Pawan Vs Chiru

తమ్ముడికి బాటలో ముళ్ళు పరుస్తున్న మెగా అన్నయ్య

      మెగా సోదరుడు నాగబాబు తమకు చిరంజీవి అన్నయ్యే రాజబాట పరిచారని చెపుతుంటే, ఆయన మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంచుకొన్న కొత్త బాటలో ముళ్ళు పరుస్తూ అతనిని కుటుంబంలో, రాజకీయాలలో సమాజంలో కూడా ఒంటరివాడిని చేయాలని ప్రయత్నించడం చాలా విచారకరం. ఆయన పదవుల కోసం ఆరాటపడుతూ ఇప్పటికే తన మెగా ఇమేజ్ పూర్తిగా డేమేజ్ చేసుకొని, ఇప్పుడు తమ్ముడు పవన్ పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. చిరంజీవి స్వయంగా తన అభిమాన సంఘాల నేతలకు ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెప్పడం, బహుశః ఆయనకు ఎటువంటి బాధ కలిగించకపోవచ్చు గాక, కానీ వారి అభిమానుల మనసులు మాత్రం నొప్పిస్తోంది. అందుకే అనేక మంది ఆయన మాటను కాదని పవన్ కళ్యాణ్ వెంట వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పుడు వారి వద్ద కూడా ఆయన తన గౌరవం పోగొట్టుకోవడమే గాక తమ్ముడితో బాటు వారిని కూడా దూరం చేసుకొన్నట్లయింది.   అయితే పవన్ కళ్యాణ్ తన ప్రయత్నంలో సఫలమయినా, విఫలమయినా, చిరంజీవి మాత్రం ప్రజల, అభిమానుల దృష్టిలో దోషిగా తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడటం ఖాయం. పవన్ తన ప్రయత్నంలో సఫలమయితే, స్వయంగా అన్నఅయ్యి ఉండి కూడా చిరంజీవి ఆయనకు అడ్డంకులు సృష్టించారని, అయినా వాటినన్నిటినీ అధిగమించి విజయం సాధించారని అందరూ చెప్పుకొంటారు. దురదృష్టవశాత్తు ఒకవేళ పవన్ కళ్యాణ్ తన ప్రయత్నంలో విజయం సాధించలేకపోతే, అప్పుడు కూడా ఆయనకు అడ్డంకులు సృష్టించినందుకు ప్రజలు, అభిమానులు చిరంజీవినే నిందించడం ఖాయం. ఈవిషయం గ్రహిస్తే ఆయన అటువంటి ప్రయత్నాలు చేసి ఉండరు.    

chiranjeevi

చిరు అన్నయ్యకు చిక్ బళ్లాపూర్ లేనట్లే

      రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేసి నెగ్గడం కష్టమని, అందువల్ల కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ నుంచి బరిలోకి దిగాలని భావించిన కేంద్ర మంత్రి చిరంజీవికి చుక్కెదురైంది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ, మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకే కాంగ్రెస్ పార్టీ కేటాయించేసింది. దాంతో చిరంజీవి అన్నయ్య మరో స్థానం వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బెంగళూరుకు సమీపంలోని చిక్ బళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి చిరంజీవి బరిలోకి దిగుతారని ఇంతకుముందు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవి విజయం సాధించే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ రెండో జాబితాతో వాటికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది.

janareddy

‘జానా‘.. బెత్తెడేనా?

  ఎప్పుడు ఏ సమావేశం జరిగినా పెద్దమనిషిలా, పెద్ద విగ్రహంతో కనిపించే జానారెడ్డి ఇప్పుడు చిన్నబోయారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాను కీలక పాత్ర పోషిస్తానని ఆయన భావించారు. కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కూడా ఓ దశలో ప్రచారం చేసుకున్నారు. మొదటి తెలంగాణా పీసీసీ పదవి తనకే దక్కుతుందని ఎదురు చూశారు. ఇప్పుడు అన్నీ అడియాసలయ్యాయి. కీలక పాత్ర కాదు కదా, చివరకు ఏ పాత్రా ఆయనకు దక్కేలా కనిపించట్లేదు. తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవిని పొన్నాల లక్ష్మయ్యకు ఇచ్చేశారు. తెలంగాణాకు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు. దాంతో ఎన్నో కలలు కన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం మంత్రిగా కొనసాగిన రికార్డు ఉన్న జానారెడ్డి ఒక్కసారిగా డీలాపడ్డారు.   నిజానికి తెలంగాణా జేఏసీ ఏర్పాటులో జానారెడ్డిదే కీలకపాత్ర. అప్పట్లో రాష్ట్ర సాధనకు అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలంటూ ఆయన పెద్దమనిషి పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో అదికాస్తా టీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లు కూడా ఆయనను కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేస్తున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు.   ఇదంతా ఒక ఎత్తయితే, జానారెడ్డికి ఇంటిపోరు కూడా ఎక్కువైంది. జానా వారసుడుగా రఘువీర్‌ రాజకీయాలలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న డిమాండ్ ఇంట్లోనుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న రాహుల్ ఫార్ములాతో అసలుకే ఎసరు వస్తుందేమోనని ఆందోళన పడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యం తెలంగాణా రాష్ట్రంలో కూడా నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో రఘువీర్‌ కు రాజకీయ వారసత్వం అప్పగించి రిటైర్‌ కావాలని జానారెడ్డి అనుకుంటున్నట్లు వినవస్తోంది.

