సీమాంధ్ర జిల్లాల్లో 10 గంటల వరకు కౌన్సిలర్ల ఫలితాలు

      సీమాంధ్ర జిల్లల్లో సోమవారం ఉదయం 10 గంటల వరకు వివిధ పార్టీలు గెలిచిన కౌన్సిలర్ల సంఖ్య వివరాలు ఇలా వున్నాయి.   శ్రీకాకుళం - కాంగ్రెస్ (1), తెలుగుదేశం (33), వైకాపా (28), వామపక్షాలు (0), ఇతరులు (9) విజయనగరం -  కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (0), వామపక్షాలు (0), ఇతరులు (5) విశాఖపట్నం - కాంగ్రెస్ - (1), తెలుగుదేశం 22), వైకాపా (3), వామపక్షాలు (0), ఇతరులు 0) తూర్పు గోదావరి - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (75), వైకాపా (46), వామపక్షాలు (1), ఇతరులు 5) పశ్చిమ గోదావరి - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0)  వైకాపా (0), వామపక్షాలు (0), ఇతరులు (0) కృష్ణ - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (4), వామపక్షాలు (0), ఇతరులు (1) గుంటూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (42), వైకాపా (23), వామపక్షాలు (4), ఇతరులు (0) ప్రకాశం - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (27), వైకాపా (13), వామపక్షాలు (0), ఇతరులు (0) నెల్లూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (26) వైకాపా (15), వామపక్షాలు (0), ఇతరులు (4) చిత్తూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (14) వైకాపా (24), వామపక్షాలు (0), ఇతరులు (4) కడప - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (27), వైకాపా (40), వామపక్షాలు (0), ఇతరులు (3) కర్నూలు - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (8), వైకాపా (13), వామపక్షాలు (0), ఇరులు (0) అనంతపురం - కాంగ్రెస్ (1), తెలుగుదేశం (6), వైకాపా (0), వామపక్షాలు (1), ఇతరులు (0)

కేసీఆర్ ఇలాకాలో టీడీపీ ముందంజ

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు అనుమానమే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న మునిసిపల్ ఫలితాలలో టీడీపీ ముందంజలో వుండటం విశేషం. గజ్వేల్ మునిసిపల్ ఫలితాలలో ఇప్పటి వరకూ ఆరు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. వీటిలో తెలుగుదేశం నాలుగు స్థానాలను సొంతం చేసుకుని ముందంజలో వుంది. మిగిలిన రెండు స్థానాలను ఒకటి కాంగ్రెస్, మరొకటి తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకున్నాయి. ఇక్కడ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా వుండే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మునిసిపల్ ఫలితాలలోనే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుందంటే, అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం విజయం ఖాయం

      సీమాంధ్రలో తెలుగుదేశం హవా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతూ వుంది. సీమాంధ్రలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని మునిపిపాలిటీలను గెలుచుకుంది. చాలా మునిసిపాలిటీలలో ముందంజలో వుంది. అలాగే కార్పొరేషన్ ఫలితాలలో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో వుంది. చిత్తూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరులోని 50 కొర్పొరేషన్ స్థానాల తెలుగుదేశం పార్టీ 20 స్థానాలను ఇప్పటికే గెలుచుకుంది. ఈ కార్పొరేషన్ మీద బాగా ఆశలు పెట్టుకున్న వైకాపా 3 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలిచి వైకాపా కంటే అగ్రస్థానంలో వున్నారు.

తెలంగాణలో ఫలితాలు.. 9.30 సమయానికి...

      పురపాలక ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలలో వివిధ పార్టీలు గెలుచుకున్న కౌన్సిలర్ల సీట్లను గమనిస్తే.. ఆదిలాబాద్: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (1), తెరాస (5), వామపక్షాలు (2), ఇతరులు (6). కరీంనగర్: కాంగ్రెస్ (24), తెలుగుదేశ౦: (3), తెరాస (34), ఇతరులు (16), వరంగల్: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (2), తెరాస (15), ఖమ్మం: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), వామపక్షాలు (1), ఇతరులు (1), నల్గొండ: కాంగ్రెస్ (30) తెలుగుదేశం: (11), తెరాస (3), నిజామాబాద్: వామపక్షాలు (2), ఇతరులు (1), మెదక్: కాంగ్రెస్ (6), తెలుగుదేశం (3), తెరాస (4), వామపక్షాలు (1), ఇతరులు (1), రంగారెడ్డి: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (1), తెరాస (2), వాపమక్షాలు (1), ఇతరులు (9), మహబూబ్ నగర్: కాంగ్రెస్ (9), కాంగ్రెస్ (2), తెరాస (7), ఇతరులు (4). ఉదయం తొమ్మిదిన్నర వరకు వరకు తెలంగాణలో కాంగ్రెస్ 119, తెలుగుదేశం 47, తెరాస 71, వామపక్షాలు 16, ఇతరులు 64 స్థానాలు గెలుచుకున్నారు.

తెలంగాణ పురపాలక ఫలితాలు.. 9 గంటలకు

  పురపాలక ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలలో వివిధ పార్టీలు గెలుచుకున్న కౌన్సిలర్ల సీట్లను గమనిస్తే.. ఆదిలాబాద్: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (1), తెరాస (5), వామపక్షాలు (2), ఇతరులు (6). కరీంనగర్: కాంగ్రెస్ (10), తెరాస (6), ఇతరులు (3), వరంగల్: కాంగ్రెస్ (1), తెరాస (1), ఖమ్మం: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), వామపక్షాలు (1), ఇతరులు (1), నల్గొండ: కాంగ్రెస్ (9) తెలుగుదేశం: (2), తెరాస (1), నిజామాబాద్: (ఫలితాలు వెలువడలేదు), మెదక్: కాంగ్రెస్ (9), తెలుగుదేశం (1), తెరాస (1), ఇతరులు (1), రంగారెడ్డి: కాంగ్రెస్ (6), తెలుగుదేశం (1), తెరాస (2), మహబూబ్ నగర్: తెరాస (1), ఇతరులు (1). ఉదయం తొమ్మిది గంటల వరకు తెలంగాణలో 41 కౌన్సిలర్ ఫలితాలు వెలువడగా వాటిలో కాంగ్రెస్ 41, తెలుగుదేశం 12, తెరాస 17, వామపక్షాలు 3, ఇతరులు 12 స్థానాలు గెలుచుకున్నారు.

పురపాలక ఎన్నికలలో మొదటి విజయం టీడీపీదే!

  పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు విడుదలవటం ప్రారంభమైంది. తెలంగాణలో మొదటి ఫలితం విడుదలైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి మొదటి విజేతగా నిలిచాడు. టీఆర్ఎస్ బలంగా వుందని ఇప్పటి వరకూ ఆ పార్టీ నాయకులు అనుకుంటున్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోణీ చేయడం ఆశ్చర్యకరం. అలాగే వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో మొదటి విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జనగాంలో ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైన ఇరవై నిమిషాలలోనే నాలుగు ఫలితాలు వెల్లడయ్యాయి. సమయం గడిచేకొద్దీ కౌంటింగ్ వేగం పెరిగే అవకాశాలున్నాయి.

4రోజుల వ్యవధిలో ఎన్నికలు, ఫలితాలు

  ఈరోజు 10నగర పాలక సంస్థలు, 145 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజే చివరి దశ ఎన్నికలలో భాగంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 41 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కొద్ది వారాల క్రితం మన రాష్ట్రంలో జరిగిన యం.పీ.టీ.సీ మరియు జెడ్.పీ.టీ.సీ. ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఆ తరువాత శుక్రవారం అంటే మే16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అందువల్ల ఈ నాలుగు రోజులు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చాలా కీలకమయినవి. ఈ ఎన్నికలు, వెలువడనున్న ఫలితాలు ఆయా పార్టీల, దేశ భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతున్నాయి. మన రాష్ట్రంలో మున్సిపల్ మరియు స్థానిక సంస్థలకు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది వారాల ముందుగా నిర్వహించినందున, ఈరోజు వెలువడబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజాతీర్పు ఏవిధంగా ఉండబోతోందో చూచాయగా తెలియజెప్పవచ్చును. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగు ఈవీయంల ద్వారా నిర్వహించినందున, పూర్తి ఫలితాలు మధ్యాహ్నం నాటికే తెలిసిపోవచ్చును. ముందు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆ మరునాడే స్థానిక సంస్థల ఫలితాలు, రెండు రోజుల వ్యవధిలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉన్నందున ఓట్లు కౌటింగ్ మరియు ఫలితాలు వెల్లడికి ఎన్నికల కమీషన్ విస్తృతమయిన ఏర్పాట్లు, పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసింది.

టీఆర్ఎస్ నేత కోనపురి రాములు దారుణ హత్య

      మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు తమ్ముడు కోనపురి రాములు ఈ రోజు హత్యకు గురయ్యారు. నల్లొండ జిల్లా శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరుగుతున్న పెళ్ళికి హాజరయ్యి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయనను ఆసుపత్రికి తరలింస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. రాములు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు. ఆయనపై గతంలో కూడా హత్యాయత్నం జరిగింది. కొట్టి సాంబశివుడు సోదరుడి హత్య తనకు ప్రాణహానీ ఉందని కోనపురి రాములు గతంలోనే మొరపెట్టుకున్నారు. అతనికి ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. రాములును హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని టీఆర్ ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.

13న తెలంగాణ, సీమాంధ్రలో రీపోలింగ్‌

      ఈ నెల 13న రాష్ట్రంలో 29 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 13 లోక్‌ సభ, 21 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 29 కేంద్రాల్లో రీపోలిగ్‌ నిర్వహిచనున్నట్లు తెలిపారు. దీంతో 13న ఆయా కేంద్రాల్లో రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణలో మొత్తం 12 కేంద్రాల్లో, సీమాంధ్రలో మొత్తం 17 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.   తెలంగాణలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు పార్లమెంటు: నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని బోధన్‌లో 64వ పోలింగ్ కేంద్రం, జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని జుక్కల్‌లో 134వ పోలింగ్ కేంద్రం, బాన్సువాడలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు. నిజామాబాద్ రూరల్‌లోని 9వ నెంబర్ పోలింగ్ కేంద్రం, కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని హుస్నాబాద్‌లో 170వ పోలింగ్ కేంద్రం. అసెంబ్లీ: బాన్సువాడలో 146వ పోలింగ్ కేంద్రం, నిజామాబాద్ రూరల్‌లోని 48, 168 పోలింగ్ కేంద్రాలు, కూకట్‌పల్లిలోని 371/ఎ పోలింగ్ కేంద్రం, కొత్తగూడెంలో 161 పోలింగ్ కేంద్రం, భద్రాచలంలో 239 పోలింగ్ కేంద్రం. సీమాంధ్రలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు పార్లమెంటు: శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని శ్రీకాకుళంలో46వ పోలింగ్ కేంద్రం, మచిలీపట్నం లోక్‌సభ పరిధిలోని గుడివాడలో 123వ కేంద్రం, అవనిగడ్డలోని 29వ కేంద్రం, విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ తూర్పులో 212 వ పోలింగ్ కేంద్రం, మైలవరంలో 123 పోలింగ్ కేంద్రం, జగ్గయ్యపేటలోని 122వ పోలింగ్ కేంద్రం. అసెంబ్లీ: కుప్పంలోని 192 పోలింగ్ కేంద్రం, సాలూరులోని 134వ పోలింగ్ కేంద్రం, అవనిగడ్డలోని 91వ పోలింగ్ కేంద్రం, పెనమలూరులోని 59, 172 పోలింగ్ కేంద్రాలు, నందిగామలో 171, 174 పోలింగ్ కేంద్రాలు. పార్లమెంట్, అసెంబ్లీ: అరకు లోక్‌సభ పరిధిలోని పాడేరులో 68వ పోలింగ్ కేంద్రం, కడప లోక్‌సభ పరిధిలోని జమ్మలమడుగులో 80, 81,82 పోలింగ్ కేంద్రాలు. (ఇక్కడ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు రెండిటికీ రీపోలింగ్ జరగనుంది)  

కాంగ్రెస్ పార్టీ.. ఓ అబద్ధాలపుట్ట.. ట్విట్టర్‌లో పాత ఫొటో!

  అబద్ధాలు చెప్పే సబ్జెక్టులో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవార్డు ఇవ్వొచ్చు. ప్రస్తుతం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా వున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీకి లేనిపోని బిల్డప్పు ఇవ్వడం కోసం కూడా తెగ అబద్ధాలు చెప్పేస్తోంది. వారణాసిలో శనివారం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించాడు. కాంగ్రెస్ పార్టీ ఇదే రాహుల్ గాంధీ వారణాసి రోడ్ షో అంటూ బాగా జనాలున్న ఓ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టింది. ఆ ఫొటో చూసి నిజమేననుకుని దేశవ్యాప్తంగా అనేక నెట్ మ్యాగజైన్లు, నెట్ మేగజైన్లు తమ న్యూస్‌లో సదరు ఫొటోని పోస్ట్ చేశాయి. దాన్ని చూసిన జనం అబ్బో వారణాసిలో రాహుల్ ర్యాలీకి ఎంతమంది వచ్చారో అనుకున్నారు. అయితే బీజేపీ మాత్రం వారణాసిలో రాహుల్ ర్యాలీకి జనం ఏమంతగా రాకపోయినా ఫొటోలో మాత్రం ఇంతమంది జనం వున్నారేంటా అని పరిశోధన మొదలుపెట్టింది. తీరా చూస్తే వారణాసి పేరుతో ట్విట్టర్‌లో పెట్టిన ఫొటో ఎప్పటిదో పాత ఫొటో అని తేల్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో అందరి దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో నాలుక్కరుచుకున్న కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌‌లో పెట్టిన పాత ఫొటో తీసేసింది. జనంలేని వారణాసి ర్యాలీ ఫొటో పెడితే బాగోదని అనుకుందేమోగానీ, ఏ ఫొటో పెట్టలేదు.

లగడపాటి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారా?

  రాష్ట్రం విడిపోతే ఎన్నికలలో నిలబడనని చెప్పిన లగడపాటి రాజగోపాల్ ఆడినమాట తప్పకుండా ఎన్నికలకు దూరంగా వున్నారు. అయితే సర్వేల స్పెషలిస్టుగా పేరున్న ఆయన సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రం విడిపోకుండా వుంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుశం, బీజేపీ కూటమి ప్రభుత్వం స్థాపించేదని చెప్పి సంచలనం సృష్టించారు. ఎలాంటి సర్వే అయినా ప్రకటించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధనలు వున్నప్పటికీ లగడపాటి సాహసంతో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం ఆయన మీద కేసు కూడా పెట్టింది. మొన్నామధ్య లగడపాటి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాలలో కొనసాగే విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. లగడపాటి తీసుకునే ఆ కీలక నిర్ణయం ఏమిటబ్బా అని రాష్ట్ర రాజకీయ వర్గాలలో కలిగిన సందేహాలు శనివారం నాడు కొంతవరకు తీరాయి. లగడపాటి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈమధ్యే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో కలసిన గంటా శ్రీనివాసరావుని లగడపాటి విశాఖపట్నంలో కలిశారు. వీరిద్దరి మధ్య కొంతసేపు చర్చలు జరిగాయి. గంటా శ్రీనివాసరావు తనకు సన్నిహితుడు కాబట్టి కలవటానికి వచ్చానని లగడపాటి చెబుతున్నప్పటికీ, ఈ మీటింగ్ లగడపాటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి కర్టన్ రైజర్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.