గుంటూరు జిల్లాలోనూ తెలుగుదేశానిదే ఆధిక్యం
గుంటూరు జిల్లాలో కూడా మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో మొత్తం 12 మునిసిపల్ స్థానాలున్నాయి. వీటిలో 11 మునిసిపల్ స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెనాలిలోని 40 స్థానాల్లో ఇప్పటి వరకు 10 స్థానాలను తెలుగుదేశం, మూడు స్థానాలను వైకాపా గెలుచుకుంది. నరసరావుపేటలోని 40 స్థానాల్లో 18 తెలుగుదేశం, 15 తెలుగుదేశం గెలవగా ఒక స్థానంలో వామపక్షాలు విజయం సాధించాయి. బాపట్లలోని 34 స్థానాల్లో ఒక స్థానాన్ని కాంగ్రెస్, 8 స్థానాలను తెలుగుదేశం, 6 స్థానాలను వైకాపా, ఒక స్థానాన్ని ఇతరులు గెలిచారు. రేపల్లె మునిసిపాలిటీలోని 28 స్థానాల్లో మూడు స్థానాలను కాంగ్రెస్, పదహారు స్థానాలను తెలుగుదేశం, తొమ్మిది స్థానాలను వైకాపా గెలిచాయి. చిలకలూరిపేటలోని 34 స్థానాల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 15 స్థానాలు వైకాపా గెలిచాయి. ఒక స్థానాన్ని ఇతరులు సొంతం చేసుకున్నారు. పొన్నూరులోని 31 స్థానాల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 13 స్థానాలు వైకాపా గెలిచాయి. మంగళగిరిలోని 32 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 14, వైకాపా 8, వామపక్షాలు 6, ఇతరులు 1 స్థానం గెలిచారు. మాచర్లలోని 29 స్థానాల్లో తెలుగుదేశం 20, వైకాపా 8, ఇతరులు 1 స్థానాన్ని గెలిచాయి. సత్తెనపల్లిలోని 30 స్థానాల్లో 1 కాంగ్రెస్, 15 తెలుగుదేశం, 13 వైకాపా, 1 ఇతరులు గెలిచారు. వినుకొండలోని 26 స్థానాల్లో మూడు కాంగ్రెస్, ఆరు తెలుగుదేశం, ఎనిమిది వైకాపా, నాలుగు వామపక్షాలు, ఐదు ఇతరులు గెలిచారు. ఇక్కడ ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. పిడుగురాళ్ళలోని 30 స్థానల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 12 స్థానాలు వైకాపా గెలిచాయి. తాడేపల్లిలోని 23 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 3, వైకాపా 18, ఇతరులు ఒక స్థానం గెలిచారు.