వైకాపా సమైక్య రాజకీయాలు

  తెలంగాణా వదులుకొని వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్యాంద్ర ఉద్యమాలు సీమాంద్రాలో రాజకీయంగా పూర్తి పట్టు సాధించేందుకేనన్నది బహిరంగ రహస్యమే. అసలు రాష్ట్రం రెండుగా విడిపోతుందని ఆ పార్టీ బలంగా నమ్మినందునే తను బలహీనంగా ఉన్నతెలంగాణాను వదులుకొని, బలంగా ఉన్న సీమాంధ్రకి వచ్చేసింది. ఒకవేళ వైకాపా నిజంగానే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఉంటుందని లేదా తన ఉద్యమాల ద్వారా విభజన ప్రక్రియను ఆపగాలననే ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండి ఉంటే తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకొనేదికాదు. కానీ వదులుకొని వచ్చిందంటే రాష్ట్ర విభజన అనివార్యమని ఆ పార్టీ మనస్పూర్తిగా నమ్ముతున్నట్లు అర్ధం అవుతోంది. అయినా కూడా నేటికీ ఆపార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం ఆపలేదు. అంటే విభజన ఖాయమని నమ్ముతూనే ప్రజలతో గొంతు కలిపి సమైక్య రాగం ఆలపిస్తూ వారి మనసులు గెలుచుకొని రానున్న ఎన్నికలలో దానిని ఓట్ల రూపంలోకి మార్చుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.   షర్మిల, విజయమ్మలతో సహా ఆ పార్టీలో నేతలందరూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకైక ధ్యేయమని చాలా విస్పష్టంగానే చెపుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైకాపా నిజంగా కోరుకొంటున్నట్లయితే, తెలంగాణాలో పార్టీని మూసుకొని వచ్చేదే కాదు. కానీ ఆ పార్టీ కూడా తము అధికారంలోకి రావాలంటే విభజన అనివార్యమని నమ్ముతున్నదునే తెలంగాణాను వదులుకొని సీమాంధ్రలో సమైక్య రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది.   ఈ సంగతి ఏపీఎన్జీవోలు కూడా గ్రహించకపోలేదు. అదే విషయం వారు తమ సభలలో తెలియజేసి రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వైకాపా తన సమైక్య ఉద్యమాల నుండి వెనకడుగు వేయలేదు. ఈరోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే, ఇంతకాలం తన తల్లి, చెల్లి నడిపిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను చేతిలోకి తీసుకొని తన దయిన శైలిలో దూసుకుపోవడం ఖాయం.      

ఆదార్‌ తప్పసిసరి కాదు

  కేవలం ఆదార్‌ లేని కారణంగా భారతదేశం ప్రజలకు నిత్యావసారాలను నిరాకరించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యనించింది. ఆదార్ కార్డు పొందాల వద్దా అనేది వ్యక్తి ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుందని దాన్ని తప్పనిసరి నిబందన చేయద్దని స్పష్టం చేసింది. అంతే కాకుండా అక్రమంగా వలస వచ్చి ఈ దేశంలో ఉంటున్న వారికి ఆదార్‌ కార్డులు అందకుండా జాగ్రత్త పడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. జీతాలు, పిఎఫ్‌లు, వివాహ దృవీకరణ, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ లాంటి వాటికి ఆదార్‌ను తప్పనిసరి చేయటం పై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆదాక అమలు పౌరుల ప్రాదమిక హక్కులను హరించేదిగా ఉండరాదని స్పష్టం చేసింది. ఆదార్‌ తీసుకోవడం వ్యక్తిగత అభిప్రాయం అని కేవలం ఆదార్‌ లేని కారణం వ్యక్తి గుర్తింపు కార్డులు జారీ చేయకుండ ఉండరాదని ప్రభుత్వానికి తెలిపింది.అయితే ఈ విషయం పై వాదనలు వినిపించిన ప్రభుత్వం, ఆదార్‌ తప్పనిసరి కాదని, స్వచ్చందమేనని కోర్టుకు తెలిపింది. ఎటువంటి గుర్తింపు కార్డు లేని అణగారిన వర్గాల కోసమే ఆదార్‌ను అమలు చేస్తున్నామని తెలిపింది.