tadepalligudem

రసవత్తరంగా గూడెం రాజకీయాలు

  తాడేపల్లిగూడెం.. ఈ పట్టణం పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయాలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ మునిసిపల్ చైర్మన్ దగ్గర్నుంచి ఎమ్మెల్యే వరకు ఏ ఎన్నిక జరిగినా రాజకీయాలు రసవత్తరంగా మారుతూనే ఉంటాయి. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 85లో ఎర్రా నారాయణస్వామి, 89, 94లలో పసల కనకసుందరరావు, మళ్లీ 99లో ఎర్రా నారాయణస్వామి ఇక్కడ టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో 99 ఎన్నిక బాగా ఉత్కంఠభరితంగా సాగింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ బాగా బలమైన అభ్యర్థి అని ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తర్జనభర్జన పడి.. నారాయణ స్వామిని పిలిపించి మరీ పోటీ చేయించారు. అప్పటికి ఆయనతో పోలిస్తే కొట్టు సత్యనారాయణ యువకుడు కావడం, ప్రచారం ఉధృతంగా చేయడంతో ఫలితాలను ఎవరూ ఊహించలేపోయారు. చివరకు ఎర్రా నారాయణస్వామే గెలిచారు.   తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైఎస్ హవాతో కొట్టు సత్యనారాయణ గెలిచారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా ఈలి నాని, కాంగ్రెస్ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, టీడీపీ నుంచి ముళ్లపూడి బాపిరాజు పోటీపడ్డారు. ముగ్గురికీ 40వేల ఓట్లకు పైగానే వచ్చాయి. బాపిరాజుకు 41282 ఓట్లు రాగా, కొట్టు సత్యనారాయణకు 45727 వచ్చాయి. 3020 ఓట్ల తేడాతో.. అంటే 48747 ఓట్లు సాధించిన ఈలి నాని విజేత అయ్యారు. తర్వాత పీఆర్పీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడంతో ఇప్పుడాయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. అయితే.. ప్రస్తుత రాజకీయం మరింత చిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అటు కొట్టు సత్యనారాయణ గానీ, ఇటు ఈలి నాని గానీ సుముఖంగా లేరు. ఒక దశలో జగన్ పార్టీలోకి కొట్టు వెళ్తారనుకున్నా, అక్కడ అప్పటికే తోట గోపికి టికెట్ దాదాపుగా ఖరారు కావడంతో ఊరుకున్నారు.   ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోనన్న విషయం మంచి ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా పోరాడిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీ టికెట్ కోసం కొట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజు, ఎర్రా నారాయణస్వామి మనవడు ఎర్రా నవీన్ లకు ఈ రాజకీయాలతో దిమ్మ తిరిగిపోతోంది.

chiranjeevi

ఛలో చిక్బల్లాపూర్ అంటున్న చిరు?

  కాంగ్రెస్ తురుపుముక్క మడత పడిపోయిందా? సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా కాడి భుజానికెత్తుకొన్నమెగాజీవిని వీరప్ప మొయిలీ కర్ణాటకకి లాక్కుపోనున్నారా? లేక పోతే మొయిలీని తప్పించేసి ఈ జీవే అక్కడి నుండి పోటీ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కన్నడ నాట వెబ్ సైట్లలో దొరుకుతున్నాయి. జగన్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే, తాను నిలబెడతానని కాంగ్రెస్ అధిష్టానం అడక్కుండానే తొడ కొట్టి భరోసా ఇచ్చిన చిరంజీవి అంటే టెన్ జనపథ్ యజమానికి భలే అభిమానం అట!   ఆ అభిమానంతోనే, ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి కావలసిన అంతటి మహావ్యక్తిని అంతకు ఏమాత్రం తీసిపోని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేసింది కాంగ్రెస్ అధిష్టాన దేవత. ఆ మెగాజీవి రాష్ట విభజన నిర్ణయాన్ని పైపైన వ్యతిరేకిస్తూ, లోలోన మాత్రం తమకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు రాజమాత, యువరాజులవారు ఇరువురూ కూడా ఆయన పట్ల చాలా ప్రసన్నం అయినప్పటికీ, సరిగ్గా అదే కారణంతో సీమాంధ్ర ప్రజలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేఖత గూడు కట్టుకొని ఉందని, అందువల్ల ఆయనకు ప్రచార భాధ్యతలు అప్పగించడం వలన రివర్స్ ఎఫ్ఫెక్ట్స్ కనబడతాయని, ఆయన ఇమేజుకి తోడూ యువరాజావారి ఇమేజు కూడా తోడయితే ఇక తిరుగే ఉండదని కాంగ్రెస్ నేతలే ఒకరి చెవులు మరొకరు పరపరా కోరికేసుకొంటున్నట్లు గాలి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టమయింది గనుక ఆ జీవినే నమ్ముకొని ముందుకు వెళ్ళేలా ఉంది.   అయితే చిరంజీవి వచ్చి చెయ్యేస్తే చాలు మళ్ళీ నాకు యంపీ సీటు కన్ఫర్మ్ అని కేంద్ర మంత్రి వీరప్ప మోయిలీగారు ఆశలన్నీ మెగా జీవిపైనే పెట్టేసుకోన్నారుట. ఈ సారి కర్ణాటకలోని చిక్బల్లాపూరు నుండి పోటీ చేస్తున్న ఆయన ఈ చిరు జీవి అండతో ఎన్నికల వైతరిణిని దాటేయాలని ఆశడుతున్నట్లు కన్నడ వెబ్ సైట్లన్నీ కాకుల్లా గోలగోల చేసేస్తున్నాయి. అందుకు అవి మంచి రీజనింగ్ పాయింటు కూడా చెపుతున్నాయి.   చిరంజీవీ ఎందుకంటే.. చిక్బల్లాపూర్ లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అందులోనూ బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ వారికి చిరు గురించి ఇంకా చాలా గొప్ప అభిప్రాయాలే ఉన్నాయిట! వారు ఇంకా త్రేతాయుగంలోనే ఉండిపోయినట్లుగా నేటికీ ఆయన అభిమాన సంఘాలు, బ్లడ్ బ్యాంకులు, సమాజ సేవ, దానగుణం వగైరా సీనుల వద్దనే ఆగిపోవడంతో, విలీనమే మార్గం- కేంద్రమంత్రి పదవే లక్ష్యం, విభజనే ఆచరణీయం-ముఖ్యమంత్రి పదవే ప్రధానం వంటి తాజా కొటేషన్లను, డెవెలప్మెంట్లను బొత్తిగా గమనించలేకపోయారుట! అందువల్ల ఈ జీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ ఒడ్డుకు చేరుస్తారో తెలియక పోయినా, తనను మాత్రం తప్పకుండా ఒడ్డునపడేయగలడని మోయిలీగారి వీర నమ్మకంతో ఉన్నారు.   మళ్ళీ అవే వెబ్ సైట్లు కొన్ని చిరంజీవి తెలుగు ప్రజలకు హ్యండిచ్చినట్లే, మొయిలీ కూడా ఆయన హ్యండిచ్చేసి ఇంత సేఫ్ గా ఉన్న జోన్ లో తనే స్వయంగా ఎందుకు పోటీ చేయకూడదూ? అనే ఐడియాని అధిష్టానం మెదడులో నేర్పుగా జొప్పించేసినట్లు మరో నాలుగు ముక్కలు గీకి పడేశాయి. అది చూసి మోయిలీ షాకయిపోతే అధిష్టాన దేవత బలే ఇంప్రెస్స్ అయిపోయిందిట!   ఈ మెగాజీవిని కూడా కర్ణాటకలో పోటీకి దింపితే సినీ గ్లామర్, తెలుగువాళ్ళ ఓటు బ్యాంక్ అన్నీ కలిపేసుకొని లెక్క చూసుకొంటే కనీసం మరొక్క లోక్ సభ సీటు ఎక్సట్రాగా వచ్చినా యువరాజవారి పట్టాభిషేకానికి అదే పదివేలు అని భావిస్తోందిట. కనుక, ఏ జీవి మద్దతులేనిదే ఎన్నికలలో గెలవలేని మొయిలీని రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఆయనకు బదులు మెగాజీవినే చిక్భుల్లా పూర్ లో పోటీకి దింపితే బెటర్ కదాని ఆలోచిస్తున్నట్లు తాజా గాలివార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను అక్కడ నుండి పోటీ చేయిస్తే పనిలోపనిగా ఆయన ఎన్నికల రధాన్ని ఓ సారి కర్ణాటకలో తెలుగు వాళ్ళున్న అన్ని ప్రాంతాలలో కూడా ఓ రౌండేయించేస్తే బెటరేమో.. అని అధిష్టాన దేవతలు ఆలోచిస్తున్నారుట.   మన మెగాజీవి మాత్రం పాలకొల్లు పరాభవం, ఉప ఎన్నికల్లో తిరుక్షవరం కంటే, చిక్బల్లాపూరు కి జంపై పోతే మళ్ళీ ఐదేళ్ళు తిరిగి చూసుకోక్కరలేదు అని లోలోన సంతోషపడిపోతున్నట్లు ఆయన మనసులో తొంగి చూడగల కొన్ని వెన్ సైట్లు కనిపెట్టిసాయి. మరి ఈ గాలి కబుర్లు అన్నీ వినివినీ మొయిలీ హార్ట్ అయిపోయారంటే అవరూ...పాపం మొయిలీ...

