pawan kalyan

సీమాంధ్ర రాజకీయాలపై పవన్, కిరణ్ ఎఫెక్ట్

  మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని తాజా సమాచారం. ఈ పేరుని శ్రీహరి రావు అనే వ్యక్తి కొన్ని నెలల క్రితమే ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరుని కిరణ్ పేరిట బదలాయించినట్లు తెలుస్తోంది.   అయితే రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతున్న ఈ తరుణంలో కూడా కిరణ్ తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని పేరు ఎంచుకోవడం గమనిస్తే, ఆయన ప్రజలలో ఉన్న సమైక్య భావనలను, సెంటిమెంటుని వాడుకొనేందుకు సిద్దపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అదీగాక ఆయన శాశ్విత ప్రాతిపాదికన రాజకీయపార్టీ ఏర్పాటు చేయదలచుకొంటే వేరే మరేదయినా పేరుని ఎంచుకొని ఉండేవారు. కానీ, ఈ సమైక్యభావనలు ఎల్లకాలం ఉండబోవని, ప్రజలలో సమైక్యవేడి క్రమంగా చల్లారుతున్నదని తెలిసినప్పటికీ, ఆయన ఇటువంటి పేరుని ఎంచుకోవడం చూస్తే ఆయన తాత్కాలికంగానే ఈ పార్టీని నెలకొల్పుతున్నారని అర్ధమవుతోంది. అంటే ఎన్నికల తరువాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయమని భావించవచ్చును.   అయితే మరి కేవలం రెండు మూడు నెలల కోసం ఇంత భారీ ఖర్చు చేసి, ఇంత శ్రమపడి పార్టీని ఎందుకు స్థాపిస్తున్నారు అంటే ఎన్నికలలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువయిన తెదేపాను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం, వీలయితే తన అధిష్టానం కోసం తన వంతుగా మరి కొన్ని యంపీ సీట్లు సాధించిపెట్టడానికేనని చెప్పుకోవచ్చును. అయితే ఆయన ప్రధానంగా తెదేపాకు నష్టం కలిగించాలని పార్టీ పెడుతున్నపటికీ, ఆయన వల్ల తెదేపా కంటే కాంగ్రెస్ అధిష్టానం తో రహస్య అవగాహన కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారిరువురూ కూడా తెలుగువారి ఆత్మగౌరవం, సమైక్యవాదం కోసం తామే పోరాడుతున్నామని చెప్పుకొంటూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు గనుక వారి మధ్య ప్రజల ఓట్లు చీలిపోవచ్చును. అదేవిధంగా ఇద్దరు కూడా రెడ్డి కులస్తులే గనుక ఆ కులస్థుల ఓట్లు కూడా వారిరువురి మధ్య చీలిపోయే అవకాశం ఉంది. కానీ, మిగిలిన పార్టీలలో టికెట్స్ దొరకని అసంతృప్తి నేతలందరూ చివరికి కిరణ్ కుమార్ గూటికే చేరుకొనే అవకాశం ఉంది గనుక ఈ రెండు నెలల సమయంలో కిరణ్ పార్టీ మరింత బలపడితే అప్పుడు ఆయన పార్టీ వల్ల తెదేపాకు కూడా నష్టం తప్పకపోవచ్చును.   ఇక కమ్మ, కాపు, యస్సీ యస్టీ, బీసీ మరియు ఇతర కులస్థులు, మైనార్టీ వర్గాల ఓట్లు ప్రధానంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్యే చీలవచ్చును. కానీ, రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారందరూ తెదేపా వైపే చూసే అవకాశం ఉంది. కానీ, ఒకవేళ తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, జగన్ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపి మైనార్టీ వర్గాలను తనవైపు తిప్పుకొన్నట్లయితే, పోటీ చాలా తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు వీరందరి నడుమ పవన్ కళ్యాణ్ కూడా పోటీలోకి ప్రవేశిస్తుండటంతో, అతని ప్రభావంతో ముందుగా కాంగ్రెస్, ఆ తరువాత వరుసగా తెదేపా, వైకాపా, కిరణ్ పార్టీలు కూడా కొంత మేర నష్టపోయే అవకాశం ఉండవచ్చును. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారే రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాల కారణంగా ఈ అంచనాలు కూడా మారిపోవచ్చును.  

k janareddy

తెరాసతో సమరానికి టీ-కాంగ్రెస్ సై

  కొద్ది రోజుల క్రితం తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోమని కుండ బ్రద్దలు కొట్టారు. అయితే, పొత్తులు ఉండవని చెప్పకుండా కమిటీయే చూసుకొంటుందని తెలివిగా తప్పుకొన్నారు. తాము పొత్తులకు అంగీకరించినా టీ-కాంగ్రెస్ నేతలు ఎలాగు అంగీకరించరని కేసీఆర్ ముందే ఊహించారు. వారికి దక్కవలసిన టికెట్స్, మంత్రి పదవులు అన్నీ తామే ఎగురేసుకొని వేల్లిపోతామనే భయంతో వారే పొత్తులు వద్దని తమ అధీష్టానానికి చెప్పుకొంటారని కేసీఆర్ ఊహించారు. అందుకే తెలివిగా పొత్తులు లేవని చెప్పకుండా బంతి కాంగ్రెస్ కోర్టులో పడేసారు. ఆయన ఊహించినట్లుగానే ఈరోజు మాజీ మంత్రి జానా రెడ్డి ఇంట్లో సమావేశమయిన టీ-కాంగ్రెస్ నేతలు తెరాసతో పొత్తులు తమకు అవసరం లేదని, తాము ఒంటరిగానే పోరాడి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలమని ప్రకటించారు.   జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అయితే ఇతర పార్టీలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నదున వాటి పాత్రా ఉందని మేము అంగీకరిస్తున్నాము. కానీ, ఇతర పార్టీలు ఎంత పోరాటం చేసినాకూడా కాంగ్రెస్ ఇవ్వదలచుకోకపోతే తెలంగాణా ఏర్పడేదే కాదని అందరికీ తెలుసు. కనుక ప్రధానంగా ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తారని మేము నమ్ముతున్నాము. అందువల్ల మాకు ఎవరి మద్దతు, పొత్తులు అవసరం లేదు. మా అంతట మేమే మా పార్టీని పూర్తి మెజార్టీతో గెలిపించుకొని తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తాము. తెలంగాణా పునర్నిర్మాణం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది తప్ప ప్రాంతీయ పార్టీల వల్ల కాదు."   "ఒకవేళ మా అధిష్టానం కేంద్ర రాజకీయ అవసరాల నిమిత్తం ఎవరితోనయినా ఎన్నికల పొత్తులు పెట్టుకోదలిస్తే మేము ఎటువంటి అభ్యంతరమూ చెప్పము. అందుకు తప్పకుండా సహకరిస్తాము," అని తెలిపారు.

elections

గల్లీ టు డిల్లీ .... ఎనీ సెంటర్ .. ఎనీ పార్టీ..

  విడిపోయే ముందు రాష్ట్రానికి ఎన్నికలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో పార్టీలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గల్లీ టు డిల్లీ .... ఎనీ సెంటర్ .. ఎనీ పార్టీ.. నుంచి పోటీ చేసే అవకాశాలు అంగడిలోకి వచ్చి పడ్డాయి. ఆలసించినా .. ఆశాభంగం.. మంచి తరుణం మించిన దొరకదు. పార్టీ జెండాలు భుజాన వేసుకుని కాళ్ళరిగేలా తిరిగిన కార్యకర్తలకు ఎట్టకేలకు ఎన్నికల కదన రంగంలోకి దూకే అవకాశం అంది వచ్చింది.   నల్లారి నాన్చుడుతోనే.. తాజా మాజీ ముఖ్యమంత్రి నల్లారి నాన్చుడు ధోరణి పుణ్యమా అని ఎప్పటి నుంచో నిర్వహించకుండా అట్టిపెట్టిన మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఇచ్చింది. మరో పక్క సార్వత్రిక ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6న జెడ్పీ.. మండల ఎన్నికలు? (ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు), ఏప్రిల్ 30న తెలంగాణలో.. మే 7న సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 5 వారాల తేడాలో 5 రకాల ఎన్నికలను అధికారులు నిర్వహించబోతున్నారు.   ఒక్క మన రాష్ట్రంలోనే ఎన్నికల నిర్వహణకు వేలకోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే .. ఇంకొకటి ... ఏళ్ళు తరబడి.. వార్డు నుంచి ఎంపీ స్థానం వరకూ నేతలు పాతుకు పోయారు. కొత్త పార్టీలు లేవు. ఏ ఎన్నిక జరిగినా.. ఓడినా, గెలిచినా వారే అభ్యర్ధులు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వరుస ఎన్నికలు, కొత్త కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. డబ్బుంటే చాలు.. మా పార్టీ టికెట్ ఇస్తాం అంటూ అభ్యర్ధులు వెంట పార్టీ తిరిగే పరిస్థితి. డబ్బు, ఆశక్తి ఉండాలే గాని, కార్పొరేటర్ గా ఓడిపోతే .. ఎంపీటీసీ/జెడ్పీటీసీగా పోటీ చేయొచ్చు. ఇక్కడా గెలవకపోతే ఎమ్మెల్యే/ఎంపీగా పోటీ చేశే అవకాశమూ మిగిలే ఉంది.

elections

ప్రతి ఒక్కరికీ పరీక్షలే

  అవును.. ఇది అందరికీ పరీక్షా కాలమే. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు.. పార్టీలకు కీలక పరీక్షలు ఒకేసారి వచ్చాయి. తమ భవితకు, ఉన్నత చదువుల మెట్టు ఎక్కేందుకు విద్యార్థులకు పదోతరగతి పరీక్ష.. బిడ్డల జీవితాలపై ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకూ ఇది అగ్ని పరీక్ష.. పదవుల కుర్చీ ఎక్కేందుకు నేతల జాతకాలకు ఎన్నికల పరీక్ష.. మనుగడ కోసం రాజకీయ పార్టీలకు ఇదే కీలక పరీక్ష.. ఇలా అందరికీ ఒకేసారి పరీక్షా కాలం ముంచుకొచ్చింది.   ఈసారి మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అన్నీ ఒకేసారి రావడం.. అదీ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడం చిత్రమైన పరిస్థితి. ఎన్నికలు వచ్చాయంటే టీచర్ల పాత్ర అందులో చాలా ఉంటుంది. వారు ఎక్కువగా ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ సరిగ్గా పరీక్షలకు ముందు అలా వెళ్లిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం సాగడంతో దాదాపు వంద రోజులకు పైగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రైవేటు క్లాసులు పెట్టినా సిలబస్ పూర్తికాలేదు. అరకొర చదువులతోనే పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన దుస్థితి దాపురించింది. దీనికితోడు కరెంటు కోతలు, ఎన్నికల వాతలు విద్యార్థుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

kiran kumar

చిత్తూరు కాంగ్రెస్ నేతలకి కిరణ్ పార్టీ వల

  చిత్తూరు జిల్లా రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిన ఎమ్మెల్యేలు ఏ ఒడ్డుకు చేరుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. దరి ఎంపిక చేసుకునే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో అయోమయం చోటుచేసుకుంది. కొత్త పార్టీ ప్రకటన తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ పావులు కదపడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురితో మంతనాలు జరిపినట్టు తెలిసింది.   గంగాధరనెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, చిత్తూరు ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, డాక్టర రవి, షాజహాన్‌బాషా, సీకే.బాబులు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనుచరులతో హైదరాబాద్ చేరుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి, అరుణమ్మతో పాటు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ ఆయన ప్రస్తుతానికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు.   కిరణ్‌కుమార్‌రెడ్డితో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ భేటీ అయ్యారు. మధ్యాహ్నం కిరణ్ ఇంటికి వెళ్లిన ఆమె గంటకు పైగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే కిరణ్‌తో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రెండు రోజులుగా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించారని సమాచారం.   చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఇంకా గుంభనంగా వ్యహరిస్తున్నారు. ఆయన ఎటువైపు మొగ్గుతారనేది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని సీకే అనుచరవర్గాలు అంటున్నాయి. నగరి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి పరిస్థితి కూడా ఇంతే. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అనుచరవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కిరణ్ పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది.

chiranjeevi

అన్నదమ్ముల సవాల్

  పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం వేదికా రెండూ ఖరారయిపోయాయి. మార్చి14, హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్ లో ఆయన వర్తమాన రాజకీయాలపై ప్రసంగించిన తరువాత తన పార్టీని ప్రకటిస్తారు.   ఇక ఆయన పార్టీ పెట్టడంపై రామ్ చరణ్ స్పందిస్తూ “బాబాయి పార్టీ పెట్టడం అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. నాకు రాజకీయాలపై సరయిన అవగాహన లేదు. నేను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఆయనకు ఎప్పుడు మద్దతు ఇస్తాను. అయితే రాజకీయంగా నాన్నగారికే మద్దతు ఇస్తాను,” అని అన్నారు. రామ్ చరణ్ మాటలను బట్టి చూస్తే, ఈ విషయంలో మెగా కుటుంబంలో మరి కొంత దూరం పెరగబోతోందని స్పష్టమవుతోంది.   నిరుడు ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ “కాంగ్రెస్ నేతలందరినీ పంచెలూడదీసి తరిమితరిమి కొట్టాలి” అని ఎద్దేవా చేసారు. కానీ తను ఎంతో ఉన్నతంగా ఊహించుకొన్న అన్నగారు చిరంజీవి కేంద్రం మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ షాకయ్యాడు. అప్పటి నుండే వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మళ్ళీ మొన్న రాష్ట్ర విభజన సందర్భంగా చిరంజీవి వ్యవహరించిన ద్వంద వైఖరితో ఆయనకు మానసికంగా కూడా దూరమయ్యాడు. ఆవిషయం మొన్న నాగబాబు కుమారుడు సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో స్పష్టంగా బయటపడింది.   ఇప్పుడు అన్నగారు చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా పోరాడేందుకు ఆయన పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతుండటంతో ఇక ఆ దూరం మరింత పెరిగి ఎన్నికల సమయానికి అది శత్రుత్వంగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయకపోడు. అప్పుడు కాంగ్రెస్ నేతలు అతను చిరంజీవి సోదరుడని విడిచిపెట్టలేరు కనుక వారు తీవ్రంగానే విమర్శించవచ్చును. ఇది మెగా బ్రదర్స్ ముగ్గురికీ, వారి కుటుంభ సభ్యులకు, వారి అభిమానులకు కూడా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు కల్పించడం ఖాయం.

new political parties

కొత్త వి"నాయకులు"

  వినాయక చవితి వస్తోందంటే చాలు.. ఉత్సవ కమిటీలు హడావిడి అంటా ఇంతా కాదు. పోటాపోటీగా పందిర్లు ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణతో ఊరూ వాడా మెరిసిపొతాయి. దోనీ గణపతి, రోబో గణేష్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు గణపతి విగ్రహాలను తీర్చిదిద్ది నిలుపుతారు. అందరూ పూజించేది వినాయకుడినే .. కొలిచేది విఘ్ననాయకుడినే .. గణేష్ నవరాత్రులలో మాత్రం వీధికి ఒకలా గణనాధుడు మనకు కనిపిస్తాడు. కొత్త దేవుడండీ ..సరికొత్తా దేవుడండీ అని భక్తులు పాడుకొనేలా వీధి మారేసరికి గణపతి రూపాలు కూడా మారిపోతాయి. గతేడాది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల నేపధ్యంలో గణపతి కూడా సీమాంధ్ర, తెలంగాణా రూపాలను సంతరించుకున్నాడు. ప్రస్తుతం విభజన పూర్తి అయిపోయింది. దగ్గరలో వినాయకచవితి కూడా లేదు. కానీ సరికొత్త వినాయకులు పుట్టుకొస్తున్నారు. ఈ వినాయకులు ఎవరని మీరు ఆశ్చర్యపోవద్దు. మన దేశంలో ఏ పని కావాలన్న వినాయకుడి మాదిరిగానే వీరినే ముందు దర్శించుకోవాలి. దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. దక్షిణ సమర్పించుకోవాలి. ఆనక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ పూర్తి అయితే స్వాముల అనుగ్రహం పొంది కోరుకున్న పని జరుగుతుంది. వీరి దర్శనం అయితే ఇంకా శివుడిని ప్రార్ధించాల్సిన పని కూడా అంతగా ఉండదు. ఆయన రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో రాష్టపతి లాంటి వాడు. ఆమోదముద్ర వేసి పారేస్తాడు.   రాజకీయ నవరాత్రోత్సవాలు వంటి ఎన్నికలకు ప్రకటన వెలువడింది. ఊరుకో రాజకీయ వి"నాయకుడు" కొలువైపోతున్నాడు. ఇందులో ప్రజల విఘ్నాలు తొలగించేది ఎందరో, దక్షిణలు, నైవేద్యాలు మింగేసి దయాదాక్షిణ్యాలు లేకుండా దోచుకునేది ఎందరో భక్తులైన ఓటర్లకు కొద్దిరోజుల్లో తత్త్వం బోధపడనుంది. ఎన్నికల నవరాత్రోత్సవాలు ముగిసేసరికి జనం కొంత మంది నేతాగ్రేసరులను నిమజ్జనం చెసేస్తారు. ఇవన్నీ కొత్తా దేవుళ్ళం అనిపించుకునేందుకు ఈ ఎన్నికల్లో చాలా మంది బరిలోకి దిగుతున్నారు.   మ్యాచ్ అయిపోలేదని అందరినీ చివరి బంతి వరకూ గ్రౌండ్లో కూర్చో పెట్టి ప్రత్యేక రాష్రం సినిమాను శుభం కార్డు పడేవరకు చూపించిన నల్లారి వారు పార్టీ పెడుతున్నారు. నిజమండీ నమ్మండీ .. స్వయంగా ఆయనే చెప్పేశారు. ఎన్నికల తరువాత కిరణ్ అనే వినాయకుడు కాంగ్రెస్ లో నిమజ్జనం కాక తప్పదని తెలుగు తమ్ముళ్ళు మైకు పట్టుకు అరుస్తున్నారు. జైలు..బెయిల్ పార్టీగా టీడీపీ నేతలు వర్ణిస్తున్న వై సి పీ కూడా 10 జనపథ్ ఆలయంలో విలీనం జరిగితీరుతుందని.. దమ్ముంటే బెట్టింగ్ కాయమంటున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వచ్చిన చిరంజీవి ..ప్రజరాజ్యం పార్టీ స్థాపించి.. వై ఎస్ రాజ్యం ఏర్పడేందుకు ప్రత్యక్షంగా సహకరించాడు. పరోక్షంగా టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు మన అందరివాడు. పార్టీ లక్ష్యం నెరవేరకపోయినా ..తన ‘చిరు లక్ష్యం’ మాత్రం నెరవేర్చుకున్నారాయన. ఓటడిగే ఎన్నిక నుంచి చాటుమాటుగా ఎన్నికయ్యే రూటు చేరుకున్నాడు. కాంగ్రెస్ అనే మహాసముద్రంలో తన ప్రజా రాజ్యాన్ని నిమజ్జనం చేశాడీ వినాయకుడు.   ఎన్నికలకు ముందు తన సైన్యం బరిలో దిగుతుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో వింత వినాయకుడి అవతారం ఎత్తనున్నాడు. అన్న మాదిరిగానే ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ ఎవరిని పవర్ కు దూరం చేస్తాడో అనే టెన్షన్ తో పాత వినాయకులు బిక్క చచ్చిపోయున్నారు. పవన్ ఎవరి పుట్టి ముంచుతాడో అనే భయంతో పార్టీలన్నీ ఎన్నికల నవరాత్రోత్సవ జాగారం చేస్తున్నాయి.   ప్రాంతం కార్డుతో మరికొన్ని పార్టీలు, కులం పేరుతొ ఇంకొన్ని పార్టీలు తమ వినాయకులను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి వినాయకచవితికి ఘనంగా పూజలు అందుకునే వినాయకు విగ్రహాలను నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే నిమజ్జనం ఆనవాయితీ. ఆలాగే ప్రతి ఐదేళ్ళకు ఓసారి జరిగే ఎన్నికల వేడుకల సందర్భంగా కొత్త దేవుళ్ళను నిమజ్జనం చేస్తారు జనం. మరికొందరు వినాయకులు శివాలయాల్లాంటి జాతీయ ప్రాంతీయ పార్టీల కార్యాలయాల ప్రాంగణాలకు చేరుకొని ఉత్సవ విగ్రహాల్లా పూజలు అందుకుంటున్నారు.   ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ , కాసాని జ్ఞానేశ్వర్, చిరు ప్రజారాజ్యం, విజయశాంతి తల్లి తెలంగాణా, లక్ష్మిపార్వతి, హరికృష్ణ వంటి వారు స్థాపించిన పార్టీలు ఇప్పుడు వికీపీడియా లో వెతికినా దొరకవు. మరి కొత్తా పార్టీలు పెట్టే వారంతా పాత వినాయకులుగానే మిగిలిపోతారా.. లేదంటే గణేష్ మహారాజ్ కీ జై అనిపించుకుంటారా? అనేది ప్రజాస్వామ్యానికి మహా భక్తులైన ఓటఋ మహాశయులు తేలుస్తారు.

daggubati venkateswara rao

దగ్గుబాటి రాజకీయ సన్యాసం...ఎందుకు?

  రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో పెట్టేందుకు రాష్ట్ర విభజన అంశం ఎత్తుకొన్న సోనియాగాంధీ, అందుకోసం సీమాంధ్రలో తన పార్టీని, పార్టీ నేతల భవిష్యత్తుని బలిగోనేందుకు కూడా వెనుకాడలేదు. ఆమె పుణ్యామాని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు చెల్లచెదురయిపోతే, మరికొందరు ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకోక తప్పలేదు. పాము తన పిల్లలని తానే తిన్నట్లుగా ఉందిది. ఇప్పటికే లగడపాటి రాజకీయ సన్యాసం స్వీకరించగా ఇప్పుడు మరో కరడుగట్టిన కాంగ్రెస్ వాది దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ మరియు కుటుంబ కారణాల రీత్యా తను రాజకీయ ల నుండి తప్పుకొంటున్నట్లు ఆయన తెలిపారు.   అయితే నిన్ననే దగ్గుబాటి దంపతులిరువురూ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించి, మళ్ళీ ఇంతలోనే ఆయన మనసు మార్చుకొని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరుచూరు శాసనసభ నియోజక వర్గం నుండి మళ్ళీ పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసినందున, త్వరలో బీజీపీ సీమాంధ్ర శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి తరుణంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకోవాలని భావించడం వెనుక బలమయిన కారణాలే ఉండి ఉండవచ్చును.       ప్రస్తుతం బీజేపీ-తెదేపాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నపటికీ, త్వరలోనే ఆ రెండు ఎన్నికల పొత్తులు పెట్టుకోవచ్చును. ఒకవేళ ఆయన బీజేపీలో చేరినట్లయితే, ఏదో ఒక సందర్భంలో తను వ్యతిరేఖించే తన తోడల్లుడు చంద్రబాబుతో పార్టీ వ్యవహారాల నిమ్మితం కలవ వలసి ఉంటుంది. బహుశః అది ఇష్టం లేని కారణంగానే ఆయన బీజేపీలో చేరేందుకు వెనుకాడి ఉండవచ్చును. అయితే అందుకు రాజాకీయ సన్యాసం తీసుకోనవసరం లేదు. ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా నయినా పోటీ చేసి గెలువవచ్చును. కానీ, రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమయిన మెజార్టీ రాని పక్షంలో, ఆయన అయిష్టంగానయినా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయవలసి రావచ్చును. అటువంటి బేరసార రాజకీయాలకు బొత్తిగా ఇష్టపడని కారణంగానే ఆయన రాజకీయాల నుండి తప్పుకొని ఉండవచ్చును.  

balakrishna

మళ్ళీ బాలయ్య గోల?

  నటసింహం మరోసారి జూలు విదిల్చింది. నందమూరి వారసుల బాటలోనే బాలకృష్ణ పయనిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కోసం బాలయ్య పోరాడాల్సిన పని ఉందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ మాదిరిగానే పార్టీ అంతర్గత విషయాన్ని రచ్చ చేశారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభిమానులు. యెన్బీకే ఫ్యాన్స్ పేరుతో వివిధ జిల్లాల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు నిర్వహించిన సమావేశాలు సంచలనం సృష్టించాయి. కంటి చూపుతో చంపేస్తానని సినిమాలో విలన్లను బెదిరించే బాలయ్య బాబు.. కనుసన్నల్లోనే అభిమానులు ఆందోళనకు దిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అభిమానులు డిమాండ్ చేయడం తెలుగుదేశం శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది.   గతంలోనూ చాలా సార్లు అలక పాన్పు ఎక్కిన బాలకృష్ణ ... మళ్ళీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్లు పార్టీకి హ్యాండ్ ఇచ్చే సమయంలో బాలయ్య ఒక్కడు బాబుతోపాటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. బాబు బాలయ్యకు బావ మాత్రమే కాదు.. వియ్యంకుడు కూడా..పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా ఎప్పుడూ బాలయ్య మాట్లాడింది లేదు. అలాంటిది పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో బాలయ్య అభిమానుల ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పార్టీలో కీలక పాత్ర పోషించాలనుకుంటే బాబుతో మాట్లాడవచ్చు.. తన అల్లుడైన లోకేష్ తో మాట్లాడి ఉండవచ్చు.. ఇవేమీ చేయకుండా అభిమానులతో ఆందోళన ఎందుకు చేయించారనే దాని చుట్టే టీడీపీ నేతల ఆలోచనలు సాగుతున్నాయి.   బాబు దగ్గర మాట చెల్లుబడి కాని నేతలు కొందరు బాలయ్య పంచన చేరి..తెర వెనుక ఉంది డ్రామాలు ఆడిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా నందమూరి నాయకుడి అసమ్మతి రాగం బాలయ్య..బాలయ్యా గుండెల్లో గోలయ్య అంటూ టీడీపీ నేతల గుండెల్లో మార్మోగుతోంది. తెగే దాకా లాగే బాబు గారు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతారో అనే ఆశక్తితో చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఓ పక్క టీడీపీలోకి భారీగా ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తూ .. పసుపుపచ్చ కండువాలు కప్పేస్తున్నారు బాబు. మరో పక్క తెలంగాణాలో సైకిల్ పార్టులు ఒక్కొక్కటిగా "కారు"లో తరలించుకుపొతున్నారు.   రాష్ట విభజన నేపధ్యంలో సామాజిక తెలంగాణా, అవశేష ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం తనతోనే సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త రాష్ట్రం, రాజధాని పునర్ నిర్మాణం సాధ్యమని సీమాంద్ర జనాలు కూడా ఆశతో ఉన్నారు. ఇదే సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని బాబు అందుకు తగిన వ్యూహాలు రచించుకుంటున్నారు. తెలంగాణలో నేతలు జారిపోతున్నా, కేడర్ ను కాపాడుకుని పార్టీని నిలబెట్టాలని విశ్వప్రయత్నం చెస్తున్నారు.   ఇంత కీలక సమయంలో బాలయ్య గొడవ బాబుకి చికాకు పెట్టె అంశమే. తెలుగుదేశంలో ఎన్టీయార్ కుటుంబం ప్రతినిధిగా ఉన్న బాలయ్య మనసెరిగి మసులుకుంటే అన్నగారి అభిమానుల అభిమానం చూరగొనొచ్చు .. అదే సర్దుకుంటుంది అని వదిలేస్తే.. ప్రత్యర్హి పార్టీలకు బాలయ్యకు అన్యాయం అనే మరో విమర్సనాస్త్రాన్ని అందించినట్టవుతుంది. మరి బాబుగారు ఏమి చేస్తారో?

