APSRTC

మే 14న ఏపియస్ ఆర్టీసి విభజన

  దాదాపు 11 నెలల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. కానీ నేటికీ ఏపియస్.ఆర్టీసి సంస్థ ఉమ్మడి పాలనలోనే నడుస్తోంది. ఆర్టీసి విభజన ప్రక్రియ కూడా ఒక కొలిక్కి రావడంతో వచ్చే నెల 14నుండి ఆంద్ర, తెలంగాణా ఆర్టీసీలు వేర్వేరుగా నిర్వహించేందుకు ఏపియస్.ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ యన్. సాంబశివరావు నిన్న ఉత్తర్వులు జారీ చేసారు. మే14నుండి ఆంద్ర, తెలంగాణా ఆర్టీసీలు వేర్వేరు కార్పోరేషన్లుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. హైదరాబాద్ లో గల ఆర్టీసీ భవన్ లో ‘ఏ’ బ్లాకును ఏపియస్.ఆర్టీసికి, ‘బి’ బ్లాకును తెలంగాణా స్టేట్ ఆర్టీసికి కేటాయించారు. రెండు సంస్థలు మే 14నుండి రెండు సంస్థలు వేర్వేరుగా రికార్డులు నిర్వహించుకొంటాయి. కానీ రెండు కార్పోరేషన్ల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు ఇంకా పూర్తికావలసి ఉంది. ప్రస్తుతం ఆర్టీసిలో 1.19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 61 వేల మంది ఉద్యోగులను, తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 58వేల మంది ఉద్యోగులను దశల వారిగా కేటాయించబడ్డారు. అదేవిధంగా ఏపియస్.ఆర్టీసికి 404 ఉన్నతాధికారులను, తెలంగాణా ఆర్టీసీకి 197మందిని కేటాయించారు.

earthquake

రాహుల్ వల్లే భూకంపం వచ్చిందా?

  జీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హరిద్వార్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీ బీఫ్ (ఆవు మాంసం) తిని తనను తాను శుద్ధి చేసుకోకుండా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించినందుకే నేపాల్, భారత్ లో భూకంపం వచ్చిందని విమర్శించారు. సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధికార ప్రతినిధి సుస్మితా దేవ్ మాట్లాడుతూ... ఇంతకు ముందు ఆడవాళ్లు 10 మంది పిల్లల్ని కనాలి, కుక్కల మాదిరి పిల్లల్పి కనకుండా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వల్లే భూకంపం వచ్చిందని అర్ధరహితంగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

Jitender Singh Tomar

ఆ మంత్రి... పెద్ద కంత్రి

  కంచే చేను మేస్తే ఎలా ఉంటుంది? న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తూ అన్యాయం చేయడంలా ఉంటుంది. అలాంటి న్యాయశాఖ మంత్రి అన్యాయం లేటెస్ట్గ్ గా బయటపడింది. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ బీహార్ లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు చూపించిన సర్టిఫికెట్లు నకిలీవని యూనివర్శిటీ స్పష్టం చేసింది. ఆ సీరియల్ నెంబరుతో వేరే వ్యక్తి ఉన్నారని తెలిపింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హతల్ని ప్రశ్నిస్తూ దీనిపై ఆగష్టు 20 వ తేదీలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఇక తోమర్ చేసిన పనికి ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఆప్ బహిష్కృత నేత ప్రశాంత్ భూషణ్ తోమర్ ను వెంటనే పార్టీ నుండి తొలగించకపోతే తాము ఢిల్లీ సెక్రటేరియట్ ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. దీంతో కేజ్రీవాల్ జితేందర్ సింగ్ తోమర్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. కాని జితేందర్ సింగ్ మాత్రం ఈ వాదనలన్నీ తోసిపుచ్చి, తన సర్టిఫికెట్ వందశాతం నిజమైనదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

ranabheer kapoor

పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన రణబీర్

  బాలీవుడ్ లో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ల ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి, వారి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. అయితే ఎప్పుడూ వార్తల్లో వినడం తప్ప వాళ్లు నోరు విప్పి చెప్పడం మాత్రం చాలా తక్కువ. అయితే రణబీర్ కపూర్ వారి ప్రేమ విషయంపై విలేకర్ల ముందు మాట్లాడాడు. ఆరేళ్లుగా మీడియా నా పెళ్లి గురించి ఏదో ఒకటి రాస్తూనే ఉందని, దయచేసి ఇకనైనా ఊహాగానాలు ఆపి రాయడం మానేయండని అన్నాడు. ప్రస్తుతం ప్రేమలో ఉన్నా, అది ఆస్వాదిస్తున్నా అప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పారు. ఒక వేళ చేసుకున్నా అందరికీ చెప్పి చేసుకుంటా, రహస్యంగా మాత్రం చేసుకోను ఎందుకంటే అది కుటుంబ వేడుకు అని అన్నాడు. పాపం వార్తలతో విసిగెత్తిపోయాడేమో రణబీర్ ఈ రకంగా క్లారిటీ ఇచ్చాడు.

nepal earth quake

వీళ్లు మనుషులేనా.. అక్కడ కూడా సెల్పీలా?

