సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ కన్నుమూత..

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ (49)ఈ రోజు కన్నుముశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పలు టీవీ చానెళ్లలో పని చేసిన ఆయన తెలుగు కవిత్వంలో తన ప్రత్యేకమైన ముద్రను వేశారు. ఆయన మాగ్జిమమ్ రిస్క్, మేల్‌కొలుపు, మ్యూజిక్ డైస్ కవితా సంకలనాలను వెలువరించారు. కాగా అరుణ్ సాగర్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మరోవైపు అరుణ్ సాగర్ మృతికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ అరుణ్ సాగర్ మరణం చాలా బాధాకరం, తీరని లోటని అన్నారు. టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివని బాలకృష్ణ అన్నారు

పఠాన్‌కోట్‌లో 250 మంది గూఢచారులు?

పఠాన్‌కోట్ వైమానిక స్థావరం వద్ద పట్టబడుతున్న గూఢచారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న సందీప్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేయడంతో అసలు ఇంతకీ పఠాన్‌కోట్‌కి సంబంధించిన రహస్యాలు పాకిస్తాన్‌కి ఎలా చేరాయి అన్న విషయం మీద నిఘా వర్గాలు మరింత దృష్టిని పెట్టాయి. ఇందులో భాగంగా పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోకి తరచూ ప్రవేశించే అవకాశం ఉన్న 250మందితో కూడిన జాబితాను రూపొందించాయి. పఠాన్‌కోట్‌లో జరిగే చిన్నాచితకా మరమ్మతుల కోసమో, సైనికులకి ఏవన్నా సౌకర్యాలను అందించడానికో తరచూ లోపలికి ప్రవేశించే ఈ వ్యక్తులలో ఎవరైనా కూడా గూఢచారులుగా పనిచేసే అవకాశం ఉందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకని ఈ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరి గురించీ నిజాలను వెలికితీస్తున్నాయి. పఠాన్‌కోట్‌ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్‌లో ఒక పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారనీ, ఇందుకు స్థానికంగా ఉన్న చాలామంది పాకిస్తాన్‌ గూఢచారులు తగిన సమాచారాన్ని అందించారనీ నిఘా వర్గాల అంచనా! ఈ ఇంటి దొంగలను పట్టుకోవాలన్నదే ఇప్పుడు పోలీసులు ప్రయత్నం. కానీ జరగాల్సిన నష్టమైతే ఎప్పుడో జరిగిపోయింది. పఠాన్‌కోట్‌లో జరిగిన దాడిలో 7గురు సైనికులు మరణించడంతో పాటు, దేశంలోని రక్షణ దళాలు ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది.

టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయే..

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలను క్లీన్ స్వీప్ చేసి గెలుపును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే టీఆర్ఎస్ కి 40 వేల కోట్ల రూపాయిలు కావాలని.. తన హామీలను ఎలా అమలు చేస్తుందో వేచి చూడాల్సిందేనని అన్నారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడుతూగతంలో కంటే టీడీపీకి లక్షన్నర ఓట్లు అదనంగా వచ్చాయి.. అయినా ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా పోటీ చేశాం.. తెలుగుదేశం అసలు లక్ష్యం 2019 ఎన్నికలు అని..రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వ్యాఖ్యానించారు. ఇంకా టీ టీడీపీ నుండి ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ లు పార్టీ మార్పుపై స్పందించి ఎంత మంది పార్టీని మారిన కేడర్ ఎటూ పోదని.. టీడీపీకి గట్టి క్యాడర్ ఉందని.. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయేనని అన్నారు.

తెలంగాణలో టీడీపీకి గట్టి క్యాడర్ వుంది.. లోకేశ్

1. హైదరాబాద్  మహానగర పాలక సంస్థ ఎన్నికలలో గతం కంటే లక్షాన్నర ఓట్లు ఎక్కువ వచ్చాయి . ఇంటిపేరు కస్తూరి వారు -- ఇళ్ళంతా గబ్బిలాల కంపనీ - ఎన్ని లచ్ఛలొస్తే ఏట్లే సామీ - ముక్కీ మూలిగీ గెలిచిందొకటే గా...!! 2. తెరాస హామీలు అమలు చేయాలంటే 60 వేల కోట్లు కావలి. అంత సొమ్ము ఎక్కడ నుంచి తెస్తారో చూడాలి. ఆంధ్రాలో మీ నాయనిచ్చిన హామీలకి వేల కోట్లెట్టా తెస్తన్నాడో - ఇయ్యి కూడా అట్టాగే... ఆళ్ళ సావేదో ఆళ్ళు సస్తార్లే....!! 3. తెలుగుదేశం అసలు లక్ష్యం 2019 మంత్లీ టెస్టుల్లోనే  గ్రేడులిట్టా ఏడిచాయ్ - ఇదే ప్రిపరేషన్ తో ఎలితే ... బోర్డ్ ఎక్షామ్ లో బోడిగుండే ...!! 4.తెలంగాణలో తెలుగుదేశానికి గట్టి క్యాడర్ వుంది . పోయినోళ్ళంతా పోగా మిగిలిందే పుంజెడు మంది - ఇంతోటి మందకి కేడరంటూ పెద్ద పదాలెందుకులే సామీ .. !! 5. తెరాస కు ప్రధాన ప్రత్యర్ది తెలుగుదేశమే .... దేంట్లో - బైకులేసుకుని రోడ్ల మీద తిరగటంలోనా...??

ఎర్రబెల్లిపై రేవంత్ ఫైర్.. అప్పుడ రాత్రి ఇప్పుడు పగలు అంతే..

ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీని నుండి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎర్రబెల్లిపై దుమ్మెత్తి పోశారు. ఎప్పటినుండో టీఆర్ఎస్ తో ఎర్రబెల్లి స్నేహం చేసేవారని.. ఇప్పుడు అది బయట పడిందని అన్నారు. ఇన్ని రోజులు చీకటిలో మంతనాలు జరిపేవారు.. ఇప్పుడు పగలు కలుస్తారు అంతే.. అంతకు మించి తేడా ఏం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కులాల వారీగా రాజకీయ నేతలు ఏకమవుతున్నారని అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ కు సవాల్ కూడా విసిరారు. దమ్ముంటే అందరి చేత రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

గుండె పగిలిపోయిందంటున్న కోహ్లీ..

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల ప్రేమాయణం గురించి తెలియని వారుండరూ. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని వెళ్లి తిరిగొచ్చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వీరి ఊసే ఎక్కడా వినిపించడం లేదు. ఇక వీరిద్దరి బంధం తెగిపోయింది.. బ్రేకప్ చెప్పేసుకున్నారు అని పలు వార్తలు వచ్చినా వారిద్దరి నుండి మాత్రం ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు కోహ్లి చేసిన ఒక పోస్ట్ ద్వారా మాత్రం  వీరిద్దరూ విడిపోయారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ తన గుండె పగిలిపోయింది అంటూ ఒక ఫొటోని పోస్ట్ చేశాడు. అయితే కొంత సేపటికి దాన్ని డిలీట్ చేశాడు. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో.. నేను బాధతో ఉన్న చిత్రాన్ని డిలీట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నా.. నన్ను క్షమించండి అంటూ ఆ ఫొటోని మళ్లీ పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా కొహ్లీ ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎనభై వేలకు పైగా లైక్స్ రెండు వేలకు పైగా కామెంట్స్ రావడం గమనార్హం. మరి ఇంతకీ కొహ్లీ బాధ అనుష్క గురించేనా.. లేక ఇంకేదైనా ఉందా..!

నడుస్తున్న వ్యక్తులపై దూసుకెళ్లిన కారు..

చెన్నైలో ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఒక కారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నవ్యక్తులపై దూసుకుంటూ వెళ్లింది. వివరాల ప్రకారం చెన్నైలోని ఎరుపు రంగు శాంట్రో కారు రోడ్డు వెళుతున్నఐదుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అయితే ఈ ఘటన మొత్తం  సీసీటీవీ పుటేజీలో రికార్డవడంతో ఆ కారు బ్యాంక్‌ ఉద్యోగి వెంకటేష్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ పోలీసు అధికారి జవహర్‌ మాట్లాడుతూ ఈ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ మద్యం సేవించి లేడని.. అతనికి డ్రైవింగ్‌లో అనుభవం కూడా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించగలదు.. రాహుల్

కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించగలదు.. ఈ వ్యాఖ్యలు చేసింది ఏవరనుకుంటున్నారా..? ఇంకెవరూ మన రాజకీయ మేధావి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇప్పటికే పొలిటికల్ సెటైర్లు పడుతుంటాయి. ఆయన చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే రాహుల్ గాంధీపై సెటైర్లకు కొదువుండదు. ఇప్పుడు మళ్లీ తాజాగా అలాగే విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు రాహుల్. కేరళ పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సీపీఎం ఓడించలేదని.. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్‌ను ఓడించగలదని అన్నారు. అంతేకాదు బిహార్‌లో బీజేపీ ఏం చేయడానికి ప్రయత్నిస్తోందన్న విషయాన్ని పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నామని, అందుకే నితీష్, లాలు, కాంగ్రెస్ పార్టీలను ఒకటిగా చేశామని చెప్పారు. బిహార్‌లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో వాళ్లు ఎన్నికల ఫలితాలు చూసి దిగ్భ్రాంతి చెందారన్నారు. అయితే అంతా బానే ఉంది కానీ కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించడం ఏంటబ్బా అని.. రాహుల్ ఉద్దేశం ఏంటో అని అనుకుంటున్నారు.

"నాలో నీలో గజల్ శ్రీనివాస్" - పుస్తక ఆవిష్కరణ

కళాకారుల జీవితం స్ఫూర్తి దాయకం అని వారిపై గ్రంధాలు వెలువడడం అభినందనీయమని కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి అన్నారు.  డా. ఎస్. అర్. ఎస్. కొల్లూరి రచించిన "నాలో నీలో గజల్ శ్రీనివాస్" పుస్తకావిష్కరణ కార్యక్రమం యువకళావాహిని అధ్వర్యంలో బంజారా హిల్స్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన డా ఎన్. గోపి గ్రంధాన్ని ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గొప్ప వాగ్గేయ కారుడని తన గాత్రంతో లక్షల మందిని  చైతన్య పరిచే శక్తీ శ్రీనివాస్ సొంతమని అన్నారు. ఈ కార్యక్రమానికి  శ్రీ సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించగా,  ముఖ్య అతిదిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మ రాజు జ్యోతి ప్రజ్వలన చేసారు.   ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిదిగా విచ్చేసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ అర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో తెలుగు వెలుగులను ప్రకాసవంతం చేస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతున్న చైతన్య మూర్తి గజల్ శ్రీనివాస్ అని అన్నారు. మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత జె, కె. భారవి మాట్లాడుతూ, మూడు సార్లు గిన్నీస్ రికార్డ్స్ ను సొంతం చేసుకుని, 125 భాషలలో గానం చేసిన అత్యంత ప్రతిభావంతుడు డా. గజల్ శ్రీనివాస్ అని అన్నారు. గ్రంధ సమీక్ష చేసిన సినీ గేయ రచయిత శ్రీ సిరశ్రి మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గారి 30 సంవత్సరాల గాన ప్రస్థానాన్ని, చేస్తున్న సేవా కార్యక్రమాలను, డా. కొల్లూరి 125 నానీలులో రాయడం హృద్యంగా ఉంది అన్నారు. మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ మానవతా విలువలను, ప్రపంచ శాంతిని, గాంధేయ వాదాన్ని ఈనాటి తరానికి తనదైన శైలిలో అందిస్తున్న శ్రీనివాస్ గారిపై ఈ గ్రంధం రాయడం ఔచిచ్యవంతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ రాజ్ కందుకూరి, శ్రీ జి. హనుమంత రావ్ మరియు వై కె నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుతో వైకాపా ఎమ్మెల్యే భేటీ.. ఎందుకంటే..

వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. మంత్రి దేవినేని ఉమతో కలిసి జలీల్‌ ఖాన్‌ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే ఇప్పడు వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీంతో జలీల్ ఖాన్ టీడీపీలోకి చేరనున్నట్టు అప్పుడే వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై దేవినేని ఉమ మాట్లాడుతూ.. తన నియోజన అభివృద్ధి పనుల నిమిత్తం జలీల్ ఖాన్ చంద్రబాబును కలిశారు అంతేకాని దీనిలో రాజకీయ ఉద్దేశం ఏం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు చంద్రబాబు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలనే కలిశారని.. ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా అభివృద్ధే కోరుకుంటున్నారని అన్నారు.  

మందు బాబులు జర జాగ్రత్త.. తాగితే డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటం.. ఆపై చలాన్లు, కోర్టు కేసులు, అవసరమైతే డబ్బులు చెల్లించి నెట్టుకొచ్చేవారు మందు బాబులు. కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంతకాలం చలాన్లు, కోర్టు కేసులతో నెట్టుకొచ్చిన వారిలో ఎలాంటి మార్పు రావడం లేదని గమనించి కాస్త రూల్స్ గట్టిగానే పెట్టారు. ఈసారి డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడితే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పోలీసులు ఆర్టీఏకు సిఫార్సు చేశారు. అయితే ఈ విషయంలో మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు పోలీసులు. ఒకసారి పట్టుబడితో ఏదో చలాన్లతో సరిపెడతారు కానీ.. వరుసగా మూడు సార్లు  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించి మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి జాబితాను పోలీసులు సిద్ధం చేసి  81 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసినట్లు జేటీసీ రఘునాథ్ వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దయిన వీరంతా తిరిగి మూడు నెలల వరకు మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అనర్హులుగా పరిగణించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెప్పారు.

మరింత క్షీణిస్తున్న హనుమంతప్ప ఆరోగ్యం..

సియాచిన్ హిమపాతంలో ప్రాణాలతో బయటపడ్డ హనుమంతప్ప పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హనుమంతప్ప ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హనుమంతప్పకు వెంటిలేటర్‌ అమర్చి, అన్ని రకాల శక్తివంతమైన జీవనాధార ఔషధాలను ఇస్తున్నప్పటికీ అతడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా హనుమంతప్ప ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని.. అతని కిడ్నీ, కాలేయం పనిచేయడంలేదని.. మెదడుకు కూడా సరిగా ఆక్సిజన్ అందడంలేదని వైద్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రార్ధనలు చేస్తున్నారు.

మేం పని లేకుండా కూర్చున్నామా..? చంద్రబాబు

ప్రభుత్వం అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబు కోప్పడటం సర్వసాధారణమే. పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా తిడతారు. ఇప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులు కూడా ఆయన ఆగ్రహానికి బుక్కయ్యారు. చంద్రబాబు నిన్న జన్మభూమి కమిటీ సభ్యులతో వీడియో  కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడు కొన్ని సమస్యలను చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన మీ మండలం నుంచి ఎంత మంది జన్మభూమి కమిటీ సభ్యులు వచ్చారని ఆయన్ని ప్రశ్నించగా.. దానికి ఆయన  ఇద్దరమే వచ్చామని చెప్పడంతో వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం పని లేకుండా ఇక్కడ కూర్చున్నామా? ప్రభుత్వ పథకాల పట్ల మీకు అవగాహన పెంచి, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేలా చూసేందుకు మిమ్మల్ని కూడా కాన్ఫరెన్సకు రమ్మన్నాం, ఇష్టం లేకపోతే తప్పుకోవచ్చు’ అంటూ జన్మభూమి కమిటీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. దీంతో ఆయన అసలు ఎవరెవరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారో తెలుసుకోవడానికి సీఎం స్వయంగా ఐదు జిల్లాల అటెండెన్స్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.