east godavari

తూ.గో.జిల్లాలో మహిళలే మహారాణులు

  మహిళా రిజర్వేషన్ల పుణ్యమాని కౌన్సిలర్ల భార్యలకు మంచి రోజులు వచ్చాయి. ఇన్నాళ్లూ ఇంటిపట్టున్న ఉన్న వాళ్లంతా ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు. రిజర్వేషన్లవల్ల ఈసారి తూర్పుగోదావరి జిల్లా ‘పుర’పోరులో 700 మంది మహిళలు రంగంలోకి దిగుతారని అంచనా. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 153 మంది మహిళలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ఎన్నిక కానున్నారు. అమలాపురంలో రెండుసార్లు కౌన్సిలర్‌ గా పనిచేసి, వైస్ చైర్మన్ పదవి కూడా వహించిన వైఎస్సార్ సీపీ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు తానుపోటీ చేయాలనుకున్న 17వ వార్డు మహిళలకు రిజర్వు కావడంతో తన భార్య శ్రీదేవిని పోటీకి నిలిపారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన టీడీపీ నాయకుడు తిక్కిరెడ్డి నేతాజీ గతంలో తాను పనిచేసిన 7వ వార్డులో రిజర్వేషన్ కారణంగా తన భార్య ఆదిలక్ష్మిని పోటీకి నిలబెట్టారు. మరో మాజీ కౌన్సిలర్ జంగాఅబ్బాయి వెంకన్న (టీడీపీ) మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో తన భార్య స్వర్ణ కనకదుర్గను పోటీకి దింపుతున్నారు.   మాజీ కౌన్సిలర్ గంపల నాగలక్ష్మి ఈ దఫా 27వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ కేశవబోయిన సత్యనారాయణ ఈసారి తన భార్య లక్ష్మిని పోటీకి నిలబెడుతున్నారు. ఇదే మున్సిపాలిటీ నుంచి మాజీ కౌన్సిలర్ బోను లక్ష్మారావు 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చిన అవకాశంతో తన కోడలిని పోటీకి దింపుతున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ తాళాబత్తుల సాయి ఈసారి తన భార్యతో పోటీ చేయిస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్లు తమ భార్యలను బరిలో దించుతున్నారు.

hanuman junction

కొత్త రాజధాని ఎక్కడ?

  సెప్టెంబర్ నాటికల్లా కొత్త రాజధాని ఎక్కడ ఉండబోతోందన్న విషయం తేలిపోతుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా చెప్పారు. అయితే.. రాజధానిగా కృష్ణా జిల్లాలోని హనుమాన్‌జంక్షన్ లేదా గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతాలు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని పురపాలక శాఖ వ్యక్తం చేస్తోంది. రవాణా, సమాచార వ్యవస్థ, ప్రభుత్వ భూములు, విమానాశ్రయం, తాగునీటి సౌకర్యం అన్నీ కలగలిసిన ప్రాంతం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు వరకూ గల ప్రాంతం.. అలాగే గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ తీరం.. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖలోని డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికార యంత్రాంగం రూపొందించిన నివేదిక చెబుతోంది.   కర్నూలు, దొనకొండ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి పలు సమస్యలు ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. కొత్త రాజధానికి సంబంధించి వినిపిస్తున్న పలు ప్రాంతాల గురించి అధికారులు అధ్యయనం చేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి నేతృత్వంలో కొత్త రాజధాని మౌలిక సదుపాయాల అంశంపై ఏర్పాటైన కమిటీకి డీటీసీపీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో అన్నింటింకంటే ఎక్కువ మార్కులు హనుమాన్ జంక్షన్- ఏలూరు రోడ్డుకే పడినట్లు తెలుస్తోంది.

chandrababu

చంద్రబాబు, కిరణ్ ప్రసంగాల తీరు ఎట్టిదనినా..

