Big Shock To Ys Jagan Mohan Reddy

ఆయనొస్తున్నాడా? అయితే ఏంటంట?

      నిన్న మొన్నటి వరకు తెలుగు ఛానళ్ళలో ‘ఆయనొస్తున్నాడు’ అనే ప్రకటనలు హడావిడి సృష్టించాయి. ఈ ప్రకటనల సారాంశం ఏంటంటే, సామాన్య ప్రజలకు ఏదో సమస్య వస్తుంది. రాజకీయ నాయకులు ఆ సమస్యని పట్టించుకోరు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రాజకీయ నాయకులు నిర్లక్ష్యంగా మాట్లాడతారు. చివరికి ప్రజల్లో ఓ కేరెక్టర్ రాజకీయ నాయకులని నీచంగా చూస్తూ, చూపుడు వేలు గాల్లోకి తిప్పుతూ ‘ఆయనొస్తున్నాడు’ అంటుంది. ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తుంది.   గత కొంతకాలంగా ఈ ప్రకటన చూసి రాష్ట్రంలో ప్రజలందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ప్రకటనలో కేరెక్టర్ ఆయనొస్తున్నాడు అంటూ గాల్లోకి వేలు తిప్పడం చాలామందికి అర్థం కావడం లేదు. అలా వేలు తిప్పడం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ని సూచిస్తోందా? ఇక మిగిలేది సున్నానే అనే అర్థమా అనేది అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాతగాని అలా వేలు తిప్పడం ఫ్యాన్ గుర్తుకు సింబాలిక్ అని అర్థం చేసుకున్నారు. గత కొంతకాలంగా తెలుగు ప్రజలకు నవ్వుల్ని పంచుతున్న ఈ ప్రకటనలు సడెన్‌గా ఛానెళ్ళలోంచి మాయమైపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు.  తమ నవ్వులకు ఆటంకం కలిగించిన కారణాలేంటా అని పరిశోధిస్తే ఆస్తకికరమైన విషయాలు  తెలిశాయి. వైఎస్సార్సీపీ ఈ ప్రకటనలని అనేక  ఛానెళ్ళలో ప్రసారం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని ఎన్నికల కమిషన్ అభ్యంతర పెట్టింది. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని స్పష్టం చేసింది. ఆయనొస్తున్నాడా? అయితే ఏంటంట? అని చెప్పకనే చెప్పేసింది.

Congress bus yatra

కాంగ్రెస్ ‘తుస్సు’ యాత్ర!

      సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యాత్రని ‘బస్సు’ యాత్ర అని పిలవడం కంటే ‘తుస్సు’ యాత్ర అని పిలిస్తే కరెక్ట్ గా సూటవుతుందని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడితో సహా సీమాంధ్ర కాంగ్రెస్‌లోవున్న ముఖాలన్నీ సీమాంధ్ర ప్రజలు చూడ్డానికి కూడా ఇష్టపడని ముఖాలే. వీళ్ళని చూడ్డానికి ఎవరూ రారు కాబట్టి సినీ గ్లామర్ వున్న చిరంజీవిని వెంట పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఈ బస్సు యాత్ర చప్పచప్పగా సాగుతోంది. ఈమధ్యకాలంలో ఇంత చప్పగా జరుగుతున్న బస్సు యాత్ర మరొకటి లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.   రోజూ కొన్ని ఊళ్ళకి వెళ్ళడం, అక్కడ ఓ ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం, రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ ఒక్కదానిదే కాదు, అన్ని పార్టీలూ ఓకే అన్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ విభజనకి ఒప్పుకుందని చెప్పిన పాయింటే అరిగిపోయిన రికార్డులాగా చెప్పడం.. ఇదే వరస! ఈ ప్రెస్ మీట్స్ లో చిరంజీవి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆయనకు వున్న రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి మీద చిరాకు పెంచి, కిరణ్ కుమార్ మీద అభిమానం పెంచేలా వుంటున్నాయి. రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనం కూడా వుంటుందా అన్నట్టుగా చిరంజీవి ప్రసంగం సాగుతోందని విమర్శకులు అంటున్నారు. కాంగ్రెస్ గర్భంలో కలిసిపోయిన పిఆర్పీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అందరిముందు చిరంజీవిని ఛీకొడుతూ ‘పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదా?’ అని అడిగేయడం, పిఆర్పీ ఐడెంటిటీ కార్డ్ ని ముక్కలు చేసేయడం బాబోయ్ దారుణం. ఇంత జరిగినా చిరంజీవి తుడిచేసుకుని బస్సు యాత్రలో పాల్గొనడం ఇంకా దారుణం.  ఇక రోడ్ షోల విషయానికి వస్తే, వాటికి ‘రోడ్ షో’ లాంటి భారీ మాటలను ఉపయోగించడం అనవసరమన్న అభిప్రాయం కలుగుతోంది. సాక్షాతూ చిరంజీవి వచ్చి రోడ్డు మధ్యలో నిలబడినా పట్టుమని వందమంది కూడా జనం రావడం లేదంటే కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న బస్సు యాత్ర ఎంత తుస్సుమందో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి కాకుండా యాత్రలో పాల్గొంటున్న మిగతా నాయకులను చూసిన సామన్య జనం ‘వీళ్ళెవరబ్బా.. ఎక్కడా చూసినట్టు లేదే’ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సు యాత్రకి బ్రేకులేస్తే బెటరన్న అభిప్రాయాలని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  

CPI Naryana

కమ్యూనిస్టుల కితకితలు!

      ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు తెలుగు ప్రజలకు కితకితలు పెట్టి నవ్వించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. కాకపోతే, వాళ్ళు కితకితలు పెడుతుంటే నవ్వు రావడానికి బదులు ఏడుపు వస్తూ వుండటమే బ్యాడ్‌లక్. నిన్నటి వరకూ ఉప్పూ నిప్పుల్లా వున్న సీపీఎం, సీపీఐ పార్టీలు ఎన్నికలు రాగానే భుజాల మీద చేతులు వేసుకున్నాయి. నిన్నటి వరకూ ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకున్న ఈ రెండు పార్టీల నాయకులు కలసి ప్రెస్ మీట్లు పెట్టి కిలకిలా నవ్వుకుంటూ మీడియాకి పోజులిస్తున్నారు. ఇదిలా వుంటే, సీపీఐ నాయకుడు నారాయణ చిన్నప్పుడు చదువుకున్న ‘తనకు మాలిన ధర్మం మొదలు చెడిన బేరం’ అనే సామెతని మరచిపోయినట్టున్నాడు. అందుకే తనకు సంబంధం లేని పనులని భుజాన వేసుకుని లాభం పొందే ప్రయత్నాలు చేస్తున్నాడు.   ఇంతకీ ఆ పనేంటయ్యా అంటూ, ప్రస్తుతం రాష్ట్రంలో తిట్టిన తిట్టు తిట్టుకోకుండా తెగ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని నారాయణ ప్రకటించాడు. వాళ్ళకి లేని బాధ నీకెందుకయ్యా, మధ్యలో నిన్ను రాయబారి చేయమని ఎవరైనా అడిగారా అనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నాడు. ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తాను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీని కలిపే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరిగే అవకాశం వుందని అంటున్నాడు. నారాయణ గారి బుర్రలో వున్నది తెలంగాణ ప్రజల మేలు కాదని, ఈ రెండు పార్టీలకు సయోధ్య కుదిర్చి రాజకీయంగా లాభం పొందే ఆలోచనలో ఆయన ఉన్నారన్నది ఎంత అమాయకులకైనా అర్థమైపోయే విషయం. అంచేత నారాయణ ఇలాంటి సూపర్ తెలివితేటల ప్రదర్శన మానుకుని నిజంగా జనానికి ఉపయోగపడే విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని విమర్శకులు సలహా ఇస్తున్నారు. ఇదిలా వుంటే, నిన్నటి వరకూ సమైక్యం అని గొంతు చించుకున్న సీపీఎం ఇప్పుడు విభజన కోరుకున్న పార్టీ టీఆర్ఎస్‌తో స్నేహం కుదుర్చుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఈ స్నేహం కోసం ఈ పార్టీ ఎంత దిగజారిందంటే, చివరికి నిన్నగాక మొన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వాగిన చెత్త మొత్తం భేషుగ్గా వుందని కితాబు ఇచ్చింది.  ఇలాంటి రాజకీయాలు నడుపుతారు కాబట్టే కమ్యూనిస్టులు ప్రజలకి దూరమైపోతున్నారు.

 Vimalakka Vs KTR

సిరిసిల్లలో కేటీఆర్‌కి జెల్ల!

      సీమాంధ్రలను తిట్టిపోయడంలో తన తండ్రి కేసీఆర్‌ కంటే నాలుగు తిట్లు ఎక్కువే చదివిన ఘనాపాటి కేటీఆర్ ఈసారి ఎన్నికలలో కూడా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయాలని ఫిక్సయ్యాడు. నిన్నటి వరకూ తన గెలుపు చాలా ఈజీనే అనే ఫీలింగ్‌లో వున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం పరిస్థితి మారిపోయింది. ఈసారి ఎన్నికలలో కేటీఆర్ గెలుస్తాడా, లేదా అనే సందేహాలు బయల్దేరాయి. దీనికి కారణం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సామాజిక ఉద్యమ కార్యకర్త విమలక్క పోటీ చేయాలని ఆలోచిస్తూ వుండటమే. ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే విమలక్కకి జనంలో మంచి ఫాలోయింగ్ వుంది. ఆషామాషీ వాళ్ళని ఈజీగా ఓడించే శక్తి కేటీఆర్‌కి వుందేమోగానీ, తన ప్రత్యర్థి విమలక్క అయితే మాత్రం ఆయనగారి బొచ్చెలో రాయిపడ్డట్టే.. నెత్తిన టెంకెజెల్ల పడ్డట్టే! విమలక్క గనుక సిరిసిల్ల నుంచి పోటీ చేయడం అంటూ జరిగితే అది కేటీఆర్‌కి గండంలా మారే ప్రమాదం వుంది. ఆమెకు ప్రజల్లో, కళాకారుల్లో, తెలంగాణ ఉద్యమ శక్తుల్లో వున్న బలం సామాన్యమైనది కాదు. మొదటి నుంచీ కేసీఆర్, టీఆర్ఎస్‌లను వ్యతిరేకిస్తున్న తెలంగాణ శక్తులు అన్నీ విమలక్కకు మద్దతు ఇచ్చే అవకాశం వుంది. వాళ్ళందరూ సిరిసిల్లో  మోహరించికి కాలికి గజ్జె కట్టారంటే ఆ శబ్దానికే కేటీఆర్ ఎగిరిపోయే అవకాశం వుంది. తమ యువరాజుకి ఊహించని విధంగా ముంచుకొచ్చిన ఈ ప్రమాదం టీఆర్ఎస్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కేటీఆర్ నియోజకవర్గాన్ని మారిస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి.

Chidambaram opts out of Lok Sabha race

చిదంబరం తొక్కలో వేదాంతం!

      బోలెడన్ని జీవాలని పొట్టన పెట్టుకున్న ముసలిపులి శాంతిసూత్రాలు వల్లిస్తే ఎలా వుంటుందో, దేశం నాశనం కావడంలో భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావడంలో సూత్రధారి అయిన చిదంబరం ఇప్పుడు వేదంతం మాట్లాడుతూ వుండటం కూడా అలాగే వుంటుంది. జీవితంలో అన్నీ అనుభవించేసి, తన సొంత రాష్ట్రం తమిళనాడుకు పోటీగా వున్న ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చిన చిదంబరం లేటెస్ట్ గా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళనాడులోని శివగంగా లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని చెప్పాడు. అంత గొప్ప డెసిషన్ తీసుకున్నావేంటి బాబయ్యా అని ప్రశ్నిస్తే చిదంబరం వేదాంత ధోరణిలో సమాధానాలు చెప్పాడు. జీవితంలో అన్నీ చూసేశాను. ఇప్పుడు నాకు 68 ఏళ్ళు వచ్చేశాయి. నేనిక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదలుచుకోవడం లేదు. ఇక శాంతిమార్గంలో నడుస్తూ శేష జీవితాన్ని నెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. తనకి పునర్జన్మల మీద నమ్మకం లేదని, ఈ జన్మలో ఏం సాధించామన్నదే తనకి ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అయ్యగారిలో తొక్కలో వేదాంతానికేం తక్కువలేదు. తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదన్న విషయాన్ని నొక్కి చెబుతూ, యువతరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే శివగంగ స్థానం నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఇంతకీ వచ్చే ఎన్నికలలో శివగంగ స్థానం నుంచి పోటీ చేయబోతున్న యువతరంగం మరెవరో కాదు.. చిదంబరం గారి పుత్రరత్నం కార్తి. తన కొడుకు కోసం ఎన్నికల నుంచి తప్పుకుంటున్న చిదంబరం అదేదో తాను దేశాన్ని ఉద్ధరించడానికి చేసిన పనిలా బిల్డప్పు ఇచ్చుకుంటున్నాడు. ఇలాంటి తెలివితేటలనే తమిళ సాంబార్ తెలివితేటలు అంటారేమో!

tdp

రసవత్తరం.. పశ్చిమ జడ్పీ పీఠం

  పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ప్రాంతంలో సైకిల్ జోరు బాగుండటంతో.. నాయకుల వలసలు కూడా ఎక్కువయ్యాయి. మొన్నటివరకు మూడు రంగుల కండువా కప్పుకొన్న తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో అక్కడి టికెట్ ఆశించిన గూడెం మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజును జడ్పీ చైర్మన్ గా బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. దీంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ సీటు వేరేవారికి ఇస్తున్న నేపథ్యంలో తనకు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే, ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పార్టీ వెనుకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ కూడా ఈ పదవి తనకే కావాలని గట్టిగా పట్టుపడుతుండటం, డీసీసీబీ ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చిన అల్లూరి విక్రమాదిత్య కూడా కుర్చీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిని కాదన్నా మిగిలిన ఇద్దరూ ఒప్పుకునే పరిస్థితి కనిపించటం లేదు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Jaswant Singh hits out

ఈ ఏడుపు సీన్ ఏంటండీ బాబు!

      వయసొస్తే సరిపోదు.. వయసుకు తగ్గ పరిపక్వత కూడా వుండాలి. ప్రస్తుతం వున్న పొలిటికల్ సిట్యుయేషన్‌లో ఈ సలహా తీసుకోవడానికి నూటికి నూరుపాళ్ళు అర్హుల్లో ముందు వరసలో వుండేది ఎవరయ్యా అంటే, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్. ఏనాడో ఏడుపదులు దాటిపోయిన జస్వంత్ సింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి లాంటి పదవులని బోలెడన్నిసార్లు అనుభవించేశాడు. అయినా సరే మరోసారి ఎంపీ టిక్కెట్ రాలేదని భోరున ఏడ్చేశాడు. భారతీయ జనతాపార్టీ ప్రస్తుతం కొత్త రక్తం ఎక్కించుకునే పనిలో వుంది. అందులో భాగంగా జస్వంత్ సింగ్ లాంటి వృద్ధ జంబూకాలకి టిక్కెట్లు ఇవ్వకూడదని డిసైడ్ చేసింది. దాంతో జస్వంత్ సింగ్ చెలరేగిపోయాడు. ఠాఠ్ నాకు టిక్కెట్ ఇవ్వరా అంటూ ప్రెస్‌మీట్ పెట్టిమరీ పార్టీ ఎన్నికల కమిటీని ఎదిరిస్తూ మాట్లాడాడు. మాట్లాడ్డంతో ఆగితే బాగానే వుండేది, ఆ ప్రెస్‌మీట్‌లోనే భోరున ఏడవటం మొదలెట్టి కన్నీళ్ళు తుడుచుకున్నాడు. జస్వంగ్ సింగ్ లాంటి పెద్దమనిషి ఎన్నికల్లో టిక్కెట్ రాలేదని ఇలా ఏడవటం చూసి అక్కడున్నవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. కాసేపు ఏడిచి కళ్ళు తుడుచుకున్న తర్వాత తేరుకున్న జస్వంత్ సింగ్ భాజపా టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదని, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈ ఏడుపేదో భోరున ఏడవకముందు ఏడిస్తే బాగుండేది కదా అని అక్కడున్న అందరూ అనుకున్నారు!

T Congress leaders fire on KCR

కేసీఆర్ తోడేలు కాదు.. నక్క!

      మొన్నటి వరకూ ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్న కొంగలాగా శాంతియుతంగా కనిపించిన కేసీఆర్ లేటెస్ట్ గా మళ్ళీ సీమాంధ్రుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద నోరు చేసుకోవడం మొదలెట్టారు. ఆప్షన్లుండవు.. ఆంధ్రోళ్ళు వెళ్ళిపోవాల్సిందే లాంటి గుండెల్ని మండించే మాటల్ని అటుంచితే, మొన్నటి వరకూ కాంగ్రెస్ వాళ్ళని కీర్తించిన నోటితోనే ఇప్పుడు తెగ తిడుతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తోడేళ్ళ లాంటి వాళ్ళని తేల్చేశాడు. నిజం నిష్టూరంగానే వుంటుంది కాబట్టి కేసీఆర్ అన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది.   తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు మేం తోడేళ్ళం కాదు కేసీఆరే తెలంగాణ ప్రజల్ని మింగడానికి రెడీగా వున్న పెద్ద తోడేలు అని ఎదురుదాడి చేశారు. మొత్తమ్మీద ఒకరినొకరు తోడేళ్ళని తిట్టుకున్నారు. దాంతో ఇద్దరూ తోడేళ్ళే అని, తెలంగాణ ప్రజలే అమాయక గొర్రెలని వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు. ఒకర్నొకరు తిట్టుకున్నారు కాబట్టి ఇక్కడితో ఈ తోడేలు ఎపిసోడ్ ముగిసినట్టేనని రాజకీయ పరిశీలకులు అనుకున్నారు. అయితే మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ఇష్యూని మరికొంత సాగదీశారు. టోటల్ తెలంగాణలో సీమాంధ్రులకు నచ్చే ఇద్దరు నాయకులు జగ్గారెడ్డి, రేణుకా చౌదరి ఈ ఇష్యూలో మరింత ముందుకు వెళ్ళారు. ఎవరు తోడేళ్ళో తెలంగాణ ప్రజలు ఎన్నికల తర్వాత నిరూపిస్తారని, కేసీఆర్‌కి తమ గురించి మాట్లాడేంత సీన్ లేదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తిట్టిపోయడంలో కేసీఆర్‌కి కరెక్ట్ మొగుడులా వుండే జగ్గారెడ్డి మాత్రం కేసీఆర్ తోడేలు కాదని అన్నారు. ఆయనగారు తోడేలు కాదు.. నిఖార్సయిన నక్క అని డిసైడ్ చేశారు. కేసీఆర్ రాజకీయాల్లో తన నక్కబుద్ధిని బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని, గోతికాడి నక్కలాగా లాభం పొందాలని చూస్తున్నాడని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ సీమాంధ్రుల మీద, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద మాటలతో దాడి చేస్తున్న కేసీఆర్ తన నక్కబుద్ధులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.  

political parties

పొత్తులతో బలాబలాలు మార్పులు

  తెదేపా-బీజేపీ-జనసేన-లోక్ సత్తాల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారయినట్లయితే, సీమాంద్రాలో ఆ నాలుగు పార్టీలు బలమయిన కూటమిగా ఏర్పడి, వేర్వేరుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, వైకాపా, జైసపాలను బలంగా డ్డీ కొనవచ్చును. ఇంతవరకు వైకాపా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కానీ మజ్లిస్, సీపీయం పార్టీలు దానితో పొత్తులు పెట్టుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే వారి కూటమికి కూడా కొంత బలపడుతుంది. అప్పుడు కాంగ్రెస్, జైసపాలు ఈ రెండు కూటములను ఎదుర్కొని నిలవలసి ఉంటుంది. అయితే జైసపా, వైకాపాలు రెండూ కూడా ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఆ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున వాటిని కాంగ్రెస్ అనుబంధ పార్టీలుగానే పరిగణించవలసి ఉంటుంది.   తెదేపా కూటమికి చాలా ప్లస్ పాయింట్స్ కనబడుతుంటే, వైకాపా కూటమికి మాత్రం కొన్నే కనబడుతున్నాయి. తెదేపా కూటమిలో చంద్రబాబు, నరేంద్ర మోడీ, జయప్రకాశ్ నారాయణ్ వంటి అనుభవజ్ఞులయిన నేతలు, పవన్ కళ్యాణ్ వంటి మంచి ప్రజాధారణ ఉన్న నటుడు కనబడుతుంటే, వైకాపా కూటమిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ప్రత్యర్ధులతో పోల్చి చూస్తే చాలా విషయాలలో తేలిపోతారు.   ఒకవేళ వైకాపాకి మజ్లిస్ కూడా తోడయితే, ముస్లిం, క్రీస్టియన్ ఓట్లన్నీ వారికే పడవచ్చును. అయితే, బీసీ, యస్సీ, ఎస్టీలు, ఇతర కులస్తులు అందరూ తెదేపా లేదా కాంగ్రెస్ పార్టీల వైపు మొగ్గు చూపవచ్చును. కానీ రాష్ట్ర విభజన చేసినందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారందరూ కూడా విజయవకాశాలున్న బీజేపీతో పొత్తులు పెట్టుకొంటున్న తెదేపాకే ఓటేయవచ్చును. ఈసారి ఎన్నికలలో తెదేపా బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. ఇక కాంగ్రెస్ నుండి భారీగా తరలి వస్తున్న హేమాహేమీల వలన కూడా తెదేపా మరింత బలోపేతమవుతుంటే, అదే కారణంతో వైకాపా వారి ముందు బలహీనంగా కనబడుతోంది.   సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినప్పటికీ, ఇంకా ఆ పార్టీలో హేమహేమీలనదగ్గ నేతలు మిగిలే ఉన్నారు. వారందరూ పార్టీ విజయానికి భరోసా ఇవ్వలేకపోయినా వారు మాత్రం ఎన్నికలలో గెలవగల సత్తా ఉన్నవారే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల మిగిలిన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వగలదు. అయితే పోటీ ప్రధానంగా తెదేపా కూటమికి వైకాపాకి మధ్యనే ఉండవచ్చును.

pitani satyanarayana

ఎన్నికలకు ముందే కిరణ్ పార్టీ ఖాళీ అయిపోనుందా

  గత ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపిస్తున్నపుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన పార్టీ కార్యాలయం ముందు బారులు తీరారు. కానీ ఎన్నికల ముగిసిలోగానే అందరూ మళ్ళీ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. అయితే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరునెలలు మీనమేషాలు లెక్కించి మరీ పార్టీని స్థాపిస్తే ఒక్కరు కూడా వచ్చి చేరడం లేదు, పైగా ఉన్నవారే బయటకి వెళ్ళిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన వెనుకే తిరిగిన అనేక మంది మంత్రులు తెదేపాలో చేరిపోగా, పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా కాదు పొమ్మని శైలజానాథ్ కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయిపోతున్నారు. ఇప్పడు కొత్తగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా తెదేపాలోకి మారిపోయేందుకురంగం సిద్దం చేసుకొంటున్నారు. తెలంగాణాకి ముఖ్యమంత్రి కావలనుకొంటున్న కేసీఆర్ తన అనుచరులచేత అందుకు అనుకూలంగా ఏవిధంగా డిమాండ్ చేయించుకొంటున్నారో, అదేవిధంగా పితాని కూడా తెదేపాలో చేరాలని తన అనుచరుల చేత డిమాండ్ చేయించుకొన్న తరువాత, మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలియజేసారు. అంటే, లాంచనంగా కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ బై చెప్పేసినట్లే అనుకోవచ్చును.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న రోడ్ షోలకి కూడా జనాలను పోగేయడం చాలా కష్టమవుతోందని సమాచారం. బహుశః ఆయన చెప్పే సమైక్యపాటాలు వినేందుకు ఇప్పుడు ఎవరికీ ఆసక్తి లేకపోవడమే అందుకు కారణం అయ్యుండవచ్చును. పరిస్థితి ఇలాగే కొనసాగితే కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలు జరుగక ముందే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయవలసి వస్తుందేమో..పాపం. కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా ఆయన పార్టీని నడిపించుకోగలిగితే, ఆనక ఏ కాంగ్రెస్ గంగలో కలిపేసుకొన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆశ్చర్యపోరు కూడా. కానీ, ఆయన తొందరపడి ఎన్నికల ముందే ఆ పనిచేస్తే మాత్రం ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.

tdp

తెదేపా-బీజేపీ పొత్తులు ఖరారయ్యేనా

  బీజేపీ-తెదేపాలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ, తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. కానీ, ఆ రెండు పార్టీలు కూడా తెరవెనుక ఆ విషయంపై చాలా కసరత్తు చేస్తున్నట్లు, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తాజా ప్రకటనతో స్పష్టమయింది.   ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెదేపాతో పొత్తులకు ఆసక్తిగా ఉందని, అందువలన రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ సీమాంధ్రలో ఎనిమిది లోక్ సభ, ఇరవైఐదు శాసనసభ స్థానాలను తెదేపా నుండి ఆశిస్తోందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణాలో కూడా ఇరు పార్టీల బలాబలాలను బట్టి సీట్లు కేటాయించమని తెదేపాను కోరినట్లు తెలిపారు. అంతేగాక తెలంగాణాకి ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం కూడా తమ పార్టీకే ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.   ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తెదేపాలో కల్లోలం సృష్టించే ప్రమాదం ఉంది. చిరకాలంగా పార్టీలో ఉన్నవారు, కాంగ్రెస్ నుండి వరదలా వచ్చి చేరుతున్న నేతలకి టికెట్స్ కేటాయించకుండా, పొత్తుల కోసమని బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తేదేపాకు చాలా కష్టమే. అయితే, బీజేపీ ప్రధాన లక్ష్యం కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడమే తప్ప రాష్ట్రంలో అధికారం సంపాదించడం కాదు గనుక, తేదేపాకు అనుకూలంగానే సీట్ల సర్దుబాట్లకు అంగీకరించవచ్చును.   ఇక తెలంగాణాలో బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకొన్నారు. అంతే గాక బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్, కృష్ణయ్యను తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కనుక, ఈవిషయంలో కూడా బీజేపీ తెదేపాతో రాజీ పడక తప్పదు.   ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణాలలో నెలకొన్న తీవ్రమయిన పోటీ వాతావరణంలో, తెదేపా-బీజేపీలు పొత్తులపై ఒక అంగీకారానికి రాలేకపోయినట్లయితే అవే తీవ్రంగా నష్టపోవడం తధ్యం. అందువలన ఆ రెండు పార్టీలు వీలయినంతమేర ఇచ్చి పుచ్చుకొనే ధోరణినే పాటిస్తూ పొత్తులు ఖరారు చేసుకోవడం తధ్యం. తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ వారు కూడా పార్టీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయిష్టంగా అయినా తెదేపాతో పొత్తులకు అంగీకరించక తప్పదు.

bjp

పొత్తుపై ముందు.. వెనక

   టీడీపీతో పొత్తు విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీతో కలిసి సాగాలా.. వద్దా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ బలహీనపడిందని, పొత్తు లాభదాయకం కాదని ఓ వర్గం వాదిస్తుండగా.. టీడీపీ మద్దతుతో ఎక్కువ సీట్లు సాధించవచ్చునని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ వద్ద తెలంగాణ కమలనాథులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ హైదరాబాద్ నగర శాఖ పొత్తుకు అనుకూల అభిప్రాయాన్ని చెప్పగా, జిల్లాల నుంచి వచ్చిన నేతల్లో ఎక్కువ మంది పొత్తు వద్దని స్పష్టం చేశారు.   జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉన్నందున దేశంతో పొత్తు అవసరం లేదని కొందరు యువనేతలు వ్యాఖ్యానించారు.మరికొందరు ఎలాంటి నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నిర్ణయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికే వదిలిపెట్టారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవడంతో జవదేకర్ ఒకింత అసహనం ప్రదర్శించారు. తమిళనాడులో ఐదు పార్టీలతో కూటమిగా మారామని, ఇక్కడ మాత్రం ఇంత అయోమయం ఎందుకన్నట్టుగా వ్యాఖ్యానించారు. స్థానిక నేతలు స్పష్టమైన అభిప్రాయానికి రానిపక్షంలో జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయాన్ని తేల్చేస్తామని ప్రకటించారు.

pawan kalyan

మోడీకి జై కొట్టిన పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అహ్మదాబాద్ వెళ్లి బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసారు. దాదాపు గంటసేపు సాగిన వారి సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తన జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిరువురూ రాష్ట్ర రాజకీయాలు, విభజన జరిగిన తీరు గురించి చర్చించుకొన్నట్లు తెలిపారు.   పవన్ కళ్యాణ్ తాను అధికారం కోసం రావడం లేదని ముందే స్పష్టం చేస్తున్నందున, ఆయన వలన బీజేపీకి లాభమే తప్ప నష్టమేమి ఉండదు. ఆయన మద్దతుతో ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా బీజేపీకి చాలా లాభం చేకూరుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు తెలంగాణాలో కూడా చాలా మంది అభిమానులున్నపటికీ, వారిలో చాలా మంది చిరంజీవి తెలంగాణా వ్యతిరేఖ ధోరణి వలన ఆయనకి దూరమయ్యారు. అయితే నేటికీ వారిలో చాలా మంది పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చూపుతూనే ఉన్నారు. గనుక పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఇక సీమాంద్రాలో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన మాటే వేద వాక్కు గనుక అక్కడ కూడా బీజీపీ లాభపడుతుంది.   పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు మ్రోగ్గు చూపినందున, ఇంతవరకు సీమాంద్రా ప్రజలలో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేఖత కూడా కొంత తగ్గుముఖం పట్టవచ్చును. గనుక తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులకు మార్గం సుగమం అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నట్లు సూచించారు గనుక ఇక ఈ మూడు పార్టీలు చేతులు కలపడం తధ్యం. దీనితో ఇంతవరకు ఆంద్ర, తెలంగాణాలలో రాజకీయ పార్టీల బలాబలాలలో తీవ్ర అంతరం ఏర్పడుతుంది కూడా.   ఇంతవరకు సీమాంద్రాలో తెదేపా-వైకాపాలు రెండూ సమవుజ్జీలుగా నిలుస్తూవచ్చాయి. కానీ, ఇప్పుడు శక్తివంతులయిన, ప్రజలను ప్రభావితం చేయగల ముగ్గురు వ్యక్తులు-చంద్రబాబు, నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ చేతులు కలిపినట్లయితే, జగన్మోహన్ రెడ్డి వారిని తట్టుకొని విజయం సాధించడం దాదాపు అసంభవమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఉన్నందున, అతనికీ కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్న రహస్య అవగాహన కూడా వైకాపాకు ఒక ప్రతిబందకంగా మారవచ్చును.   మోడీ, చంద్రబాబు ఇరువురూ మంచి పరిపాలనా దక్షులు, రాజకీయ అనుభవజ్ఞులు కాగా, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పాలనానుభవం లేకపోగా అతని నేర చరిత్ర, సీబీఐ,ఈడీ కేసులు ఆయన పార్టీకి శాపంగా మారే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి ప్రజాధారణ ఉన్నపటికీ, అది పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ కాదు. ఎందువలన అంటే పవన్ కళ్యాణ్ తన ఉన్నత వ్యక్తిత్వంతో, తన సినిమాల ద్వారా ప్రజాధారణ పొందితే, జగన్ మాత్రం చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొంటున్నట్లుగా నేటికీ తన తండ్రి వైయస్సార్ మరణం తాలూకు సానుభూతి ద్వారానే ప్రజాధారణ పొందే ప్రయత్నం చేయడమే అందుకు కారణం. ఇక దేశ వ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనం, చంద్రబాబు, మోడీలమధ్య ఉన్న సత్సంభందాలు వగైరా అంశాలు కూడా ఈ కూటమికి వైకాపాపై స్పష్టమయిన ఆధిక్యత ఏర్పరచవచ్చును. అయితే తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంత మాత్రమే గనుక ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చును. కానీ ఆయన మద్దతు వలన తెదేపా, బీజేపీలకు ఎంతో కొంత లాభమే తప్ప నష్టం మాత్రం జరగదని చెప్పవచ్చును. కానీ, ఈ మూడు పార్టీలు ఒకబలమయిన కూటమిగా ఏర్పడి వేర్వేరుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, తెరాసల విజయావకాశాలకు తప్పకుండా గండి కొట్టగలవు.  

chandrababu

కృష్ణయ్యే తెదేపా తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్దా?

  చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ఎన్నికలలో విజయం సాధించేందుకు, తమ పార్టీని గెలిపిస్తే బీసీ కులాలకు చెందిన వ్యక్తిని తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత ఆయన బీసీ సంఘాల నేతలతో సమావేశమయినప్పుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆ వెనువెంటనే బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తన అనుచరులతో కలిసి త్వరలోనే తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు కృష్ణయ్యను తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. నిన్న జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆ వార్తలను దృవీకరిస్తున్నట్లే కృష్ణయ్య మాట్లాడటం గమనిస్తే, చంద్రబాబు ఆయననే తమ పార్టీ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఖరారు చేసి ఉండవచ్చనని నమ్మకం కలుగుతోంది.   కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణాలో 60-80 శాతం మంది బీసీలున్నపుడు, తెదేపా ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే దానిని కాంగ్రెస్, తెరాసలు ఎందుకు తప్పుబడుతున్నాయని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ముందు తమ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లను ప్రకటించి, అప్పుడు తెదేపా గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.   రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకొన్న ఈ బీసీ ఎత్తుగడ చాలా మంచి ఫలితాన్నే ఇచ్చే అవకాశాలున్నపటికీ, ఇంతకాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్న ఎర్రబెల్లి, రేవూరి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి వంటి అనేకమంది తెదేపా సీనియర్ నేతలు ఇదే కారణంగా ఆగ్రహం చెందవచ్చును. మరి చంద్రబాబు వారందరినీ కాదని కనీసం ఇంతవరకు పార్టీలో ప్రాధమిక సభ్యత్వం కూడా లేని కృష్ణయ్యకు ఏవిధంగా ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దపడుతున్నారో, పార్టీలో సీనియర్లను ఏవిధంగా బుజ్జగించగలరో ఊహించడం కష్టమే.   సర్వ సాధారణంగా చంద్రబాబు ఏ కీలక నిర్ణయం తీసుకొన్నా అది తాత్కాలిక ప్రయోజనాల కోసం కాక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకొంటారు. వాటిలో చాలా వరకు ఆయన ఆశించిన విధంగానే ఫలితాలు వచ్చాయి. అందువలన ఇప్పుడు కూడా ఆయన కృష్ణయ్య పేరును ప్రతిపాదించి ఉండి ఉంటే, అందుకు తగ్గట్లుగానే ఆయన పార్టీ నేతలను ముందుగానే సన్నధం చేసే ఉండి ఉండవచ్చునని అనుకోకతప్పదు.

pawan kalyan

పవన్, మోడీ,బాబు చేతులు కలిపితే...

  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్తాపిస్తున్నట్లు ప్రకటించగానే దేనినయినా రాజకీయ రంగు కళ్ళద్దాలలో నుండి మాత్రమే చూసేందుకు బాగా అలవాటు పడిపోయిన అనేకమంది రాజకీయ విశ్లేషకులు ఎన్నికల తరువాత పవన్ స్థాపించిన జనసేన కూడా చిరంజీవి యొక్క ప్రజారాజ్యంలాగే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని నిర్దారించేసారు. వారేగాక సీపీయం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కూడా అదేవిధంగా అభిప్రాయపడ్డారు. కానీ వారందరి ఊహాగానాలను వమ్ము చేస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ లాగే నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీని దేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టేయాలని పట్టుదలగా ఉన్నారు. అటువంటి వ్యక్తితో, పార్టీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపాలనుకోవడం చూస్తే పవన్ జనసేనను, చిరంజీవి ప్రజారాజ్యంతో పోల్చలేమని, అదేవిధంగా ఆ అన్నదమ్ముల ఆలోచనా సరళిలో చాలా వైర్ద్యం ఉందని స్పష్టమవుతోంది.   చిరంజీవి తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, తనను, తన ప్రజారాజ్యాన్నినమ్ముకొన్న వారినందరినీ నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి, సోనియాగాందీ ముందు సాగిలపడి తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే, పవన్ కళ్యాణ్ ఆయనకు పూర్తి విరుద్దంగా తనకసలు ఏ పదవి మీద వ్యామోహం లేదని అసలు ఎన్నికలలో పోటీ చేస్తానో లేదో కూడా చెప్పలేనని ప్రకటించారు. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలందరూ సక్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో విభజన రాజకీయాలను ఎండగట్టి, అందుకు కారకురాలయిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తానని శపథం చేయడమే కాకుండా, తన ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీని కలవనున్నారు.   మూలిగే ముసలి నక్క వంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా దానిని గెలిపించే బాద్య భుజానికెత్తుకొన్నఆయన సోదరుడు చిరంజీవికి ఇది మరొక పెద్ద షాక్ అని చెప్పవచ్చును. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా వారికి తోడయితే, వారి కూటమి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం. నరేంద్రమోడీ, చంద్రబాబులకు వారి కార్యదక్షత, సమర్ధ పరిపాలనానుభావం అనుకూలాంశాలు అయితే, వారికి పవన్ కళ్యాణ్ కున్న అపారమయిన ప్రజాధారణ, స్టార్ ఇమేజ్ మరింత కలిసి వస్తుంది. వీరు ముగ్గురు చేతులు కలిపినట్లయితే, రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ సమీకరణాలు మారినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కొద్దో గొప్పో విజయావకాశాలు ఉన్నాయనుకొంటున్న తెలంగాణాలో కూడా ఇకపై కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులను వెతుకొనే దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ తెరాసతో పొత్తులకు గట్టిగా ప్రయత్నించవచ్చును. లేదా తనకు అలవాటయిన పద్దతిలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆధాయపన్ను శాఖ తదితరులను ఉసిగొల్పినా ఆశ్చర్యం లేదు.

బొబ్బిలి యుద్ధానికి వీరులేరీ?

  విజయనగరం జిల్లా బొబ్బిలి అనగానే.. ఒక్కసారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బొబ్బిలి యుద్ధం నాటి వీరగాధలు కళ్లముందు కదలాడతాయి. కానీ అదంతా గత వైభవం. ఇప్పుడక్కడ యుద్ధాలు కాదుకదా, ఎన్నికల్లో పోరాడేందుకు కూడా వీరులు కనిపించడంలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు.   మున్సిపల్ ఎన్నికలకు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టకపోతే పార్టీ లేదనుకుంటారేమోనని కొన్ని వార్డుల్లో ఎవరో ఒకరిని పోటీకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ఆ పరిస్థితి గ్రామాల్లోకి వెళ్లే సరి కి తారుమారైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చే యడానికి అభ్యర్థులే లేని గడ్డు పరిస్థితి ఎదురైంది.   నిజానికి తొలినుంచి కాంగ్రెస్‌ పార్టీకి బొబ్బిలిలో మంచి పట్టుంది. డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా అదే పార్టీ నుంచి విజయం సాధించగా, బొబ్బిలి ఎంపీలు కూడా అఖండ మెజార్టీతో అదే పార్టీలో ఉంటూ గెలిచేవారు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీకి సుజయ్‌కృష్ణ రంగారావు రాజీనామా చేసిన తరువాత కేడర్ కూడా ఆయన వెంట వెళ్లడంతో పరిస్థితి మరీ దిగజారిపోయింది. రామభద్రపురంమండలంలో టీటీడీ బోర్డు సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ స భ్యుడు అప్పికొండ శ్రీరాములు నాయుడు, తెర్లాంలోని నర్సుపల్లి బాబ్జీరావు, బొబ్బిలిలోని ఇంటి గోపాలరావు వంటివారే పార్టీ ని లాగేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ సమయలో టీడీపీ నుంచి ప్రభుత్వ మాజీ విప్ శంబంగిని తెచ్చారు. కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే.. ఇంతలో రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నుంచి ఆ పార్టీని వదిలేసి నాయకులంతా వెళ్లిపోయారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరి స్థితి ఏర్పడింది. రామభద్రపురంలో 14 స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కా గా, బాడంగిలోని 14 స్థానాలకు ఒకటే నా మినేషన్ వేశారు. తెర్లాం మండలంలో 17 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేశారు.

చంద్రబాబు బీసీ మంత్రం ఫలిస్తుందా?

  రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలంగాణాలో బాగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని తిరిగి బలపరిచేందుకు చంద్రబాబు మళ్ళీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్, తెరాసలపై పైచేయి సాధించేందుకు ఆయన మొట్ట మొదటగా చేసిన ‘బీసీ ముఖ్యమంత్రి’ ప్రతిపాదనతో ఊహించినట్లే ఆ రెండు పార్టీలలో కలకలం చెలరేగింది. అందుకే కేంద్రమంత్రి జైరామ్ రమేష్ తమ పార్టీ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హడావుడిగా ప్రకటించి ఆనక నాలుక కరుచుకొన్నారు. అయితే, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులెవరూ చంద్రబాబు ఉచ్చులో పడలేదు, పైగా మాటల మాంత్రికులైన వారందరూ పోలవరం, ఉద్యోగులు, నదీ జలాల పంపకాలు తదితర సున్నితమయిన అంశాలను లేవనెత్తి దానిపై తెదేపా వైఖరి ఏమిటో చెప్పమని నిలదీస్తూ చంద్రబాబునే ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ, చంద్రబాబు కూడా వారి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. అందుకే బీసీ, యువ మంత్రాలు జపిస్తున్నారిప్పుడు. ఆయన రెండు రోజుల క్రితం బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి వారికి 50శాతం టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చి వారిని తెదేపా వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు.   త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నట్లు సూచన ప్రాయంగా ప్రకటించారు. ఆయననే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, పార్టీకి ఇంతకాలం సేవ చేసిన వారిని కాదని కొత్తగా పార్టీలో చేరుతున్న ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారని భావించలేము. అలా చేసినట్లయితే చంద్రబాబు ఒక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించి మరో కొత్త సమస్యను సృష్టించుకొన్నట్లవుతుంది గనుక అటువంటి ఆలోచన చేయకపోవచ్చును.   ఈసారి ఎన్నికలలో బీసీలను, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గనుక సఫలమయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణాలో పుంజుకోవచ్చును. ఒకవేళ తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారు అయినట్లయితే, అప్పుడు తెదేపా మరింత బలడుతుంది. అప్పుడు పోటీ ప్రధానంగా తెరాస, తెదేపా-బీజేపీ కూటమిల మధ్యనే జరుగుతుంది గనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో అధికారం చెప్పట్టడం కోసం కాక, మూడో స్థానం కోసం పోటీ చేసే దుస్థితికి దిగజారవచ్చును. రాష్ట్ర విభజన చేసి బీజేపీ, తెదేపా, తెరాసలను దెబ్బతీద్దామని దురాలోచన చేసి అంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు ప్రయోగిస్తున్న బీసీ ఆయుధం, కేసీఆర్ ప్రయోగిస్తున్న తెలంగాణా సెంటిమెంటు దెబ్బకీ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆశ్చర్యం లేదు.

ముందే విషం చిమ్మిన కేసీఆర్

      రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విషం చిమ్మారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని విభేదాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఒకవేళ తాము అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ ప్రాజెక్టులు నిండితేనే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లిస్తామని కుండ బద్దలుకొట్టేశారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వాళ్లు తమతమ ప్రాంతాలకు వెళ్లి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారు. ‘‘మా తెలంగాణ ప్రాజెక్టులు నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకం.. ఇవన్నీ నిండిన తరువాత నీళ్లు మిగిలితే..అక్కడి అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామే గానీ.. లేకపోతే నీళ్లు తీసుకుపోనీయం. పోలవరం కోసం సీమాంధ్రలో కలపాలని చెప్పి ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించిన ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మేం ప్రాజెక్టు యథాతథంగా కడతామంటే దానిని వ్యతిరేకిస్తాం. డిజైను మార్చాలని డిమాండ్ చేస్తున్నం. ఏడు మండలాలు ఖచ్చితంగా తెలంగాణలోనే ఉండాలే. సుప్రీంకోర్టుకు పోయి అయినా, ఉద్యమం చేసైనా సరే,  చివరిదాకా పోరాడతం. అక్కడ ఉన్న గిరిజనులను కాపాడతం. డిజైను మార్చకుండా ఆ ప్రాజెక్టును కట్టనీయం.తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ గవర్నమెంట్‌లో పనిచేయాలి. ఆంధ్ర ఉద్యోగులు వాళ్ల గవర్నమెంట్‌లో పనిచేయాలి.వేరే ఆప్షన్లు ఉండయి. చంద్రబాబూ.. ఇక్కడ కూడా నా గవర్నమెంట్ వస్తదంటున్నవు. నీ బొంద.. నీ గవర్నమెంట్ కాదు కదా, నెత్తి కొట్టుకున్నా ఈడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ధాంధీం అని మాట్లాడి, ఒక అబద్ధం నూరుసార్లు చెప్పి, ఏదో చేయాలని ప్రయత్నంలో ఉన్నడు. చంద్రబాబు మనకు కొట్టిన గుండు చాలదా? ఇంకా మనం బుద్ధి లేకుండా ఉన్నామా? మన తలరాత మనమే రాసుకోవాలి. చంద్రబాబు ఓయ్ ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లు అని చెప్తుండు. జపాన్  పోయి వచ్చి జపాన్ చేస్తాన న్నాడు. చైనా పోయి వచ్చి చైనా చేస్తానన్నాడు. సింగ పూర్ పొయి వచ్చి సింగపూర్ చేస్తానన్నాడు. చివరకు ఆయనకు పిచ్చి లేచిపోయి స్క్రూ లూజ్ అయిపోయి మాట్లాడుతుండు. జపాన్, సింగ పూర్ కాలేదు కానీ, చంద్రబాబు మెంటల్ మాత్రం ఖరాబ్ అయింది. అన్నీ పిచ్చి కూతలు కూస్తున్నడు’’ అంటూ తనదైన శైలిలో, తనదైన స్థాయిలో కేసీఆర్ మాట్లాడారు.

తిలాపాపం తలా పిడికెడు.. సీమాంద్రాలో మాత్రమే

      కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారం తలకెత్తుకొనప్పుడు మొదట తన అభిప్రాయం, వైఖరి చెప్పకుండా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నుండి లేఖలు తీసుకొంది. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను బ్లాక్ మెయిల్ చేస్తోంది. అంతే గాక, అన్ని పార్టీలు విభజనకు అంగీకరించిన తరువాతనే తమ పార్టీ విభజనకు పూనుకొందని అందువల్ల ఎవరూ తమ పార్టీని తప్పు పట్టలేరని, ఒకవేళ తప్పు పట్టదలిస్తే లేఖలు ఇచ్చిన అన్ని పార్టీలను కూడా తప్పు పట్టాలని, ఈ వ్యవహారంలో తిలా పాపం తలా పిడికెడు అని వితండవాదం చేస్తోంది. కానీ, తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా వాదన చేస్తోంది. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొన్న సోనియా గాంధీ వారికిచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఏర్పాటు చేసారని టీ-కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం గురించి అందరికీ తెలుసు. సీమాంద్రాలో ఈ పాపంలో అందరికీ భాగం ఉందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మాత్రం ఆ పాపంలో (?)ఎవరికీ వాటా పంచి ఇచ్చేందుకు సిద్డంగా లేదు. తమది జాతీయ దృక్పధం ఉన్న గొప్ప పార్టీలని గర్వంగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఇదే రకమయిన ద్వంద విధానం అవలంభిస్తూ రెండు ప్రాంతాల ప్రజలను మభ్యపెడుతున్నాయి.   రెండు ప్రాంతాలలో తమ రాజకీయ ప్రత్యర్ధులను బట్టి వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తూ, ప్రజల భావోద్వేగాలను అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి. అందువల్ల ఉభయ ప్రాంతాల ప్రజలు కూడా వారి మాటల గారడీకి లొంగిపోకుండా, విజ్ఞతతో వ్యవహరించి తమ తమ ప్రాంతాలకు మేలు చేకూర్చగల ప్రతినిధులను, పార్టీలను మాత్రమే ఎన్నుకోవలసి ఉంది.