వేర్పాటు ముసుగులో కబ్జాదారులు ఎవరెవరు?

 

 

- డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]

 

 

"ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటలుగా పరిగణింపబడే ముఖ్యకేంద్రాలను మీర్జా ఇస్మాయిల్ (నిజం) రిజర్వు పోలీసులు, సైన్యాలు వారంరోజుల్లో రాత్రికి రాత్రే చుట్టుముట్టి మెరుపు దాడులు చేసి, నిండుప్రాణాలను బలిగొని, వేలకు వేల సంఖ్యలో అరెస్టులు చేసి, హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణా ప్రాంతపు కారాగారాలందు నిర్భంధించి, కనీవినీ ఎరుగని నిర్బంధవిధానాన్ని నైజాం నిరంకుశ ప్రభుత్వం ప్రయోగించింది ... ఆ సమయంలో ఈ ప్రాంతపు ఆంధ్రమహాసభలో మితవాదులైన మందుముల సోదరులు (నర్శింగారావు, రామచంద్రరావు), బూర్గుల రాం కిషన్ రావు, కొండా వెంకటరంగారెడ్డి లాంటివారు నైజాం సైన్యాలు, రిజర్వుపోలీసులు చేస్తున్న అఘాయిత్యాలను ఖండిస్తూ కనీసం ప్రకటనలనైనా చేయడానికి సాహసించలేకపోయారు! పైవారంతా, ఆంధ్రమహాసభలో మాతో సమిష్టిగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలపై చన్నీళ్ళు చల్లిన ఘరానా పెద్దమనుషులే! నిజం వ్యతిరేకపోరాటం చాలా ఉన్నతస్థాయిలో వున్నప్పుడు కొండా వెంకటరంగారెడ్డి నాయకత్వాన ఒక బృందం [మితవాద నాయకులు పంపగా] ఒక నివేదికను పత్రికలకు విడుదల చేసింది. గ్రామ సీమలందు కమ్యూనిస్టులు దొరలను, భూస్వాములను పత్తి హింసిస్తున్నారని, వారి వ్యవసాయాల్ని సాగనీయడం లేదని, ఆయా గ్రామాలందు కాంగ్రెస్ లో సభ్యులుగా చేరినవారిని కమ్యూనిస్టులు హింసిస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు.

 

దొరల దోపిడీ, దౌర్జన్యాకాండలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఆంధ్రమహాసభ కార్యకర్తలను భూస్వాములు పోలీసులతో మిలాఖాతై చిత్రహింసలకు గురిచేస్తున్నప్పుడు నైజాం నవాబుకు తొత్తులుగా వున్నారని గ్రామాలనుండి తరిమివేయడంలో తప్పులేదు. ఆ దొరల తొత్తులయిన గూండాలను కాంగ్రెస్ లో చేర్చుకోగా, కాంగ్రెస్ వారిని కమ్యూనిస్టులే కొట్టారని కొండా వెంకటరెడ్డి నివేదిక చెప్పింది. అసలు ఈ కొండా వెంకటరెడ్డి ఎవరు? .... ఈ రంగారెడ్డికి భువనగిరి తాలూకాలోని శాహ్ రాజ్ పేట గ్రామంలోనే దాదాపు వేయి ఎకరాలభూమి సొంత వ్యవసాయంలో ఉంది. 1946-47, 1947-48 సంవత్సరాల్లో నైజాం నవాబుకు నమ్మినబంటు అని పేరుతెచ్చుకున్నారు. పులితోలు కప్పుకున్నా, నక్కనక్కే, గూండాలు కాంగ్రెస్ లో చేరినా గూండాలే ... అలాంటి కాంగ్రెస్ కు 1952 జనరల్ ఎన్నికల్లో సభ్యులకు అసలు పోలింగ్ ఏజెంట్లే దొరకలేదు. కమ్యూనిస్టు పార్టీ అద్వితీయమైన విజయాలు సాధించింది! [రైతాంగ సాయుధ పోరాట అగ్రనాయకులలో ఒకరైన ఆరుట్ల రామచంద్రారెడ్డి: "తెలంగాణా పోరాట స్మృతులు]

 

తెలంగాణాలో ఈ 'దొరల'గత చరిత్రే కాదు, నేటి చరిత్ర కూడా అదే అయినందుననే, హైదరాబాద్ స్టేట్ రద్దయి, దేశంలో తొలి "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్'' [ఫజల్ ఆలీ] స్పష్టమైన సిఫారసులు ఆధారంగా దేశంలోనే తొలి రెండవ పెద్ద రాష్ట్రంగా తెలుగువారందరికీ కలిపి తెలుగుప్రజల చిరకాల వాంఛలకు అనుగుణంగా "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్ర అవతరణ హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న సుసాధ్యమయిన తరువాత కూడా నానారకాల 'దొరల' ఇతర భూస్వామ్య, నయాపెట్టుబడిదారుల అలానే ఉన్నాయి! ఈ కొనసాగింపులో భాగమే కోస్తాంధ్రలోని శ్రీకాకుళం (విజయనగరం)నుంచి తెలంగాణాకు వచ్చి, తన రాజకీయ నిరుద్యోగానికి పరిష్కార మార్గంగా మొత్తం తెలుగుజాతి మధ్యనే విషబీజాలు నాటినవాడు "బొబ్బ్లిదొర'', అతని కుటుంబమూ; తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో ఇతడు కాలుమోపిన నాటికి ఉన్న ఆస్తిపాస్తులెన్ని? ఆ తరువాత చేసిన దొంగసంపాదనలెన్ని? లెక్కల కోసం సీమాంతరాలు దాటి వెళ్ళనక్కరలేదు!


 
ఎందుకంటే తెలంగాణాలోని స్థానికులు హైదరాబాద్ లోని మిత్రులూ వెల్లడిస్తున్నా దాన్నిబట్టి - ఒక్క హైదరాబాద్ సమీపంలో 'బొబ్బిలిదొర'కు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో రకరకాల రహస్య కార్యకలాపాల కోసం నిర్మించుకున్న "ఫామ్ హౌస్'' ఉంది! ఇదిగాక, 2010 జనవరి 31న "ఇంటర్నెట్" సాక్షిగా ఒక "బ్లాగ్''లో "బొబ్బిలిదొర'' వారి "డాలర్ సామ్రాజ్యం'' అన్న మకుటం కింద ఇండియా మ్యాప్ లో అతడి బొమ్మ ముద్రించి తాజాగా మావోయిస్టులు ఒక వార్తను ప్రముఖంగా విడుదల చేశారు! ఆ వార్త తాలూకు తాజా సమాచారం ("అప్ డేటెడ్'') పేరిట "ఆంధ్రామానియా'' శీర్షిక కింద బొబ్బిలిదొర పేరుతొ వారి "సీక్రెట్ బిజినెస్: సీపోర్టు షిప్స్ అండ్ రు. 6000 క్రోర్స్'' అన్న ఉపశీర్షిక పెట్టి ఈ క్రింది సమాచారం అందులో పెట్టారు. అందులోని కొన్ని భాగాలు :
తెలంగాణా ప్రజలంటే తనకెంతో ప్రేమ అని నటించే వ్యక్తీ నిజమైన ప్రేమంతా అతని వ్యాపారాల మీదనే ఉంటుంది.
"తన ప్రజలు మోసపోయారని ఎవరు అరుస్తూంటారో అతను ఇతర రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు పెడుతుంటాడు!''
"ఇతరులమీద రాజకీయంగా ఎక్కువ పలుకుబడి పొందడం కోసం దోమల బెడదను కూడా లెక్క చేయకుండా తండాల మధ్య తలదాచుకోజూచే వ్యక్తీ రెండు ఓడలకు (కాండ్లారేవులో) అధిపతి కాగలగడమేకాదు, ఇప్పుడా వ్యక్తీ ఒక ప్రయివేట్ హార్బరునే నిర్మిస్తున్నాడు'' అని ఆ బ్లాగ్ లో బ్లాగర్ వివరించాడు.
 


అంతేగాదు, ఆ వ్యక్తీ తాలూకు "ఈ చీకటి కోణాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి ... ఈ వివరాలు చదివితే అతడు ప్రారంభించిన స్థానిక ఉద్యమం గురించీ, తెలంగాణా ఆత్మగౌరవం గురించీ అతను చేస్తే ప్రకటనలలోని డొల్లతనం బోధపడుతుంది ... 2001 సంవత్సరంలో ఇతడు స్థానిక పార్టీని స్థాపించిన తరువాత అపారమైన సంపదను కూడబెట్టుకున్నాడు. దానికి తగిన సాక్ష్యాధారాలను విశ్వసనీయవర్గాల నుంచే రాబట్టుకోవటం జరిగింది. రాజకీయంగా పొందిన ఈ సంపదతోనే ఆయన కాండ్లా (గుజరాత్) సముద్ర రేవుపైన గట్టిపట్టు సాధించాడు. రెండు భారీ నౌకలు కొన్నాడు. ఇప్పుడా నౌకలు ప్రపంచాన్ని చుట్టివస్తున్నాయి. అతడు ఒక ప్రయివేట్ సీపోర్టును కూడా నిర్మించే యత్నంలో ఎద్దడిగా ఉన్నాడు. ఈ సీపోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.500 కోట్లు అని అంచనా. ఈ నిర్మాణాన్ని ఆయన సన్నిహిత బృందంతో ("క్లోజ్ సిండికేట్'') కలిసి చేస్తున్నాడు! ఈ రాజకీయవేత్త విలువ నేడు రూ.6,000 కొట్లనీ, ఇది పైకి కన్పించే సొమ్ము మాత్రమేననీ అతడి ఆర్ధిక లావాదేవీలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తీ వెల్లడించాడు. ఈ మొత్తం కేవలం పైకి తెలియవచ్చిన సంపదకాగా, అజ్ఞాతంగా ఉన్న సంపద వాస్తవ విలువ ఎంత ఉండాలో ఎవరికీ వారే ఊహించుకోవచ్చు. అంతేగాదు, మహారాష్ట్ర, గుజరాత్ ల మధ్యదారిలో అతడికి అనేక ఆస్తులూ, ఎస్టేట్లూ, ఆర్ధిక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలేగాని, తెలంగాణాలో మాత్రం కావు. ముంబైకి, గుజరాత్ కు మధ్య ఈయన పొందిన భూముల విలువ కోటానుకోట్ల రూపాయల్లోనే ఉంటుంది''!

 

ఇవీ - ఇంటర్నెట్ కథనం (బ్లాగ్) వివరాలు! ఇంతకూ ఇక్కడ గమనించవలసిన విషయం - 1956కు ముందూ తెలుగుజాతి ఏర్పరచుకున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దరిమిలా ఇరుప్రాంతాలకు చెందినా (సీమాంధ్ర, తెలంగాణా) భూస్వామ్య, ధనికవర్గాలు పెట్టె పెట్టుబడులకు మాత్రం ప్రాంతీయ భేదాలుండవుగాక ఉండవు, అని! ప్రాంతాలలోని సామాన్య ప్రజాబాహుళ్యాన్ని వివిధ రూపాలలో దోచుకోవటంలో ఇరుప్రాంతాలలోని భూస్వామ్య, పెట్టుబడివర్గాలకు పద్ధతులలోనేగాని, దోపిడీ స్వభావంలో మాత్రం తేడాలుండవు గాక ఉండవు! లేవు కాబట్టే, తెలంగాణా సాయుధ పోరాట విజయాల ప్రభావంలో నాటి తెలంగాణా పేదరైతు, వ్యవసాయ కార్మికవర్గం, వెట్టిచాకిరీని, "నీబాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న బానిస సంకెళ్ళను కాస్తా విదిలించుకుని బయటపడవలసి వచ్చింది. అదీ అసలైన ఆత్మగౌరవ ప్రతిష్ఠాపాన!
 