  ఈ రోజుల్లో సెల్ఫీల గోల మరీ ఎక్కువైపోయింది. ఎక్కడికెళ్లినా టపీ మని ఒక సెల్ఫీ తీసుకోవడం దానిని ఫెస్ బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ చేయడం. ఇలా టపీ మనీ సెల్ఫీ తీసుకుంటూ టపీ మని టపా కట్టేసినోళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే.. కఠ్మాండులో భూకంపం వచ్చి బాధితులు తినడానికి తిండి, నీళ్లు, బట్టలు లేక అల్లాడిపోతుంటే ఒక పక్క సెల్పీల గోల మొదలైంది. కఠ్మాండులోని చారిత్రక ధారాహర టవర్ భూకంపం వల్ల కుప్పకూలిపోయింది. చారిత్రక కట్టడం అంటూ అక్కడికి వచ్చిన వారంతా శిథిలాలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకొని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక వైపు భూకంప బాధితులు బాధపడుతుంటే, ఇక్కడికి వచ్చిన వారు నవ్వుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు.

kerala cm

సీఎంకి హాలీవుడ్ నటి ఈ-మెయిల్

  హాలీవుడ్ నటి కేరళ ముఖ్యమంత్రికి ఉమెన్ చాందీ, కోచ్చి దేవస్థానం బోర్డు ప్రెసిండెంట్ కు ఈమెయిల్ చేసింది. హాలీవుడ్ నటి ఏంటీ కేరళ ముఖ్యమంత్రికి ఈ మెయిల్ చేయడమేంటి... ఇంతకీ ఆ ఈ మెయిల్ లో ఏముందనుకుంటున్నారా... హాలీవుడ్ నటి పమేలా అండర్ సన్ జంతు హక్కుల ఉద్యమకర్త. అయితే బుధవారం కేరళలో జరగబోయే చారిత్రక త్రిస్పూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులు వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారుచేసిన బొమ్మలను ఉపయోగించాలని ఈమెయిల్ లో కోరింది. ఉత్సవం కారణంగా ఏనుగులను గొలుసులతో కట్టేసి ఎండలో తిప్పడం సబబు కాదని అన్నది. నిర్భందించిన ఏనుగులని ఉపయోగించడాన్ని భారత్తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలిసిందే.. అని పమేలా అండర్ సన్ ముఖ్యమంత్రికి రాసిన ఈమెయిల్ లో పేర్కొన్నారు. పమేలా అండర్ సన్ నుంచి మెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి తిరువనంతపురం తిరిగి రాగానే ఈ విషయం పై చర్చిస్తామని అధికారులు చెప్పారు.

Nepal

4,350 దాటిన నేపాల్ మృతులు

  నేపాల్ లో భూకంపం తాకిడిలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి వీరి సంఖ్య 4,350 కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా తినడానికి ఆహారం, నీరు, మందులు, కరెంటు లేక ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. నేపాల్ ప్రభుత్వ ఉన్నతాధికారి లీలామణిపౌడెల్ విలేకర్లతో మాట్లాడుతూ బాధితులకు కావలసిన పొడిసరుకులు, టెంట్లు, బ్లాంకెట్లు, మందులు, ప్రత్యేక సామాగ్రి, వైద్య బృందాలను పంపిచాల్సిందిగా విదేశాలను కోరుతున్నామని తెలిపారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు సహాయకబృందాలను పంపిచాయి. అయితే సహాయచర్యలకు వర్షం పెద్ద ఆటంకంగా మారింది. విదేశాల నుండి వచ్చిన అత్యాధునిక పరికరాలు, జాగిలాల సహాయంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ ను ఆదుకోవడానికి ఒక నెల వేతనం ఇవ్వాలని ప్రతిపాదన చేయగా లోక్ సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో వారి ఒక నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు నిర్ణయించుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ తన నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు.

producer c.kalyan

లేడీ డాక్టర్ని కొట్టిన సి.కల్యాణ్

  టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ ఈసారి మరో వివాదం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. సి.కల్యాణ్ తనపై చేయి చేసుకున్నారంటూ కవిత అనే ఓ మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సి. కల్యాణ్, డాక్టర్ కవిత ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో వీరిద్దరికి వివాదం జరిగింది, అదికాక మెట్రోరైలు నష్టపరిహారం విషయంలో కూడా వీరికి వాగ్వాదం జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ కారణంగా తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి కూడా చేసుకున్నారని డాక్టర్ కవిత జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు సి. కల్యాణ్పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