నేడు సీమాంద్రలో రహదారుల దిగ్బందం

  50 రోజులు దాటినా ఇంకా సీమాంద్రలో ఉద్యమాల హోరు తగ్గకపోగా మరింత ఉదృతం అవుతున్నాయి. ఈ నెల 16న ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు నాయకులు. అందులో భాగంగానే మంగళవారం సీమాంద్ర లో రహాదారుల దిగ్బందించి, బంద్‌ పాటిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలనుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అడ్డకోవటం ద్వారా సమస్య, ఉద్యమ తీవ్రతలు కేంద్రానికి తెలియజేయాలని భావిస్తున్నారు. ఈ రహదారుల దిగ్బందం తిరుమల వెళ్లే భక్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కార్యక్రమంలో అన్ని జేఎసిల నాయకులతో పాటు ప్రజలు కూడా స్వచ్చందంగా పాల్గొనాలని సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

షిండే మళ్లీ మాట మార్చాడు

  తెలంగాణ నోట్‌ విషయంలో షిండే మరోసారి మాట మార్చాడు. గతంలో నోట్‌ రెడీ అయింది అని తానే స్వయంగా అన్న షిండే ఇప్పుడు రెడీ కాలేదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన నోట్‌ తయారికి ఇంకా సమయం పడుతుంది అని, ఆ నోట్‌ను కేభినెట్‌ ముందుకు తీసుకొచ్చేప్పుడు మీకు తప్పకుండా చెపుతామని అన్నారు. రక్షణ మంత్రి ఆంటోని అస్వస్ధత మూలంగా నొట్‌ తయారి ఆలస్యం అవుతుందని, ఆయన కోలుకోగానే నోట్‌ రెడీ చేసి కేభినెట్‌ ముందుకు తీసుకురానున్నారు. దీంతో మంగళవారం జరగబోయే భేటిలో ఇక తెలంగాణ నోట్‌ విషయంలో ఎలాంటి చర్చ జరగదని తేలిపోయింది. ఆంటోని కమిటీ సిఫార్సులు అందిన తరువాత నోట్‌కు తుది రూపునిస్తారని షిండే తెలిపారు. కేభినేట్‌ భేటి తరువాత ప్రదాని అమెరికా పర్యటన ఉన్నందున ఆయన తిరిగి వచ్చాకే నోట్‌ పై తదుపరి కార్యచరణ కొనసాగనుంది. అక్టోబర్‌ తొలి వారంలో జరగభోయే భేటి సమయానికి నోట్‌ రెడీ చేస్తామని హోం శాఖ వర్గాలు చేపుతున్నా ప్రస్థుతం రాష్ట్రం ఉన్న పరిస్ధితుల్లో అసలు కేంద్ర ముందడుగు వేసే ఆలోచనలో ఉందా అనేది కూడా సందేహమే.

జగన్ బెయిల్ పై మంచు లక్ష్మీ కామెంట్

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి తనదైన రీతిలో స్పందించారు. జగన్ కు బెయిల్ రావడాన్ని ఆమె గొప్ప విజయంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.   వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. రెండు లక్షల రూపాయల సెక్యూరిటీ బాండ్ ను, ఇద్దరు పూచీకత్తును ఇవ్వలని కోరింది. అలాగే హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే కేసు విచారణలో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదని కోర్ట్ ఆదేశించింది. జగన్ కు బెయిల్ రావడంతో ఇక పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అలాగే ఆడిటర్ విజయసాయి రెడ్డిలకు కూడా బెయిల్ రావడానికి మార్గం సుగమమం అయినట్లు భావించవచ్చు.

