తెలంగాణను ఎవరూ విడదీయలేరు.. చంద్రబాబు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు. పటాన్చెరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీడీపీతో తెలంగాణను ఎవరూ విడదీయలేరని వ్యాఖ్యానించారు. బ్రిటష్ వాళ్లు, నిజాంలు వందల సంవత్సరాలు హైదరాబాద్ ను పాలించారు.. కానీ నేను అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలతో ప్రపంచ పటంలో హైదరాబాద్ కు స్థానం కల్పించా అని అన్నారు. అంతేకాదు హైదరాబాద్లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. హైదరాబాద్ వల్ల తెలంగాణకు ఎక్కువ లాభం వచ్చిందని, ఔటర్ రింగురోడ్డు, మెట్రోరైలు ఘనత టీడీపీదేనని, 12 ఏళ్లయినా మెట్రో పనులు పూర్తి కాలేదని, అదే తాము మేము గెలిచి ఉంటే మూడేళ్లలో పూర్తిచేసే వాళ్లమని అన్నారు. అలాగే హైదరాబాద్లో అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి ఉందని, నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా అని అన్నారు.