sonia gandi telangana

సోనియాగాంధీ మాటిస్తే అంతే

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆమె మాటకు తిరుగులేదని అన్నారు. దేశ ప్రజల కోసం పట్టుపట్టి ఆహార భద్రత బిల్లుకు తీసుకువచ్చి, దానికి చట్టరూపం కల్పించిన సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.   రాష్ట్ర విభజన జరిగిపోయిదని, కాబట్టి సీమాంధ్రుల్ర సహకరించాలని గీతారెడ్డి కోరారు. అలాగే సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో బిల్లుపెట్టి త్వరగా లమలు చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలతో సయంమనంతో, స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నామని గీతారెడ్డి తెలిపారు. పదేళ్ళ ఉమ్మడి రాజధానికి సహృదయంతోనే ఒప్పుకున్నామని అన్నారు. అవసరమైతే మళ్ళీ అంటోనీ కమిటీని కలుస్తామని చెప్పారు. పరస్పర దాడులుసరికాదని ఆమె అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఒప్పుకున్నప్పుడు సీమాంద్రులు నగరంలో సభలు, సమావేశాలు పెట్టకూడదని ఎందుకు చెబుతామని గీతారెడ్డి అన్నారు. సభల వ్యవహారం, శాంతభద్రతల వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆమె అన్నారు.

 tdp congress

లగడపాటిని అడ్డుకున్నారు

      విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ను కూడా కొందరు సమైక్య ఉద్యమకారులు అడ్డుకోవడం విశేషం.పంచాయితీరాజ్ గెస్ట్ హౌస్ దగ్గర ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లగడపాటికి చేదు అనుభవం ఎదురైంది. లగడపాటి రాజీనామా చేయాలని, గో బ్యాక్ అంటూ ఆర్టీసీ ఉద్యోగులు నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల డిమాండ్‌ను అవమానంగా భావించడం లేదని అన్నారు. లగడపాటిని శిబిరంలోకి రానివ్వమని చెబుతూ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన తెలపడంతో లగడపాటి వెనుదిరగకుండా బందరురోడ్డులోనే ఓ డివైడర్‌పై కూర్చున్నారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపి, వారితో మాట్లాడిన తర్వాతే వెళతామని ఆయన పట్టుపట్టారు. ఆ తరువాత   లగడపాటి పోలీసుల సహాయంతో శిబిరంలోకి వచ్చి, ఉద్యోగులతో మాట్లాడి, జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర ఉద్యమాన్ని కేంద్రం గుర్తించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లగడపాటి పేర్కొన్నారు.

Laksha Jana Gosha in Vijayawada

విజయవాడ సింహగర్జన

  సమైక్యాంధ్ర కోరుతూ విజయవాడ విద్యార్థులు సింహాల్లా గర్జించారు. వారు వేలాదిగా తరలివచ్చి బందరు రోడ్డులో శాంతియుత నిరసన తెలిపారు. వారు జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తుంటే… విజయవాడ దద్దరిల్లుతోంది. దేవినేని అవినాష్ నాయకత్వంలో సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడలోని అన్ని విద్యాసంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ జనాన్ని చూస్తుంటే… సముద్రాన్ని చూస్తున్నట్టే అనిపించింది. ఇసుకేస్తే రాలని జనం… జై సమైక్యాంధ్ర అని నినాదం చేస్తుంటే… నాయకుల గుండెలు దద్దరిల్లాయి. అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు కూడా వచ్చారు. హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తూ కాదని… అది అందరి సొత్తని విద్యార్థులు నినదించారు. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ఇది డబ్బు సంచుల్లోంచి వచ్చిన ఉద్యమం కాదని… తెలుగు తల్లి గర్భం నుంచి వచ్చిన ఉద్యమం అన్నారు. శాంతియుతంగా తరలివచ్చిన ఈ అఖండ విద్యార్థి సమూహాన్ని డబ్బుతో కొనడం సాధ్యం కాదని… తెలుసుకునే విజ్ఞానం తెలంగాణ నేతలకు లేదన్నారు. మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు విద్యార్థులు కూడా గర్జించారు. ఈ విద్యార్థి గర్జన సభకు దీక్ష చేస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్రను సోనియా ఇవ్వక్కర్లేదని.. ప్రజలే సాధించుకుంటారని అన్నారు.

Rupee continues free fall

పతనంలోనే రూపాయి

      రూపాయి పతనం మరింత కొనసాగుతోంది. ఆర్థికలోటును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామన్న ప్రభుత్వ హామీలు నిలబడకపోవటం, ఆహార సబ్సిడీ బిల్లు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపువిలువను మరింత చితికి పోయేలా చేసింది.ఇంట్రాడే ట్రేడింగ్‌లో 66.30 పైసల కనిష్ట నష్టానికి చేర్చగా, ముగింపు సమయానికి రూపాయి మారకపువిలువ 66.24పైసల వద్ద ఆగింది. ఇది 3.02శాతం అంటే 194పైసల నష్టాన్ని మిగిల్చింది.   ఆగస్టు 19న రూపాయి 148పైసల నష్టాన్ని నమోదు చేయగా, మునుపెన్నడూ లేని రీతిలో మంగళవారం ఇంట్రాడే లావాదేవీల్లో రూపాయి మారకపువిలువ కనిష్ఠ స్థాయిలో పడిపోయి రికార్డు సృష్టించింది. స్థానిక ఈక్విటీ మార్కెట్‌ గణనీయస్థాయిలో పడిపోవటం నడుమ ఈ నెలాఖరున దిగుమతుదారులు, బ్యాంకుల నుంచి యుఎస్‌ కరెన్సీకి బాగా డిమాండ్‌ పెరిగింది. ఇక్కడ ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజీ వద్ద మధ్యాహ్నం 12గంటలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 65.72పైసలకి మునుపెన్నడూ లేనిరీతిలో పడిపోయింది. నెలాఖరులో దిగుమతిదారులు, ప్రధానంగా ముడిచమురు దిగుమతి చేసుకునే ఆయిల్‌కంపెనీలతోపాటు విదేశీ మూలధన ప్రవాహాల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో, ఈక్విటీ మార్కెట్‌ పడిపోయి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపువిలువ మరింత క్షీణదశకు చేరిందని ఒక ఫారెక్స్‌ డీలర్‌ చెప్పారు. ఇదిలాఉండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సెన్సెక్స్‌ 2.24శాతానికి అంటే 415.74పాయింట్లకు నష్టపోయి 18,142.39 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతోంది.అయితే, ముగింపు సమయానికి సెన్సెక్స్‌ సూచీ మార్కెట్‌ ముగింపు సమయానికి 590.05 పాయింట్ల మేరకు నష్టపోయి 17,968.08 పాయింట్ల వద్ద ముగిసింది.

chandrababu

రాష్ట్ర విభజన ప్రకటనతో తెదేపా చిత్తయిపోయిందా

  రాష్ట్ర విభజన ప్రకటన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చాలా అయోమయ పరిస్థితుల్లోపడింది. చంద్రబాబు నాయుడు పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు ‘ఆత్మగౌరవ యాత్ర’ చెప్పట్టబోతే అడ్డుపడిన తెదేపా నేతలు, సమైక్యాంధ్ర కోసం పాదయాత్రలు మొదలుపెట్టబోతున్నారు. ఇక పార్టీకి ఎటువంటి సమాచారం ఈయకుండా, అనుమతి కోరకుండా నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ 2నుండి చైతన్యయాత్ర మొదలుపెట్టేందుకు సిద్దం అవుతున్నారు.   చంద్రబాబు రాష్ట్ర విభజనపై తమ పార్టీ ఆలోచనలని, తమ భావి ప్రణాళికలను ప్రజలకు వివరించి వారిలో పార్టీ పట్ల నెలకొన్న అపోహలు దూరం చేసి తద్వారా పార్టీని ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో బలపరుచుకోవాలని ఆలోచిస్తుంటే, తెలుగు తమ్ముళ్ళు మాత్రం కేవలం సీమాంధ్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్నట్లు సమైక్యాంధ్ర కోసం పాదయాత్రలు, దీక్షలు, బస్సు యాత్రలంటూ చంద్రబాబుకి అగ్నిపరీక్ష పెడుతున్నారు.   సీమాంధ్రలో పార్టీ నేతలు చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి ఆ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు చాలా ఆందోళనకు గురవుతున్నపటికీ, చంద్రబాబుతో సహా అందరూ కూడా నిస్సహాయంగా చూస్తూ కూర్చోవలసి వస్తోంది. అయితే, వారు ఇదే తీరుగా కొనసాగితే పార్టీ రెండు చోట్ల తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలందరికీ కూడా బాగా తెలుసు. కానీ, సమైక్యరేసులో వెనుకబడిపోతే రాజకీయంగా నష్టపోతామనే భయంతో ఎవరికీ తోచిన రీతిలో వారు ముందుకు సాగిపోతుంటే వారిని ప్రోత్సహించలేక, ఆపనూ లేక తెదేపా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది. ఈ సంకట పరిస్థితి నుండి తెదేపాను కాలమే బయటపదేయాలి తప్ప స్వతహాగా బయటపడే అవకాశం కనుచూపుమేర కనబడుటలేదు.

