చిత్తూరు జిల్లాలో తెదేపా, వైకాపా పోటాపోటీ
posted on May 12, 2014 @ 1:55PM
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీ పోరు జరిగింది. ఎన్నికల ఫలితాలలో రెండు పార్టీలూ సమ స్థాయిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదనపల్లిలోని 35 వార్డుల్లో 15 తెలుగుదేశం, 17 వైకాపా గెలిచింది. 3 స్థానాల్లో ఇతరులు గెలిచారు. శ్రీకాళహస్తిలోని 35 వార్డుల్లో 4 కాంగ్రెస్, 18 తెలుగుదేశం, 11 వైకాపా, 2 ఇతరులు గెలిచారు. పుంగనూరులోని 24 వార్డుల్లో 7 తెలుగుదేశం, 17 వైకాపా గెలిచాయి. పలమనేరులోని 24 వార్డుల్లో 6 తెలుగుదేశం, 17 వైకాపా సొంతం చేసుకున్న్నాయి. 1 ఇతరులు గెలిచారు. నగరిలోని 27 వార్డుల్లో 13 వార్డుల్లో తెలుగుదేశం, 11 వైకాపా గెలవగా, 3 వార్డుల్లో ఇతరులు గెలిచారు. పుత్తూరులోని 24 వార్డుల్లో 13 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి.