రేపు సాయంత్రం ‘కళ్లు చిదంబరం‘ అంత్యక్రియలు
ప్రముఖ సినీనటుడు కళ్లు చిదంబరం కన్నుమూశారు, శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ కేర్ ఆస్పత్రిలో చేరిన కళ్లు చిదంబరం... చికిత్స పొందుతూ మరణించారు. సుమారు 300 సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం వయసు 70ఏళ్లు, ఈయన అసలు పేరు కొల్లూరు చిదంబరం, అయితే ‘కళ్లు‘ సినిమాలో తొలిసారి నటించడంతో కళ్లు చిదంబరంగా ప్రాచుర్యం పొందారు. అనేక విజయవంతమైన సినిమాల్లో నటించిన కళ్లు చిదంబరం... విశాఖ పోర్టులో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ... నాటక రంగం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చారు, 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించిన కొల్లూరు చిదంబరం... తన మొదటి సినిమా ‘కళ్లు‘నే ఇంటి పేరుగా మార్చుకుని గుర్తింపు పొందారు, ఆయన నటించిన సినిమాల్లో కళ్లు, అమ్మోరు, పెళ్లిపందిరి, మనీ, చంటి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు, ఏప్రిల్ 1 విడుదల సినిమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి, కళ్లు చిదంబరం అంత్యక్రియలు రేపు సాయంత్రం విశాఖపట్నం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.