కుదిరిన డీల్, జ‌గ‌న్‌కు బెయిల్‌

  16 నెల‌లుగా చంచ‌ల్‌గూడ జైళులో ఉంటున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఎట్టకేల‌కు బెయిల్ మంజూరు అయింది. ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా తొమ్మిది సార్లు బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన జ‌గ‌న్ చివ‌ర‌కు అనుకున్నది సాదించాడు. అయితే చాలా రోజులుగా కేసు విష‌యంలో ఎంతో బలంగా ఉన్న సిబిఐ గ‌త కొద్ది రోజులుగా దూకుడు తగ్గించింది. ఆక‌వాల‌నే జ‌గ‌న్‌కు బెయిల్ వ‌చ్చే విధంగా చేసింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ప్రస్థుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌గ‌న్‌కు బెయిల్ రావడం ప్రాదాన్యం సంత‌రించుకుంది. అయితే జ‌గ‌న్‌కు బెయిల్ రావ‌డం వెనుక కాంగ్రెస్ హ‌స్తం ఉంది అన్న ఆరోప‌ణ కూడా ఉంది. తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి ఏర్పాండింది ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర రాజీనామాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌తో పెత్తు పెట్టుకుంటే అక్కడ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టవ‌చ్చని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌తో తెలంగాణ ప్రాంతంలో కూడా వీలైన‌న్ని ఎక్కువ స్ధానాలు గెలుచుకోని మ‌రోసారి యుపిఏ ప్రభుత్వాని ఏర్పాటు చేసేదిశ‌గా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. సిబిఐ ఎంక్వయిరీలో వేగం త‌గ్గడం, దాదాపు ఎనిమిది కేసుల్లో క్విడ్‌ప్రోకో జ‌రిగిన‌ట్టుగా ఆదారాలు లేవ‌ని సిబిఐ కోర్టుకు తెల‌ప‌టం లాంటి ప‌రిణామాలలో జ‌గ‌న్ బెయిల్‌కు మార్గం సుగ‌మం అయింది. ప్రస్తుతం కాంగ్రెస్, వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ల మ‌ద్య కుదిరిన ఒప్పందాల‌ను ఇరు పార్టీలు అంగీక‌రించ‌క‌పోయినా , ఎల‌క్షన్స్ స‌మ‌యానికి స‌మీక‌ర‌ణాలు అలాగే మారే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

వైఎస్ జగన్ బెయిల్ కు షరతులు

  గత 16 నెలలుగా అక్రమాస్తుల కేసులో చంచల్ గూడా జైలులో నిర్భంధించబడ్డ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు సీబీఐ కోర్టు షరతుల కూడిన బెయిలు మంజూరు చేసింది. అతనిని హైదరాబాద్ విడిచి బయటకి వెళ్లరాదని, అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉన్నసాక్షులెవరితో మాట్లాడటం కానీ, వారిని ప్రబావితం చేయడం గానీ చేయరాదని ఆదేశించింది. ఒకవేళ అతను షరతులను ఉల్లంఘించినట్లయితే వెంటనే బెయిలు రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. రూ. 2లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తులు రెండు పూచీకత్తులను కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి బెయిలు వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నఅతని లాయర్లు బెయిలు కోసం కోర్టుకి సమర్పించవలసిన అన్ని కాగితాలను ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచారు. అయితే చంచల్ గూడా జైలు కార్యాలయ సమయం ఐదు గంటలకే పూర్తవడంతో, రేపు ఉదయం 10-11గంటల మధ్య జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది.

వైఎస్ జగన్ కు బెయిల్

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 484 రోజులుగా వైఎస్ జగన్ హైదరాబాద్ చంచల్ గూడ జైలులో వున్నారు. మధ్యాహ్నం నుండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తదితరులు కోర్టుకి చేరుకొని తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాలామంది తరలివచ్చారు.     జగన్ కి బెయిల్ లభించడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశం వుంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందని ఆగ్రహంతో ఉన్న అనేకమంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి వైకాపాలోకి దూకవచ్చును. అదేవిధంగా సమైక్యాంధ్ర పధం నోట నుండి ఉచ్చరించని చంద్రబాబుపై కూడా కినిసిన తెలుగు తమ్ముళ్ళు కూడా వైకాపాలోకి దూకే అవకాశం ఉంది.