jagan mohan reddy

జగన్ దీక్షపై జైలు అధికారుల అయోమయం

  జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలులో చేప్పటిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగవ రోజుకి చేరుకొన్నతరువాత గానీ, అతని దీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని జైలు అధికారులకు ఆలోచన కలుగకపోవడం చాలా విచిత్రం. వివిధ పార్టీల నేతలు చాలా సూచనలు చేసినప్పటికీ వాటిని జైలు అధికారులు పట్టించుకోలేదు. రిమాండ్ ఖైదీగా ఉన్నజగన్ జైలులోనిరాహార దీక్ష చేయవచ్చాలేదా? ఒకవేళ చట్ట ప్రకారం అనుమతి లేకుంటే అతనితో ఏవిధంగా వ్యవహరించాలనే సంగతి కూడా తెలుసుకోకుండా, అతను దీక్షకు అనుమతి కోరుతూ తమకు వ్రాత పూర్వకంగా ఎటువంటి విజ్ఞప్తి చేయనందున తామేమి చేయలేమని చెపుతూ ఈ నాలుగు రోజులు కాలక్షేపం చేసారు.   మూడు రోజులుగా అతను ఆహారం తీసుకోకపోవడం వలన క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవగానే, ఇప్పుడు జైలు అధికారులలో కంగారు మొదలయ్యింది. వారు ఈ రోజు హడావుడిగా సీబీఐ కోర్టుకి పరుగులు తీసి అతని విషయంలో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై కోర్టు సలహా కోరుతున్నారు. అంటే గత నాలుగు రోజులుగా జైలు అధికారులు కూడా అతను దీక్ష చేయడానికి పరోక్షంగా సహకరించినట్లే అర్ధం అవుతోంది. లేకుంటే వారు ఈ రోజు సీబీఐ కోర్టును ఆశ్రయించేవారు కాదు. ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాలలో చాలా ఉదాసీనత చూపడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

prime minister

ప్రధాని అలాగ ఎందుకన్నారు

  నిన్నవైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఏపీ యన్.జీ.ఓ. నేతలు ప్రధాని మన్మోహన్ సింగును కలిసి రాష్ట్రాన్నివిభజించవద్దని కోరినప్పుడు, ఆయన వారికి ఎటువంటి హామీలు ఈయకపోగా రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని గనుక, ఆ విషయంలో తానేమి చేయలేనని తెలిపారు. అంటోనీ కమిటీకి అదనంగా ప్రభుత్వం త్వరలో మరో కమిటీ వేయబోతున్నట్లు, దానికి సమస్యలన్నీ నివేదించుకోమని ఆయన సలహా ఇచ్చి వారిని సాగనంపారు. ప్రధాని నుండి సానుకూల స్పందన వారు ఆశించనప్పటికీ, తెలంగాణా ఏర్పాటుకి నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్నితాను కూడా అడ్డుకోలేనని ఆయన కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారు కంగు తిన్నారు. అయితే ఎవరినీ నొప్పించే విధంగా మాట్లాడే అలవాటు లేని ప్రధాని ఇంత ఖరాఖండిగా ఎందుకు మాట్లాడారనే ప్రశ్నవారిలో మిగిలిపోయింది.   రాష్ట్ర విభజనపై జరిగిన చర్చలు, సమావేశాలు, నిర్ణయాలలో సోనియాగాంధీ అంతా తానై వ్యవహరించడంతో ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే నిర్ణయం జరిగిపోయిందని చెప్పవచ్చును. అందుకే రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఉద్యమ నేతలు అందరూ కూడా ఈ విషయంలో ఆమెతోనే సంప్రదింపులు జరపుతున్నారు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాక, కీలకమయిన ఇటువంటి అనేక నిర్ణయాలలో ప్రధాని ప్రమేయం అంతంత మాత్రమేనన్నది బహిరంగ రహస్యమే.   ఈ నేపద్యంలో తెలంగాణా ఏర్పాటుకి సోనియా గాంధీ స్వయంగా ఆసక్తి చూపుతున్నప్పుడు, రాష్ట్ర విభజన వల్ల కలిగే విపరీత పరిణామాల గురించి తన ముందు ఎవరు ఎంత మొరపెట్టుకొన్నపటికీ, ప్రధాని తన నిస్సహాయతను గ్రహించినందున తన ముందున్న ఏకైక మార్గం-కమిటీ వేయడం గురించి వారికి వివరించి సాగనంపడం తప్ప వేరే ఏమి చేయలేరు.   ఇక, రాబోయే ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగితే రాహుల్ గాంధీ ప్రధాని పదవి చెప్పటేందుకు అనాసక్తి చూపిస్తున్న కారణంగా మళ్ళీ ఆయనకే అవకాశం దక్కవచ్చును. ఒక వేళ రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టినట్లయితే, ప్రణబ్ ముఖర్జీ అనంతరం మన్మోహన్ సింగుకు రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేఖించి కొత్త సమస్యలను సృష్టించుకోవడం కంటే, తన ‘మౌనముని’ ముద్రను కొనసాగిస్తే అన్ని విధాల మంచిదని మన్మోహన్ సింగ్ భావించి ఉండవచ్చును.

central goverment

బొగ్గు స్కాంలో సిబిఐ vs ప్రభుత్వం

  బొగ్గు కుంభకోణంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుతో కేంద్ర ఇరుకున పడేలా ఉంది. కోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో అధికారులను విచారించడానికి తమకు ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్‌ అవసరం లేదని సిబిఐ వాదిస్తొంది అయితే ప్రభుత్వం మాత్రం తమ అనుమతితోనే విచారణ చేపట్టాలని పట్టుబడుతుంది. ఈ వివాదానికి సంబందించి మంగళవారం సుప్రిం కోర్టుకు ఆరు పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసింది సిబిఐ. గతంలో 2జి  స్కాం విచారణ సమయంలో కూడా కోర్టు ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్న విషయాన్ని ఈ అఫిడవిట్‌లో గుర్తు చేసింది. కాని ప్రభుత్వం మాత్రం కోర్టు పర్యవేక్షిస్తున్న కేసులో కూడా విచారణకు తమ అనుమతి తీసుకోవాలంటూ న్యాయస్ధానానికి స్పష్టం చేసింది. అయితే దీనిపై సిబిఐ తీవ్రం అభ్యతరం తెలిపింది. ఇలా చేయడం  కోర్టులకు ఉన్న అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని వాదించింది.

hari krishna

ఆహార భ‌ద్రత ఎన్టీఆర్ ఆలోచ‌నే

  యుపిఏ ప్రభుత్వం, సోనిమా గాందీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహార భ‌ద్రత బిల్లు పై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపి హ‌రికృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కేంద్ర స్ధాయిలో ఆహార భద్రత గురించి ప్రస్ధావించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 2 రూపాయ‌ల‌కే కిలోబియ్యం ఇచ్చిపేద‌వాడి ఆఖ‌లి తీర్చిన ఘ‌న‌త అన్న ఎన్టీఆర్‌దే అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ విడుతున్నట్టుగా వ‌చ్చిన వార్తల‌ను కూడా హ‌రికృష్ణ ఖండిచారు. తనుకు అలాంటి ఆలోచ‌నే లేద‌ని, ఇది త‌న తండ్రి స్ధాపించిన పార్టీ అని ఆ పార్టీ భ‌విష్యత్తు కోసం శ్రమిస్తాన‌న్నారు. త‌ను పార్టీ వీడుతున్నట్టుగా మాట్లాడుతున్న వారివి చిల్లర మాట‌ల‌న్న ఆయ‌న అలాంటి వాళ్ల మాట‌ల‌కు స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Maoists

ఏవోబిలో మావోయిస్టుల దాడి

  రాష్ట్ర స‌రిహద్దుల్లో మావొయిస్టులు మ‌రోసారి తెగ‌ప‌డ్డారు.  సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన బృందంపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక స‌బార్డినేట్ ఆఫీస‌ర్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుల్లు కూడా అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. ఎప్పుడు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే ఎవోబి ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ మోత‌ల‌తో ద‌ద్దరిల్లింది. ఉద‌యం తొమ్మిదిన్నర ప్రాంతంలో 18 మంది స‌భ్యులున్న సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జ‌వాన్ల బృందం విశాఖ‌ప‌ట్నం వెళ్తూ ఏవోబి ప్రాంతంలో ఎంట‌ర్ అయింది. అయితే ముందు వెళ్లిన మూడు వ్యాన్లు సుర‌క్షింతంగానే వెళ్లిన వెనుక ఉన్న నాలుగో వ్యాన్ మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర దాటికి తునాతున‌క‌లు అయింది. ఈ పేలుడుతో వ్యాన్‌లో ఉన్న నాలుగు అక్కడిక‌క్కడే మ‌ర‌ణించారు. అయితే పేలుడు త‌రువాత ముందు ఉన్న వ్యాన్లపై కూడా మావోయిస్ట్‌లు కాల్పుల‌కు దిగారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు గంట‌కు పైగా కొన‌సాగిన ఈ ఎదురు కాల్పుల్లో మ‌రో ఇద్దరు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

vijayamma delhi

విజయమ్మ ఢిల్లీ యాత్రలు

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల తీరును కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు రాష్ట్రపతి తో భేటి అయ్యారు. అంతా బాగానే వుంది కాని రాష్ట్రపతిని ఇప్పటి వరకూ ఏ పార్టీ నాయకుడు ఇన్ని సార్లు కలవలేదు. రాష్ట్రపతిని విజయమ్మ ఇన్ని సార్లు కలవడం వెనుక మతలబు ఏమిటి? అని రాజకీయ విశ్లేషకులు చర్చి౦చుకుంటున్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశం అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పట్టికీ, దీనికి ఏమైనా ప్రాధాన్యత ఉందా అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.   రాష్ట్రపతిగా ప్రతిభ పాటిల్ వున్నప్పుడు గుర్తుకురాని ప్రజాసంక్షేమం... విజయమ్మ కి ప్రణబ్ ముఖర్జీ వచ్చిన తరువాత తరుచుగా గుర్తుకు రావడం ఆశ్చర్యం. అలాగే  రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ని మర్చిపోయి... ఢిల్లీలో వున్న రాష్ట్రపతి కి  సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల పై ఫిర్యాదు చేయడం ఏంటీ? అని విమర్శలు వున్నాయి. జగన్ కాంగ్రెస్ లో ఎప్పటికైనా కలిసిపోతారనేవారి ఊహగానాలకు ఊతమిచ్చేలా విజయమ్మ ప్రయత్నాలు సాగడం విశేషం. కేంద్ర ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ఉన్నప్పుడు జగన్ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నారన్న భావన ఉండేది.  అయితే ఆయన వ్యక్తిగతంగా చేయగలిగేది తక్కువగా ఉంటుందని, మర్యాద కోసమే తాము రాష్ట్రపతిని కలిశామని పార్టీ నేతలు వివరిస్తున్నా... ప్రణబ్ కు ఉండే పలుకుబడి ఎటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా రాజీకోసం వీరు ప్రయత్నిస్తున్నారా? అన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇదంతా ఇలా వుంచితే... ఈ విజయమ్మ ఢిల్లీ యాత్రల మీద ఏ రాజకీయ పార్టీలు నోరు ఎందుకు మెదపడంలేదంటే... తెలంగాణలో తెలంగాణ అంటూ...సీమాంద్రలో చంద్రబాబు వల్లే తెలంగాణ వచ్చింది అంటూ కాంగ్రెస్ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూంటే.. ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆత్మరక్షణలో పడిపోయి..విజయమ్మ గురుంచి పట్టించుకొనే స్థితిలో లేదు. 

Congress Ysr congress

కాంగ్రెస్, వైసీపీల వికృత క్రీడ

      రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.   గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిస్తున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు తమకు తోచిన విధంగా శాంతియుత ఉద్యమాలు చేసుకోవచ్చు. అలాంట ప్పుడు ఇతరులు వారి కార్యక్రమాలను అడ్డుకోవడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం మంచిదికాదని సూచించారు.  సున్నితమైన తెలంగాణ అంశాన్ని సమగ్ర రీతిలో పరిష్కరించాల్సిన కాంగ్రెస్, రాజకీయ ప్రయోజనాల కోసం జటిలంచేసి ప్రజలమధ్య చిచ్చు పెట్టిందన్నారు. తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండన్న రీతిలో కాంగ్రెస్ నేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  ఏడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనచేస్తున్నా వారిని శాంతింపజేసే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం గర్హనీయమన్నారు. 

bifurcation

విభజన ప్రక్రియకు బ్రేకులేసిన ఆ ముగ్గురు

  నిన్న మొన్నటి వరకు తెలంగాణపై వెనకడుగు వేసే ప్రశ్నే లేదని డంకా బజాయించి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు, అఖిలపక్ష కమిటీ అంటూ రాష్ట్ర విభజనపై సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందువరకు చాలా ప్రశాంతంగా ఉన్న సీమంద్ర ప్రాంతం నేడు సమైక్య ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. అయితే, గత ఐదారేళ్ళుగా తెలంగాణా ఉద్యమాలకి అలవాటుపడిపోయిన కాంగ్రెస్ అధిష్టానం, ఈ సీమాంధ్ర ఉద్యమం చూసి భయపడే అవకాశం లేదు. అంటే వీటికంటే బలమయిన కారణమేదో దానిని రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేలా చేస్తోందని అర్ధం అవుతోంది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ మాట్లాడటం మొదటి ప్రమాద హెచ్చరికగా భావించవచ్చును. ఆయన లేవనెత్తిన నీళ్ళు, ఉద్యోగాలు, విద్యుత్, రాజధాని తదితర అంశాలను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మొండిగా ముందుకుసాగినట్లయితే రెండు ప్రాంతాల ప్రజల మధ్య యుద్ధాలు ఎలాగు తప్పవు, ఆకారణంగానే రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన పరోక్షంగా చేసిన హెచ్చరిక కాంగ్రెస్ అధిష్టానంపై బాగానే పనిచేసినట్లుంది.   ఇక, రాష్ట్ర విభజనను మొదటి నుండి గట్టిగా వ్యతిరేఖిస్తున్న గవర్నర్ నరసింహన్ లేవనెత్తిన రాష్ట్రం విడిపోతే తెలంగాణాలో పెరగనున్న నక్సల్స్ సమస్య, రాజధానిలో శాంతి భద్రతల సమస్య తదితర అంశాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పునరాలోచనలో పడేసి ఉండవచ్చును. ఈ అంశాలపై ముందే చాలా చర్చలు జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాదులో ఆంద్ర తెలంగాణా ప్రభుత్వోద్యోగుల మధ్య నిత్యం జరుగుతున్నఘర్షణలు, అవి నగరంలో ఇతర వర్గాలకు ప్రాంతాలకు వ్యాపించే ప్రమాద హెచ్చరికలు వగైరాలు గవర్నర్ ముఖ్యమంత్రి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.   ఇక పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానానికి వ్రాసిన లేఖపై ముఖ్యమంత్రితో బాటు ఆయన కూడా సంతకం చేయడం గమనార్హం. ఒకవేళ తన రాజకీయ భవిష్యత్త్ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆయన కూడా అందుకు అనుగుణంగానే అభిప్రాయలు మార్చుకోవచ్చునని ఇది సూచిస్తోంది.   ఈవిధంగా రాష్ట్రానికి పెద్ద తలకాయలయిన గవర్నర్, ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు విభజనను గట్టిగా వ్యతిరేఖిస్తుండటం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. వారి సహకారం లేనిదే విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళడం కూడా చాల కష్టమని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోలేదు. అదేవిధంగా వారి హెచ్చరికలను, అభిప్రాయాలను బేఖాతరు చేసి ముందుకు సాగడం కూడా చాలా ప్రమాదం అని అర్ధం చేసుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి ముందు నుయ్యి గొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.   సమస్యను సృష్టించడం, నాన్చడం తప్ప ఎన్నడూ సమర్ధంగా పరిష్కరించడం చేతకాని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అందుకే కమిటీలు, చర్చలు అంటూ కొత్త పల్లవి పాడుతుంటే, టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస, టీ-జేయేసీ నేతలు అనుమానంగా చూస్తున్నారు.    

ప్రజా శ్రేయస్సు.

    .......Vijaykumar ponnada   హట్టాతుగా, ఈ మధ్య ప్రజలందరు మంత్రులను, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ వుద్యోగులని కనిపించినవార్ని కనిపించినట్టుగా, కనిపించనివారిని వెదికి పట్టుకుని, వున్నఫళంగా బరబరా లాక్కెళ్ళిపోయి, చేతికో పూలగుచ్చం ఇచ్చి, మెడలో ఓ దండవేసి, చుట్టూ ఓ శాలువాలాంటిది కప్పేసి, గుర్తుగా ఓ పనికిమాలిన ఉపయోగంలేని ఓ రుబ్బురోలు పత్రం బహుకరించి మరీ సన్మానాలు చేసేస్తున్నారు. ఈ హటాత్తు పరిణామానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వోద్యోగులు ఎక్కడివారక్కడే ఏకబిగిన హడలిపోయి ఆ తరువాత బెబేలిత్తిపోయి పిదప జాడుసుకుని ఇక ఏమి చెయ్యాలో తోచక ఉద్యోగాలకి శెలవులు పెట్టి ఎటొ పారిపోయారు. శెలవులు పెట్టలేని అభాగ్యులు ముఖానికి ముసుగులేసుకుని, మారువేషాలేసుకుని దొడ్డి దారెంబట ఆఫిసు కెళ్ళి బెంచికింద పడుకునో, కుర్చీకింద కూర్చునో, బిక్కుబిక్కుమంటు భయపడిచస్తూ పనిచేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో తీవ్రవాదులు పార్లమెంటుని ముట్టడించినప్పుడు కూడా ఇంత బెంబేలెత్తిపోలేదు. మంత్రులుకాని, ఎమ్మెల్యేలుకాని, ప్రభుత్వ అధికారులుకాని వాళ్ళ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. దుకాణాల ప్రారంబోత్సవానికి, సదస్సులకి, మీట్టింగులకి వెళ్ళటం మానేసి, ఇంట్లో మంచం కింద దాక్కుంటూ, ఎవరొచ్చినా లేరని చెప్పి పంపించేస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం యదావిధిగా నాల్రోజుల తరువాత ప్రభుత్వం మేల్కొని, ఇలాంటి పరిణామాలకి దారితీసిన పరిస్తితులని విశ్లేషించటానికి, ఓ కమిటీని వేసింది. వారు ప్రజల్లో వచ్చిన ఈ అనూహ్యమయిన మార్పుకి కారణాలు వారినే అడిగి తెలుసుకోవటం మొదలెట్టారు. 'భలేవారు సార్, ప్రభుత్వం మాకు అందించే సేవలు ఇంతా అంతా కాదు కదా. వారు మా బాగోగులు చూస్తూంటే, వారిని కానీసం పిలిచి గౌరవించుకోవటం మా కర్తవ్యం కాదంటారా? అన్ని తెల్సే అడుగుతారు.' అని వెళ్ళిపోయాడు. తలగోక్కున్న్నారు కమిటీవాళ్ళు. మరొకడి దగ్గరకి వెళ్ళారు. 'అసలు ఇది వారికి సన్మానం కాదు. మాకు మేమే చేసుకునే సన్మానం. వారు మాకు చేసే సేవలకి, వారు మాకొసం అమలు చెసే పధకాలకి, వేయి సన్మానాలు చేసినా తీరదు. మహానుభావులు.' అని, అటుగా దండలు పట్టుకుని స్థానిక ఎమ్మెల్యేల కోసం వెదుకుతున్న ఓ గుంపుని చూసి 'ఒరేయ్, మా ఇంటి పక్కన వేరుసనక్కాయలు అమ్ముకునేవాడిలా ఒకడు తచ్చాడుతూ తిరుగుతున్నాడు. వాడు మారు వేషంలో వున్న మన ఎమ్మెల్యే అని నాకు అనుమానం ' అన్నాడు. అంతే అందరు అటువైపు పరిగెత్తారు. అలా పరిగెడుతున్న ఒకడిని ఆపి, 'బాబూ నీకు పుణ్యం వుంటుంది. అసలు ఈ సన్మానాల ప్రహశనానికి కారణం చెప్పవా, ప్లీజ్ ' అని వాడి కాళ్ళు పట్టుకున్నత పని చేసారు. వాడు తన చేతిలో దండ పక్కన పెట్టి చెప్పడం మొదలెట్టాడు. 'మన ప్రభుత్వం మనల్ని ఎంత బాగా చూసుకుంటోదో మీకు తెలియదా?' అడిగాడు. కమిటీ వాళ్ళు తెల్లముఖం వేసారు. వాళ్ళ తెల్లముఖం చూసి అతగాడు 'సర్లెండి నేనే చెబుతాను ' అని 'ఆకలేసినప్పుడు అన్నం ఎవరయినా పెట్టి ఆకలి తీరుస్తారు, కానీ ఆకలిపుట్టించి మరీ ఆకలి ఎవరయినా తీరుస్తారా? అలాగే, రోగం వచ్చినప్పుడు మందులు ఎవరయినా ఇచ్చి రొగం తగ్గిస్తారు, కానీ రొగాలు తెప్పించి మరీ రోగాలు ఎవరయినా తగిస్తారా?' అని అందరిని చూసాడు. తెల్లముఖాలేసుకుని చూస్తున్న వారు ఇంకా అలానే తెల్లబోయి చూడ్డం చూసి ' ఏంటీ? ఇంకా అర్ధంకాలేదా? మందు తాగనోడు ఎలాను మనాల్సిన పన్లేదు, కానీ వాడికి మందు తాగించి, మానిపించడం ఎవరయినా చేస్తారా?' అనడిగి, ఆ తెల్లముఖాలని చూసి 'మన ప్రభుత్వం చేస్తుంది.'అన్నాడు. 'మీరు మరీ వాజమ్మల్లా వున్నారు. గోడకొట్టిన సున్నంలా అలా తెల్లబోయి చూడ్డం తప్ప, మీకు ప్రభుత్వ విధానాల గురించి అస్సలు తెలిసినట్టు లేదు. ప్రజలని బాగు చేయడం అంటే ఏంటో మీకు బొత్తిగా అవగాహన లేదు. ఇప్పుడు ప్రజలని బాగు చేయాలి అంటే, వాళ్ళు చెడ్డవాళ్ళయినా అయ్యిండాలి లెదా చెడిపోవాలి? ఆనాడు వాల్మీకి వచ్చేపోయే వాళ్ళందరినీ తెగ బాది, దోచుకునేవాడు. అలాంటి చెడ్డవాడిని ఋషులు, ఆతరువాత భ్రహ్మా అతన్ని మంచివాడుగా మార్చారు. రామాయణం రచించేలా చేసారు. ఒకవేళ వాల్మీకి చెడ్డవాడు కాకపోతే, అతన్ని మంచివాడుగా మర్చి, రామయణం రచించేట్టుగా చేసే అవకాశం వుండేదా? అదే తర్కాన్ని ఇక్కడా వుపయోగించండి. ప్రజలని పాడు చేసి, వాళ్ళని మంచి వాళ్ళుగా మర్చడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం. రూపాయికి బియ్యం ఇస్తున్నారు. అమ్మ హస్తం ద్వారా బోల్డు సరుకులు 'చీపుగా ' ఇచ్చేస్తున్నారు. వీటికి డబ్బులు తక్కువే, కానీ వచ్చే జబ్బులే ఎక్కువ. మరి ఆ రోగాలిని ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఇచ్చే మందులతో తగ్గించుకుంటాము. ఇలా జబ్బుల మందులకయ్యే ఖర్చు ఆదా చేసిన డబ్బుతో, మందు కొనుక్కుంటాము. ఇదివరకు మందు కొట్టేందుకు బెల్టు షాపుల్లోను, బూటు షాపుల్లోను జాగా లేక చాటుమాటుగా కొట్టే వాళ్ళం. ఈప్పుడు ప్రభుత్వం మందు కొన్న దుకాణం లోనే మందుకొట్టే సదుపాయం కలిపించి మమ్మలిని ఆదుకుంది. కాపోతే రోడ్డు మీదా వెళ్ళే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఇలా తాగి మేము పొర్పాటున రోడ్డు మీద తందన్నాలాడితే, ప్రభుత్వం వూరుకోదుకదండి. వెంటనే మమ్మలిని తీసుకెళ్ళి నివారణ కేంద్రానికి పంపిస్తుంది. అలా చెడ్డ వాళ్ళమయిపోయిన మమ్మాలిని బాగు చేసి మళ్ళి మందు షాపు ముందు నిలబెట్టి చేతులు దులుపుకుని వెళ్ళి పోతుంది. మేము అప్పుడు వాల్మీకిలా మంచోళ్ళమయ్యిపోతామన్నమాట. ఇన్ని వసతులు సౌకర్యాలు కలిపించిన ప్రభుత్వానికి మా విశ్వాసాన్ని తెలియచేయటానికే, ఇలా మంత్రులని, ఎమ్మెల్యేలని, ప్రభుత్వ వుద్యోగులని పట్టుకుని సన్మానిస్తున్నము. తప్పా, చెప్పండి.' అన్నాడు. కమిటీవాళ్ళు అదేదో ప్రకటనలో వాడిలా అవాక్కయ్యిపోయారు. వెంటనే తేరుకుని 'మీరు చేస్తున్నది చాలా మంచిపని. మంచి ఎవరు చేసినా వారిని ప్రోశ్చహించవలసినదే. మా ఇంటి ఎదురుగా గిన్నెలకి మాట్లు వేసేవాడిలా మారు వేషంలో తిరుగుతున్న ఓ ప్రభుత్వ వుధ్యోగి వున్నాడు. రండి ' అన్నాడు ఓ కమిటీ సభ్యుడు. 'ఒరేయ్, ఇంకొకడు దొరికాడురోయ్.' అన్నాడు. అంతా అటు పరిగెత్తారు.    

సోనియా ఓటు వేయకుండానే ఆహర భద్రత బిల్లు

  సోనియా మానస పుత్రికగా, యుపిఏ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎలాగైన ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్‌ చేయించాలనుకున్న కాంగ్రెస్‌ తన పంతం నెగ్గించుకుంది. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం వాడివేడిగా చర్చ జరిగింది అయితే 15వ లొక్‌సభలో తొలిసారి ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించారు. అయితే సమావేశం జరుగుతున్న సమయంలోని సోనియా అస్వస్థతకు గురికావటంతో ఆమె ఓటింగ్‌లో పాల్గొన కుండానే వెళ్లిపోయారు. సోనియాతో పాటు రాహుల్‌ కూడా వెళ్లిపోయారు. బిల్లు లక్ష్యాలను సభకు వివరించిన ఆహార మంత్రి కెవి థామస్‌ బిల్లును ప్రవేశ పెట్టారు.ఆహార భద్రత బిల్లు అమలులోకి వచ్చినప్పటికీ.. రాష్ట్రాలకు ఆహార ధాన్యాల సరఫరాను తగ్గించబోమని స్పష్టంచేశారు.

సెప్టెంబర్ 2వరకు ఏపీ యన్జీవోలకు కోర్టు గడువు

  రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా జరుగుతున్నపోరాటానికి ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఎదురు దెబ్బలు తగిలాయి.   సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం ఏపీ యన్జీవోల నిరవదిక సమ్మె చట్ట విరుద్దమని, దానిని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయవలసిందిగా హైకోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలయింది. కోర్టు నోటీసులు అందుకొన్నఏపీ యన్జీవో ప్రతినిధులు ఈ కేసులో తమ ప్రతిస్పందన తెలియజేసేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఇవ్వవలసినదిగా కోర్టును అభ్యర్దించగా, కోర్టు అందుకు అంగీకరించి కేసును వచ్చేనెల రెండవ తేదీకి వాయిదావేసింది. ఒకవేళ హైకోర్టు వారు చేస్తున్న సమ్మె చట్ట విరుద్దమని తేల్చిచెప్పినట్లయితే ఏపీ యన్జీవోలకు ధర్మసంకటం తప్పదు. సమ్మె విరమిస్తే సమైక్య ఉద్యమం నిలిచిపోతుంది. కొనసాగిస్తే చట్టపరమయిన చర్యలు ఎదుర్కోక తప్పదు.   ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది  సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసారు. అయితే ఆ పిటిషన్ను చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోనందున దానిపై విచారణ జరపటం సరికాదని, అయినా రాష్ట్రాల విభజనపై తగిన నిర్ణయం తీసుకొనేందుకు పార్లమెంటు ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.