అయితే నాటి ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం సుసాధ్యం చేసిన ఈ పరిణామక్రమాన్ని నేడు తిప్పికొట్టడం కోసమే మరొకసారి ప్రాతపు దోరాలూ, భూస్వాములూ సమాయత్తం కావడానికి ఒక ఉద్యమం అవసరమైంది. అందుకనే ప్రజల మౌలిక సమస్యలయిన భూసమస్య, కనీసవేతనాలు, గనుల పేరిట, పరిశ్రమల విస్తరణపేరిట విచ్చలవిడిగా పెట్టుబడివర్గాలు సాగిస్తున్న భూసేకరణలు, భూముల స్వాదీనాలు, విద్యార్థి, యువజనుల నిరుద్యోగం వగైరా సమస్యలు ప్రస్తావనకు రాకుండా, ఆ సమస్యలపైన వాస్తవికమైన ఆందోళనలు, ఉద్యమాలూ రాకుండా పక్కదారులు పట్టించేందుకే, పదవీ స్వార్థంలో భాగంగా పాలకపక్షంలోని 'నిరుద్యోగ'వర్గమూ, "పక్కింటావిడ భర్త దొరికితే, నా భర్తా దొరుకుతాడ''న్న సామెతలాగా కొన్ని ప్రతిపక్షాలలోని స్వార్థపరులూ ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండా ద్వారా తెలుగుజాతిని చీల్చాలని కృత్రిమంగా ఉద్యమించారనడంలో సందేహం లేదు! ఈ రాజకీయ నిరుద్యోగుల అండలేకపోతే కాంగ్రెస్ అధిష్ఠానం కొమ్ములు కూడా విరిగిపోవటం ఖాయం.

 

అలాగే, 1956కు ముందు పరిస్థితిలో పోల్చుకుంటే ఆ తరువాత కడచిన 56 సంవత్సరాలలోనూ ఉభయప్రాంతాలలో రిజిస్టరయిన భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల పెట్టుబడులూ, పరిశ్రమల నిర్మాణం కూడా ఉన్న పరిధులలో గణనీయంగానే పెరిగాయని గణాంకాలన్నీ తెల్పుతున్నాయి. అందువల్ల హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడుల కేంద్రీకరణలో గానీ, విస్తరణలోగానీ ఉభయప్రాంతాల మోతుబరులూ ఉన్నారు. అందుకు ఏ ఒక్కరినో టార్గెట్ చేసీ లాభంలేదు! విచిత్రమేమంటే, ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయమే చూడండి - "న్యూ''కంపెనీలో భాగస్వాములుగా ఉన్నవారు ఉభయప్రాంతాల పెట్టుబడిదారులే. పైగా ఆ కంపెనీ కోసం స్థానిక మోతుబరూ, స్థానిక దినపత్రిక యజమానికి [ఇప్పటిదాకా ఆ పత్రిక నిర్వాహకుడు తెలంగాణాలో పాగా వేసిన 'బొబ్బిలిదొర'వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా] కాంట్రాక్టు ఇప్పించడంలో ప్రముఖపాత్ర వహించడాన్ని పత్రికలు బయటపెట్టాయి!

 



అంతవరకూ ఇదే స్థానిక పత్రిక అధినేతగా ఉంటూ వచ్చిన 'బొబ్బిలిదొర' ఆ పత్రికను ఆ స్థానిక యజమానికి కుదువబెట్టిన సంగతీ బహిరంగ రహస్యమే! ఇక "బొబ్బిలిదొర'' కుమారరత్నం ఒక ఎన్.ఆర్.ఐ. "సీమాంద్ర పెట్టుబడిదారులు'' అంటే ఎక్కడ అదే సీమాంధ్రకు చెందినా తమకూ వర్తించుతుందేమొననిసిగ్గుపడిన ఈ తండ్రీకోడుకులూ మధ్యలో ఆ మాటను మానేసి మొత్తం "దోపిడీ'' పదాన్ని "సీమాంధ్రప్రజల''కే అంటగట్టేస్తూ వచ్చారు. అంతేగాదు, 'బొబ్బిలిదొర' కుమారరత్నానికి వ్యాపారాలకోసం సీమాంధ్ర కావాలట, అధికారానికి తెలంగాణా కావాలట! ఈ సత్యం - శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి గ్రామంలో ఎగుమతులకు గిరాకీ ఉన్న "శ్రీకాకుళం బ్లూస్'' అనే విలువైన రంగురాళ్ళ క్వారీని ఈ కుమారరత్నం 2005 సంవత్సరం దాకా కొల్లగొడుతూనే వచ్చాడని మరవరాదు!

 



ఈ భాగోతం ఇలా ఉండగానే, 1956కు ముందు మన తెలంగాణాలోగాని [రెండు ప్రాంతాలూ 1953 దాకా ఒకటి, 1956 దాకా మరొకటీ పరాయి పాలనల్లోనే ఉంటూ వచ్చినందున] ఉభయత్రా విదేశాలకు ఉద్యోగరీత్యాగానీ, వ్యాపారాల కోసంగానీ వెళ్ళిన ఎన్.ఆర్.ఐ.ల సంఖ వేళ్ళమీద లెక్కించదగిన దానికన్నా మించిలేదు. కాని 1956 తరువాతనే ఉభయప్రాంతాలలోనూ గత 57 సంవత్సరాలలోనూ ఇటు తెలంగాణానుంచీ, అటు సీమాంధ్రనుంచీ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఎన్.ఆర్.ఐ.ల రాకపోకలూ, విదేశాల్లో నివాసాలూ, స్థిరనివాసాలూ పెరిగాయని మరచిపోరాదు. అమెరికా, బ్రిటన్, జర్మనీలలోనేగాక, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, మలేసియా, సింగపూర్ లలో స్థిరపడి ఆయా చోట్ల పలు తెలుగు సాంస్కృతిక సంస్థలనూ ఏర్పరచుకున్నారు. ఈ విషయంలో ఇరుప్రాంతాల వారూ విద్యా విషయకంగానూ, సాంస్కృతికంగానూ కూడా ఎంతో అభివృద్ధి దిశగా పురోగామిస్తున్నారు. తెలుగునాట వివిధప్రాంతాల అభివృద్ధి కోసం తమకు వీలైన పద్ధతుల్లో పాటుపడుతూనూ ఉన్నారు. ఈ పరిణామం ప్రధానంగా 1956 తరువాతనే, తెలుగుజాతి ఏకైకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత మాత్రమే సాధ్యమైందని గుర్తించాలి. ఇక హైదరాబాద్ లో ఉభయప్రాంతాల వారి పెట్టుబడులకు సంబంధించి కూడా 1956 తర్వాతనే ఇరుపక్షాల క్రమానుగతమైన అభివృద్ధి కనిపిస్తోంది.



ఉదాహరణకు 1956 తరువాతనే మన తెలంగాణా సోదరుల పరిశ్రమలు, సంస్థలలో ఉన్న పెట్టుబడులు రూ.350 కోట్ల నుంచి సుమారు రూ.4,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈ ఇరుప్రాంతాలకు చెందిన మోతుబరులు ఆక్రమించిన లేదా కొనుగోలు చేశామని చెబుతున్న భూముల వైశాల్యం వివరాలను రాష్ట్రప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన 'శాంతి'చర్చల సందర్భంగా మావోయిస్టులు పేర్లతో సహా పేర్కొన్న వివిధ ప్రాంతాలవారీ భూముల, పెట్టుబడి ఆస్తుల, కంపెనీల వివరాలతో ఒక పత్రాన్ని కూడా విడుదల చేశారు. కాగా, ఇటీవల తెలియవచ్చిన కొన్ని వివరాల ప్రకేరం గత పాతికేళ్ళలో స్థానిక సోదరులు సంపన్నులుగా ఎదిగి ఏ ఏ పరిశ్రమలు పెట్టి బలమైన పరిశ్రమాధిపతులుగా ఎదుగుతూ వచ్చారో తెలిసింది. పెట్టుబడిదారీ-భూస్వామ్య మౌలిక చట్రం అనుమతించినందువల్లనే అటువారుగాని, ఇటువారుగానీ వీలైనంత మేర సంపన్నులుగా తమ వృద్ధి నమోదు చేసుకున్నారు! ఆ వ్యవస్థ మౌలింగానే మారిపోనంత కాలం ప్రాంతాలతో నిమిత్తం లేకుండానే కొత్త 'టాటా'లు, కొత్త 'బిర్లా'లూ, ఇంకొత్త అంబానీలూ పుట్టుకొస్తూనే ఉంటారని మరవరాదు! అలాగే మన తెలంగాణాలో కూడా హైదరాబాద్ కేంద్రంగానూ, జిల్లాస్థాయిలోనూ కోట్లకు పడగలెత్తిన కేవల స్థానిక కంపెనీలున్నాయి. వాటిలో కొన్ని " ఆంశ్రీ కన్ స్ట్రక్షన్స్, శాలివాహనా బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్, మధుకాన్, మైహోమ్ కన్ స్ట్రక్షన్స్, నాగంవారి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కున్ డాయి, గుజరాత్ షిప్పింగ్ సర్వీసు, 'న్యూ' కంపెనీ, శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్, శ్రీకిరణ్ కన్ స్ట్రక్షన్స్ వగైరాలు!
 



