ఫేస్ బుక్ సీఈఓ కూతురు అప్పుడే స్విమ్ చేసేసిందట..

ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు.. తన పాప తన జీవితాన్ని మార్చేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఫేస్ బుక్ సీఈవో మార్క్ బుకర్ బర్గ్ తన కూతురు మాక్స్ తో బిజీగా జీవితాన్ని గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన పాపాయి పుట్టిన సందర్బంగా తనకున్న షేర్లలో 90 శాతం షేర్లను ట్రస్ట్ లకు ఇచ్చి ప్రపంచంతో ప్రశంసలు అందుకున్నాడు  బుకర్ బర్గ్. ఇప్పుడు మాక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త షేర్ చేస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి  ఫోటో, తొలి టీకా మొదలగు ఫొటోలు పోస్ట్ చేసిన జుకర్ బర్గ్ ఇప్పుడు తాజాకా మాక్స్ ఫస్ట్ స్విమ్.. షి లవ్స్ ఇట్ అని ఒక ఫోటోను  షేర్ చేశాడు. అంతే ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఇంకా ఫొటోకి కామెంట్లు, షేర్లు, లైక్ లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

ఎంఎస్ నారాయణ సతీమణి మృతి.. మలయాళ నటి కల్పన మృతి

ప్రముఖ హాస్యనటుడు, దివంగత  ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆమె ఈరోజు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మృతి చెందారు. ఇప్పటికే హాస్య నటుడు మరణించి ఎంఎస్ నారాయణ మరణించి జనవరి 23 నాటికి ఏడాది అయింది. మొన్న ఎంఎస్ నారాయణ ప్రధమ వర్ధంతి జరిగింది. అది జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు.దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ప్రముఖ మలయాళ నటి కల్పన (50) కూడా ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె గుండెపోటుతో మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఓ ప్రయివేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన ఆమె తాను బస చేసిన హోటల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి .... హుటాహుటీన జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కల్పన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కల్పన ప్రముఖ నటి ఊర్వశి సోదరి.

రాహుల్ గాంధీ చిన్నపిల్లాడు.. ఎవరూ పట్టించుకోరు.. ఆజంఖాన్

చాలా సంవత్సరాల రాజకీయానుభవం ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సెటైర్లు తప్పవు. ఇప్పటికి చాలా మంది నేతలే రాహుల్ పై వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ కూడా ఆ జాబితాలో చేరారు. రాహుల్‌ గాంధీ ఇంకా చిన్న పిల్లాడేనని, అతడి మాటలను ఎవరూ పట్టించుకోరని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ చాక్లెట్లు తింటూ, కొన్నింటిని మిగిలిన 'చిన్న పిల్లల'కు పంచిపెట్టాలని సూచించారు. కాగా రాహుల్‌గాంధీ శనివారంనాడు బుందేల్‌ఖండ్‌లో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసుకున్న నిధులనుంచి కొంత భాగాన్ని కరవు దెబ్బ తిన్న ప్రాంతాలకు కేటాయించాలని రాహుల్ డిమాండ్‌ చేశారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆజంఖాన్‌ పైవిధంగా స్పందించారు.

బ్రిటన్ మా తర్వాత లక్ష్యం : ఐఎస్ఐఎస్

పారిస్‌లో 130 మందిని బలితీసుకుని, నరమేధానికి పాల్పడిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు ఎవరో చెబుతూ,ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ దాడిలో నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రెంచి పౌరులు, ఇద్దరు ఇరాకీలు పాల్గొన్నారని  వెబ్‌సైట్లలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. 'వాళ్లు ఎక్కడ కనిపిస్తే.. అక్కడ చంపండి' అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో అమెరికా సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటనే తమ నెక్స్ట్ టార్గెట్ అని సంకేతాలు ఇచ్చింది. 2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్పై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలన్నింటికీ ఈ బెదిరింపు వర్తిస్తుందని ఫ్రెంచ్, అరబ్ భాషలో ఉగ్రవాదులు హెచ్చరించారు. వీడియోలో బ్రిటన్ పిఎం డేవిడ్ కామెరాన్‌ ఫొటోను చూపించి..  'అవిశ్వాసులతో జతకలిసే ప్రతి ఒక్కరూ మ తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే' అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నారు. పారిస్‌ దాడితో ఫ్రాన్స్‌ను గడగడలాడించిన తొమ్మిది మంది ఉగ్రవాదులు సింహాల్లాంటి వాళ్లంటూ కితాబిచ్చారు తీవ్రవాదులు.ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన 'అల్‌ హయత్‌' ఈ వీడియోను విడుదల చేసింది.

టీడీపీకి మరో షాక్.. టీఆర్ఎస్ లోకి కృష్ణ యాదవ్.. అన్నా క్షమించు..

తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నేతలు పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరుతున్న వేళ మరో టీడీపీ నేత  మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కూడా ఆ జాబితాలో చేరారు. కృష్ణ యాదవ్ టీడీపీని వీడి కారెక్కుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మార్పుపై కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. తనపై పార్టీ వ్యవహరిస్తున్నతీరుకు మనస్తాపానికి గురై టీడీపీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. పార్టీలో ఇమడలేని తీరు ఉండటంతో బాధతో తన పదవికి రాజీనామా చేశానని..తను పార్టీ పదవికి రాజీనామా చేసినా కూడా కనీసం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు ముగ్గురు చేతుల్లో పార్టీ నష్టపోతున్న తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపినట్లు చెప్పారు. కాగా అధికార పార్టీ తెలంగాణాభివృద్ధికి పాటు పడుతోందని.. నేను కూడా రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకునేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన స్వర్గీయ నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. పార్టీ స్థాపించి ఎందరినో నాయకులుగా తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అలాంటి పార్టీలో ఎదిగిన వాడిలో నేను కూడా ఒకడినని.. పార్టీని వీడుతున్నందుకు అన్నా క్షమించు అంటూ వాపోయారు.

చంద్రబాబు, కేసీఆర్ మధ్య పంచాయతీ లేదు.. మీ మధ్య ఎందుకు.. కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ అందరికి తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని.. వారి మధ్య ఎలాంటి గొడవలు విభేధాలు లేవు.. వారి విషయంలో అనవసరంగా ప్రజల మధ్య పంచాయితీలు ఎందుకని అన్నారు. తెలంగాణ అభివృద్దికి అందరూ పాటుపడదాం.. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములమవుదామవుదాం అని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ ను నమ్మాలని.. ఆయనకు గ్రేటర్లో గెలిచే అవకాశం ఇవ్వాలని.. మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ తప్పకుండా చేస్తారని అన్నారు.

రిపబ్లిక్ డే హై అలర్ట్.. ఎన్‌కౌంటర్‌ టెన్షన్

రిపబ్లిక్ డే సందర్బంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని అనుమానించి భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. అయితే ఈ భద్రతా దళాల బందోబస్తు నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌ జరుగడం కలకలం రేపింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఘటనా స్థలానికి వెళ్లి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు పరారైనట్టు తెలుస్తోంది. కాగా అరెస్ట్ అయిన వ్యక్తి పేరు అంకిత్ అని.. అతను ఓ పేరు మోసిన దొంగ అని.. అతని పేరు 25వేల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.  

ఏదో ఆశించే పార్టీల్లోకి చేరుతారు.. జయసుధ

సినీ నటి జయసుధ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ మార్పుపై ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా వేరే పార్టీ మారేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించే అని అన్నారు. అంతేకాదు తన పద్దతులేంటో తనకు తెలుసని..  రాజకీయాల్లో అందరూ ఒకేలా ఉండాలని లేదని.. తెలుగు దేశం పార్టీలోకి చేరినప్పటికీ తాను తన పద్దతిలోనే ఉంటానని చెప్పారు. అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయడానికి కుదురుతుందని.. అందుకే టీడీపీలో చేరాను.. త్వరలో గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆదేశిస్తే ప్రచారం చేస్తానని చెప్పారు. సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే పెద్ద నటులు ఉన్నారని ఆమె అన్నారు. అంతేకాదు మా ఎన్నికల గురించి కూడా ఆమె మాట్లాడుతూ మా ఎన్నికల్లో పోటీకి తనను ఎవరూ బలవంతం చేయలేదని.. నేనే పోటీ చేశానని అన్నారు. అయినా పోటీ అనేది ఎన్నికల వరకే అని.. సినిమా పరిశ్రమ అంత ఒకటేనని స్పష్టం చేశారు.

మల్లాదికి అక్రమాస్తులు 600 కోట్లు..!

కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణువును సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మల్లాది విష్ణుకు దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మల్లాది విష్ణువు ఖండిస్తున్నారు. తనకు అన్ని ఆస్తులు లేవని ఇవన్ని ఒట్టి పుకార్లేనని తనపై అధికార తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందని అంటున్నారు. కాగా కల్తీ మద్యం కేసులో మల్లాదికి బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.

లీవ్‌పై వెళ్లిన హెచ్‌సియు వీసీ అప్పారావు

  వేముల రోహిత్ ఆత్మహత్య, ఎన్ని పరిణామాలకు దారితీసిందో తెలిసిందే..తాజాగా, యూనివర్సిటీ వీసీ అప్పారావు లీవ్ పై వెళ్లడం మరింత వివాదాస్పదంగా మారింది..వర్సిటీలో వాతావరణం వేడిగా ఉన్న ఇలాంటి సమయంలో, అప్పారావు లీవ్ పెట్టడం పై విద్యార్ధులు మండిపడుతున్నారు..లీవ్ పై వెళుతూ ఇన్ ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించారు.దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదని, తనపై ఆరోపణలు వస్తున్నాయని భావించిన వీసీ తాత్కాలికంగా ఈ ఘటన నుంచి తప్పుకునేందుకు లీవ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ ఛార్జ్ వీసీగా విపిన్ శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని కూడా విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయి.   ప్రస్తుతం రోహిత్ అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. తమ ఉద్యమానికి విలువ లేకుండా చేస్తున్నారనేది విద్యార్ధుల ఆరోపణ. అసలే తమ కడుపు మండిపోతుంటే, మళ్లీ మరోసారి మంట పెట్టిన చర్యగా శ్రీవాత్సవ్ నియామకాన్ని విద్యార్థులు అభివర్ణించారు. ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉండగా కేవలం శ్రీవాత్సవ్ నే ఇన్ ఛార్జ్ వీసీగా ఎందుకు నియమించారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు.తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి రేపు మరికొంతమంది విద్యార్థులు వస్తున్నారని,ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని విద్యార్ధులు చెబుతున్నారు..

బ్లాక్ మనీని పట్టేందుకు కొత్త వ్యవస్థ

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన హామీల్లో కీలకమైనది,విదేశాల నుంచి నల్లధనం వెనక్కి రప్పించడం..ఈ విషయంలో ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై, ప్రతిపక్షాలు విమర్శల్ని గుప్పిస్తున్నాయి..తాజాగా బ్లాక్‌మనీ వెలికి తీసే విషయంలో స్విస్‌ బ్యాంక్‌ పూర్తి స్థాయిలో భారత్‌కు సహకరిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. భారత్‌-స్విట్జర్లాండ్‌ ఆర్థిక మంత్రులు ద్వైపాక్షిక్ష భేటీలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఇక నుంచి స్విస్‌ బ్యాంకులో నగదు జమ చేసే వారి సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలిసేలా నూతన వ్యవస్థను, నిబంధనలను తీసుకురానున్నట్లు వివరించారు. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా,స్విస్ బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే భారతీయుల డబ్బుకు సంబంధించిన అన్ని వివరాలూ క్లియర్ గా తెలుస్తాయి..ఇప్పటికే తాము భారత్‌కు పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వచ్చామని, భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని అని స్పష్టం చేశారు స్విట్జర్లాంట్ ఆర్ధిక మంత్రి యులి మౌరర్.ఇలాంటి వ్యవస్థ మొదలైందని ప్రకటించిన తర్వాత కూడా, నల్లధన కుబేరులు తమ ధనాన్ని అక్కడ జమ చేస్తారా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న..

పిల్లలే మారణాయుధాలు... మోడీ‍యే టార్గెట్..?

  భారతప్రధాని మోడీ తమ టార్గెట్ అని తీవ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే..తాజాగా, పిల్లల్ని ఆయన హత్యకు పావులుగా వాడుకోవాలని ఐఎస్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్‌డే రోజున టీనేజ్‌ పిల్లల్ని ఆత్మహత్యాదళంగా ఉపయోగించి ప్రధానిని అంతమొందించాలని ప్లాన్ వేసింది..ఇంటిలిజన్స్ ఇన్ఫర్‌మేషన్ ప్రకారం,12నుంచి 15ఏళ్ల మధ్య ఉన్న వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను వినియోగించడంలో శిక్షణ ఇచ్చి వారిని ఆయుధాలుగా తయారుచేస్తోందట ఐఎస్‌ఐఎస్..దీంతో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ఆగస్టు 15న మోడీ చిన్నారుల దగ్గరకు వెళ్లి మమేకమయ్యారు.అందుకే రిపబ్లిక్ డే కు,ఈ ప్లాన్ వేసింది ఉగ్రవాద సంస్థ.ఇప్పటికే 26 వ తారీఖున హైఅలర్ట్ ప్రకటించింది భారత భద్రతా సంస్థ..

భారతీయుడికి 82 ఏళ్ల జైలు శిక్ష

భారత్‌కు చెందిన అమన్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తికి,అమెరికాలోనే ఉంటున్న మరో భారతీయుడు పరంజీత్‌సింగ్‌ తో వ్యక్తిగత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో పరంజీత్‌తో కలిసి 2008 ఆగస్టు 31న ఒక ఫంక్షన్‌కు హాజరైన సమయంలో ఇద్దరూ గొడవ పడ్డారు..ఆ గొడవలోనే పరంజీత్‌ను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అమన్‌సింగ్‌ భారత్‌కు పారిపోయాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన అమెరికా  పోలీసులు భారత అధికారులకు సమాచారమందించారు. దీంతో 2013లో పంజాబ్‌లోని జలంధర్‌లో అమన్‌దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అమెరికాకు హ్యాండ్ ఓవర్ చేశారు.ఈ కేసులో జనవరి 22న తుదితీర్పు ఇచ్చింది అమెరికా కోర్టు. అమన్‌దీప్‌ను దోషిగా గుర్తిస్తూ అక్కడి సక్రామెంటో కోర్టు 82ఏళ్ల జైలుశిక్ష విధించింది..

ఆదర్శముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుకు ఆదర్శముఖ్యమంత్రి పురస్కారం దక్కింది.. పుణేలోని భారతీయ ఛాత్ర సంసద్,ఈనెల 30 న ఈ పురస్కారాన్ని ఆయనకు అందించనుంది...పుణె, కొత్రూడ్ లోని మిట్ క్యాంపస్‌లో జరిగే వాలిడెక్టరీ సెర్మనీ సందర్భంగా చంద్రబాబు ఈ అవార్డ్ అందుకుంటారు. దేశవ్యాప్తంగా పదివేలకు పైగా విద్యార్ధి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరౌతారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి, ఈ పురస్కారాన్ని ప్రకటించామని సంసద్ తెలిపింది.   మహారాష్ట్ర శానన మండలి చైర్మన్ రామ రాజే నాయక్  నీంబల్కర్ ఈ అవార్డును అందజేస్తారని, రాష్ట్ర హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి వినోద్ టాడే ఇందులో పాల్గొంటారని సంసద్ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఈ అవార్డును మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ప్రదానం చేశారు. విద్యార్థి నాయకులతో మాట్లాడేందుకు ఆసియా, పశ్చిమ దేశాలకు చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సంసద్ చెబుతోంది .

మరోసారి బిజేపి అధ్యక్షుడిగా అమిత్ షా

బిజేపి జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న ఆయన రెండోసారి కూడా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా అమిత్‌ షా పేరును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, బిజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా కు పార్టీ నేతలు, కేంద్రమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా అమిత్‌ షా పూర్తిస్థాయిలో మరో మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ ఎన్నికకు అగ్రనేతలు అడ్వాణి, మురళీ మనోహర్‌ జోషి దూరంగా ఉండటం కొసమెరుపు

వైద్య విద్యార్ధినుల ఆత్మహత్య

తమిళనాడులో ముగ్గురు వైద్య విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు..విల్లుపురంలోని ఎస్‌వీఎస్‌ యోగా, నేచురోపతి మెడికల్ కాలేజీ సమీపంలో ఒక బావిలో విద్యార్థినుల మృతదేహాలు లభ్యమయ్యాయి.వారిని శరణ్య,  ప్రియాంక, మనీషాలుగా గుర్తించారు. విద్యార్థినులు చనిపోయే ముందు ఆత్మహత్య లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. కళాశాలలో కనీస వసతుల కోసం యాజమాన్యంతో పోరాడామని, కానీ వారి వేధింపులు తమపైన ఎక్కువయ్యాయని లేఖలో పేర్కొన్నారు.   కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు చనిపోయినట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు..కొన్ని రోజుల క్రితమే తీవ్ర సంచలనం రేపిన రోహిత్ వేముల ఆత్మహత్య గురించి మరువక ముందే, తమిళనాడులో ముగ్గురు స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడటం, తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

చంద్రబాబు ప్రచారం చేస్తే మాకే ఉపయోగం..! కేటీఆర్ మైండ్ గేమ్..!

రాజకీయాల్లో ఒక పార్టీని దెబ్బ కొట్టాలంటే మిగిలిన పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి.. మిగిలిన పార్టీలను కన్ఫ్యూజ్ చేయాడానికి మైండ్ గేమ్ ఆడుతుంటాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే అలా అనిపిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలకుగాను వాతావరణం చాలా వేడెక్కింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్సలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక టీఆర్ఎస్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేటీఆర్ సారధ్యంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అని పార్టీల కంటే ఒక అడుగు ముందంజలోనే ఉంది. ఇక టీడీపీ-బీజేపీ కూడా తమ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈనెలాఖరున టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రచారంపైన కేటీఆర్ కొత్తగా మైండ్ గేమ్ ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నెలాఖరున చంద్రబాబు ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ దీనిపై స్పందిస్తూ చంద్రబాబు ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే తమకు అంత ప్రయోజనమని అన్నారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా? వద్దా అనేది చంద్రబాబు విజ్ఞత అని.. ఆయన ప్రచారం చేస్తే తమకే ఉపయోగమని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు అసలు కేటీఆర్ ఏ ఉద్దేశంతో ఇలా అన్నారు.. ఆ వ్యాఖ్యలు చేయండం వెనుక మతలబు ఏంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి మతలబు లేదని.. కావాలనే తను అలా వ్యాఖ్యానించారని.. ఇది కేటీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ అని అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రచారం చేస్తే తమకే ఉపయోగమని చెప్పిన కేటీఆర్.. ఏ రకంగా ఉపయోగమో కూడా చెబితే బావుండేదని అంటున్నారు. మరి కేటీఆర్ ఎందుకు అలా మాట్లాడారో ఆయనకే తెలియాలి.

మేడమ్ టుస్సాడ్స్ లో కేజ్రీవాల్ మైనం బొమ్మ..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ అరుదైన ఘనతను పొందారు. అదేంటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. బ్రిటన్ లోని మేడమ్ టుస్సాడ్స్  మ్యూజియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ పలువురు ప్రముఖుల మైనపు బొమ్మల విగ్రహాలు తయారు చేసి ఉంచుతారు. ఇప్పటి వరకూ మహత్మ గాంధీ - ఇందిరా గాంధీ - అమితాబ్ -షారుఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్ - ఐశ్వర్య రాయ్ - కరీనా కపూర్ -మాధురీ దీక్షిత్ - హృతిక్ రోషన్  - సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ మ్యూజియంలో కేజ్రీవాల్ కూడా స్థానాన్ని ఆక్రమించేశారు. త్వరలో ఈ మ్యూజియం కేజ్రీవాల్ మైనపు బొమ్మను తయారుచేసి అక్కడ పెట్టుబోతున్నారట. దీనికి సంబంధించి మాట్లాడటానికి మేడమ్ టుస్సాడ్ ట్రస్ట్ సభ్యులు వచ్చే నెల ఢిల్లీ కూడా వస్తున్నారంట. మొత్తానికి భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమంత్రి బొమ్మను టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచడం తొలిసారి కావడం.. అది కూడా కేజ్రీవాల్ ది కావడం విశేషమే.

కరణ్ జోహార్ ను చితగొట్టండి.. కేంద్ర మంత్రి

మాజీ జనరల్ ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి గారికి.. కరణ్ జోహార్ కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా..? అదేంటంటే.. ఈ మధ్య కాలంలో దేశంలో అసహనం గురించిన చర్చలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే మత అసహనం గురించి జరుగుతున్న చర్చ మీద ఈ మధ్య కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో ఆయన మాట్లాడుతూ  దేశంలో వ్యక్తిగత విషయాలు ఏం మాట్లాడినా జైలుకెళ్లాల్సిందే అని.. మత అసహనం గురించి మాట్లాడిన వారి పరిస్థితి ఏమైందో చూశాం కదా అందుకని ఈ విషయంపై తానేమి మాట్లాడనని అమీరు ఖాన్ గురించి గుర్తు చేస్తూ పరోక్షంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. ఇక్కడి వరకూ బానే ఉంది. అయితే భాజపా కార్యకర్తల్ని కలిసేందుకు ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రి వీకే సింగ్ ను కరణ్ మాట్లాడిన దానిపై విలేకరులు అడిగారు. దీనికి తాను స్పందిస్తూ ముందు ఈ విషయాన్ని కరణ్ నే అడగాలని చెప్పినా తరువాత మాత్రం కార్యకర్తలు వెళ్లి కరణ్ ను చితగ్గొట్టాలని నోరు జారేశారు. దీంతో ఇప్పుడు మంత్రిగారు చేసిన వ్యాఖ్యలపై కొంతమంది మండుతున్నారు.