  ఈ రోజు (బుదవారం) వైజాగ్ లో తెదేపా ప్రజా గర్జన సభ, రాజమండ్రీలో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యంద్ర పార్టీ సభ జరిగాయి. కిరణ్ సభతో పోలిస్తే తెదేపా సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. కిరణ్ ఇంకా రాష్ట్రం పూర్తిగా విడిపోలేదని, సమైక్యంగా ఉంచే అవకాశం ఉందని చెపితే, చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగిపోయింది గనుక ఇక అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవలసి ఉందని చెప్పడం విశేషం. ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుని తీవ్రంగా విమర్శించారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పటికీ, కిరణ్ మాత్రం ఈసారి కూడా సోనియా, రాహుల్ జోలికి పోకుండా విభజన గురించే మాట్లాడి సరిపెట్టేసారు. అయితే కొంచెం దైర్యం చేసి సోనియమ్మ పెద్దమ్మ అని సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని, వారిద్దరూ కలిసి రాష్ట్ర విభజన చేసారని అనగలిగారు.   చంద్రబాబు మాత్రం షరా మామూలుగా సోనియాను అవినీతి అనకొండ అని, రాహుల్ గాంధీ అసమర్దుడని, ప్రధాని డా.మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో రోబోట్ వంటి వారని, ఆయన కంటే రజనీ కాంత్ రోబోట్ అయితే ఇంకా సమర్ధంగా పనిచేసేదని ఎద్దేవా చేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీని పది తలల రావణాసురుడితో పోల్చి వాటిలో జగన్, కిరణ్, కేసీఆర్, బొత్స ఇతర కాంగ్రెస్ నేతలు అందరూ ఒక్కో తలవంటి వారని, ఒక తలనరికితే మరొక కొత్త తల పుట్టుకొస్తూనే ఉంటుందని అందువల్ల, దానిని ప్రజలు రానున్న ఎన్నికలలో పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప దానికి అంతం ఉండదని అన్నారు.   ఇక చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా తమ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వల్లెవేసారు. కిరణ్ తను పదవి చెప్పట్టేనాటికి రాష్ట్రం అప్పులలో కూరుకు పోయుందని, కానీ తాను కేవలం ఒకటి రెండేళ్ళలోనే తిరిగి గాడిన పెట్టగలిగానని చెప్పారు. అయితే తన సమర్ధతను గురించి చెప్పుకొనే ఆత్రంలో అంతకు ముందు కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలించిందన్న సంగతి మరిచిపోయారు. అంటే వైయస్సార్ పాలన సరిగ్గా లేదని ఆయనే స్వయంగా ద్రువీకరించినట్లయింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కిరణ్ మాట్లాడినా దాని గురించి లోతుగా వెళ్ళే దైర్యం చూపకపోవడంతో ప్రజల నుండి ఎటువంటి స్పందన రాలేదు. కానీ, అదేవిషయం గురించి ప్రజాగర్జన సభలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు ప్రజల నుండి మంచి స్పందన కనబడింది. కిరణ్, తనకు బాగా పట్టున్న గణాంకాలను తన ప్రసంగంలో వల్లే వేయడం వలన అది చాలా నిరాసక్తంగా మారింది. చంద్రబాబు పదేపదే తన గొప్పలు చెప్పుకోవడం కూడా కొంచెం అతిగా కనిపించింది.   చంద్రబాబు ఇద్దరూ కూడా తమకు పదవీ, అధికారాల మీద మమకారంలేదని కేవలం తెలుగు ప్రజల సంక్షేమం కోసమే ఈ భాద్యతను తమ భుజాల మీద వేసుకొన్నామని అన్నారు. కిరణ్ తాను ప్రజల కోసం తన అధిష్టానాన్నే ధిక్కరించి పదవిని తృణ ప్రాయంగా వదులుకొన్న త్యాగాశీలినని, మిగిలిన ముగ్గురూ-చంద్రబాబు, జగన్ మరియు కేసీఆర్ లు ముఖ్యమంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తనకు ఎటువంటి కుటుంబ బాధ్యతలు, అవసరాలు, కోర్కెలు, పదవీ కాంక్ష లేవని, తనను, తన పార్టీని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలు కష్టాలలో ఉన్నందునే ముందుకు వస్తున్నానని తెలుపుతూ, మిగిలిన ముగ్గురూ-కేసీఆర్, కిరణ్, జగన్ కాంగ్రెస్ తరపున పనిచేస్తున్న డమ్మీ నేతలని ఎద్దేవా చేసారు.   కిరణ్ తనపార్టీ తరపున యువకులను ఎన్నికలలో నిలబెడతానని చెపితే, చంద్రబాబు బీసీ, యస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. కిరణ్ తనకు 25 యంపీ సీట్లు ఇస్తే, కేంద్రంతో పోరాడి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెపితే, చంద్రబాబు ఆంధ్ర, తెలంగాణాలలో తన యంపీలందరినీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రెండు రాష్ట్రాల పునర్నిర్మాణానికి అవసరమయిన నిధులు తీసుకు వచ్చి రెండు రాష్ట్రాలని విదేశాలకు తీసిపోని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.   చంద్రబాబు హామీలు, ప్రసంగం నిర్మాణాత్మకంగా, ఆశాజనాకంగా ప్రజలకు భరోసా ఇస్తూ సాగగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగంలో అటువంటివేమీ కనబడలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్ర పునర్నిమాణం గురించి ఎక్కువగా మాట్లాడితే, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తాను కనబరిచిన నిబద్దత, పోరాట పటిమ గురించే ఎక్కువ మాట్లాడారు. ఆయన నేటికీ సమైక్య కార్డుతో గేమ్ ఆడుతున్నారు గనుక తన పార్టీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేసుకొన్నారు. దాని గురించి మాట్లాడితే ఆయన చేస్తున్న సమైక్యవాదానికి అర్ధం లేకుండా పోతుంది.

Kiran Kumar imitating late N T Rama Rao

Kiran Kumar imitating late N T Rama Rao

      Kiran Kumar Reddy’s new Party slogan which is all about ‘Teluguvaari Atma Gouravam’ looks and sounds familiar. Now for those who have tuned into the 2014 political scenario may or may not remember the Late N T Rama Rao’ call when he first launched the Telugu Desam Party on March 21st 1982- It was the same motto “Telugu Atma Gauravam which resulted in the resounding victory in the immediate election. But to try and match the same aura skepticism notwithstanding, Jai Samaikyandhra Party President Nallari Kiran Kumar Reddy who hopes to make a larger impact with voters who have given up on the Congress, TDP, BJP and YSR Congress alike will be seen only after the votes have been cast. Apart from the sentiment of the Telugu pride his focus is on students, NGO activists and women. On the eve of the inaugural rally to be held in Rajamundry where the party logo is rumored to be the Chappal ( footwear) akin to the AAP s logo the broom we need to see if he can really garner the same kind of public support which the late NTR got when he had a massive public meeting at Nizam College grounds on April 11,1982 attended by his fans that spilled over to road all around reflected the mood of the people and popular support to NTR’s campaign against the Congress.    The Congress critics are already concluding his party as a weak attempt to regain ground and with a few leaders who are with him and the low turnout of people in the press meet has led to widespread snide remarks that it is like sleeper class in the train where people adjust to the seats. All this will be revealed today in the launching of the party at Rajamundry.  

bjp

తెలంగాణా బీజేపీ సభలో వెంకయ్య మిస్సింగ్

  బీజేపీ నిన్న హైదరాబాదులో నిర్వహించిన ‘తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలందరూ పాల్గొన్నారు. కానీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కనబడలేదు. ఆయన ఏదో చాలా అర్జెంట్ పనిమీద బెంగళూరు వెళ్ళవలసి రావడంతో సభకు హాజరు కాలేకపోయారని ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నట్లు సమాచారం. షరా మామూలుగానే బండారు దత్తత్రేయతో సహా చిన్నా పెద్ద నేతలందరి ఫోటోలతో బ్యానర్లు, భారీ కటవుట్లు కూడా సభా ప్రాంగణంలో పెట్టబడ్డాయి. కానీ వాటిలో కూడా వెంకయ్య నాయుడు ఫోటో భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనబడలేదు. బహుశః ఆయన బెంగళూరు వెళుతూ వెళుతూ హైదరాబాదులో తన ఫోటోలేవీ ఉంచకుండా వెంటపట్టుకు పోయినందువల్లే బీజేపీ వాళ్ళు ఆయన ఫోటోలు అచ్చు వేయలేకపోయారేమో పాపం!   ఆ తరువాత సభలో ప్రసంగించిన వక్తలందరూ తమ పార్టీ తెలంగాణ కోసం ఫెవీకాల్ పూసుకొని ఒక ఇంచి కూడా పక్కకు జరగకుండా ఏవిధంగా మాట మీద నిలబడిందో, ఏవిధంగా తెలంగాణా ప్రజల కలలను సాకారం చేసిందో పూస గుచ్చినట్లు వివరించారు. తమ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఝాన్సీ లక్ష్మీ భాయిలా తెలంగాణా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా పోరాడి సాధించిందో కళ్ళకు కట్టినట్లు వివరించి, తెలంగాణా క్రెడిట్ మొత్తం ఆమె పద్దులోనే అంటే బీజేపీ పద్దులోనే వ్రాసేసుకొంటునట్లు ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా తెలియజేసారు. అయితే ఈ సందర్భంగా రాజ్యసభలో సీమాంధ్ర కోసం తాండ్ర పాపారాయుడిలా పోరాడేసి, చివరికి చేతులెత్తేసిన వెంకయ్య నాయుడిని తలుచుకోవడం అసందర్భంగా ఉంటుందని ఎవరూ కూడా తలుచుకోలేదు.   బహుశః త్వరలో సీమాంధ్రలో మోడీ నిర్వహించబోయే ఎన్నికల సభలో వెంకయ్య నాయుడి వీర పోరాటం గురించి ప్రజలకు కధలు కధలుగా వివరిస్తారేమో. అప్పటికి ఆయన కూడా ఆంధ్రాకు తిరిగి వచ్చేస్తారు గనుక ఆయన కూడా మోడీ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ఆయన ఫోటోలు, బ్యానర్లు కూడా నిరభ్యంతరంగా పెట్టేసుకోవచ్చును. అయితే ఈ సారి తెలంగాణా-చిన్నమ్మ అండ్ కో ఆ సభకు రాకపోవచ్చును. అదేవిధంగా వారి ఫోటోలు బ్యానర్లు కూడా సభలో కనబడకపోవచ్చును. తెలంగాణాలో వెంకయ్య ఫోటోలు పెడితే జనాలు ఏవిధంగా రియాక్టవుతారో, సీమాంధ్రలో చిన్నమ్మ ఫొటోలకి, ప్రస్తావనకు అదేవిధంగా రియాక్టవడం ఖాయం గనుక ఏ ఎండకి ఆ గొడుగు లేదా ఏ ప్రాంతానికి ఆ మనుషులు, కటవుట్లు ఏర్పాటు చేసుకొని, సందర్భోచితమైన డైలాగులే పలకాల్సి ఉంటుంది. లేకుంటే అంతా రచ్చరచ్చయిపోద్ది మరి. ఆంధ్రాకి వెంకయ్య, తెలంగాణాకి చిన్నమ్మని బీజేపీ కేటాయించుకొంది గనుక వారు ఇకపై ఒకరి జోన్లో మరొకరు ఎంటరవరన్నమాట. బహుశః అందుకే నిన్న వెంకయ్య గారు అర్జెంటుగా బెంగుళూరు వెళ్ళిపోవలసి వచ్చిందేమో!పాపం!   ఇదంతా చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే చాలా మొండి దైర్యం ఉందని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన తంతుని దగ్గరుండి చకచకా పూర్తి చేసి చేతులు దులుపుకొన్న జైరామ్ రమేష్ నే రెండు ప్రాంతాలలో పర్యటనకు పంపించి కాంగ్రెస్ నెగ్గుకు వస్తోంది కదా! ఆయన ‘కాంగ్రెస్ చర్మం’ కొంచెం మందం గనుక, సీమాంధ్రలో ఎవరు ఎన్ని తిట్లు తిడుతున్నాఅవి చెవిన పడనీయకుండా తన చుట్టూ భజన బృందం ఏర్పాటు చేసుకొని తిరుపతి నుండి వైజాగ్ వరకు కాళ్ళరిగేలా తెగ తిరిగేస్తున్నారు.   ఈ ఎన్నికల తరువాత తమ పార్టీ అధికారంలోకి రాలేక పోవచ్చననే అనుమానం ఉన్నపటికీ, అదేమీ బయటకి కనబడనీయకుండా రాగల పదేళ్లలో సీమంద్రాను తాము ఏవిధంగా మార్చేయబోతున్నామో ఆయన 3డీలో పిక్చర్ వేసి చూపిస్తూ ప్రజలను పడేస్తున్నారు. సీమాంధ్రలో క్లైమేట్ మరికొంత కొంచెం చల్లబడగానే రాజమాతని, యువరాజవారిని స్వయంగా తోడ్కొని వచ్చి సీమాంధ్ర ప్రజలను అనుగ్రహింప జేస్తానని ఆయన హామీ కూడా ఇస్తున్నారు. మరి వెంకయ్య అండ్ కో పార్టీ మోడీ మహాశయుడిని ఎప్పుడు తోడ్కొని వస్తారో ఎప్పుడు సీమాంధ్ర ప్రజలను అనుగ్రహిస్తారో...అని ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏమయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకోసం ఇంతగా ఆరాటపడేవాళ్ళు దొరకడం వారి అదృష్టమే!

kiran

సొంతింట పట్టులేక.. పొరుగుకు నల్లారి పరుగు

  ఇంట గెలవకనే రచ్చ గెలిచేందుకు పోయినట్టుంది మాజీ సీఎం కిరణ్ వ్యవహారం. ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ బుధవారం పురుడు పోసుకుంటోంది. ఇందుకు గోదావరి తీరం రాజమండ్రి వేదిక కానుంది. రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన సొంత జిల్లాలోని తిరుపతిని కాకుండా అయన రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు పట్టులేకపోవడమే అని విమర్శకులు అంటున్నారు. మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీపై గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై గానీ ఎప్పుడూ పట్టులేదు. జిల్లా ప్రజల్లోనూ తనదంటూ ముద్ర వేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించడమంటే ఇంట గెలవకనే రచ్చ గెలిచే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లాను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే అపవాదును మాజీ సీఎం మూటగట్టుకుంటున్నారు. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారు.

politicians

కప్పలకు తీసిపోని రాజకీయ నేతలు

    భూమి గుండ్రంగా ఉన్నట్లుగానే తాము మళ్ళీ తెదేపాలోకే వచ్చిపడ్డామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆనంద బాష్పాలు రాలుస్తూ చెప్పిన మాటలు అక్షరాల నిజమే. అయితే భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణం చేయడానికి ఒకరోజు పడితే, ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీల చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తవడానికి ఐదేళ్ళు అంటే ఎన్నికల నుండి మళ్ళీ ఎన్నికల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ ఐదేళ్ళు పూర్తయి ఎన్నికలు వచ్చేసాయి గనుక అనేకమంది నేతలు స్వంత గూళ్ళు వెతుకొంటూ తిరుగుతున్నారు. అయితే పార్టీ సిద్దాంతాలకు, ఆశయాలకు అతీతులయిన చాలా మంది నేతలు మాత్రం అన్ని పార్టీలను తమ స్వంత పార్టీలుగానే భావిస్తూ ఎందులో బెర్తు కన్ఫర్మ్ అయిపోతే అందులో ఎక్కేసి సెటిల్ అయిపోతుండటంతో, అక్కడ ఆల్రెడీ చాలా కాలంగా రుమాళ్ళు, దుప్పట్లు వేసుకొనున్న వాళ్ళు అలిగి వేరే గూట్లోకి జంపైపోతున్నారు. వాళ్ళ రాకతో మళ్ళీ ఆ పార్టీలో కూడా అదే సీను రిపీటవుతోంది. అంటే నేతలందరూ ఉన్న ఈ నాలుగు పార్టీల మధ్య పరుగులు తీస్తూ నాలుగు స్తంభాలాట లేదా మ్యూజికల్ చేయిర్స్ ఆట ఆడుకొంటున్నారని అర్ధమవుతోంది. వారి జంపింగ్స్ అన్నీ పూర్తిగా కవర్ చేయాలంటే ఈ మూడు నెలలు ప్రత్యేకంగా కాలమ్స్ కానీ వీలయితే ప్రత్యేక పత్రికలూ గానీ పెట్టుకోక తప్పదు.   ఇప్పుడు అసలు కధలోకి వస్తే, తెదేపాలోకి టీజీ వెంకటేష్ వచ్చిపడగలిగినందుకు ఆనంద బాష్పాలు రాలిస్తే, కర్నూల్ టికెట్ కోసం ఆశపెట్టుకొన్న రాంభూపాల్ చౌదరి తనకు చంద్రబాబు హ్యాండిచ్చారని కన్నీళ్లు కార్చారుట. అదేవిధంగా అనంతపురం ఎమ్.పి వెంకట్రామిరెడ్డిని వైకాపాలోకి వచ్చిపడటంతో, అదే ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే. గురునాధరెడ్డి హార్ట్ అయిపోయి దేనిలోకో దానిలోకి వెంటనే జంపైపోయేందుకు డిసైడ్ అయిపోయినట్లు తాజా వార్త. ఆయన దేనిలోకి జంప్ చేస్తే అక్కడి నేత కూడా ఆయన లాగే హర్టయ్యిపోయి, మళ్ళీ వేరే పార్టీలోకి జంపైపోవడం ఖాయం. గనుక ఈ భాగోతాలు సైకిల్ చక్రంలా తిరుగుతూనే ఉంటాయి.   తాజా సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి తెరాసలోకి జంపయ్యారు. తెలంగాణ జెఎసి కో ఛైర్మన్ గా ఉన్న శ్రీనివాసగౌడ్ కి కేసీఆర్ మహబూబ్ నగర్ నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ చేసేయడంతో ఆ నియోజక వర్గం ఇన్ చార్జీగా ఉన్న ఇబ్రహిం బాగా అప్ సెట్టయిపోయినట్లు తాజా సమాచారం.   ఇక కిరణ్ కొత్తపార్టీ ఇంకా రాజమండ్రీలో మొదటి సభ పెట్టుకొని పార్టీ గురించి, అందులో జనాల గురించి చెప్పుకోక మునుపే, దానికీ అప్పుడే బోణీ అయిపోయింది. నిన్నటి దాక ఆయనకు హ్యాండ్ పట్టుకొని తిరిగిన రాజమండ్రి నగర శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు, ఆయనకు హ్యాండిచ్చేసి వైకాపాలో చేరిపోయారు.   ఇక తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ మీద మనసు పారేసుకొన్నారని తెలియగానే, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అలర్టయిపోయి, ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని అప్పుడే రోడ్డెక్కినట్లు లేటెస్ట్ అప్ డేట్స్ ఉన్నాయి. మరికొద్ది సేపటి లో దిగ్విజయ్ సింగ్ ఆంద్ర, తెలంగాణాలకు పీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించగానే బహుశః ఈ లిస్టులో మరిన్ని కొత్త పేర్లు వ్రాసుకోవలసి ఉంటుందేమో!

bjp

ఒంటరి పోరాటానికే కమలం సై

  తెలుగుదేశం పార్టీ సహా అనేక పార్టీల ఆశలపై బీజేపీ నీళ్లు చల్లేసింది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయిస్తోంది. తమ రాష్ట్రశాఖ అలాగే భావిస్తోందని, జాతీయస్థాయిలో కూడా తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం పొత్తుల విషయంలో తీసుకోరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీలో మూడు స్థానాలు మాత్రమే కలిగి ఉండి, రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ స్థానం కూడా లేకపోయినా.. తెలంగాణా రాష్ట్రం తమవల్లే వచ్చిందన్న ప్రచారంతో ఈసారి నేరుగా పోటీ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. తమ పార్టీ టికెట్లకు కూడా బోలెడంత డిమాండ్ ఉందని, ఒక్కో చోట అయితే ఐదారుగురు కూడా పోటీ పడుతున్నారని అంటున్నారట. ఇక సీపీఎం తరహాలోనే రెండు ప్రాంతాలకు రెండు శాఖలను ఏర్పాటుచేసే ప్రయత్నాలలో బీజేపీ పడింది. తెలంగాణా, ఆంధ్రా శాఖల పేర్లతో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

krishna district

కృష్ణా జడ్పీ మహిళల పరం

  కృష్ణా జిల్లా పరిషత్ పీఠంపై మరోసారి మహిళ కాలు మోపనుంది. ఇప్పటివరకు జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే మహిళకు అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి మహిళ ఆ పీఠాన్ని అధిష్టించనుంది. కృజిల్లాలో 49 మండలాలు ఉండగా 21 స్థానాలు జనరల్‌కు, 13 బీసీలకు, 13 ఎస్సీలకు, రెండు ఎస్టీలకు కేటాయించారు. కృష్ణాజిల్లా పరిషత్ 1960లో ఏర్పడగా, 1962లో చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1964 సెప్టెంబర్ 11న జిల్లా పరిషత్ చైర్మన్‌గా పిన్నమనేని కోటేశ్వరరావు ఎంపికై 1976 జనవరి 19 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1987 నుంచి జడ్పీ చైర్మన్‌ను నేరుగా ఎన్నుకునే పద్ధతి ప్రారంభమైంది. దాదాపు 19 సంవత్సరాల పాటు పిన్నమనేని చైర్మన్‌గా పనిచేశారు. 1995లో కడియాల రాఘవరావు, 2000లో ఎస్సీ మహిళలకు కేటాయించడంతో నల్లగట్ల సుధారాణి జడ్పీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత బీసీలకు వెళ్లడంతో కుక్కల నాగేశ్వరరావు చైర్మన్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు జనరల్ మహిళలకు ఆ సీటు వెళ్లింది.

రంగంలోకి జే గ్యాంగ్?

  జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్లు ఉన్న వారిలో చాలా మంది లోటస్ పాండ్ గూటికి చెరుతున్నారు. ఆ కేసులతో తమకు సంభంధం లేదని కోర్టుకు విన్నవించుకున్న వారందరూ ఒక్కక్కరిగా జే గ్యాంగ్ లో చేరుతున్నారు. జైలులో ఉన్నప్పుడే మాజీ మంత్రి మోపిదేవి చేరికకు రంగం సిధ్ధమైంది. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత జగన్ పార్టీలో చేరిన వారిలో ఎక్కువ మంది సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్నవారే ఉన్నారు. జగన్ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టు సేకరించారనే అభియోగాలు ఎదుర్కొన్న కేవీపీ వియ్యంకుడు రఘురామక్రిష్ణ రాజు వైసీపీలో చేరినట్టే చేరి గోడకు కొట్టిన బంతిలా వచ్చి బీజేపీలో పడ్డారు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపేది తానే అన్నంత బిల్డప్ ఇచ్చే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా తన అన్న కృష్ణదాస్ ధర్మాన జే గ్యాంగ్ లో చేరిపొయారు. యెమార్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన కోనేరు ప్రసాద్ కూడా యువనేత సమైక్యాంద్ర నినాదం నచ్చి వైసీపీ కండువా వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నయ్య అధికారంలోకి వస్తే కేసుల నుంచి బయటపడొచ్చు అనే ఆలోచనతోనే వీరంతా వైసీపీలో చేరుతున్నారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్లున్న వారంతా ఒకే గూటికి చేరడం వెనుక ఏదో మతలబు ఉందని గొణుక్కుంటూ ఉన్నారు సామాన్యులు. క్విడ్ ప్రోకోతో వీరికి సంబంధం లేకపోతే జగన్ తో విభేదించాలి కానీ జే గ్యాంగ్ లో ఒకరిగా మారిపోవడం గూడు పుఠానీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.

Politics for out-of-work stars

      Looks like politics is becoming a haven for out-of-work and retired movie stars. With senior actor Krishnam Raju already joining BJP, we have one more entry-actor Rajasekhar and his wife Jeevitha, who has formally joined the BJP on Monday in the presence of BJP State leader Kishen Reddy.   Now this couple, who have made a full circle and touched the doors of all political parties except CPI, started with the TDP and then joined the Congress during the YSR regime. In between there was a fallout with actor Chiranjeevi and they were on backlash against him and his brother Pawan Kalyan which they even stated in an interview with a prominent news channel about his rude behavior and this has seen Pawan Kalyan imitating how Rajasekhar speaks with an accent in his block buster movie Gabbar Singh and ultimately the PRP merging with the Congress is past history. Post YSR’s death they were seen hobnobbing with Jagan’s YSRC Party.   who made use of the couple’s star status and if rumors are to be believed he was not happy with the extra attention that Rajasekhar got during an event and sidelined them. They were lost for some time and tried to get back to TDP but with no credible status and the lack of support from the inside TDP cadre they moved back. With both of them attending the prestigious Statue of Unity project one-day workshop by the BJP recently it was understood they were getting into the BJP mode. Rajasekhar’s film career is known to be on the downfall with no hit to his credit and also known for his eccentricities he has put forward Jeevitha in the front end with her joining the party formally. Known to be an eloquent speaker and  whether she will be given a party ticket is yet to be seen except for adding to the glam-quotient to the rallies and public meetings conducted by the party. Actress Roja is another meanderer, who first joined the TDP and was also the Woman Wing President of Telugu Mahila Party. She lost during the 2009 state elections, and in August 2009, she quit  the TDP and joined Congress Party. She also quit the Congress party showed her open support to Y. S. Jaganmohan Reddy's political party YSR Congress Party during the political turmoil after he was sidelined by the Congress High Command. Excepting for adding to the glamour we have to wait and see if any of these actors are capable of contesting in the forthcoming elections.

Is Legend eyeing top post in TDP?

  Recently, CH Ramesh, the Balakrishna Fans’ Association President has demanded TDP (Chandrababu) to handover the party reins to Balakrishna. They blame Chandrababu for using his services and his star image for in party campaigning but not giving his due share of power in the party. It stirs a controversy in the party circles and lead to rumors about they both having differences between them. Media adding fuel to flames reports that Balakrishna has intentionally did not invited Chandrababu to his Legend audio release function held recently.   However, Balakrishna has condemned the reports of having differences with Chandrababu and hushed up the controversy with his explanation. But, it is to be observed that though he condemned the reports about differences with Chandrababu, he did not condemn the demands raised by his fans for his appointment as party President. So, it is evident that he too agrees with their demand or at least is hoping for some key post in the party or an immediate announcement by Chandrababu about his ticket and constituency.   But, Chandrababu may be planning to announce the names of the party candidates once, he strikes poll alliance with BJP soon. However, he may not afford to elevate him as Party President, even after creating two separate branches of the party in near future, because Balakrishna can't dedicate his full time to party due to his obligation of his film profession. So, his fans can think about their demand only if he agrees to retire from his film profession.

కొత్త పార్టీలు తెదేపాతో సహకరించాలి: బాబు

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పవన్, కిరణ్ కొత్త పార్టీల గురించి నిన్న ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలుకుతూ, అంతా అయిపోయిన తరువాత చేతులెత్తేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలను ఉద్దరిస్తానంటూ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఏమీ చేయలేనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి ఏమి చేయగలరు ఓట్లను చీల్చడం తప్ప? మహా అయితే ఆయనకు ఒక నాలుగయిదు సీట్లు వస్తాయేమో? కొత్తగా వస్తున్న పార్టీలకు ఓట్లు వేయడం వలన విలువయిన ప్రజల ఓట్లు వృధా అయిపోవచ్చును. కొత్త పార్టీలు పెట్టి ప్రజలలో సదిగ్ధం సృష్టించడం కంటే, వారు తేదేపాకు సహకరించినట్లయితే అందరూ కలిసి రాష్ట్ర పునర్మిర్మాణం చేసుకోవచ్చును,” అని అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, తమతో చేతులు కలిపి సహకరించితే బాగుటుందని సూచిస్తున్నట్లే భావించవచ్చును.   పవన్ కళ్యాణ్ కూడా తెదేపాతో చేతులు కలిపేందుకు సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తనకు కనీసం 15 యం.ఎల్యే. మరియు 3-4 యంపీ టికెట్స్ కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లయితే తెదేపాలో చేరడమో లేక ఆపార్టీకి మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే, తెదేపా నేటికీ బీజేపీతో ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తోంది. కనుక, కొన్ని టికెట్స్ పవన్ కళ్యాణ్ కి, మరికొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్ నుండి తరలి వస్తున్న నేతలకీ పంచుకొంటూ పోతే ఇక తెదేపాలో ఉన్నవారికెవరికీ టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల మహా అయితే 4-5 సీట్లు కేటాయించేందుకు మాత్రం చంద్రబాబు అంగీకరించగలరు. కానీ, పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఏర్పాటుకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పొట్లూరి వరప్రసాద్ విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నందున, ఆయనకు విజయవాడ టికెట్ ఇవ్వాలని పవన్ పట్టుబడితే, తెదేపా ఇవ్వలేదు. కనుక పవన్ తెదేపాతో జత కట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చును.   ఏమయినప్పటికీ, కిరణ్, పవన్ కళ్యాణ్ ల రంగప్రవేశంతో సీమాంధ్రలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. ఈ పాత, కొత్త పార్టీల ప్రభావంతో ప్రజల ఓట్లు చీలడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడటం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే పరితపించిపోతున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, తమవల్లనే ఓట్లు చీలి, ఎవరికీ మెజార్టీ రాకుండా చేసుకొని, రాజకీయ అస్థిరతను సృష్టించడానికి సిద్దపడుతుండటం చాలా శోచనీయం. ఇప్పటికే చాల దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం, ఈ రాజకీయ నేతల, పార్టీల స్వార్ధం, అధికార కాంక్ష కారణంగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఒక సుస్థిరమయిన ప్రభుత్వం ఏర్పడలేకపోతే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయం. ఈ సంగతి గ్రహించిన చంద్రబాబు అందుకే ఇటువంటి సూచన చేసారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడదని ఆయనకీ తెలుసు.   రాజకీయ పార్టీలు వాటిని నడిపే నేతల మధ్య సత్సంబంధాలు, సరయిన అవగాహన, రాష్ట్ర ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం ఇంత సాహసించగలిగేదే కాదు. రాష్ట్రానికి నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. అందువల్ల ఇప్పుడు వారి నుండి కొత్తగా ఏమీ ఆశించలేము.