మరి కొద్ది సేపటిలో జగన్ బెయిలుపై కోర్టు తీర్పు

  నాంపల్లి సీబీఐ కోర్టు మరి కొద్ది సేపటిలో జగన్మోహన్ రెడ్డి బెయిలుపై తన నిర్ణయం ప్రకటించబోతోంది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి బెయిలు రావడం ఖాయమని అతని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దృడంగా నమ్ముతున్నారు. అందుకే అతని లాయర్లు బెయిలు కోసం సమర్పించవలసిన పత్రాలను అన్నీ సిద్దం చేసుకొని కోర్టు తీర్పు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం నుండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తదితరులు కోర్టుకి చేరుకొని తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాలామంది తరలివచ్చారు. కోర్టు తన తీర్పును సాయంత్రం 4.30-5.00గంటల మధ్య వెలువరించి అవకాశం ఉంది.   జగన్మోహన్ రెడ్డి విడుదల అయితే, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందని ఆగ్రహంతో ఉన్న అనేకమంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి వైకాపాలోకి దూకవచ్చును. అదేవిధంగా సమైక్యాంధ్ర పధం నోట నుండి ఉచ్చరించని చంద్రబాబుపై కూడా కినిసిన తెలుగు తమ్ముళ్ళు కూడా వైకాపాలోకి దూకే అవకాశం ఉంది. అయితే, రానున్న ఈనికలలో గెలవడం చాలా అవసరం గనుక జగన్మోహన్ రెడ్డి వారిలో కేవలం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఈయవచ్చును.   ఇక అతనికి బెయిలు దొరుకుతుందా లేదా అనే విషయంపై ప్రజలే కాక, అన్ని రాజకీయ పార్టీలు చాల ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. మరి కొద్ది సేపటిలో ఏ సంగతి తెలిసిపోతుంది.

రాజీనామాల అవసరం లేదు: జేసీ

      రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసేందుకు సీమాంధ్ర నేతలంతా సిద్దంగా వున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే ప్రస్తుతం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బిల్లును శాసనసభలో తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వం పడిపోయే స్థితి లేనందువల్ల ఎంపీలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, ఎంపీలు రాజీనామా చేసిన తమపై ఒత్తిడి రాదని అన్నారు.     ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందువల్లనే రాజీనామాలపై వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. అందరం కలిసి త్వరలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రితో మళ్లీ రాజీనామాల అంశంపై మాట్లాడుతామని ఆయన చెప్పారు.

ఎన్ఐసీ నుంచి చంద్రబాబు నాయుడు వాకౌట్

      దేశంలో భద్రతాచర్యలపై ఇవాళ ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం జరిగింది. ఈ సమావేశాన్ని హాజరైన చంద్రబాబు వాకౌట్ చేశారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు.     అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

టీ-సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిర్భావం

  రాష్ట్ర విభజన కంటే ముందుగానే తెలుగు సినీపరిశ్రమ రెండుగా చీలిపోయింది. తెలంగాణా నిర్మాతలు, సినిమా పంపిణీదారులు, ప్రదర్శకులు మరియు స్టూడియో యజమానులు కలిసి కొద్ది నెలల క్రితం పెట్టుకొన్న దరఖాస్తుని రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ హైదరాబాద్ ఆమోదించడంతో ‘తెలంగాణా సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్’ (రిజిస్టర్డ్ నంబర్: 602, ఆగస్ట్ 21,2013) ఆవిర్భవించింది. దీనిపై తెలంగాణా సినీ దర్శకులు, నిర్మాతలు తదితర సంఘాల వారు హర్షం వ్యక్తం చేసారు.   టీ-చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యుల పేర్లు: అధ్యక్షుడు: యాన్. శంకర్; ఉపాధ్యక్షుడు: సంగిశెట్టి దశరద్; ప్రధాన కార్యదర్శి: సయ్యద్ రఫీ; జాయింట్ సెక్రెటరి: ఆకుల సురేష్; కోశాధికారి: సాయి వెంకట్. టీ-సినిమా నిర్మాతల కౌన్సిల్ అధ్యక్షుడు: సాన యాదిరెడ్డి టీ-సినీ పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు: ఉదయ రెడ్డి టీ- సినిమా ప్రదర్శకుల సంఘం అధ్యక్షుడు: వీ.యల్. మల్లికార్జున్ గౌడ్   టీ-సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిర్భావం గురించి తెలియజేస్తూ ఒక లేఖను మంత్రి డీకే అరుణ కుమారికి వారు సమర్పించి దానికి ప్రభుత్వ గుర్తింపు కల్పించవలసిందిగా వారు కోరారు. ఆమె వారిని ఈ సందర్భంగా అభినందించి లేఖను సంబంధిత అధికారులకు వెంటనే పంపారు.

కేభినెట్‌ ముందకు టి నోట్‌

  25 నుంచి ప్రదాని విదేశి పర్యటన నేపధ్యంలో ఈ 24 న జగరనున్న ప్ర్యతేక కేభినేట్‌ సమావేశంలోనే తెలంగాణ నోట్‌పై చర్చించనున్నారు. భారత్‌ అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందాల వ్యవహారాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం అవుతున్న కేభినేట్‌ పనిలో పనిగా తెలంగాణ నోట్‌పై కూడా చర్చించనుందని సమాచారం. ఇప్పటికే నోట్‌ రెడీ అయినట్టుగా ప్రకటించిన హోం మంత్రి షిండే పలువురు సీమాంద్ర కేంద్ర మంత్రులకు నోట్‌ కాపీని కూడా అందించారట. ఎలాంటి సాంకేతిక పరమైన అంశాలను ప్రస్తావించకుండా రెడీ చేసిన ఈ నోట్‌లో, మంత్రుల బృందం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది. నోట్‌ కేభినెట్‌ ముందుకు వచ్చిన దగ్గర నుంచి ఇక తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన అన్నిఅంశాలు మంత్రి వర్గమే చూడనుంది. అయితే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఆంటోని కమిటీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిన కేంద్ర, ఎవరికి ఏ అభ్యంతరాలు ఉన్న ఆంటోరి కమిటీకే నివేదించుకోవాలని చెపుతుంది.

నేడు జగన్‌ బెయిల్ పిటిషన్‌పై తీర్పు

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటీషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశామని కోర్టుకు తెలిపిన సిబిఐ, జగన్‌ రాజకీయంగా బలమైన వ్యక్తి కనుక సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందుకే బెయిల్‌ ఇవ్వవద్దని వాదించింది. అయితే సిబిఐ దర్యప్తు పూర్తయినందున  బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ తరుపు న్యాయవాది వాదించారు. ఈ నెల 18న ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ రోజు జగన్‌ బెయిల్‌ వస్తుందా లేదా అన్న అంశం పై ఉత్కంట నెలకొంది.

కమలం దిశగా సైకిల్‌ పయనం

  బిజెపితో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు ఈ మేరకు సంకేతాలనిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితులను రాష్ట్రపతితో పాటు పలువురు నేతలతో చర్చించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతో కలిసి తాము దేశాన్ని ఎంతో అభివృద్ది చేశామన్న చంద్రబాబు, యుపిఏ మాత్రం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. అయితే ఈ సందర్భంలో విభజనకు ముందు నుంచి మద్దతు తెలుపుతున్న బిజెపిని చంద్రబాబు విమర్శించకపోగా, ప్రస్థుతం దేశంలో అభివృద్దిలో బాగంగా ఉన్న విశాలమైన రోడ్లు, ఐటి టెక్నాలజీ వంటివి బిజెపి చేసిన అభివృద్దే అని కొనియాడారు. అయితే ఈ విషయం అధికారికంగా చెప్పాటనికి చంద్రబాబు ఇష్టపడలేదు, ఢిల్లీలో రాజ్‌నాధ్‌ను కలిసిన ఆయన్ను ఎన్డీఏతో పొత్తు, మోడి ప్రదాని అభ్యర్ధిత్వంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలను బాబు దాటవేశారు. దీంతో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాబు బిజెపిల పొత్తు కాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సీమాంద్ర ఎంపిలకు సియం బుజ్జగింపులు

  అధిష్టానం వైఖరితో రాజీనామాలకు సిద్దపడ్డ సీమాంద్ర ఎంపిలను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు సియం. ఆదివారం క్యాంపు కార్యాలయంతో తనతో కలిసిన నేతలతో ఇప్పుడే రాజీనామాలపై తొందరపడొద్దని తెలిపినట్టుగా సమాచారం. ఒకవేళ ఎంపిలు రాజీనామలు చేస్తే ఆ ప్రభావం మిగతా నేతలపైనా పడుతుందని అప్పుడు వారు తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పాడుతుందన్నారు. రాజీనామాల వల్ల విభజన తీర్మానం అసెంబ్లీకి వచ్చినపుడు, కేభినెట్‌ నోట్‌ మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు, బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు సీమాంద్ర తరుపున పోరాడటానికి ఎవరూ ఉండరని నిర్ణయం ఏకపక్షంగా సాగుతుందని సీయం ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లును సీమాంద్ర ఎంపిలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చిన్నరాష్ట్రాలను వ్యతిరేఖించే పార్టీలన్ని అండగా నిలుస్తాయని సియం హామి ఇచ్చారు. అధిష్టానం కూడా రాజీనామాలు చేసినా వెనక్కు తగ్గే పరిస్ధితి లేదని వివరించారు. ఒకవేళ రాజీనామాలు అనివార్యం అయితే అందరం కలిసే చేద్దామని సియం నేతలకు వివరించారు.

రాజీల్లేవ్‌ రాజీనామాలే

తెలంగాణ ప్రకటనతో కాంగ్రెస్‌ పార్టీలో మొదలైన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.హైకమాండ్‌తో పాటు సీమాంద్ర నేతలు డీ అంటే డీ అంటున్నారు. తెలంగాణ ప్రకటన విషయంలో వెనక్కి తగ్గేది లేదని అధిష్టానం తెగేసి చెపుతుండటంతో, సీమాంద్ర నేతలు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు రాజీనామాల విషయంలో దాటవేత దొరణి అవలంభించిన ఆ ప్రాంత ఎంపిలు ఇక రాజీనామలకే మొగ్గెతున్నారు. అందులో భాగంగానే మంగళ వారం స్పీకర్‌ను కలవనున్న ఏడుగురు లొక్‌సభ సభ్యులతో పాటు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోనున్నారు. మొదట పదవులకు ఆ తరువాత పార్టీకి కూడా రాజీనామ చేయడానికి సిద్దమవుతున్నారు ఆప్రాంత నేతలు.మంగళవారం స్పీకర్‌ను కలవటానికి నిర్ణయం తీసుకున్న సీమాంద్ర నేతలే శాంతింప చేయడానికి సియం సహా పలువురు నేతలు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఎంపి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో రాజీనామాలు చేస్తామని పట్టుపడుతున్నారు. 2014లో వైసిపితో పొత్తుకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం, సీమాంద్ర కాంగ్రెస్‌ నేతల భవిష్యత్తును పణంగా పెడుతున్నట్టుగా భావిస్తున్నారట ఆ ప్రాంత నేతలు.

రెండు ప్రాంతాల మధ్య చిచ్చు: చంద్రబాబు

      రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ యత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించాలని, రెండు ప్రాంతాల జేఏసీ నేతలతో కేంద్రం చర్చలు జరిపి ఎవరికీ నష్టం జరగకుండా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   హస్తిన పర్యటనలో ఉన్న తాను ఎవరితోనూ, ఎక్కడా రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను మాత్రమే శరద్‌యాదవ్‌కు వివరించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రంలోని అనిశ్చితి తొలగించాలని శరద్‌యాదవ్‌ను కోరామని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్ నేతల సతీమణులు ఉమ్మడిగా రాష్ట్రపతిని కలవడంతో కాంగ్రెస్‌తో వైసీపీ కుమ్మక్కు అయిందని రుజవు అయిందని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని చంద్రబాబు అన్నారు.   

ఏపీ ఎన్జీఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం

      ఏపీ ఎన్జీవో నేతలతో ఆదివారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీమాంధ్రలో సమ్మె వలన జనజీవనం స్తంభించి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పరిపాలన స్తంభించిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని పరిస్థితి ఉందని అందువల్ల సమ్మె విరమించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. దీనిపై స్పందించిన ఉద్యోగులు రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే సమ్మె విరమిస్తామని వారు స్పష్టం చేశారు.     రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీఎన్జీవో సంఘం నేత అశోక్‌బాబు తెలిపారు. సమ్మె విరమించాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలు తమను కోరలేదని, రాష్ట్రం సమైక్యం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రజలు కోరుతున్నారని ఆయన మంత్రివర్గ సబ్ కమిటీకి తెలిపారు. తాము జీతాలు తీసుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం చేయలేమని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో నేతలతో పాటు మంత్రులు ఆనం రామ్‌నారాయణ రెడ్డి, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు.