాభాలు... హలాసనం ప్రతి రోజూ వేయడం ద్వారా హలసనం లో తల నుండి పోట్టవరకూ రకరకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.ఈ ఆసనం వేయడం ద్వారా శరీరం లోని ప్రతి భాగం పటిష్టంగా ఉంటుంది.శరీరాన్ని చాలా మృదువుగా బక్క పలుచగా    ఆరోగ్యంగా ఉందెందుకు సహకరిస్తుంది. హలాసనం వేయడం వల్ల ఎవరికీ లాభం  ఎవరైతే శరీర వ్యాయామం సరిగా చేయడం లో రోజంతా కూర్చుని పనిచేస్తారో.వారికి   చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. హలాసనం తో మరిన్ని లాభాలు చూద్దాం... బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు పొట్టలో కొవ్వు పేరుకుపోతుందో వారు హలాసనం సాదన చేయండి.పొట్టలో పేరుకున్న అదనపు కొవ్వు త్వరలో తగ్గిపోవాలంటే హలాసం వేయండి.ఈ ఆసనం వేసాక కొన్ని సెకండ్లు తరువాత కొవ్వు పోయి లాభం కలుగుతుంది. నడుము నొప్పి దూరం... ఆఫీసు లేదా ఇంటిలో అదేపనిగా 8 గంటల నుండి 1౦ గంటల వరకు కూర్చుని పని చేస్తారో దీనికారణంగా వెన్నుపూస నడుమునొప్పి వస్తూ ఉంటుంది. మీకోసం హలాసనం కన్నా పెద్దదైన ఆసనం లేదు.హలాసనాన్ని సాధన చేయడం ద్వారా వెన్నునోప్పికి శాస్వతంగా విముక్తి పొందవచ్చు అంటున్నారు నిపుణులు. పంచేంద్రియాలు బలోపేతం... ఆసనాన్ని క్రమ పద్దతిలో అభ్యసిస్తే పంచేంద్రియాలు బలంగా ఉండడం అవసరం.దీనివల్ల భోజనం చాలా చక్కగా అరుగుతుంది. భోజనం ద్వారా లభించే పోషక తత్వాలు శరీరం లో చాలాసులభంగా కలిసి పోతాయి. పోట్టసమస్యలు దూరం... గ్యాస్ ఎసిడిటి కొన్నిరకాల రాసాయానాల వచ్చే సమస్యలు.వారికి హలాసనం ఒక వరదానం అనే చెప్పాలి.హలాసనం వల్ల పొట్టలోని మాంసకండరాలు లాగడం.దీనివల్ల మరింత బలోపేతం అవుతుంది.పోట్ట వల్ల వచ్చే సమస్యలు దూరమౌతాయి. ముఖం లో గ్లౌ పెరుగుతుంది... హలాసనం వేసే సమయం లో రక్త ప్రవాహం ముఖం వైపు ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా ముఖం గ్లౌ మరింత పెరుగుతుంది.చర్మం తైట్ గా ఉంటుంది ముఖంపై ముడతలు మచ్చలు పోతాయి సహజమైన గ్లౌ వస్తుంది.                                   

యోగాతో ఆరోగ్యం ఆనందం

స్త్రీ ఆరోగ్యానికి యోగా... యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం మహిళలకోసం. ప్రతిరోజూ యోగా చేయవచ్చు. యోగ ఆసనాలు ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు. అంటే ఇంటి పనులు చేసుకునే మహిళలుఅయినా సరే వారు వారి ఆరోగ్యం పై శ్రద్ధ చూపరు.కారణం వారికి సరైన సమయం దొరకదు.ప్రతిరోజూ పనిచేసే స్త్రీలు ఎప్పుడు ఎలాంటి యోగాసనాలు వే యాలి ప్రతిరోజూ వారి దిన చర్యలో కొంత సమయం కేటాయించాలని యోగా నిపుణులు సూచించారు. నేటి ఆధునిక కాలం లో మహిళలు సమాజం లో,గృహిణిగా,తల్లిగా, కూతురిగా,భార్యగా,కొన్ని తరతరాలుగా పాత్ర పోషిస్తున్నారు. నేటి కాలం లో ఇంట్లో నాలుగు గోడల మధ్య సామాజిక ఆర్ధిక రాజకీయ రంగాలలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం హర్షించ దగ్గ పరిణామం అన్నిరంగాలలో పురుషులతో పాటు సమాన భాగస్వామ్యాన్ని కోరుతూ పోటీ పడుతున్నారు.సమాజం లో జీవితం లో ప్రతిరంగం లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉండడం వల్ల వారి ప్రాధాన్యత పెరిగింది.అన్ని రకాల బాధ్యతలను పూర్తి చేయాలంటే వారి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం దురదృష్ట కరం ఎందుకంటే భారత పిల్లలు కుటుంబం కుటుంబం లోని ఇతర సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.కుటుంబం పని ఇతర అంశాలాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక క్రమ పద్దతిలో కార్యక్రమాలాను 1౦౦%   పూర్తి అయ్యేవిధంగా పనిచేస్తూ సంతృప్తి పంచడం మాత్రమే వారికి తెలుసు. అలాంటి సమయం లోనేవారి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.అలాగే ఎటువంటి సమస్య వచ్చినా తాను తీవ్రైబ్బంది పడుతున్నాఒక్కోసారి కుటుంబ సభ్యులకు చెప్పరు. తాము పడుతున్న బాధను పంటిబిగువున ఉంచుకుంటారు.కనీసం ఆసుపత్రికి వెళదా మన్న తరువాత చూద్దామని అంటూ దాట వేస్తారు. ఎంతో కష్టం ఒస్తే తప్ప తమబాధను చెప్పుకోరు. ఇక్కడే మహిళలు అర్ధం చేసుకోవాలి కుటుంబ సభ్యులను చూసుకోవడం,లేదా పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లు సమస్యలు ఎదుర్కోవాలంటే వారు మానసికంగా,శారీరకంగా ఆరోగ్యపరంగా శక్తి వంతులుగా ఉండడం అవసరం.మీరు సమాజానికి కుటుంబానికి మూల స్థంబాలు,మూల స్తంబాలే బలహీనం గా ఉంటె కుటుంబం కట్టడం బలహీన పడుతుంది.అన్న విషయం ప్రతిమహిళా తెలుసుకోవచ్చు.మీ నిత్యజీవితం లో తప్పనిసరిగా యోగా కోసం కొంత సమయం కేటాయించండి.యోగాతోపాటు ఆరోగ్యం గా ఉండే వీలు ఉంటుంది. ఒకే ఒకమాధ్యమం యోగా... చాలా మంది మహిళలు ఏమని అంటారంటే అన్నిరకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఒక గంట మీకోసం మీఆరోగ్యం కోసం సమయం కేటాయించడం సాధ్యం కాదని.కష్టమని.ఈ కారాణాలు అన్ని కొంతవరకు సరైనదే కావచ్చు.ఉద్యోగినులు అయితే ఉదయం ఇంటి పని ఆపైన ఆఫీసుకు తయారై వెళ్ళాలి మొత్తం రోజంతా ఆఫీసు పనిలో అలిసి పోయిన స్త్రీ సాయంత్రం ఇంటికి చేరుకోవాలి.వాళ్ళ కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి.అదే గృహిణి అయితే పిల్లలు,కుటుంబం కుటుంబ సభ్యులందరి మధ్య ఆరోజు గడిచి పోవడం సహజం.ఇంట,బయట వారు నిర్వహించే బాధ్యతలు నిర్వహిస్తూ ఒక్కోసారి ఒకఘంత పాటు సమయం తమకోసం తమ ఆరోగ్యం కోసం కేటాయించలేకపోతున్నారు.ఈ సమయం లో మేము ఒకగంట సమయం కేటాయించలేకపోతే ప్రతి 15 -2౦ నిమిషాల సమయం కేటాయించు కోవచ్చని. శారీరకంగా మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టేందుకు మధ్య మధ్యలో యోగ సాధన చేయవచని నిపుణులు సూచిస్తునారు. ఉదయం వేళ యోగసాధన... అందరికంటే ముందు నిద్ర లేచేది ఆఇంటి మహిళలె మీరు నిద్ర లేచాక మీ దుప్పటి మడత పెట్టె సమయం.దాదాపు 15 నిమిషాలుముందు నిద్రలేవడం ఆతరువాతే మీ దినచర్యను ప్రారంభించండి.ఆ 15 నిమిషాలు మీకు మాత్రమే కేటాయించండి.మీరు 15 నిమిషాలపాటు మీ మంచం పైన గాని లేదా  మ్యాట్ పైన గాని ఆసనాలు వేయండి.అందులో సుప్త తాడాసనం,సుప్తవక్రాసనం,సేతుబంధ ఆసనం.ఆ తరువాత రాత్రి 8 నిమిషాలు ఆసనాలు అందులోను అనులోమ వినులోమ ప్రాణాయామం చేయండి.15 నిమిషాల కాలం లో సాధన లో మీశరీరం మొత్తం వ్యాయామం చేసినట్లు అవుతుంది.ఆ విధంగా మీ పంచేంద్రియాలు స్వాసనాళాలు ఇతర అవయవాలు సరిగా పనిచేస్తాయని యోగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యాహ్న వేళ భోజనానికి ముందు... మీరు ఇంట్లోన్ ఉంటె నిలబడి లేదా ఆఫీసులో ఉంటె కుర్చీపై కూర్చుని 15 నిమిషాలు సాధన చేయావచ్చు.1౦ నిమిషాలు మాత్రం సూర్యబెదప్రాణాయామం సాధన చేయాలని.15 నిమిషాలు చేసే వ్యాయామం మీ శరీరం సంపూర్ణం గా రక్త ప్రసారం సరిపోతుంది.మీరు శక్తి వంతులుగా అనుభూతి పొందుతారు. సాయంత్రం వేళలో... మీరు ఆఫీసునుండి ఇంటికి చేరగానే ఇంటిపనులు ప్రారంభానికి ముందు దాదాపు 1౦ నిమిషాలు సుదీర్ఘ శవాసనం లేదా 1౦-15 నిమిషాలు యోగనిద్ర సాధన ద్వారా రోజంతా మీరు చేసిన అలసట పోతుంది.మీరు చాలా శక్తి మంతులుగా ఫ్రెష్ గా ఉన్నట్లు భావిస్తారు. రాత్రి వేళలో... రాత్రి వేళలో మీ భోజనం త్వరగా ముగించే ప్రయాత్నం చేయండి.ఎట్టి పరిస్థితిలో నిద్ర పోయేముందు 2 లేదా 2-౩౦ నిమిషాల ముందు భోజనం చేయాలి. ఉదయం భోజనం కన్నా రాత్రి కొంచం తక్కువగా భోజనం తీసుకోవడం కీలకం.నిద్రకు ఉపక్రమించే ముందు కొంచం అభ్యాసం చేయవచ్చు. ఇందుకోసం విపరీత కారిణి అంటే గోదా ఆధారం గా పోత్తపైకి నిలిపి దాదాపు 5 నిమిషాలు పోట్టద్వారా శ్వాసను పీలుస్తూ సాధన చేయాలి. ఈ ఆసనాల్ సాధన వల్ల మీ పంచేంద్రియాలు పనిచేయడమే కాక మంచినిద్ర పడుతుంది. చిన్న చిన్న అసనాలే చాలా లాభాలు ఉన్నాయి.లేదంటే మీరు రోజంతా నిలబడి ఇంట్లో పని చేసుకుంటూ ఉండటమో లేదా ఆఫీసులో కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తూ ఉండటమో ప్రతిరోజూ ఆసనాలు సాధన చేయడం ద్వారా మీ కళ్ళకు విశ్రాంతి.రోగాలు రాకుండా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.మీ పంచేంద్రియాలు శక్తివంతంగా తయారు అవుతాయి. దీనితోపాటు మీశరీరంలో రక్త ప్రసారాలు ప్రారంభమౌతాయి.నిద్ర లేమి సమస్య నుండి బయట పడే అవకాశం ఉంది. నియమిత యోగసాధన ద్వారా కేవలం మనం రోగాలు రాకుండా నివారించవచ్చు.మన రోగాలను నయం చేసుకోవచ్చని యోగాసాధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జీవితం లో సకారాత్మక ఆలోచనలు అవసరం కారణం నిరాశ,నిస్పృహ కు కారణం నకారాత్మక ఆలోచనలే మనలను ఓటమి వైపుకు నడిపిస్తాయి. యోగా ద్వారా సకారాత్మకంగా ఆలోచించే శక్తి శరీరం లో ప్రయాణిస్తుంది.యోగా ద్వారా ఆత్మబలం కలుగుతుంది.మనసులో చింత వేరొకరి పట్ల ద్వేషం తగ్గుతుంది. మనసుకు ఆత్మిక శాంతి విశ్రాంతి లభిస్తుంది.మనసులో ఆనందం ఉత్సాహం కలిగిస్తుంది.దీని ప్రభావం నేరుగా మన వ్యక్తిత్వం ఆరోగ్యం పై ప్రభావంచూపుతుంది. ఒక మహిళ మాన సికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మొత్తం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.అందుకే ప్రతిరోజూ మీరు ఎంత బిజీగా ఉన్న కొంత సమయం  యోగాసనం తప్పనిసరిగా వేయడం అలవాటు చేసుకోండి యోగాసధన చేయండి ఆరోగ్యంగా ఉండండి.