TTD Board

టీటీడీ చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి

  తెదేపా మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు డా. కె. రాఘవేంద్ర రావు పేరు కూడా పాలకమండలి సభ్యుడిగా ఖరారయింది. తెలంగాణా నుండి ఇద్దరు యం.యల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సాయన్నలను పాలక మండలి సభ్యులుగా నియమించబడ్డారు. వీరు గాక ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, బాల వీరాంజనేయ స్వామి, కోళ్ల లలిత కుమారి సభ్యులుగా నియమింపబడ్డారు. పుట్ట సుధాకర్ యాదవ్, పి. హరిప్రసాద్, రవి నారాయణ్, భాను ప్రకాష్ రెడ్డి, దండు శివరామరాజు, వైటి రాజ, ఏవి రమణ, జె.శేఖర్, వి.కృస్ణమూర్తి మరియు డిపి అనంత్ పాలక మండలి సభ్యులుగా నియమించబడ్డారు. ఈరోజు రాత్రి లేదా మంగళవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చును.

Mallu Bhatti vikramarka

హైదరాబాద్‌ని అమ్మేస్తారు

  జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై సోమవారం ఎల్బీనగర్ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అమలు చేయడానికి వీలుకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను కూడా అమ్మకానికి పెడుతోందని, సెక్రటేరియట్ ను కూడా ప్రవేటు సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు రావాలని సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో రాజకీయ వలసలను ప్రోత్సహించిందే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

150 ఏళ్లు బతుకుతా

  పెళ్లి చేసుకోకుండా 150 ఏళ్లు బతుకుతానని యాంటీ ఏజింగ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ అలెక్స జావోరొంకోవ్ అంటున్నారు. ప్రస్తుతం అలెక్స్ బ్రిటన్‌లోని బయోజెరంటాలోజీ రీసెర్చ్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి, పిల్లలు అనే బాధ్యతలు లేకుండా క్రమం తప్పకుండా వ్యాయామం, వృద్దాపాన్యాన్ని అరికట్టే మందులు తీసుకుంటూ 150 ఏళ్లు జీవిస్తానని తెలిపారు. జీవితం మొత్తాన్ని ఏజింగ్ ను అరికట్టే ప్రయోగాలకే అంకితం చేస్తానని అన్నారు. ఇప్పటికే ఏజింగ్ ను అరికట్టే ప్రయోగాలన్నీ విజయం సాధించాయని అవి మందుల రూపంలో రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో జన్యువుల చికిత్సకు సంబంధించిన వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని, వాటిని కూడా తాను తీసుకుంటానని చెప్పారు. బ్రిటన్ లో అనేక ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల ఆయుషు ప్రమాణం పెరిగిందని చెప్పారు.

నేపాల్‌లో తెలుగు నటుడు మృతి

  నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో నేపాల్‌కి సినిమా షూటింగ్ కోసం వెళ్ళిన విజయ్ (25) అనే నటుడు, నృత్య దర్శకుడు దుర్మరణం పాలయ్యారు. ‘ఎటకారం’ అనే సినిమా షూటింగ్ కోసం యూనిట్ నేపాల్‌కి వెళ్లింది. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా హఠాత్తుగా భూకంపం రావడంతో వారు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సినిమాలో హీరోగా చేస్తున్న విజయ్ అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒక పాటకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఉన్నప్పుడు భూప్రకంపనలు రావడంతో వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, అందువల్ల ప్రమదం నుండి బయటపడ్డామని కొంతమంది చిత్ర సిబ్బంది సమాచారమిచ్చారు. విజయ్ మృతదేహం భారత్ కు రప్పించే ప్రయాత్నాలలో ఉన్నారు.

హీరోయిన్ నగ్న వీడియో లీక్

  హీరోయిన్ రాధికా ఆప్టే నగ్న వీడియోలు లీక్ అయ్యాయి. ఇటీవల ఆమె అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న 20 నిమిషాల నిడివి వున్న షార్ట్ ఫిలింలో నటించింది. అందులో ఆమె నగ్నంగా నటించిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ నగ్న దృశ్యాలు లీక్ అయ్యాయని దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాధికా ఆప్టే నగ్న దృశ్యాలు ఆదివారం నుంచి వాట్సప్ తదితర సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య కూడా రాధికా ఆప్టే బాత్రూమ్ సన్నివేశాలు అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ‌హల్‌చల్ చేశాయి. అప్పుడు రాధికా ఆప్టే ఆ వీడియోలలో వున్నది తాను కాదని ఖండించింది. ఇప్పుడు ఆమె నగ్న దృశ్యాలు లీకయ్యాయి. అయినా ఈ విషయంలో రాధికా ఆప్టే బాధపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే నటించడానికి లేని బాధ లీకైతే ఎందుకట?