జగన్ ప్రాణాలు పణంగా పెట్టొద్దు.. దిగ్విజయ్
posted on Oct 13, 2015 @ 6:15PM
జగన్ చేస్తున్న దీక్షకు రాష్ట్ర పార్టీల నేతలతో పాటు అటు తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ పార్టీ వ్యవహాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి తను సొంతగా పార్టీ పెట్టుకున్నా.. పార్టీ పరంగా ఎలాంటి రాజకీయ విభేదాలున్నా తను చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం జగన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టొద్దని.. హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తానని మోదీ చెపుతున్నారు.. అసలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా ఎలా ఇస్తారని ప్రశ్సించారు. కేసీఆర్ తన కుటుంబంకోసమే పాలన సాగిస్తున్నట్టు ఉంది కాని రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవడం లేదని.. కాని రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందని అన్నారు.