దేవుడు మాతోనే ఉన్నాడు.. మోడీ సర్కార్ ఏం చేయలేదు.. కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్లో మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ సర్కార్ తదుపరి లక్ష్యం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ లు కావచ్చు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా మోడీ సర్కార్ సర్కార్ తనకు, ఆప్ మంత్రులకు ఎటువంటి హానీ చేయలేదనీ, దేవుడు మాతోనే ఉన్నాడనీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా కేజ్రీవాల్ సీఎంఓ ఆఫీసులో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.