లింఫో ఎడిమా అంటే...

లింఫో ఎడిమా అంటే ఏమిటి? దీని అర్ధం ఏమిటి అంటే వాపు అని అంటున్నారు.శరీరంలో ఎక్కడైతే వాపు ఉంటుందో అక్కడ కొన్ని రకాల ఫ్లూయిడ్స్ వృద్ది చెందుతాయి.అది మీ లింఫ్టిక్ విధానాన్ని సరిగా పని చేయనివ్వదు.అది మీ శరీరంలో ఉన్న లింఫ్ నోడ్స్ పాడైపోవడం లేదా తొలగింపబడి ఉండచ్చు.ఆ కారణంగా క్యాన్సర్ చికిత్సకు సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు.అది కొన్ని సంవత్సరాల తరువాత భయట పడి  ఉండచ్చు. లింఫో ఎడిమా వస్తే ఏమౌతుంది... లింఫోటిక్ సిస్టం మీ శరీరం లో ఇమ్యూన్ సిస్టం లో భాగం ఫ్లూయిడ్స్ మీ శరీరం ద్వారా శరీరంలో ఉన్న పనికిరాని వ్యర్ధాలను ,బ్యాక్టీరియాను వైరస్ ను లింఫ్ నోడ్స్ ఫిల్టర్ చేస్తుంది.తద్వారా శరీరం లో ఉన్న మలినాలు కొవ్వు శరీరం నుండి బయటికి పంపుతుంది.లేదా ఏదైనా మీ కణాలలో ఫ్లూయిడ్ మరో ప్రాంతం లో చేరిందేమో.చాలా తరచుగా మీ లింఫ్ నోడ్స్ పాడైపోతు ఉండచ్చు.మీకణాలు నరాలు నాళాలు ఎక్కడైనా బ్లాక్ అయినప్పుడు లింఫ్ ఎడిమా ఉండచ్చు అని అంటున్నారు వైద్యులు. లింఫ్ ఎడిమా లక్షణాలు... ఎడిమా మీశరీరం లో ఎక్కడైనా ఉండచ్చు మీ మెదడులో ఊపిరి తిత్తులలో అది జనటిక్ గా కావచ్చు.సహజంగా ఒక చేయి లేదా కాలు వాపు చాలా చిన్నదే కావచ్చు.మీరు ఓర్చుకో గలిగేదే అని అనుకోవచ్చు. పెద్దగా పట్టించుకుని ఉండక పోవచ్చు.అది ఆ తరువాత దాని ప్రభావం తీవ్రంగా ఉండచ్చు.అప్పుడు మీ శరీరం కాలు చేయి ని సైతం కదల్చలేరు.వాపు శరీరం మొత్తం మీద ఉండచ్చు.అది మీచర్మం పై కనిపిస్తుంది.చాలా గట్టిగా ధగ ధగ బంగారం లా మెరుస్తుంది.ఈ కార ణంగా ఒక్కో సారి బట్టలు కూడా పట్టవు.అంటే లింఫోమా ప్రభావం ఆప్రాంతం లో చర్మం గట్టిగా ఉంటుంది. లింఫోమా ఎవరికీ వస్తుంది... లింఫ్ నోడ్స్ తొలగించేందుకు సర్జరీ చేస్తారు.లింఫ్ నోడ్స్ నుండి వక్షోజాల క్యాన్సర్ కు దారి తీయవచ్చు.రేడియేషన్ ద్వారా క్యాన్సర్ చికిత్స చేయవచ్చు.వయస్సు మీద పడ్డవారు అధిక బరువు ఉన్న వాళ్ళు రోమటైడ్ ఆర్తరైటిస్.సొరియాటిక్ ఆర్తరై టిస్, అవకాశాలు పెరుగుతాయి.మీరు  ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అంటే వివిదరకాల వాతావరణాలలో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు ,అలాగే అరుదైన డిజార్డర్స్ కుటుంబం లోవారికి వస్తాయి.లింఫ్ నిడ్స్ లింఫ్ నాళాలలో లింఫ్ సిస్టం ను ఇబ్బంది పెడుతుంది. లింఫ్ నోడ్ నివారణ... మీ లింఫ్ నోడ్స్ కు సర్జరీ లేదా రేడియేషన్ చికిత్స మీకాలు లేదా చేయి గుండె పై భాగం ఉంటుంది.ఈ సమయం లో ఐస్,లేదా హాట్ ప్యాక్స్ పెట్టవద్దని.బిగుతైన అంటే శరీరాన్ని అంటుకునే టైట్ బట్టలు వేసుకోవద్దని,నగలు బంగారు ఆభరణాలు వేసుకోరాదు.మీరు కూర్చున్నప్పుడు ఎక్స్ ఆకారం లో క్రా స్ గా పెట్టుకోవద్దు.ఒకవేళ మీకు వాపు అధికంగా ఉంటె లేదా ఇతర లక్షణాలు ఉంటె మీరు మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి.లింఫ్ ఎడిమా కు సత్వర చికిత్స చేయిస్తే మార్పు గమనించవచ్చు. నిర్ధారణ... మీవాపు గల ఇతర కారణాలను కనుగొంటారు.ఇన్ఫెక్షన్ రక్తం గద్దకట్టడం వాపు ఎంత ఉంది.ఏ ప్రాంతం లో వాపు ఉంది.ఎప్పుడైనా ఇలాంటి వాపులు వచ్చాయా వాపు శరీరం లో ఎక్కడ్డ ఎక్కడ ఉన్నాయి వాపులు అన్నీ ఒకేరకంగా ఉన్నాయా? వేరు వేరు గా ఉనాయా బ్లాకేజీలను పూర్తిగా పరిశీలించిన మీదట మీ లింఫ్ నోడ్ లక్షణాల ఆధారం గా ఎం అర ఐ లింఫోసిటిక్ గ్రఫీ మీ శరీరం లో ప్రత్యేక ఇంజక్షన్ చేస్తారు.అది మీ లింఫ్ నళాలలో 1-లేదా 4 వ స్టేజి లో లింఫ్ ఎడిమా ఏ స్టేజిలో ఉందొ చెపుతుంది. లింఫ్ ఎడి మాకు చికిత్స ... లింఫ్ ఎదిమాకు చికిత్స లేదు వాపును నియంత్రించ వచ్చు.మళ్ళీ పరిస్థితి దిగజారకుండా సరైన బరువు ఉండే విధంగా చికిత్స చేయవచ్చు.నీటిని తొలగించే పిల్స్ వాడ కూడదు.లింఫ్ ఎడిమాకు నిర్దేశించిన ప్రత్యేకమైన దేరఫీలు  మీకు సహకరిస్తాయి.మీ పరిస్థితిని నియంత్రిస్తాయి.అవసరమైన పక్షం లో స్టేజ్1 లో మీ డాక్టర్ సర్జరీ ద్వారా వాపు ఉన్న ప్రాంతం లోకొన్ని కణాలను నరాలాను తొలగించవచ్చు. బ్యాన్దేజీలు... లింఫ్ ఎడిమా ఉన్న ప్రాంతం లో చాలా గట్టిగా బిగుతుగా మీ వేళ్ళు పాదాలు చుట్టకుండా మీశరీరం లో ఫ్లూయిడ్ ప్రవహించే విధంగా బ్యాండేజ్ కట్టండి.ఫ్లూయిడ్ నిలిచిపోయే విధంగా కాక ఫ్లూయిడ్ కిందికి దిగే విధంగా తెరపిస్ట్ ఎలా చేయాలో వివిదరకాల లేయర్లు బ్యాండేజ్ ను చుట్టండి.కాగా కేవలం బ్యాండేజ్ వేయడం తోనే లింఫ్ ఎడిమా త్వరిత గతిన తగ్గాడు బ్యాన్దేజ్ ను వివిధ లేయర్లలో బ్యాండేజ్ ను చుట్టండి.వీటికి తోడు శరీర వ్యాయామం చేయండి. వ్యాయామం... ఏ ప్రాంతం లో అయితే లింఫ్ వాపు ఏర్పడిందో ఆ ప్రాంతాన్ని చాలా సున్నితంగా కదిలిం చండి.కండరాలు కాస్త లూజ్ అవుతాయి.శరీరం లో పేరుకున్న ఫ్లూయిడ్ మీ మెదడులో చేరకుండా ప్రతిరోజూ చేసే చేసే వ్యాయామం సహకరిస్తుంది.మీ గుండెలో ఉన్న రక్త ప్రసారం లో ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కలిగించ వచ్చు.మీ డాక్టర్ మీకు సముచితమో సూచిస్తాడు.                                                                       

నాడీపతిలో వందకు పైగా చికిత్సలు!!

సాంప్రదాయ వైద్యవిధానం లో మన పూర్వీకులు మనకుందించిన పురాతన వైద్యం లో ఒకటి నాడీ పతి.నాడీ పతిలో ఉన్న చికిత్సాపద్దతులలో సర్జరీలు,మందులు ఉండవని ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణమ రాజు అన్నారు.ఈమేరకు నాడీ పతిలో ఉన్న కొన్ని చికిత్సా పద్దతులు హానికరం కాదని ప్రాణాంతకం అంతకన్నాకాదని అన్నారు.ఈ చికిత్స పద్దతుల వివరాలు వాటివల్ల వచ్చే లాభాలు ఇందులో తెలుసుకుందాం.నాడీ పతిలో వందకు పైగా చికిత్సలు ఉన్నాయాని అన్నారు వాటిలో కొన్నిమీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది తెలుగు వన్. 1)అక్యు పంక్చర్  తెరఫీ ... అక్యు పంక్చర్ తెరఫీ భారతీయ సంప్రాదాయ వైద్యం లో భాగామే అని అన్నారు.భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా సూదుల ద్వారా చికిత్స చేసే వారని అన్నారు.శరీరంలో ప్రత్యేకంగా ఎంపిక చేసినా పాయింట్స్ లో స్టిములేషణ్ తెరఫీ ద్వారా శరీరానికి శక్తి నిచ్చి ఆరోగ్యాని అందిస్తామని తెలిపారు. నాడీ పతి వైద్య బృందం పరిసీలన లో అక్యు పంక్చర్ చికిత్స ద్వారా శరీరం లోపల ఉన్న సమస్యలకు భవిష్యత్తు లో మరే ఇతర జబ్బులబారిన పడకుండా నాడిపతి టెక్నిక్  తో శరీరంలో ఉన్న పంచేంద్రియాలను సమతుల్యం చేయవచ్చని నిరూపిత మైనదని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.అక్యుపంక్చర్ ను ఉపయోగించి రోగి ట్రీట్మెంట్ టేబుల్ పై ఉండగానే వారికి సంబందించిన నారాలసమస్యలు,శరీరంలో వచ్చే వివిదరకాల నొప్పులు సర్వైకల్ స్పొండోల సిస్,కిడ్నీ సమస్యలు,కంటి సమస్యలు,లివర్ సమస్యలు,మైగ్రైన్ సమస్యలు,ఒత్తిడి నిద్రలేమి,సంతాన లేమి సమస్యలు వంటి వాటికి చికిత్స చేయవచ్చు. అక్యు పంక్చర్ వల్ల లాభాలు ... ఆక్యుపంక్చర్ పద్దతిలో అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు సర్జరీ లేకుండానే చికిత్స చేయవచ్చని అనున్నారు. అక్యుపక్చర్-  అక్యు ప్రేషర్ మధ్య తేడా ఏమిటి?... సాంప్రదాయ భారతీయ వైద్య విధానం లో భారతీయ వేదశాస్త్రం లో  వైద్యం గురించి వివరించారని.అందులో మనశారీరము ప్రకృతి గురించి వివరించారని అన్నారు.శరీరం లో రెండు విభిన్న ద్రువాలు ఒకటి సూర్యుడు అయితే మరొకటి చంద్రుడని ఈరెండు క్రమపద్దతిలో ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యం గా ఉంటుందని.మనశరీరంలో మేరీడియన్స్ మాత్రమే శక్తి నిస్తాయని.శరీరమంత శక్తిని అందిస్తుందని శరీరంలో ఎప్పుదతే శక్తిఅన్డుంచకుండా నిలిచిపోవడం లేదా బ్లాక్ అయిపోవడం జరుగుతుందో అప్పుడు నొప్పి తీవ్రతర మౌతుందని అప్పుడు శక్తి అందక పోవడం వల్ల అనారోగ్యం పలౌతున్నారని డాక్టర్ కృష్ణమ రాజు వివరించారు.ఈ సమస్యకు శారీరకంగా ఒత్తిడి చేస్తామని దీనినే అక్యు ప్రెషర్ పాయింట్స్ యోక్క ఉద్దేశ్యం ఎక్కడైతే మేరిడి యన్స్  ప్రవాహం ఆగిందో బ్లాక్స్ ఉన్నాయోచేతులకు  మణికట్టు వద్ద ఒత్తిడి చేయడం వల్ల లక్షణాలు చాలా సహజంగా తగ్గిపోతాయి. అక్యు ప్రెషర్ వల్ల లాభాలు... మా పరిశోధనా బృందం చేసిన పరిశీలనలో అక్యు ప్రెషర్ చికిత్స శరీరం బయట,లోపల చేయవచ్చని ఈ చికిత్స ద్వారా తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం సాధ్యమౌతుందని తెలిపారు.అలాగే మీ రు ఎదుర్కుంటున్న సెక్స్ సంబంధిత సమస్యలకు సైతం చికిత్స చేయవచ్చని అంటున్నారు కాగా డీ తోక్సిఫికేషన్ ముఖం పై మచ్చలు తొలగించవచ్చని నొప్పులు దీర్ఘ కాలిక వ్యాధులకు అక్యు ప్రెషర్ లాభదాయక మని పేర్కొన్నారు. అక్యు టచ్ అంటే ఏమిటి... అక్యు టచ్ లో పంచాబూతాలు పద్ధతి ని అనుసరించి తెరఫీ ని వృద్ది చేసినట్లు తెలిపారు.కాగా మెరిడియన్ పాయింట్స్ ను పంచభూతాలను సమతుల్యం చేయడం ద్వారారోగికి వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.ఇందులో చికిత్సలో భాగం గా శరీరంపై మీ ఇండెక్స్ ఫింగర్ ను మామూలుగా మీ చూపుడు వెళ్ళను కొన్ని ప్రాంతాలలో లేదా పాయింట్స్ లో ఎక్కడైతే మేరిడి యన్స్ బ్లోకేజేస్ ను పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారు.ఆవిధంగా మెరిడియన్ లేదా పంచభూతాలను సమతుల్యం చేయడం ద్వారా ఆవిధంగా రోగికి చికిత్స చేసే వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేస్తాము.దీనిని ఫైవ్ ఎలిమెంట్ ఫర్మ్లులా తెరఫీ ని వృధీ చేసినట్లు తెలిపారు.వీటి చికిత్స చేసేందుకు దాదాపు ౩ నుండి 5 నిమిషాలు పడుతుందని వివరించారు.        

