నేను కాదు చంపింది... గుట్టువిప్పిన ఇంద్రాణి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది, ఈ కేసులో అరెస్టయిన షీనా బోరా తల్లి ఇంద్రాణి గుట్టువిప్పింది, ఇప్పటివరకూ విచారణకు సరిగా సహకరించడం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి...నోరు విప్పి కొత్త విషయాలు తెలియజేసింది, షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నానే ఆమెను కడతేర్చాడని చెప్పుకొచ్చింది. ఒకసారి సంజీవ్ ఖన్నాతో విందుకు షీనాను తీసుకెళ్లానని, అయితే తన ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జీ కుమారుడితో షీనా సంబంధం పెట్టుకోవడం సంజీవ్ తట్టుకోలేకపోయాడని, అందుకే డ్రైవర్ తో కలిసి షీనాను సంజీవ్ ఖన్నా చంపేశాడని సీబీఐకి తెలిపింది.