పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి.. చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్ దావోస్లో జరిగే 46వ ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన జ్యూరిక్ లో కొద్దిసేపు ఉండి అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులు.. ప్రవాస భారతీయులు.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా.. ఏపీ అభివృద్దికి తోడ్పడాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. అంతేకాదు యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయవచ్చని.. సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి తాను దేశ విదేశాల్లో పర్యటిస్తున్నానని.. ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఏపీ ఎన్ఆర్టీ పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా చంద్రబాబుతోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ సీఎం రమేష్, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్, కారం సురేష్లు ఇందులో పాల్గొన్నారు.