పురుషుల ఆరోగ్యం ఎప్పుడు బలహీనమౌతుంది!!

  పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యల ను గుర్తించడం అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా పురుషుల ఆరోగ్యవారాన్ని పత్తి ఏటా జూన్ నెలలో పురుషుల ఆరోగ్య వరాన్ని నిర్వహిస్తారు.కాగా ఈ సంవత్సరం జూన్1౩ నుండి జూన్ 19 వరకు పురుషుల ఆరోగ్య వారోత్సవం నిర్వహిస్తున్నారు.పురుషులలో సహజంగా ఉండే టేస్టోస్టె రాన్ తక్కువ కావడం వల్ల పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యల లక్షణాలను గమనించ వచ్చు.వాటిని సరిగా గుర్తించక పోవడం నిర్లక్ష్యం చేయడం పురుషులలో ఆరోగ్యం బలహీన పడేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.పురుషుల ఆరోగ్య వారం నిర్వహించడం లో ప్రాధాన ఉద్దేశం పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యమని నిపుణులు అంటున్నారు.అసలు పురుషులలో మాత్రమే ఉండే  టే స్టో స్టేరాన్ హార్మోన్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. పురుషులలో మాత్రమే లభించే టే స్టోస్టెరాన్స్ హార్మోన్ శరీరం లో చలారకాల కార్యక్రమాలకు కీలక భూమిక పోషిస్తుంది.శరీరం లో టేస్టో స్టె రాన్స్ హార్మోన్ తగ్గడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి.జూన్ నెలలో వారం రోజుల పాటు పురుషుల ఆరోగ్య వారాన్ని వారం రోజుల పాటు జరుపుకుంటారు.పురుషులలో ఆరోగ్యానికి సంబందించిన సమస్యలు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాంస కండరాలు బలహీన పడడం... టే స్టో స్టేరాన్ లోపం నేరుగా కండరాల పై ప్రభావం చూపుతుంది.టేస్టోస్టె రాన్ శాతం తగ్గడం వల్ల మాంస కండరాలు బలహీన పడతాయి.  జుట్టు రాలిపోవడం... టేస్టోస్టేరాన్ లోపం కారణం గా పురుషులలో జుట్టు పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళు  బలంగా ఉండేందుకు టేస్టోస్టేరాన్ కీలక భూమిక పోషిస్తుంది టే స్టోస్టేరాన్ తక్కువగా ఉండడం జుట్టు పై ప్రభావం చూపుతుంది.మన జుట్టు స్థితి ని బట్టి టేస్టోస్టేరాన్ ఎంత శాతం ఉందొ తెలుస్తుంది.కాగా టేస్టోస్టె రాన్ హార్మోన్ సంపూర్ణం గా ఉన్న వారిలో సెక్స్ సంబంధిత కోరికలు ఎక్కువ గా ఉండవచ్చు.అసలు హార్మోన్ లోపం కారణంగా పెద్దగా ఆశక్తి లేకపోవడం లేదా చాలా పరిమిత సంఖ్యలో పాల్గొనడం కొన్ని సందర్భాలాలో వారు బలహీనం గా ఉండవచ్చు. ఎర్ర రక్త కణాలు సంఖ్య తగ్గిపోతాయా ... టేస్టోస్టేరాన్ హార్మోన్ తగ్గడం వల్ల ఎనిమియా తీవ్ర సమస్య కు దారితీస్తుంది.రక్తం లో ఆరోగ్యం రక్త కణాలు,నాళాలు,రక్త హీనత వస్తుంది.దీనికారణం గా ఏకాగ్రత లోపం గుండె కొట్టు కోవడం లో వేగం పెరగడం లేదా రక్త ప్రసరణ లో మార్పులు గమనించవచ్చు. మూడ్ లో మార్పులు... శారీరకంగా వచ్చిన మార్పులే కాక టేస్టోస్టేరాన్ శాతం తగ్గడం కారణంగా మానసికంగా అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.జ్ఞాపక శక్తి ఏకాగ్రత పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పురుషులలో సెక్స్ సంబంధిత సమస్యలు లేదా పురుషులలో మేల్ ఫెర్టిలిటికీ                                       

ప్రపంచ రక్త దాన దినోత్సవం...

  మనిషికి ప్రాణం విలువతేలుసు మనిషి ప్రాణాన్ని కాపాడేది రక్తమే. మనిషి శరీరంలో రక్త ప్రసారం జరిగి ఆక్సిజన్ అందినంత సేపు ప్రాణాలతో జీవిస్తాడు.మనిషి ప్రాణం కన్నా రక్తం మిన్న.అన్నది మాత్రం నిజం. అన్నిదనాలోకన్న ఏ దానం గొప్పది అన్న ప్రశ్నకు సమాధానం గా రక్తదానం అని చెప్పవచ్చు.ప్రతి ఏటా జూన్ 14 న మాత్రమే ప్రపంచ రక్త దాన దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారు.దీని ప్రత్యేకత ప్రాశస్త్యం తెలుసుకుందాం.మనం జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి రక్తం ఎంత విలువైనదో మనకు తెలుసు.అందుకే ఈ కారణం గానే ప్రజలకు రక్త దానం చేయాలని సూచిస్తున్నారు.ప్రపంచ వ్యాప్త్గంగా జూన్ 14న  రక్తదాన దినోత్సవం నిర్వహిస్తారు.రక్త దానం గురించిన అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం2౦22... ప్రతి ఏటా జూన్ 14 న రక్త్గ ఉత్పత్తి ఆవశ్యకత గురించి అవగాహన పెంచేందుకు వారు చేసిన దానాలను గౌరవించడం జాతీయ ఆరోగ్యం ప్రణాళికలు ఖర్చులేకుండా రక్తదానం చేయవచ్చు.రక్తం రక్త తో సంబంధం ఉన్న ఉత్పత్తుల ద్వారా చాలా మంది ప్రాణాలు రక్షించేందుకు కృషిచేస్తున్నారు.ముఖ్యంగా గర్భావస్తలో ఉండి ప్రసవం సందర్భంగా జరిగే రక్త శ్రావం జరిగే మహిళలకు.మలేరియా ద్వారా,రక్త హీనత ,ఆహార లోపం తో ఏర్పడే రక్త హీనత తో ఇబ్బంది పడే వారికి అత్యవసర సమయం లో రకరకాల దుర్ఘటనలు జరిగినప్పుడు.వాటి బారిన పడినప్పుడు రక్తం బోన్ మ్యారో సమస్యలతో బాధ పడేవారికి లేదా హేమగ్లోబిన్ సమస్యతో వంశ పారం పర్యంగా వచ్చే సమాస్యల నుండి రక్షణ కల్పించేది రక్తమే. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే 2౦ 22 ... ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాన దినోత్సవం అంశం రక్త దానం చేయడం.రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణం కాపాడడమే ఆయా వర్గాలను సంఘటితం రక్తదాతలను పెంచడం రక్తదానం పై అవగాహన కల్పించడం. రక్త దానం చరిత్ర ... ప్రపంచం లోని రక్త దాతలు కార్ల్ లేండ స్టీనర్ జయంతి సందర్భంగా స్మృతి కి గుర్తుగా జరుపు కుంటున్నారు.ఎవరైతే 14 జూన్1868 న జన్మించారో ఏ బి ఓ బ్లడ్ గ్రూప్ ను  వెతుకు తారు.రక్త దానం చెయడం ద్వారా వారిని   ఆరోగ్యవంతులుగా చేసేందుకు ప్రయత్నం చేయడం విశేషంగా చెప్పవచ్చు.కార్ల్ లేండ స్టీనర్ ప్రయత్నాన్ని   అభినందించిన సంస్థలు ఆయనను గౌరవ ప్రదంగా సత్కరించారు.2౦౦4 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ప్రపంచ రక్త దాన దినోత్సవం నిర్వహించింది.అన్నిదేశాల ప్రజలను రక్తదానం చేసేవిధంగా ప్రోత్సహిస్తారు.నేడు ప్రపంచ రక్త దాన దినోత్దవానికి మెక్సికో ఆతిధ్యం ఇస్తోంది.జాతీయ రక్త కేంద్రాలు వాటి ప్రాధాన్యత ఆధారంగా కార్యక్రమం నిర్వహించాలని రక్తం యొక్క అవసరం ప్రపంచానికి ఉంది.ప్రపంచ రక్తాదాతల దినోత్సవాన్ని డబ్ల్యు హెచ్ ఓ ఒక మాధ్యమం గా జాతీయ రక్త దాన దినోత్సవం స్థానిక స్థాయిలో కార్యక్రామాలు చేపట్టడం ద్వారా రక్త దాతలు స్వేచాగా దాతను ప్రోత్సహిస్తూ వారికి సహకరించడం అలవరచుకోవాలి.అయితే ఇక్కడ ఒకవిషయాన్ని గుర్తుంచుకోవాలి రక్త నిదికేంద్రాలలో రక్తం నిల్వచేయడం ద్వారా రక్తం ఎప్పుడు ఎవరికీ ఉపయోగాపడచ్చు.ఉపయోగ పడక పోవచ్చు.అయితే ఒక్కోసారి అత్యవసర సమయం లో ఆపత్కాలం లో మనం చేసిన రక్త దానం ఆరోగి మనకళ్ళ ముందు ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక ప్రాణం కాపాడ గాలిగా మని సంతృప్తి ఉంటుంది. రెండు బై పాస్ సర్జరీలు,రెండు రోడ్ ఆక్సిడెంట్ కేసులకు అత్యవసర సమయం లో దాదాపు కొన్ని సందర్భాలలో రక్త లోని ప్లాస్మా,ప్లేటిలెట్స్ ను దానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడ గలిగిన మా  అనుభవం మా జీవితంలో కొందరికైనా ఉపయోగ పడ్డామన్న ఆనందం మాకు మిగిలింది.మీ రక్తదానం మరో జీవితానికి వెలుగు అన్న విషయం గ్రహించండి. నిస్వార్ధంగా రక్త దానం చేసే రక్త దాతలందరికి మా శుభాకాంక్షలు. అత్యంత విలువైనది రక్త్గమే రక్తదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి.                               

ఒత్తిడి.. యాంగ్జైటీ.. మూడ్.. స్వింగ్స్ మధ్య తేడా ఏమిటి?

ఒత్తిడి-యాంగ్జైటీ -మూడ్ స్వింగ్ సమస్యలను శారీరక అరోగ్యం తో పాటు మానసిక అరోగ్యం  పట్ల మెల్లిగా  ప్రాధాన్యత పెరిగింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం7.5% మంది ప్రజలు మానసిక సమస్యలు మెంటల్ దిజార్దర్ తో బాధ పడుతున్నట్లు తెలిపింది.ఈ గణాంకాలు 2౦2౦ నాటిదని మహమ్మారి తరువాత మానసిక సమస్యలు మరింత పెరిగాయని ౩8మిలియన్ల భారాతీయులు యాంగ్జయిటి డిజార్దర్ బారిన పడ్డారని ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం లో ౩6.6% ఆత్మహాత్యలు చేసుకుంటున్నారని ఇది చింతించాల్సిన విషయం గా చెప్పవచ్చు.ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మానసిక సమస్యలు అంశాల పైన అవగాహన తక్కువే అని చెప్పాలి. నేటి యువతరం ఒత్తిడికి-యాంగ్జయిటీ-మూడ్ స్వింగ్స్.. అసలు ఈ మూడు అంశాల మధ్య ఉన్న తేడా ఏమిటీ? అని అర్ధం చ్గేసుకోవడం లో అసమర్ధులు దీనిని గురించి అవగాహన కల్పించడం అవసరం దీనినే మానసిక సమస్య మెంటల్ డిజార్డర్స్ కోసం సరైన సమాధానం తెలుసుకోవాల్సి ఉంది.నేడు ప్రజలు మానసిక అనారోగ్య సమస్యలు లక్ష్యాలను శారీరక అనారోగ్యం గా అర్ధం చేసుకుంటారు.బాల్యం కౌమార దశలో ఉన్న వాళ్ళు దీనిని ఇదే పేరు పెట్టి పిలుస్తున్నారు. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉండవచ్చు. స్ట్రెస్-ఒత్తిడి --- ఒత్తిడి అనేది జీవితం లో ఎన్నో సవాళ్ళను అనుభవాల ప్రక్రియల రూపంగా అర్ధం చేసుకోవాలి.ప్రతి కూల పరిస్థితులు లేదా కొత్త సవాళ్ళు ఒత్తిడికి అవకాశాలు ఉన్నాయి.ముక్యంగా యువతీ యువకులు ఒత్తిడి బారిన పడుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.ఒత్తిడి, యాంగ్జ యిటి,మూడ్ స్వింగ్స్ వంటి పంజరం లో ఇరుక్కుని అందులో నుండి బయట పడే మార్గం లేక తీవ్ర సమస్యలు ఎదుర్కుటున్నారు.అలాగే వారి జీవితం లో వృతి పరమైన వ్యక్తి పరమైన సవాళ్ళను ఎదుర్కోక తప్పదు.వాటిని ఎదుర్కోక తప్పదు.ఒక్కో వయస్సులో ఒకరికి చదువు లో ఒత్తిడి సమస్య,మిత్రుల నుండి ఒత్తిడి శారీరకంగా వచ్చే లక్షణాలు సమస్యల పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.నిద్రలేమి,నిద్రపోక పోవడంఆకలి లేకపోవడం అలసట విసుగు తదితరాలు ఉంటాయి. యాంగ్జైటీ... యాంగ్జైటీ లేదా తీవ్రమైన ఆలోచన ఏంచేయాలో ఎలా చేయాలో తెలియని స్థితి నుండి ఎలా బయటపడాలి యాంగ్జైటీ కారణంగా ఆందోళన భయం అనుమానం సందేహం ఆత్మవిశ్వాసం లోపించడం నిరాశ,నిస్పృహ,లాంటి భావనలు.కలుగుతాయి.మరెన్నో కారణాలు యువతీ యువకులను వేదిస్తాయి. విద్యా వ్యవస్థలో మార్పులు ఒత్తిడి ఎదుర్కోలేక పోవడం,ప్రాధాన్యతలు మారడం సమాజం లో వారి స్థానం ఏమిటి తమకు ప్రాధాన్యత లేదని. మరొకరు చిన్నచూపు చూస్తున్నారేమో అన్న ఆత్మ న్యూనత భావం.ఈ కారణంగా వారికి నిద్రలేమి,కోపం,అలసట ఏకాగ్రత లోపం,భయం వంటి భావాన ఎదురౌతాయి. మూడ్ స్వింగ్స్ ---- అంటే దీని ఆర్ధం మీ మనసులో అనుకోకుండా వేగంగా మారడం.అది బయటి కారణాలవల్ల ప్రెరెపింప బడి ఉండచ్చు.అలాకాక పోవచ్చు.లేదా గత స్మృతులు లేదా మరిన్ని భయంకర మైన  పాత జ్ఞాపకాలు మూడ్ లో మార్పులకు కారణం అవుతుందని అంచనా.మూడ్ స్వింగ్ అనేది నియంత్రించ లేని సమస్యకు సంకేతం బై పోలార్ డిజార్దర్,ఒత్తిడి మెనోపాజ్,సమస్యలు అది ఒత్తిడి యాంగ్జయిటి వంటివి సామాన్యమైనవి కావు.ఒక్కసారి ఆనందం,దుఃఖం ఆగ్రహం వంటివి రావడం సహజం.మూడ్ స్వింగ్ చాలా సార్లు వస్తూ వుంటే చాలా పరిదులు దాటితే విషయం తీవ్రత కు దారి తీయవచ్చు. ఏది ఏమైనా మానసికం గా బలహెన పాడారో అనారోగ్యానికి గురి కవడం గమనించవచ్చు.                                                                            

బరువు తగ్గడానికి సింపుల్ చిట్కా...

అల్లం తో అమాంతం మీ బరువు తగ్గించ వచ్చు.----  మీరు ఊబకాయం తో ఇబ్బంది పడుతున్నారా?  అయితే ఈ చిట్కా మీకోసామే. ప్రతి రెండో వ్యక్తి లో పెరుగుతున్న బరువు కారణం గా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా మహమ్మారి సమయం లో కొద్ది పాటి సాధారణ సమస్యలు వచ్చాయి.కానీ మీకు తెలుసా అల్లం సేవించడం వల్ల  వారి బరువు తగ్గించవచ్చని విషయం తెలుసుకున్నారని.మీరు వినే ఉంటారు వేసవికాలం లో అల్లం తీసుకుంటే పొట్ట పాడై  పోతుందని దీని వల్ల అతి సారం వస్తుందని ఒక అపోహా ఉంది.అల్లం సహజంగా వేడి చేస్తుందన్నది నిజం ఇందులో మరో మాట లేదని అంటున్నారు.అయితే అది పంచెంద్రియాల పై అల్లం తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అలాగే మీ బరువు తగ్గుతుంది.అల్లం పొట్టకు ఇరువైపులా ఉన్న కొవ్వును తగ్గించడం లో సహకరిస్తుంది.అసలు అల్లాన్ని ఎండాకాలం లో తినవచ్చ లేదా అన్నది ప్రశ్న.దీని గురించి తెలుసుకుందాం. బరువు తగ్గించడం లో అల్లం దోహదం చేస్తుందా లేదా? ఆయుర్వేదం లో అల్లం ఒక ఔషదం గా భావిస్తారు.అల్లం వినియోగం కేవలం భోజనం లో రుచికోసం మాత్రమే కాదు.ఔషద రూపం లో కూడా ఉపయోగించవచ్చు.అల్లం లో ఉండే ఘాటైన వాసనా రుచిగా ఉటుంది.అల్లానికి శరీరానికి వేడి చేసే గుణం ఉంది.అల్లం యాంటీ ఇంఫ్లామేటరీ యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉన్నందున బరువు తగ్గిస్తాయి.బ్లాటింగ్ ను తగ్గించడం పంచెంద్రియాలను శుద్ధి చేయడం లాభదాయకంగా ఉంటుంది. వేసవికాలం లో ౩ లేదా 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం వినియోగించకూడదు. ఇదీ కాక అల్లం చాలా రకాల క్యాన్సర్ నుండి రక్షించేందుకు సహకరిస్తుంది. అల్లం తో మరోకటి కలిపి తీసుకోండి... బరువు తగ్గడం కోసం అల్లం తో పాటు మరో వస్తువు తీసుకోవచ్చు. అల్లంతో టీ --- అల్లంతో టీ తయారు చేయండి.భోజనం తో తీసుకోండి.వేసవికాలం లో అయినా తీసుకోవచ్చు.పొట్టకు ఇరువైపులా ఉన్న కొవ్వు తగ్గించాలని కోరుకున్నట్లై తే అల్లంతో పాటు నిమ్మరసం లో జోడించండి అలా ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి తో పాటు యాసిడ్ మరియు యాంటి ఆక్సిడెంట్ కూడా  పనిచేస్తుంది.అల్లంతో కలిపి తీసుకున్న బరుతగ్గ వచ్చు అని అంటున్నారు. అల్లం ఎలా తీసుకోవాలి... ఆల్లం డీ టాక్స్ డ్రింక్... అల్లం డీ టాక్స్ డ్రింక్ తయారు చేసేందుకు ఒక చంచా బాగా దంచిన అల్లం లో ౩ చెంచాల నిమ్మరసం కలపండి.ఒక లీటర్ వేడి నీటిలో బాగా కలిపిరోజంతా మెల్ల మెల్లగా ఈ ద్రవాన్ని తీసుకోండి. జింజిర్ టీ /అల్లం టీ... రెండు కప్పుల నీళ్ళు తీసుకుని ఇందులో ఒక చెంచాడు.దంచిన అల్లం కలపండి.నీళ్ళను బాగా మరగనివ్వాలి. అవసరం మేరకు పంచదార లేదా తేనె అందులో ఒక చెంచా నిమ్మరసం లో చిటికెడు దాల్చిన పొడి లేదా ఇలాచి పొడి,కలిపి ఒక్క ఉడుకు రానిచ్చి అన్నిటిని కలపండి.భోజనం తరువాత ఈ ద్రవాన్ని తీసుకోండి పొట్టలో గ్యాస్ తగ్గుతుంది. అల్లం టోఫీ... అల్లం మురబ్బ అనికూడా అని అంటూ ఉంటారు.అదే అల్లం లో చేసే చాక్లెట్ అల్లం మురబ్బ ఇది తయారు చేయడం కొంచం కష్టం.ఇందుకోసం కొంచం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కోయండి.ఒక పెద్దకప్పులో ముక్కలను వేసి ఒక కప్పు నిమ్మరసం ఒక చెంచా ఆమ్ చూర్ పొడి మిరియాలపొడి ఉప్పు కలపండి అల్లం ముక్కలను కాసేపు నానపెట్టి ఎండలో ఎందపెట్టండి.మొత్తం ఎండిన అల్లం క్యాని లేదా టోఫీ రెడీ. కొంచం పంచదార్ కొంచం బాగా తురిమిన అల్లం తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరగనిచ్చి పంచదార లేదాబెల్లం తీగ పాకం వచ్చేదాకాకలపండి ఆతరువాత  తరిగిన అల్లం  పాకం లోవేసి ఉండ కట్టకుండా  కలపండి ఆతరువాత ఒక పళ్ళెంలో నెయ్యి రాసి అల్లంపాకం వేసిన మిశ్రమాన్ని ఆరబెట్టండి అచ్చుఅచ్చుగా కోసి తీసుకోండి. అల్లం మురబ్బ రెడీ. సో మీ ఊబకా యానికి,బరువు తగ్గడానికి సింపుల్ చిట్కా మీ కోసం. 

వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే 2౦22...

  బ్రెయిన్ ట్యూమర్ ను అశ్రద్ధ చేసారో ప్రాణాలకే ప్రామాదం.మన మెదడులో కణి తలు ఉన్నాయా ప్రాణాలే పోవచ్చు.మన మెదడులో వచ్చే బ్రెయిన్ త్యుమర్స్ పై దృష్టి పెట్టాల్సిన అవస్యకతను తెలుపుతుంది.గజియా బాద్ లోని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో న్యూరో సర్జరీ విభాగం లో డాక్టర్ మనీష్ వైష్య మాట్లాడుతూ మన మెదడులో అసామాన్య మైన భాగాలు ఉంటాయని.అందులో అవి ఒక్కోసారి వికసిస్తాయి.అది ఆ సామాన్య మైన భాగాలు అందులో ఒక్కోసారి వాటి లక్షణాలు గుర్తించడం.సమయానికి చికిత్స అందించడం అవసరమని అన్నారు.ఒకోసారి మనకు అప్పుడప్పుడు వచ్చే త్ఘల నొప్పి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే మీకు అదే పనిగా చాలా రోజులనుండి తీవ్రమైన తల నొప్పి ఉంటె పగలు రాత్రి అన్న తేడా లేకుండా మిమ్మల్ని నిద్ర పోనివ్వకుండా తీవ్రమైన ఇబ్బంది పెడుతూ ఉంటుంది తల తిరిగి నట్లు వాంతులు తుమ్ములు,వస్తే దానిని అశ్రద్ధ చేయకండి.మీరు  తల నొప్పికి సంబందించిన మందులు వేసుకున్నా తల నొప్పి తగ్గలేదు అది ఖచ్చితంగా మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాసం ఉందన్న సంకేతం కావచ్చు.గత కొన్ని రోజులుగా ఈ రకమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నట్లై తే మీరు అప్రమత్తంగా ఉండండి డాక్టర్ సలహా మేరకు వెంటనే పరీక్షలు చేయించడం తప్పనిసరి.బ్రెయిన్ ట్యూమర్ ను  సకాలం లో పరీక్షలు చికిత్సలు మినహా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జూన్ నెలలో వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ను నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు... చికిత్సలు మినహా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం బ్రెయిన్ ట్యూమర్ డే ని నిర్వహిస్తున్నారు.బ్రెయిన్ ట్యూమర్ మెదడులో ఒక కణిత లేదా ఒక పిండం మాదిరిగా కనితకు ఒక అసామాన్య మైన భాగం లో వృద్ధి చెందుతుంది. బ్రెయిన్ ట్యూమర్ వర్గీకరణ... బ్రెయిన్ ట్యూమర్ రెండురకాలుగా వర్గీకరించారు.అందులో ఒకటి క్యాన్సర్ తో కూడుకున్నది.మరొకటి క్యాన్సర్ కానిది.క్యాన్సర్ కాని ట్యూమర్ ను అది పెరిగే పద్దతుల పై ఆధార పడి ఉంటుంది.బ్రెయిన్ ట్యూమర్ రెండు శ్రేణులుగా విభజించారు.ఒకటి నేరుగా మెదడులో పెరగడం దానిని ప్రాధమిక స్థాయిలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ ఇంకొకటి శరీరం లోని మరో భాగం నుండి మెదడుకు విస్తరించడం.దీనిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు.బ్రెయిన్ ట్యూమర్ కు ప్రాధాన కారణం మన ఆలోచనలు ప్రణాళికలు దీనిపై ఆధార పడి ఉంటాయి.క్యాన్సర్ నేడు ఎంత త్వరగా విస్తరిస్తుందో అది ఎస్తానం లో ఉందొ అంటే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందొ తెలుసుకోవడం అవసరం. బ్రెయిన్ ట్యూమర్లు నాలుగు రకాలు... గ్రేడ్ 1 ..7 సంవత్సరాలకు పైగా పాత కాలం నాటి ట్యూమర్ గా పేర్కొన్నారు. గ్రేడ్ 2..5 నుండి 7 సంవత్సరాల కాలం నాటి ట్యూమర్. గ్రేడ్ ౩..౩ సంవత్సరాల ట్యూమర్ గా నిర్ధారించారు. గ్రేడ్ 4..9 నెలల నుండి 1 1/2 సంవత్సరం. ట్యూమర్ లక్షణాలు.. *సాధారణ మైన తల నొప్పి మెల్లగా తీవ్రంగా మారడం. *ఉదయం వేళా వచ్చే తలనొప్పికి కారణం గా నిద్రపట్టక పోవడం. *శరీరం త్వరాగా అలిసి పోవడం వాంతులు. *మీ కంటి చూపు మసక మసక గా ఉండడం లేదా ఒకవస్తువు రెండుగా కనపడడం. * బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళ లో సహజంగా  వచ్చే తల నొప్పి,లేదా తీవ్రంగా వచ్చే తల నొప్పి సరిగా నిత్దారణ కానట్లయితే సమస్యలు తప్పవు. *బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళ లో మాట్లాడడం లో తీవ్ర సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. *కళ్ళు తిరిగినట్లు ఉండడం ఉన్న వ్యక్తికి ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్ ఉండక పోవచ్చు. *బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవాళ్ళలో వినికిడి సమస్య రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు లేదా ఎవరైనా కొన్ని సమస్యల పై దృష్టి పెట్టాల్సిందే... *మీశరీరం ఫిట్ గా ఉండడం బరువు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. *ప్రతి రోజూ ౩౦--4౦ నిమిషాల యోగా లేదా మెడిటేషన్ చెయడం తప్పనిసరి. *ఎట్టి పరిస్థితులలో ఏ రూపం లో పొగాకు వాడకం చేయాకూడదు. *మద్యం,ఎర్రటి మాంసం తినకూడదు. తక్కువ గా తినడంఆరోగ్యానికి మంచిది. *పచ్చటి ఆకు కూరలు నియమిత మొత్తము తీసుకోండి. *మీ మెదడు ప్రశాంతంగా ఉంచండి అందుకోసం సంగీతం వినండి.పుస్తకాలు చదవండి.లేదా మీకు ఇష్ట మైన పని చేయండి. సర్జరీ... బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ద్వారా ట్యూమర్ ను లేదా ఎక్కడైతే ట్యూమర్ ఉన్న భాగం తొలగించే ప్రయాత్నం చేస్తారు.ఎంతవరకూ మెదడు ట్యూమర్ లోని భాగాన్ని తొలగించాల్సి రావ.చ్చు. తొలగించినప్పటికీ లక్షణా లను తగ్గించడం లో సహకరిస్తుంది.మెదడులో ఉన్న ట్యూమర్ ను తొలగించేందుకు చేసే సర్జరీలలో ఒక్కో సారి ప్రమాదం జరగచ్చు.ఒక్కోసారి రక్త స్రావం జరిగే ప్రామాడం ఉంది.ట్యూమర్ దానిస్తానం లో ఉంటె ఎక్కడైతే ప్రమాదం ఉందొ ఇతర ప్రాత్యామ్నాయ సహాయం తీసుకుంటారు.ఏండో స్కోపిక్ స్పైన్ సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడం చాలా సులభం విజయ వంతంగా పూర్తి చేయావచ్చు. రేడియేషన్ తెరఫీ... రెడియెషన్ తెరఫీ లలో ట్యూమర్ వచ్చిన ప్రాంతాలాలో నష్టం కలిగించి హై ఎనర్జీ బీం లాంటి ఎక్స్ రే లేదా ప్రోటాన్స్ ను వినియోగిస్తారు. రెడి యేషన్ తెరఫీ ఎన్ని రకాలు... రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.ఎలాంటి రేడియేషన్ ఎంత డోసేజ్ ఇవ్వాలి.ఇస్తారు.సాధారణ అయితే రెడీ యేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో ఇన్ఫెక్షన్ వల్ల అలసట తల నొప్పి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చదవడం మెదడుపై మంట దురద వంటివి వస్తాయి. రేడియో సర్జరీ... ఇది వంశ పారం పర్యంగా చేసే సర్జరీ కాదు.ఇందులో క్యాన్సర్ తో పాటు మెదడులోని వివిధ భాగాల ను ధీ కొనాలంటే చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సవాళ్ళను ఎదుర్కోక తప్పదు.అందుకే క్యాన్సర్ కు కీమోతేరఫీ ద్వారా ఇచ్చే మందు మాత్ర రూపం లో ఇస్తారు.లేదా ఐ వి ద్వారా అంటే ఇంటర్ వైన్ ఇంజక్షన్ ద్వారా తీసుకుంటారు.దీనిని ఎంత డోస్ ఇస్తారు.అది ట్యూమర్ పై ఆధార పది ఉంటుంది.దీనివల్ల శరీరం లో అలసట,బేజారు,వాంతులు,జుట్టు ఊడి పోవడం వంటి సమాస్యలు వస్తాయి. టార్గెట్ డ్రగ్ తెరఫీ ... టార్గెట్ డ్రగ్ తెరఫీ క్యాన్సర్ ఉన్న కణాలలో విశేషమైన అసామాన్యమైన వాటి పై దృష్టి పెడతారు.అసామాన్యమైన వాటిని బ్లాక్ చేస్తూ క్యాన్సర్ వచ్చిన కణాలాను లేదా ఆ ప్రదేశం లో ఉన్న కణాలాను పూతిగా చంపేస్తారు.బ్రెయిన్ ట్యూమర్  చికిత్స కు ప్రాత్యామ్నాయాలు ఉన్నాయి.ట్యూమర్ వాటి సైజ్ ఆకారం స్థితిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది.ఏ మైనా బ్రెయిన్ ట్యూమర్ ను నిర్లక్ష్యం వద్దు అప్రమత్తంగా ఉండండి.                                    

నోరో వైరస్ కలకలం...

కేరళా ను కోరోనా కొత్తవైరస్ నోరా వైరస్ వణికిస్తోంది. అది ఎంత ప్రమాద కరమో ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకుందాం. కరోనాతో పాటు ఇప్పుడు కేరళాలో నోరా వైరస్ ప్రమాదం పొంచిఉంది. నోరా వైరస్ కేసులు కేరళా లో కనిపిస్తున్నాయి.విజ్ ఇన్ జం లో నేడు నోరా వైరస్ రోగులను గుర్తించారు. ఈ మేరకు కేరళా ప్రభుత్వ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ ఈ అంశం గురించి వివరించారు. నోరా వైరస్ సోకిన ఇద్దరు పిల్లలు స్థితి నిలకడ గానే ఉందని ఇప్పుడు సామ్ పుల్ తీసుకుని ఇతర పరీక్షలు  నిర్వహిస్తామని ఇతర పద్దతులనుకేంద్రం మార్గ దర్సకాలకు అనుగుణంగావ్యావహరిస్తామనిప్రభుత్వం వెల్లడించింది. అలసట,వాంతులు,జ్వరం,అనుకోకుండా తీవ్రమైన నొప్పి,అదే పనిగా విరేచనాలు.ఒళ్ళు నొప్పులు,తల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని కేరళా రాష్ట్ర్రానికి చెందిన వైద్యులు వివరించారు. విజ్ ఇన్ జం లోని ఎల్ ఎం ఎస్ ఎల్ పి పాట శాలాలో బాదిత విద్యార్ధులు చదువు తున్నారని.ఆహారం విషపూరితం అయ్యిందని.డయేరియా సమస్యలతో వచ్చిన విద్యార్ధులను పరీక్షించగా నోరా వైరస్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. 2౦19 లో నోరా వైరస్ అమెరికాలో ని కొలరాడో లో వచ్చిందని.నోరా వైరస్  అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు . అంటు వ్యాధిగా నిర్ధారించారుఅమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ నియంత్రణ నివారణ సంస్థ నోరా వైరస్ ప్రజలలో త్వరగా విస్తరించే వైరస్ గా పేర్కొన్నారు. నోరా వైరస్ సంక్రమించిన వారిలో 12 గం నుండి 48 గం తరువాత దాని ప్రభావం ఉంటుందని వ్యక్తులలో డయేరియా వాంతులు అసహనం,అలసట,పోట్ట నొప్పి వంటివి ఉంటాయని ఒక్కరోజులో చాలా సార్లు వాంతులుడయేరియా తో తీవ్ర ఇబ్బందులు పడతారాని నిర్ధారించారు. నోరా వైరస్ సంక్రమించిన వారిలో వాంతులు మలము నుండి వైరస్ విస్తరించే అవకాశం ఉందని రోగిని పూర్తిగా ఐ సోలేషణ్ ఉంచాలని సూచించారు. నోరా వైరస్ ఎక్కువగా పిల్లలో కనపడుతోంది.నోరా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని. ఇన్ఫెక్షన్ సోకిందని ఇన్ఫెక్షన్ సోకిన వారినుండి వేరొకరికి సోకే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు. విష ఆహారం లేదా నీరు కలుషితం అయినప్పుడు. చేయి శుభ్రంగా లేని వ్యక్తి నుండి సక్రమించవచ్చు. డయేరియా,వేరేచనాలు. వాంతులు,కడుపునొప్పి, జ్వరం,త్గలనోప్పి,ఒల్లునోప్పులు వంటి సమస్య ఉన్నపౌడు నోరా వైరస్ లక్షణం గా చెప్పవచ్చని అంటున్నారు. నోరా వైరస్ లక్షణాలు కాన పడ్డ వెంటనే అప్రమత్తంగా ఉండడం.రోగిని పూర్తిగా ఇసోలేషణ్ లోకి పంపడం ప్రధమ కర్తవ్యం. నోరా వైరస్ సోకినా వ్యక్తిని తాకినా కూర్చున్న సోకే అవకాసం ఉందన్న విషయం మీరు గ్రహించారు.                         .                          

క్యాన్సర్ రోగులకు శుభవార్త....

క్యాన్సర్ కణాల నిర్వీర్యం చేయడం లో వైరస్ ఇంజెక్షన్మానవుల పై చేసిన  తొలి క్లినికల్ ట్రైల్స్ లోనే అద్భుత ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. దీర్ఘకాలం గా క్యాన్సర్ తో పోరాడుతున్న రోగులకు శుభవార్త.క్యాన్సర్ కణాలను చంపేందుకు మానవులలో మొదటి సారిగా వైరస్ ను ఇంజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకోసం నిర్వహిస్తున్న క్లినికల్ ట్రైల్స్ లో వివిదరకాల క్యాన్సార్లను పూర్తిగా నిర్మూలించే అంశం పై క్లినికల్ ట్రైల్స్ ద్వారాశాస్త్రజ్ఞులు   మదింపు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ ఇంజక్ట్ చేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.తట్టు కో గలిగే శక్తి ఉందా లేదా.మానవులలో ఉన్న క్యాన్సర్ కణాలను చంపుతుందా లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లు పై అధ్యయనం చేయాల్సి ఉంది.నూతన తెరఫీ ని వ్యాక్సీనియా గా నామ కారణం చేసారు.క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడం.క్యాన్సర్ సైజును తగ్గించడం వంటి పరిణామాలను పశువుల పై చేసిన పరిశోదనలో వైరస్ ను తక్కువ మోతాదులో వాడినట్లు తెలిపారు. నూతన తెరఫీ ద్వారా క్యాన్సర్ కణాల వ వ్యాప్తిని నిరోధించడం.క్యాన్సర్ కణాలు లక్ష్యంగా క్యాన్సర్ ఎడ్వాన్స్  స్టేజిలో సైతం నియంత్రిన్చాగల సామర్ధ్యం తెరఫీ సాధిస్తుందా లేదా అన్న అంశం పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది. పేస్ వన్ క్లినికల్ ట్రైల్స్... యాంటి క్యాన్సర్ డ్రగ్ ప్రయోగం నిర్వహించారు.దీనిని  సి ఎల్ ౩౩ హెచ్ ఎన్ ఐ ఎస్ లేదా వ్యాక్సినా గా నామకరణం చేసారు.ఈ ప్రయోగం లో పాల్గొన్న తొలి వ్యక్తి అంకలిస్టిక్ వైరస్ ఇన్ సె క్ట్   క్యాన్సర్  కణాలను ను చంపేస్తుందని అది ఆరోగ్యానికి ప్రమాదం లేదన్న విషయాన్ని ప్రయోగం నిరూపించింది.అని నిపుణులు వెల్లడించారు. వ్యాక్సీనియా ఏమిటి?... వ్యాక్సీనియా జనటికల్ గా స్మాల్ పాక్స్ వైరస్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉన్న క్యాన్సర్ కణాలను నివారించడం లో ల్యాబొరేటరీ లో చేసిన ప్రయోగం దోహదపడిందని. యు ఎస్ కు చెందిన సిటి హోప్స్ క్యాన్సర్ రీసెర్చ్ బ్రౌల్మేట్ ఇన్స్టిట్యుట్,  ఆస్ట్రేలియాకు చెందిన ఇమ్యుజీన్,బయోటెక్ కం పేనీ సంయుక్తంగా నిర్వహిస్తున్న నావల్ వైరస్ క్యాన్సర్ రోగాలకు,ఆంకలిక్ వైరస్ కనితలు ,కణాల సైజు ను తగ్గిస్తుందని అత్యంత నమ్మకంగా నిర్వహించాగాలిగా మని నిర్వా హాకులు సిటి వాప్ కు చెందిన సర్జరీ విభాగం అధ్యక్షుడు.డాక్టర్ యమన్ ఫాగ్ సిఎఫ్ ౩౩ వ్యాక్సినా ద్వారా అన్నిరకాల క్యాన్సర్ లక్ష్యంగా తయారు చేసినట్లు వివరించారు.తెరఫి వైరస్ లు కొత్తవి కావడం విశేషం. ఇమ్యుజిన్ సి ఇఓ లేస్లె చాంగ్ మాట్లాడుతూ క్యాన్సర్ తెరఫీ లో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తెర ఫీ వల్ల సంతృప్తి చెందామని. క్యాన్సర్ తో బాధపడే వారి జీవితం పెంచగలిగామని అన్ని క్యాన్సర్లకు తెరఫీ పనిచేసే లక్ష్యం గా పనిచేస్తున్నట్లు  చెప్పారు. అంకోలిటిక్ వైరేస్లు... అంకా లెటిక్  వైరస్ ప్రకృతిలో సహజంగానే ఉంటాయని జనిటిక్ గా ప్రత్యేకంగా ఎంపిక చేసిన పరిశోదన చేసిన వైరస్ వల్ల క్యాన్సర్ కణాలు ఇన్ఫెక్ట్ అయిన క్యాన్సర్ కణాలు కణి తలను ను వైరస్ చంపేస్తుందని.కొన్ని సందర్భాలాలో కణితలు పగిలినప్పుడు ట్యూమర్ లో ప్రోటీన్ లేదా యాంటి జన్స్ విడు దల చేస్తుంది. ఇమ్యూన్ సిస్టం ఒక ఫారన్  బాడీగా గుర్తిస్తుంది.ఇమ్యూన్ రెసిస్టన్స్ యాంటి జన్స్ ట్యూమర్ కణాలు చనిపోతాయాని ద్రువీకరించారని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల అదనంగా రోగనిరోదక శక్తి సామర్ధ్యం పెరిగినట్లు గుర్తించారు. కణి తలు జ్ఞాపక శక్తి,యాన్టిజన్స్ క్యాన్సర్ మరణాలు రాకుండా సంరక్షిస్తుంది.అంకలిక్ చిన్నడోస్ కణితలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వైరస్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోదిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న క్యాన్సర్ కణాలు ప్రోటీన్ రేసేప్టర్ రోగనిరోధక శక్తిని మెటా స్టేసైజ్ కణాలు చనిపోకుండా రక్షిస్తుంది.అంకలైటిక్ వైరస్ క్యాన్సర్ కణాలు ప్రోటీన్ లక్ష్యంగా  పనిచేస్తుంది. డాక్టర్ ఫాంగ్ గుర్తించిన అంశాలు ఏమిటి?... క్యాన్సర్ కణాలు లక్షణాలు వాటి పనితీరు.ఆశ్చర్యాని కలిగిస్తుంది.అన్నారు.క్యాన్సర్ కణాలు కీమోతేరఫీ,రేడియేషన్,చికిత్సలు వైరస్ ను పెంచుతాయని.వైరస్ ఒక సాధనంగా ఉపయోగపడతాయని ఫాంగ్ అభిప్రాయ పడ్డారు. వ్యాక్సీనియా లక్ష్యం క్యాన్సర్ కణాలే... సి ఎఫ్౩౩ హెచ్ ఎన్ ఐ ఎస్ వ్యాక్సీనియా ను వృద్ది చేసారు.ఆధునీకరించిన వ్యాక్సీనియా స్మాల్ పాక్స్ వైరస్ దీనిని సి ఎఫ్౩౩ హెచ్ ఎన్ ఐ ఎస్ ట్యూమర్ సేల్స్ పై పనిచేసే విధంగా అందుకు తగిన సామర్ధ్యం ఆధునీక రించిన వ్యాక్సీనియా వైరస్ ప్రోటీన్ ట్యూమర్ పోదియంగా పిలుస్తారు.ట్యూమర్ సేల్స్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి రేడియం యాక్టివిటీ అప్రోడిన్ అప్ చెక్ శరీరానికి అయో డి న్ ట్రాక్ వైరస్ పంపిణీ చేయడం ద్వారా ప్రభావ వంతంగా పనిచేస్తుందని అన్న్తున్నారు నిపుణులు. ఆంకో లిక్ వైరస్ జంతువులలో పెరిగిందని కాంబినేషన్ తెరఫీ కన్నా ప్రభావ వంతంగా ఉంటుందని నిపుణులు దృ వీకరించారు. ఇతర ఇమ్యునో తెరఫీ ల కన్నా ఇంకి బెటర్స్ కార్ట్ తేరఫీలు సి ఎఫ్ ౩౩ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫారం త్వరగా వృ ద్ది చెందుతుందని వివిధ రకాల కాంబినేషన్ లో క్లినికల్ గా మరిన్ని క్లినికల్ గా మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ చికిత్సలో... ఇతర ఇమ్యునో తెర ఫీల కన్నా ప్రభావ వంతమైనదని నిపుణులు తేల్చారు. తెరఫీ ప్రభావం, పని తీరు మెరుగుగా ఉంటుందని ఆశా భావం వ్యక్త్గం చేసారు.క్యాన్సర్ తెరఫీలో కార్ టి సెల్ తెరఫీ 1౦ సంవత్సరాలలో సత్ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. క్యాన్సర్ లో కొవ్వు పదార్ధాలు ఉన్న ఆహారానికి సంబంధం ఉందా? క్యాన్సర్ వల్ల  కొన్ని  అపోహాలు.