Talasani Srinivas Yadav

తలసాని రాజీనామా చేయనేలేదా?

  కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు క్రింద తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా గురించి శాసనసభ కార్యాలయానికి వ్రాసిన ఒక లేఖకు డిప్యూటి సెక్రెటరీ మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నరసింహాచార్యులు బదులిస్తూ “తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి తమకు ఇంతవరకు రాజీనామా లేఖ రాలేదని” తెలియజేసారు. ఆయన ఈ విషయాన్ని గండ్ర వెంకట రమణా రెడ్డికి ఈనెల 8న లిఖిత పూర్వకంగా తెలియజేసారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గత డిశంబర్ నెలలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కనీ ఇంతకాలంగా దానిని స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించలేదని చెప్పుకొంటున్నారు. కానీ సమాచార హక్కు క్రింద గండ్ర అడిగిన ప్రశ్నతో తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి ఇంతవరకు పంపనే లేదని స్పష్టం అయ్యింది.

Singapore Team

నేడు సింగపూర్ మంత్రితో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రణాళికను తయారుచేసిన సింగపూర్ సంస్థల బృందం, ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ తో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకొన్నారు. వారు ఈరోజు రాజమండ్రి చేరుకొని రాజధాని ప్రధాన నగరం యొక్క బృహత్తర ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేస్తారు. అనంతరం వారు ఆయనతో కలిసి సాయంత్రం 4 గంటలకు షెల్టాన్ హోటల్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. మూడు రోజుల క్రితం వారు విడుదల చేసిన రాజధాని నగర ఊహాచిత్రాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈరోజు మీడియా సమావేశంలో వారు రాజధాని గురించి మరిన్ని ఆసక్తికరమయిన విశేషాలు, వివరాలు ప్రజలకు తెలియజేయవచ్చును. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలను స్వయంగా పర్యవేక్షించేందుకు రాజమండ్రిలో బస చేసి ఉన్నందున వారు అక్కడికే వచ్చి రాజధాని ప్రణాళికను అందజేయాబోతున్నారు. ఈ సందర్భంగా వారు పుష్కరాలు జరుగుతున్న తీరును కూడా పరిశీలించే అవకాశం ఉంది.

congress committee chief sucide

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మహత్య

  మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. వివరాల ప్రకారం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంయజ్ మురళీధర్ ససానే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మురళీధర్ ససానే ఆత్మహత్య చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈరోజు ఉదయం తన నివాసంలో మురళీధర్ తనను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇంకా తెలియలేదని.. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని లోనిలోని ప్రవరా మెడికల్ సైన్నెస్ ఇన్ స్టిట్యూట్ క్ పంపినట్టు చెప్పారు.

ram gopal varma

భగవంతుడిని కూడా వదలని రామ్ గోపాల్ వర్మ

  ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ వాళ్లు వీళ్లు అని చూసుకోరు.. అందరి మీద విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు ఆఖరికి దేవుడిని కూడా వదిలిపెట్టలేదు. గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చాలా మంది రాజకీయ నాయకులు విమర్శించడమే కాకా అంతటికి కారణం చంద్రబాబే అంటూ తిట్టిపోశారు కూడా. కానీ వీరందరికి భిన్నంగా రామ్ గోపాల్ వర్మ దేవుడిని విమర్శించారు. గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో భగవంతుడే తన భక్తులను కాపాడలేక పోయాడు పాపం చంద్రబాబు ఎలా కాపాడగలుగుతాడు.. ఈ విషయంలో అందరూ చంద్రబాబును నిందిస్తున్నారు కానీ దేవుడిని మాత్రం ఎవరూ నిందించడం లేదని అని ట్వీట్ చేశాడు. బహుశా చనిపోయిన భక్తులు బతికున్న భక్తుల కంటే దేవుడిని తక్కువగా ప్రార్ధించారేమో అందుకే దేవుడు కాపాడలేదేమో అని విమర్శించారు.

aap arvind kejriwal

కేజ్రీవాల్ నిస్సిగ్గుగా కోరుతున్నారు

  ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. ఈ పార్టీ లోని చాలా ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ తో మొదలైన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం నుండి ఇప్పటి వరకు నాలుగైదుగురు ఎమ్మెల్యేలు పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో అసలు ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఏం చేస్తున్నారన్నది పలువురి అభిప్రాయాలు. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పార్టీ నుండి భహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్యకర్తలను తమ పార్టీలోకి వస్తే చాలా సంతోషమని.. ఒకవేళ అది జరిగితే చాలా మంచిదని వ్యాఖ్యానించారు. అయితే కేజ్రీవాల్ గారు ఇద్దరు నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు కానీ వారు మాత్రం పార్టీలోకి వస్తారా? రారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.   మరోవైపు ఇప్పటికే పార్టీలోని చాలా మంది నేతలు పలుపలు ఆరోపణలో చిక్కుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్లను తిరిగి మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పలు రాజకీయ నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రశాంత్ భూషణ్ స్పందించి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ సమావేశంలో తమ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించి ఇప్పుడు పార్టీలోకి రావాలని సిగ్గులేకుండా కోరుతున్నారని తిట్టిపోశారు. మరి ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

cm chandrababu

హైవేల పక్కన రిసెప్షన్ సెంటర్లు.. చంద్రబాబు

  గోదావరి మహా పుష్కరాలు ఐదు రోజు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రతా ఏర్పాట్లు.. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం హైవేల పక్కన రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. అంతేకాదు వారికి అక్కడ.. మంచినీరు, మజ్జిగ వంటివి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. టోల్‌ ఫ్రీల దగ్గర పుష్కరాలకు వచ్చే భక్తుల నుండి ఫీజు వసూలు చేయవద్దని.. రాజమండ్రిలో 300 సిటీ బస్సులకు వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుష్కరాల్లో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు ఈనెల 26న అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. రోజులో 22 గంటల పాటు పుష్కరస్నానాలకు అవకాశం ఉందని తెలిపారు.

k chnadrasekhar rao

కేసీఆర్ కు ఉన్నతాధికారి ఝలక్

  తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఓ ముఖ్య కార్యదర్శి వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్నే కాదన్న ఆ అధికారి ఎవరనుకుంటున్నారా.. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టులు చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవోగా గాంధీ ఆస్పత్రి పనిచేస్తున్న ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ను నియమిస్తూ నాలుగు క్రితమే దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు కూడా పెట్టారు. అయితే ఈ ఫైల్ వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి అయినటువంటి సురేష్ చందా దగ్గరకి వచ్చింది. అయితే సురేష్ చందా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోగ్యశ్రీకి ఐఏఎస్‌ స్థాయి అధికారే సీఈవోగా ఉండాలని.. మొదటి నుండి ఈ ట్రస్టుకు ఐఏఎస్ అధికారులే సీఈవో గా వ్యవహరిస్తున్నారని.. ఈ పోస్టుకు ఐఏఎస్‌ పేరును పరిశీలించాల్సిందిగా అభిప్రాయాన్ని ఫైల్‌లో వ్యక్తం చేస్తూ ఫైల్‌ను తిరిగి పంపించారు.

cm Kcr

జీహెచ్‌ఎంసీ కార్మికులకు కేసీఆర్ వరాలు

  మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని వారం రోజులకు పైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి చేసిన డిమాండ్ లకు సీఎం కేసీఆర్ ఒప్పుకోవడంతో నిన్న సమ్మె విరమించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి జీతాల పెంపుతో పాటు కొన్ని వరాలు కూడా ప్రకటించడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వందే అని.. జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగే కొద్దీ కార్మికుల జీతాలు పెంచుతామని హామీఇచ్చారు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆర్టీసీ కార్మికులకు పెంచిన వేతనాలకుంటే ఇప్పుడు జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఎక్కువ వేతనాలు పెంచామని తెలిపారు. అంతేకాక కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని దశలవారీగా, ఉచితంగా చేపడతామని.. ముందుగా అసలు ఇల్లు లేని వారికి ప్రాధాన్యం ఇస్తామని.. ప్రతి సంవత్సరం కనీసం వెయ్యి మందికిపైగా కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి, ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్నీ బాగానే ఉన్నా ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు మున్సిపల్ కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల హస్తముందని కేసీఆర్ అనడం గమనార్హం.

Ap Special Status

నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యం! సుజనా

  ఏపీ ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని.. ఇవ్వదని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని.. 60 శాతం చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. విభజన వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని.. రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడుకోవాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. కాగా పపన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ ఎంపిల పనితీరుపై సూచన చేశారని, ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాదులో సెక్షన్-8 అమలుపై కేంద్రానికి మరోసారి విన్నవించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.

phone tapping

జుట్టూ జుట్టూ ముడేసిన కేంద్రం

  * ఇరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు * పరోక్షంగా ట్యాపింగ్ ధ్రువీకరణ * కాల్‌ డేటా రికార్డులు ఇవ్వాల్సిందే కొన్ని రోజులుగా సద్దుమణిగి ఉన్న ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఒక రాష్ట్రం మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అంటుంటే.. మరో రాష్ట్రం ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని ఎప్పటినుండో వాదించుకుంటున్నాయి అది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇదే విషయంలో ఎవరి ఆదేశాల మేరకు తమ ఫోన్లు ట్యాప్‌ చేశారో చెప్పాలంటూ.. కాల్ డేటా ఇవ్వాలంటూ సర్వీసు ప్రొవైడర్లకి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వవద్దని డేటా ఇస్తే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఏం చేయాలో తెలినీ పరిస్థితిలో సర్వీసు ప్రొవైడర్లు కేంద్రం శరణం కోరారు.   ఇక్కడి వరకూ బానే ఉన్నా అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. ఈ విషయంలో కేంద్రం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి పరిస్థితిని ఇంకా తీవ్ర తరం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సర్వీసు ప్రొవైడర్లు కేంద్రం సహాయం కోరగా.. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే అధికారికంగానే సర్వీస్‌ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పడుతూ కేంద్రం లేఖ రాసింది. ట్యాపింగ్ డేటా సర్వీసు ప్రొవైడర్ల వద్ద లేదు.. నిఘా వర్గాల వద్ద మాత్రమే ఉంది అంటూ పేర్కొంది. అంటే కేంద్ర చెప్పిన దాని బట్టి చూస్తే ట్యాపింగ్ జరగడం నిజమే అని అర్ధమవుతోంది. మరోవైపు ‘ప్రభుత్వాలు సంయమనంతో చట్టాలకు లోబడి వ్యవహరించాలి’ అని సూచిస్తూ తెలంగాణకు మరో లేఖ పంపింది. ఇప్పుడు కేంద్రం ఇరు ప్రభుత్వాలకు రాసిన లేఖల వల్ల తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం అవుతోంది.   అయితే ఇప్పుడు కేంద్రం పంపిన లేఖల ఆధారంగా సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం విజయవాడ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టుకు తాము కాల్‌ డేటా రికార్డులు ఇవ్వక్కర్లేదన్నారు. అయితే కోర్టు దీనిని పూర్తిగా వ్యతిరేకించి రికార్డులు ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించింది. పాలనా వ్యవహారాలు వేరు, కోర్టులు వేరని తెలిపింది. మొత్తానికి కేంద్ర వ్యవహారం మళ్లీ జుట్టూ, జుట్టూ ముడేసి తేల్చుకోండి అన్నట్టు ఉంది.

baahubali

సినిమాను తలపించిన మరో బాహుబలి

  ఈనెల 10న బాహుబలి సినిమా విడుదలైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మీరు కూడా సినిమా చూసే ఉంటారు. అయితే అందులో రమ్యకృష్ణ పాత్ర గుర్తుంది కదా.. అందులో శివగామిగా నటించిన రమ్యకృష్ణ అత్యంత సాహసంతో రమ్యకృష్ణ అత్యంత సాహసంతో ఒక చేతిలో శిశువును పట్టుకుని వాగు దాటిస్తుంది. సరిగ్గా అటువంటి సన్నివేశాన్నే తలపించేలా రాజమండ్రిలోని పుష్కరఘాట్ లో దర్శనమిచ్చింది. గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో పుష్కర స్నానానికి రాజమండ్రికి వచ్చిన ఓ భక్తుడు బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ చేసిన విధంగా ఓ పాపను చేత్తో పైకెత్తి కెమెరా కంటికి చిక్కాడు.

T congress leaders

టీ కాంగ్రెస్ నేతలు అరెస్ట్

  మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న నేపథ్యంలో పలు పార్టీలు వారికి మద్ధతుగా నిలిచాయి. దీనిలో భాగంగానే వామపక్షాలు బంద్ పిలుపునిచ్చాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ వద్ద దర్నకు దిగారు. మున్సిపలు కార్మికుల వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత దానం నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పటికి వారం రోజుల పైనుండి కార్మికులు సమ్మె చేస్తున్నా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. ఆయన వ్యవహారం దున్నపోతు మీద నీళ్లు పోసిన చందంగా ఉందని అన్నారు. బంగారు తెలంగాణ చేయడమేమోగాని నగరాన్ని చెత్త నగరంగా మార్చారని ఎద్దేవ చేశారు. దీనిలో భాగంగానే సెక్రటేరియట్ ను ముట్టడించడానికి ప్రయత్నించగా పోలీసుల అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వివాదం జరగింది. దాంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల, షబ్బీర్ అలీ ఇంకా పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

vote for note

సర్వీస్ ప్రొవైడర్లది కోర్టు ధిక్కారం

  ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై ఈ రోజులో వాదనలు జరిగాయి. అయితే వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వద్దని మెమో ఫైల్‌ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించిందని, అందుకే కాల్‌డేటా ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ల తీరును అడ్వకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌ తప్పుబట్టారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని కానీ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఈ కేసులో కాల్ డేటా ఇవ్వకపోవడం నేరమని.. కోర్టు అడిగిన సమాధానం ఇవ్వకపోవడం కోర్టు ధిక్కారం అవుతుందని.. ఇది ఐపీసీ 174 సెక్షన్‌ కింద నేరమని అన్నారు. అనంతరం సర్వీస్ ప్రొవైడర్లు తరపు న్యాయవాది తమకు డేటా ఇవ్వాల్లా వద్దా అన్న విషయాన్ని పరిశీలించేందుకు వారం రోజుల సమయం కావాలని కోర్టును కోరారు.

సేవాపథంలో కంఠంనేని రవిశంకర్

కృష్ణాజిల్లాలో, అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రముఖ తెలుగుదేశం నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రముఖ సంఘ సేవకుడిగా మంచి గుర్తింపు వున్న తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ సమస్యల్లో వున్నవారిని ఆదుకునే విషయంలో నేనున్నాను అంటూ అండగా నిలుస్తూ వుంటారు. ఆయనకున్న ఈ తత్వమే ఆయన్ని ప్రజల మనిషిగా నిలబెట్టింది. ఆయన సేవానిరతి దివిసీమ ప్రాంతంలో ఆయనను ఒక మంచి నాయకుడినిచేసింది. సమస్యల్లో వున్నవారికి ఒక భరోసా, ఒక ఓదార్పు, ఒక మంచి మాట ధైర్యాన్ని ఇస్తూ వుంటుంది. అలాంటి ధైర్యాన్ని ఇవ్వడంలో, నేనున్నానని అండగా నిలవటంలో కంఠంనేని రవిశంకర్‌ ఎప్పుడూ ముందుంటారు. కృష్ణాజిల్లా  చల్లపల్లిలో యస్.సి.బాలికల హాస్టల్లో ఈనెల 16వ తేదీన కలుషిత ఆహారాన్ని తిన్న ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కంఠంనేని రవిశంకర్ సదరు హాస్టల్‌ని సందర్శించారు. అక్కడి బాలికలకు పండ్లు పంపిణీ చేశారు. హాస్టల్‌లో పరిస్థితులను అక్కడి వార్డెన్‌ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చల్లపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆరుగురు బాలికలను ఆయన పరామర్శించి పండ్లు పండ్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంఠంనేని శివశంకర్, చల్లపల్లి సర్పంచ్, యార్లగడ్డ శ్రీనివాసరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కృష్ణాజిల్లా కోడూరు మండలం పెదగుడిమోటు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అబ్దుల్ కలాం  ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు కంఠంనేని రవిశంకర్ అబ్దుల్ కలాం కుమారుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇమ్రాన్‌ను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయినదని ఆవేదన వ్యక్తంచేశారు. కంఠంనేని రవిశంకర్ పెదగుడిమోటు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ గ్రామంలోని మహిళలు వృద్ధులు తండోప తండాలుగా ఆయనను చూడటానికి వచ్చారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ గ్రామస్తులకు ఏ విధమైన వైద్యపరమైన సహాయం కావలసి వచ్చినా తాను చేయిస్తానని కంఠంనేని రవిశంకర్ వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటారని ఆయన ఈ సందర్బంగా అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో  కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంఠంనేని శివశంకర్, కోడూరు జడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, బండే నాగరాజు, జరుగు వెంకటేశ్వరరావు, పరిసే నాగమల్లేశ్వరరావు, ఉప్పాల పోతురాజు, కడవకొల్లు నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా చేస్తాం. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రకాష్ దేవకర్ కొత్తూరు తాడేపల్లిలో వనమహోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్టుపై మమకారం పెంచుకోవాలని.. చెట్టుతో మనిషికి అవినాభావ సంబంధం ఉందని.. పర్యావరణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఏపీ రాజధాని అయిన అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా అభివృద్ది చేస్తామని.. 15 నగర వనాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ జవదేకర్‌ మాట్లాడుతూ కొల్లేరు పక్షులనే కాదు....ప్రజలనూ కాపాడాల్సిన అవసరముందని అన్నారు. చట్టాలను సవరణ చేసైనా ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వేం నరేందర్ రెడ్డి డ్రైవర్లని ప్రశ్నిస్తున్న ఏసిబి అధికారులు

  ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారులు తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ వరుసగా రెండు రోజులు ప్రశ్నించిన తరువాత ఈరోజు ఆయన ఇద్దరు డ్రైవర్లని ప్రశ్నిస్తున్నారు. వారిరువురికి కూడా సెక్షన్: 160సి.ఆర్.పి.సి క్రింద నోటీసులు జారీ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే వారివురు వేం నరేందర్ రెడ్డికి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు తప్ప వారికి ఈ ఓటుకి నోటు కేసులో నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా సమాచారం లేదు. అంటే ఈ కేసులో వారిరురు కేవలం సాక్షులు మాత్రమేనని అర్ధమవుతోంది. అటువంటప్పుడు వారికి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే వీలు కల్పించే సెక్షన్: 160 క్రింద నోటీసులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సండ్ర వెంకట వీరయ్యను విడుదల చేసాక మొదట కృష్ణ కీర్తన్ కి, ఆ తరువాత వేం నరేందర్ రెడ్డి యొక్క ఇరువురు కారు డ్రైవర్లకి ఏసిబి అధికారులు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్నారు. బహుశః ఈ కేసును వీలయినంత కాలం కొనసాగిస్తూ తెదేపాని నిరంతర ఒత్తిడికి గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.