అన్నట్టు - వెంకటస్వామి, వివేక్, మధుయాష్కీ, డి.ఎస్., ఎర్రబెల్లి, నాగం, ఈటెల వారి ఆస్తులు పుట్టుకతోనే వచ్చినవా, 1956 తర్వాత 'ఎదిగినవా' చంద్రబాబులాగా?! ఇంత అభివృద్ధిలోనూ ఒక చెరపరాని పెద్ద హంసపాదు - "బొబ్బిలిదొర'', అతడి కుటుంబమూ, దౌర్జన్య భాషతో, బూతులతో 'దీపి'స్తున్న అతడి అనుచరవర్గమూ, వెరసి వీళ్ళు కేవలం స్వార్థప్రయోజనాల కోసం ప్రోత్సహించిన తెలంగాణాబిడ్డల ఆత్మహత్యలూనూ! అందుకే ఈ పరిణామాన్ని మనం 'దొర'ల స్వామ్యానికీ, ఇతర భూస్వాముల వర్గ స్వామ్యానికీ మధ్య సాగుతున్న కుల, వర్గ ఆధిపత్యపోరని నిర్థారణ చేస్తుకోవచ్చు! ఇందులో రెక్కాడితే గాని డొక్కాడని "పూటబత్తెమే పుల్లవెలుగు''గా ఉన్న ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రాలేదు, లేదు, లేదు! ఆరుట్లవారి అంచనా ఆ రోజుకీ ఈ రోజుకీ అక్షరసత్యమే!

కూటమి పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ ఎలక్షన్ ఫండ్స్

  తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.  రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి. ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.  ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.   పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.  తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.  వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

అంబటి.. అహంకారమా? అవివేకమా?

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 

లోకేష్ విషెస్ కు జగన్ నో రిప్లై.. కారణమేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు.  అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు. 

ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ ఉడత ఊపులు!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి అహంకారంతో కన్నూమిన్నూగానక వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందా? గతంలో మాట్లాడితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందా? అంటే.. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఔననే అంటున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు  ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.  క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందనీ, దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారనీ,  అందుకే రేవంత్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేసీఆర్ చేసిన  తోలు తీస్తా  వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేడర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి తోలు ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఇప్పుడు  ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఇప్పుడు ఉడత ఊపుల మాదిరి విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు నిదర్శనంగా జూపల్లి అభివర్ణించారు.  బీఆర్ఎస్, బీజేపీ లు లోపాయికారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా కూడా  మూడింట్ ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయన్న జూపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారనడాని కి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.  పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కావడం వల్లే కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారంటే అర్ధమ దేనన్నారు.  ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని జూపల్లి విమర్శించారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసింది కేసీఆరేనన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది అంటూ విమర్శలు గుప్పించారు.

జగన్ బర్త్ డే.. సంబరాల పేరిట పశుబలులు!

ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో.. అలా ఉంటారు జగన్. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు జగన్. ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ, ఆయన నేతృత్వంలోని వైసీపీకి లేవు అంటారు పరిశీలకులు. ఔను మరి యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నాయకుడిని బట్టే ఆయన పార్టీ, ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ అలా కాకుండా మరెలా ఉంటాయం టున్నారు రాజకీయ పండితులు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఆనవాలు అన్నదే రాష్ట్రంలో కనిపించలేదు. కక్షసాధింపు, వ్యతిరేకించిన వారిపై కేసులు, అరెస్టులే పాలనగా ఆయన అధికారంల ఉన్న ఐదేళ్లూ కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి.  సరే జనం విషయం గుర్తించి 2019లో తాము  కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.  అది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తీరు, ఆయన పార్టీ తీరు ఇసుమంతైనా మారలేదు. తాజాగా ఆదివారం జగన్ 53వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీయులు నానా హంగామా సృష్టించారు. జనం ఈసడించుకునేలా పశుబలులు ఇచ్చి రక్తం చిందించారు.  ఇక జగన్ కు జనాభిమానం తగ్గలేదని చాటేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలూ వేయించారు. జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి ఫ్లయిట్ ఎక్కగానే  ఆయన పేరున్న గౌన్లు వేసుకున్న చిన్నారులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశారు. అసలు ఆ విమాన ప్రయాణీకులలో జగన్ ఉంటారని వైసీపీయులకు వినా మరొకరికి తెలిసే చాన్సే లేదుగా. అందుకే చిన్నారులతో చేసిన ఆర్భాటమంతా పెయిడ్ ఆర్టిస్టుల పనేనని ఇటే తెలిసిపోతోందంటున్నారు పరిశీలకులు. సరే ఫ్లైట్ సీన్లు అలా ఉంటే..  ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జగన్ పై అభిమానమంటూ వైసీపీ యులు చేసిన విన్యాసాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రప్ప రప్ప గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు హోర్డింగులే కాకుండా  మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో , మండల కేంద్రమైన విడపనకల్లు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో జగన్ జన్మదినం సందర్భంగా  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేశారు. ఇక  ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారంలో లేకుండానే ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీయులు.. పొరపాటున వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఆ హింసాకాండను, అరాచకత్వాన్నీ తట్టుకోగలమా అన్న భయాందోళనలు ఇప్పటి నుంచే జనంలో వ్యక్తమౌతున్నాయి. 

కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు.  కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏక‌కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు.   రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు  లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్  వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.  కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.  

జగన్ కు షర్మిల బర్త్ డే విషెస్.. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రెస్సాన్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు సహా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే విశేషమేంటంటే.. ఇటీవలే ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబాబు, మంత్రి లోకేష్ సహా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల సొంత అన్న జగన్ మాత్రం చెల్లెలికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయతీ నుంచి, పొలిటికల్ గా దారులు వేరవ్వడం వరకూ ఇరువురి మధ్యా అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.    షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ వీరి మధ్య విభేదాలు మరింత పెచ్చరిల్లాయి.  2024 ఎన్నికలకు ముందు, తరువాత కూడా షర్మిల జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి అన్నీ నిలిచిపోయియి.  అయితే తాజాగా ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు జగన్ కూడా స్పందించారు. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. జగన్ కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్, అలాగే అందుకు జగన్ రెస్పాన్స్ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది : కేసీఆర్

  తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్మించలేదన్నారు.  తనను తిట్టడం తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులతో గులాబీ అధినేత భేటీ అయ్యారు.  కారు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్‌ సత్తా తెలిసేది. బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్‌ ఎస్టేట్‌ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం ఫ్యామిలీ మొత్తం లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని గులాబీ బాస్ విమర్మించారు

వైసీపీ, బీఆర్ఎస్ బంధానికి ఇంత కంటే రుజువుంటుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి

  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి