చంద్రబాబును పొగిడేసిన జానారెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు అందిస్తున్ననేపథ్యంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ జానారెడ్డిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా జానారెడ్డి చంద్రబాబును ప్రశంసించారు. ఏపీ రాజధాని కోసం చంద్రబాబు చేస్తున్న కృషి, పట్టుదల ఎనలేనిదని.. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు బాగా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా జానారెడ్డిని కలిసిన మంత్రులు కూడా జానారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించారని.. రాజధాని శంకుస్థాపనకు వస్తానని చెప్పారని అన్నారు. కానీ ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మాత్రం రానంటున్నారని జగన్ ఇంత మూర్ఖుడు అని అనుకోలేదని వారు అన్నారు.

ఏపీ రాజధానికి తెలంగాణ కళాకారుల విరాళాలు..

ఏపీ రాజధాని అమరావతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఇప్పటికే  నా ఇటుక - నా అమరావతి పేరు మీద వెబ్ సైట్ డిజైన్ చేసి విరాళాలు సేకరిస్తున్నసంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ప్రారంభించిన తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో విరాళాలు సేకరించడానికి నడుంబిగించారు కళాకారలు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విరాళాల సేకరణకు పూనుకుంది తెలంగాణ కళాకారులు కావడం. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ నేతృత్వంలో..  ''ఆర్ట్ బియాండ్ బౌండరీస్'' పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు ఏర్పాటు చేసే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తెలంగాణకు చెందిన చిత్రకారులూ పాల్గొంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ - బైరు రఘురాం - చిప్ప సుధాకర్ - డి.కవిత - కె.కిషన్ - ఎల్.సరస్వతి - శ్రీకాంత్ తదితరులు ఇక్కడి నిర్వహించే వర్క్ షాప్ లో పాల్గొని తమ చిత్రాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు. వాటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నారు. ఏదిఏమైనా ఏపీ రాజధాని నిర్మాణానికి తెలంగాణ వాదులు పాల్గొని విరాళాలు సేకరించడం మెచ్చుకోదగ్గ విషయమే.

ఆయనకే అర్ధమయింది.. జానారెడ్డికి అర్ధంకాలేదు.. కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు నల్లగొండ జిల్లా పానగల్లు ఉదయసముద్రం దగ్గర వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, లకా్ష్మరెడ్డిలు శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉత్తర ప్రదేశ్ మంత్రి అఖిలేష్ యాదవ్ కు అర్ధమైంది కాని ప్రతిపక్ష నేత జానారెడ్డికి మాత్రం అర్ధం కావడంలేదని  అన్నారు. ఇంటింటికీ నీరు అందిస్తామని మేమంటుంటే.. ప్రతిపక్షాలు కాళ్లకు కట్టెలు పెట్టి అడ్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రజలు నమ్మరని.. వారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని.. వారి సన్నాయి నొక్కులను ప్రజలు పట్టించుకోరని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రైతు సమస్యలపై ఓ రభస చేస్తున్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు, టీడీపీ 17 ఏళ్లు పాలించాయి..ఇన్నేళ్లు పాలనలో ఉండి రైతులకు ఏం చేశారు.. వారి వల్ల రైతులకు ఇన్ని సమస్యలు వచ్చాయి అని ఎద్దేవ చేశారు. రైతు సమస్యలపై చర్యలు తీసుకుంటున్నామని.. వారి సమస్యలు తీర్చే బాధ్యత మాపై ఉందని.. అందుకే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

కేసీఆర్ ను పిలిచినట్టు జగన్ ను పిలవొచ్చుగా.. ఉమ్మారెడ్డి

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలికే నేపథ్యంలో కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే చంద్రబాబు సీఎంవో ఆఫీసు నుండి ఆధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంఓ ఆఫీసుకు ఫోన్ చేసి మరీ అపాంయింట్ మెంట్ అడిగారు. అయితే దీనిపై వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిని ఇంటికి వెళ్లి పిలిచినట్టు.. చంద్రబాబు జగన్ ను కూడా స్వయంగా వెళ్లి పిలవచ్చు కదా అని ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ ను అపాంయింట్ మెంట్ కోరినట్టు జగన్ కు కూడా కోరవచ్చు కదా అని అన్నారు. తన ఆరోగ్యం సరిగా లేకనే మంత్రులను కలవలేకపోయారని అని తెలిపారు. ఒకవేళ శంకుస్థాపనకు కనుక వెళితే మోదీ పక్కన కూర్చోబెడతారా.. తమ ప్రాధాన్యాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న మోడీ తమకు మాట్లాడే అవకాశం అవకాశం ఇవ్వాలని కోరారు.

మోడీకి జగన్ లేఖ.. ఆలోపు కలవడానికి సమయం ఇవ్వండి

ఒక పక్క ఏపీ శంకుస్థాపన కార్యక్రమాలతో సీఎం చంద్రబాబు బిజీగా ఉంటే మరోపక్క ఏపీ ప్రతిపక్షనేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖలు రాస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే జగన్ చంద్రబాబుకు తనను శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. మళ్లీ రాలేదని విమర్శించవద్దని లేఖ రాశారు. అయినా చంద్రబాబు మాత్రం తమ బాధ్యతగా మంత్రులకు జగన్ ను పిలవమని ఆదేశించారు. అయితే జగన్ ఈ రోజు మళ్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న జరగబోయే ఏపీ శంకుస్థాపన కార్యక్రమం జరిగే లోపు తనను కలవడానికి సమయం ఇవ్వాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ చెప్పారని.. ఇప్పుడు ప్రత్యేక హోదాపై చర్చించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీ మంత్రలు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను శంకుస్థాపన కార్యక్రమానికి పిలవడానికి తనను కలిసేందుకు సమయం ఇవ్వడంలేదని.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లడటానికి అవకాశం ఇవ్వడంలేదని మండిపడుతున్నారు.

కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు

  ఏపీ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తానన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్ ను కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబు కార్యలయం నుండి అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఈనెల 22న జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ని ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన మంత్రులు.. రావొచ్చు..! రాకపోవచ్చు..!

ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు ప్రారంభమయ్యాయి. ఏపీ మంత్రులు మంత్రులు అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, టిడి జనార్ధన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరిని ఇతర పార్టీ నేతలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు. దీనిలో భాగంగానే వీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం అయన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ నానక్‌రాంగూడలో సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను కలిసి శంకుస్థాపనకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి నాకు రావాలని ఉంది కానీ ఆసమయంలో షూటింగ్ నిమిత్తం గుజరాత్ వెళ్లవచ్చు అని అన్నారు. తాను వచ్చేది రానిది షూటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కాగా ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్ లా కాకూడదని ఆయన అన్నారు. అంతేకాదు ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఆయనను కలవడం సరికాదని.. గొడవల ఎల్లకాలం ముందుకు సాగలేమని.. సామరస్య వాతావరణం ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. కాగా శంకుస్థాపనకు వచ్చి రాజధానికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అందించాలని మంత్రులు కోరారు. అంతేకాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడతారని తెలిపారు.

"నా ఇటుక - నా అమరావతి".. ఇచ్చేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనే ఉద్యేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన "నా ఇటుక - నా అమరావతి" కి అనూహ్య స్పందని లభించింది. గురువారం చంద్రబాబు చేతుల మీదుగా "నా ఇటుక - నా అమరావతి" పేరుతో ప్రారంభించిన వైబ్ సైటుకు తక్కువ కాలంలోనే ఎక్కువ విరాళాలు పొందారు. శనివారం ఉదయానికి 15వేల మంది ఇటుకల్ని దానం చేశారు. ఇప్పటివరకూ దానం చేసిన ఇటుకల సంఖ్య 10 లక్షలు దాటింది. అయితే ఈ రాజధానికి ఒక్క ఏపీ, తెలంగాణ వారు మాత్రమే కాదు.. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమవంతుగా విరాళాలు అందించడం గమనార్హం. అంతేకాదు ఉదయం, మద్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా విరాళాలు అందిస్తున్నారు. కాగా ఏపీ క్రెడా అందించిన విరాళాన్ని ఇప్పటివరకూ ఎవరూ క్రాస్ చేయలేదు.  ఏపీ క్రెడా 52200 ఇటుకల్ని విరాళంగా ఇచ్చింది. క్రెడా తర్వాతి స్థానంలో ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి 10116 ఇటుకల్ని, తర్వాతి స్థానంలో  గిరిధర్ అనంత 6000 ఇటుకల్ని విరాళం ఇవ్వగా.. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వెబ్ సైట్ స్టార్ట్ చేసిన సమయం నుంచి ఇప్పటివరకూ దీనిని 5 లక్షల మంది చూడగా కేవలం 15 వేల మంది మాత్రమే విరాళాలు ఇవ్వడం ఆశ్చర్యకరం.

ఏపీ శంకుస్థాపన ఆహ్వానాలు.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తని జగన్

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనను శంకుస్థాపనకు పిలవద్దని, పిలిచినా రానని.. మళ్లీ రాలేదని విమర్శించొద్దని చెప్పి బహిరంగంగా లేఖ రాసిన సంగతి తెలసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తను వచ్చినా రాకపోయినా పిలవడం తమ బాధ్యత అని జగన్ ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్ మాత్రం ఏపీ మంత్రులకు అందుబాటులోకి రావడం లేదట. ఏపీ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఆహ్వానాలు మొదలయ్యాయి. కామినేని శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు, టిడి జనార్ధన్‌లు అన్ని పార్టీ నేతలను ఆహ్వానించే బాధ్యత తీసుకున్నారు.  ఇప్పటికే వీరు ఇతర పార్టీ నేతలకు ఆహ్వానాలు కూడా పంపారు. దీనిలో భాగంగానే.. చంద్రబాబు ఆదేశాల మేరకు జగన్ ను కూడా ఆహ్వానించేందుకు మంత్రులు జగన్ కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా జగన్ మాత్రం అందుబాటులోకి రావడం లేదట. అంతేకాదు ఆయన పీఏకు ఫోన్ చేసినా ఆయన నుండి కూడా ఎటువంటి స్పందన లేదట. దీంతో మంత్రులు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తప్పకుండా శంకుస్థాపనకు రావాలని.. రానని మొండి పట్టు పట్టకుండా పరిస్థితి అర్ధం చేసుకోవాలని సూచించారు. మొత్తానికి జగన్ తాను అనుకున్నట్టుగానే శంకుస్థాపనకు నిజంగానే వెళ్లనట్టు కనిపిస్తుంది.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

  ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపాళెం శివారులో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రకాశం జిల్లా పుట్లూరు మండటం చేవూరు నుంచి డీసీఎంలో మాలకొండ వెళుతున్న పెళ్లి బృందాన్ని ఎదురుగా వస్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ కు చెందిన ప్రైవైటు బస్సు ఢీ కొంది. దీంతో డీసీఎం బస్సు క్యాబిన్ లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 40 మందిలో 15 మంది మృతి చెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బస్సులో మాత్రం ఎవరూ లేకపోవడం.. డ్రైవర్ అతి వేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. చనిపోయిన వారిని కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

చంద్రబాబు వెనక్కి తగ్గడానికి మోడీ ఫోన్ కాల్ కారణమా?

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖర్చు గురించి అసలు పట్టించుకోరు అన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తున్న ఖర్చు గురించి పదే పదే చెబుతూ వివరణ ఇస్తున్నారు. అసలు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎంత గ్రాండ్ గా చేస్తున్నామని చూస్తారే తప్ప దానికి ఎంత ఖర్చు అయింది అని పట్టించుకోరు చంద్రబాబు. ఎన్నో విషయాల్లో చంద్రబాబు చేసిన ఖర్చులు గురించి ఎంతో మంది విమర్సలు చేసినా అవేమి పట్టించుకునేవారు కాదు. అయితే ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తున ఖర్చు నిమిత్తం పలు విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఒక్క చంద్రబాబే కాదు ఆయనతో పాటు మంత్రులు కూడా అంత ఖర్చు కావడంలేదని కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకొని చంద్రబాబు ఈ విషయంలో మాత్రం ఎందుకు వివరణ ఇస్తున్నారు అన్న సందేహాల నేపథ్యంలో చంద్రబాబుకు వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్లనే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా పదే పదే ఖర్చు గురించి మాట్లడటం.. వివరించడం వెనుక మోడీ ఉన్నట్టు చెబుతున్నారు. శంకుస్థాపన చేపట్టేందుకు ఇంత ఖర్చు ఎందుకని.. ఖర్చు విషయంలో విమర్శలు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ ఆఫీసు నుండి ఫోన్ రావడంతో ఖర్చు విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయం బీహార్ ప్రజలకు చెప్తాం.. రఘువీరా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని చెప్పారని తెలిపారు. అంతేకాదు ఈ నెల 22వ తేదీన ఏపీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. అదే రోజు కల్లా ఏపీ ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశారని.. త్వరలో బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తాం.. అప్పుడు ఏపీ ప్రజలకు చేసిన మోసాన్ని బీహార్ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ శంకుస్థాపన.. కేసీఆర్ వెళ్లరా? కేటీఆర్ ను పంపిస్తారా?

  ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబే స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు అయితే చంద్రబాబే కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించినా కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరవరూ అనే సంకేతాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తన తరుపున కొడుకు కేటీఆర్ ను ఈ కార్యక్రమానికి పంపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్ర వ్యవహారాలను కేటీఆరే చూస్తుండటంతో కేంద్రంలో కూడా కేటీఆర్ ను ప్రమోట్ ను చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ, ఇతర దేశాల ప్రధానులు. అంతేకాదు పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు వస్తారు.. జాతీయ నాయకులతో మాటమంతీ కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈకార్యక్రామానికి కేటీఆర్ ను పంపించాలని ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఏపీ మంత్రులు కేటీఆర్ ను ఆహ్వానించగా అందుకు ఆయన కూడా వస్తానని తన సముఖత వ్యక్తం చేశారట. దీనితో పాటు ఆయన పలు మీడియా సమావేశాల్లో కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పోటీపడాలని.. ఏపీ రాజధానికి మద్దతు తెలుపుతున్నానని చాలాసార్లు చెప్పారు.

"నా ఇటుక.. నా అమరావతి".. వాట్ యాన్ ఐడియా బాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన "నా ఇటుక.. నా అమరావతి" వెబ్ సైట్ కు తక్కువ కాలంలో ఎక్కువ ఆదరణ పొందింది. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని.. ప్రతి ఒక్కరూ రాజధానికోసం సహకరించాలని చంద్రబాబు ఎప్పటి నుండో పిలుపునిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన "నా ఇటుక.. నా అమరావతి" పేరు మీద http://amaravati.gov.in/index.aspx ఒక వెబ్ సైట్ ను స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ ఒక్క ఇటుకకైనా తమ వంతుగా దానం చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు ఈ సైట్లో విరాళాల జోరు ఎక్కువైంది. ఉదయం 11 గంటల సమయానికి ఈ వెబ్ సైట్ ద్వారా 4937 మంది 440392 ఇటుకల్ని ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు ఈ సైట్ డిజైనింగ్ కూడా చాలా ఆసక్తికరంగా చేశారు. ఇటుకలు విరాళంగా ఇచ్చే వారి పేర్లు.. ఫోటోలు కూడా ప్రచురించేలా.. అంతేకాదు విరాళం ఇచ్చిన వెంటనే తాజాగా విరాళం ఇచ్చిన వారి పేర్లు అంటూ వారి పేర్లు స్క్రోలింగ్ అవడం ఇవన్నీ కూడా ఈ సైట్ ను ఆకర్షించేలా చేస్తున్నాయి. కాగా ఇప్పటివరకూ అత్యధికంగా ఏపీ క్రెడాయ్ 52200 ఇటుకల్ని విరాళంగా ఇచ్చింది. ఆ తరువాత ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం 10116 ఇటుకలు ఇచ్చి క్రెడాయ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకలు.. డాక్టర్ శ్రీనివాస్ గుళ్లపల్లి 5000 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు ఐడియా సూపర్ గా వర్కవుట్ అయినట్టే కనిపిస్తుంది.

కాంగ్రెస్ జగన్ ను అందుకే కలుపుకోనుందా?

రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్ లేకుండా అయింది. ఏదో అప్పుడప్పుడు కొంత మంది నాయకులు హడావుడి చేయడం వల్ల కాంగ్రస్ పార్టీ ఉందని గుర్తించే రోజుల్లో ఉన్నారు. కాస్తో కూస్తో తెంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందని విషయం తెలుస్తోంది.. ఇక ఆంధ్రాలో అయితే చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటంటే తన తండ్రి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీ పెట్టి ఏపీలో ప్రతిపక్షనేతగా ఎదిగిన జగన్ తో చేతులు కలిపి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా జగన్ తో విభేధాలు ఉన్నప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కాంగ్రెస్ జగన్ తో కలిసి పనిచేయాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ కు మద్దతు తెలుపుతున్నామని ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ జయ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో కూడా జగన్, కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని పోవాలని.. అప్పుడే తనకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నార. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఒక్క విషయంలోనే కాకుండా ఇంకా ఇతర అంశాలపై కూడా జగన్ వినియోగించుకోవాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జనాకర్షణ కలిగిన నేతలెవరూ లేరూ.. ఏదో చిరంజీవి వల్ల.. తన అభిమానుల వల్ల నెట్టుకురావచ్చు అని చూసిన కాంగ్రెస్ పార్టీకి అది కూడా కుదరలేదు. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి తన 150 వ సినిమా మీద పెట్టిన దృష్టి రాజకీయాల మీద పెట్టలేకపోవడం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జగన్ ను కలుపుకొని పోతే మీడియా దృష్టిని ఆకర్షింటవచ్చు.. తమ పార్టీ చేసే నిరసనలకు ఆదరణ లభించి అలాగైనా ప్రజలలోకి వెళ్లోచ్చు అని స్కెచ్ వేస్తుంది. ఇంతా ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టి ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే అందుకు ముందు జగన్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.

విడిపోవడమే ఒకందుకు మంచిదైందా?

రాష్ట్రం విభజనప్పుడు ఒకపక్క తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలంటే.. మరోపక్క సీమాంధ్ర ప్రజలు ఇవ్వడానికి వీల్లేదు అని ఒకటే ఆందోళనలు. కానీ ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగింది. అయితే అటు తెలంగాణ కానీ.. ఇటు సీమాంధ్ర కానీ ఇద్దరి ఆందోళనలు చేయడానికి ముఖ్య కారణం మాత్రం రాజధానిగా ఉన్న హైదరాబాద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా అందరూ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారే తప్ప ఇంక ఏ ప్రాంతం పైనా అంత దృష్టి సారించలేదు. అయితే ఇప్పుడు మాత్రం రాష్ట్ర విభజన జరగడమే మంచిదని అనుకుంటున్నారు చాలామంది. ఎందకంటే రాష్ట్ర విభజన జరిగిన తరువాతే అటు ఏపీలో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలు అభివృద్ది చెందుతున్నాయి. అంతేకాదు తెలుగు వారందరికీ గుర్తుండిపోయేలా ఏపీకి రాజధానిని కూడా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది ఒక రకంగా ఏపీ ప్రజలకు మంచిదే. అంతేకాదు అటు తెలంగాణలో అంతే.. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇతర ప్రాంతాలను అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తుంది. రెండు రాష్ట్రాలు అభివృద్దిలో పోటీపడి మరీ.. ఇతర దేశాల నుండి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరకంగా కలిసి ఉండటం కంటే విడిపోయినప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగి ప్రగతిని సాధిస్తున్నాయి.

జగన్ కన్నా కేటీఆర్ చాలా బెస్ట్.. టీడీపీ నేతలు

  ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రశంసిస్తున్నారు. జగన్ కంటే కెటీఆరే బెస్ట్ అంటూ కితాబులిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా... ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పూనుకున్న సందర్భంగా పలువురు అతిధులను ఆహ్వానించనున్నారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం భిన్నంగా తాను  రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. రాకపోతే రాలేదని నిందించవద్దని చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కన్నా తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా బెస్ట్ అని.. రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచిన వెంటనే వస్తానని చెప్పారని అన్నారు. ఈ లేఖతో అతని బుద్ధి బయట పడిందని..  ఆయన వైఖరి అభివృద్ధికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన శంఖుస్థాపన కార్యక్రమానికి రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

పదవుల కోసం వీరి ముగ్గురు చుట్టూ ప్రదక్షిణలు

  దేవుడి గుడిలో దేవుడి చుట్టూ ప్రదిక్షణలు చేసినట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న నేతలు ఇప్పుడు ముగ్గుర మంత్రుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఉన్న పదవులు అన్ని పంచేస్తాం అని చెప్పారు. దీనికి సంబంధించి కేసీఆర్ ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అది ఎవరో కాదు.. మంత్రి హరీష్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ పదవులకు తగ్గ అర్హులను ఎంపిక చేసే బాధ్యత వీరి ముగ్గురిపై పెట్టడంతో ఇప్పుడు తెలంగాణలోని ఆశావహులంతా కూడా ఆ ముగ్గురి చుట్టూ పదేపదే ప్రదక్షిణలు చేయడం జరుగుతోంది. అంతేకాదు ఈ పదవులు ఆశించేవారిని సిఫార్స్ చేయదలచుకున్న వారు కూడా ఈ మంత్రుల చుట్టూ తిరగాల్సిందే.

ఏపీ నెంబర్ ప్లేట్ మార్చాల్సిందే.. టీ సర్కార్

రాష్ట్ర విభజన జరిగిన తరువాత పలు శాఖలు, పలు అంశాల్లో తెలంగాణ, ఆంధ్రా అంటూ మార్పులు జరిగాయి. ఇప్పుడు ఇదే తరహాలో నెంబరు ప్లేట్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో వాహనం రిజిస్టర్ అయితే.. ఏపీ స్టానంలో టీఎస్.. జిల్లా కోడ్ కూడా మారిపోగా నెంబరు మాత్రం అలాగే ఉంటుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అయితే గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నెంబర్ ప్లేట్ మార్పిడిపై నిర్ణయం తీసుకున్నా.. నెంబర్‌ ప్లేట్ల మార్పిడిపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో.. ప్రభుత్వం న్యాయసలహా తీసుకుని, అంతా సరే అనుకున్న తర్వాతే నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిసింది. 7 నెలల క్రితం తొలి నోటిఫికేషన్‌ జారీచేసి... ఇప్పుడు తుది నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 70 లక్షల వాహనదారులు రిజిస్టర్ చేసుకొని ఉండగా ఇప్పుడు వారందరూ నెంబర్ ప్లేట్ మార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్త నెంబర్‌ ప్లేట్లను అమర్చుకోవానే నేపథ్యంలో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి.  ఇందుకోసం మళ్లీ చలానా కట్టాలా? ఆర్‌టీఏ ఆఫీసుకు స్వయంగా వెళ్లాలా? లేక... ఆన్‌లైన్‌లోనే కొత్త నెంబర్‌ తీసుకోవచ్చా? కొత్త నెంబర్‌ను తీసుకున్నాక... ప్లేటుపై దానిని రాయించాలా? లేక, తనిఖీల సమయంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న కాపీని చూపిస్తే సరిపోతుందా? ఇలాంటి సందేహాలెన్నో తలెత్తుతున్నాయి. వీటిపై స్పష్టత రావాలంటే ఇంక కొన్ని రోజులు ఆగాల్సిందే.