congress

కాంగ్రెస్ తో మజ్లిస్ తలాక్ దేనికో

  కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు పూర్తిగా చెడిపోయింది. హైదరాబాద్ మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ సోమవారం రాజీనామా చేస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎలాగోలా ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలని పీసీసీ చీఫ్ బొత్స మంతనాలు సాగించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. పాత ఒప్పందం ప్రకారమే మేయర్ రాజీనామా చేస్తున్నా.. డిప్యూటీ మేయర్ పదవి తీసుకోడానికి కూడా మజ్లిస్ నేతలు ఆసక్తి చూపించలేదు. దీన్నిబట్టి చూస్తే ఇక కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పడానికి ఎంఐఎం సిద్ధమైపోయినట్లే ఉంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద పూర్తిస్థాయిలో సందడి కనిపిస్తోంది. తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గతంలో జగన్ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తన ఉనికిని చాటుకోడానికి మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాకే మజ్లిస్- కాంగ్రెస్ పార్టీల మధ్య చెడిపోయింది. ప్రధానంగా కొన్ని భూముల విషయమే వివాదానికి కారణమైందని అప్పట్లో వినిపించింది. ఈసారి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక కూటమిగా ఏర్పడొచ్చని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా పాతబస్తీకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మజ్లిస్ భావిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు యాదవ వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారిని ఎంఐఎం తరఫున ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కనీసం 3 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది.

kiran kumar reddy

ఇంతకీ కిరణ్ కొత్త పార్టీ ఎందుకు స్థాపిస్తున్నట్లు?

    ఎట్టకేలకు ఈరోజు మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. మార్చి12న రాజమండ్రీలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ రోజు పార్టీ పేరు, ఇత్యాదులు వెల్లడిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలుగు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఘోర అవమానం జరిగిందని, వారి ఆత్మాభిమానం దెబ్బతిందని, వారికి ఉపశమనం కలిగించేందుకే పార్టీ స్థాపిస్తున్నాని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలుగు ప్రజలను వంచించాయని, అందుకే వారి తరపూన పోరాడేందుకే పార్టీ స్థాపిస్తున్నాను తప్ప పదవుల కోసమో అధికారం కోసమో కాదని తెలిపారు.   అయితే ఆయన కాంగ్రెస్ ని వీడి బయటకొచ్చి కొత్త పార్టీ స్థాపిస్తున్నాకూడా ఇంకా తన అధిష్టానంపై మాట తూలకుండా చాలా ఒద్దికగా, సున్నితంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. పదవులకోసం అధికారం కోసం మిగిలిన పార్టీలన్నీ ఆరాటపడుతున్నాయని విమర్శించిన ఆయన, తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయదా? గెలిచేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయదా? గెలిస్తే పదవులు, అధికారం చెప్పాట్టదా? అనే సంగతిని మరిచిపోవడం విశేషం.   గాయపడిన తెలుగు ప్రజల మనసులకు స్వాంతన చేకూరూస్తానని చెపుతున్న ఆయన, రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలుగు ప్రజలకు (అంటే ఆయన దృష్టిలో కేవలం సీమాంధ్ర ప్రజలు మాత్రమే) ఏవిధంగా అవమానాలు పాలయ్యారో మరో మారు పూసగుచ్చినట్లు వివరించి మానుతున్న గాయాలను మరోమారు కెలికొదిలారు. రేపు ఎన్నికలలో గెలిచేందుకు కూడా ఆయన (పార్టీ) బహుశః ఇదే మంత్రం ప్రయోగించడం తధ్యం. లేకుంటే ఆయన కొత్తగా చెప్పుకోవడానికి వేరే ఏముంది?   అసలు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ దేనికి? అంటే తానిప్పుడు రాజకీయ నిరుద్యోగిగా మారానని ఆయనే స్వయంగా ఇటీవల ఒక సమావేశంలో చెప్పుకొన్నారు. ఆయన వంటి మరి కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించేందుకు, సమైక్యాంధ్ర సెంటిమెంటుని, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల నెలకొని ఉన్న వ్యతిరేఖతను ఓట్లుగా మలచుకొంటూనే, మిగిలిన ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీకి సహకరించేందుకు ఏర్పడుతున్న పార్టీ ఇది.   తనకే పదవి, అధికారం మీద మోజు ఉండి ఉంటే, మిగిలిన మంత్రులలాగ తను కూడా సోనియాగాంధీ కాళ్ళు పిసికితే సరిపోయేదని, కానీ తనకు తెలుగు ప్రజల (సీమాంధ్ర ప్రజలు మాత్రమే) కోసం ఆరటపడినందునే, అధిష్టానాన్ని కూడా ధిక్కరించి, బయటకి వచ్చి పార్టీ స్థాపిస్తున్నాని చెప్పుకొచ్చారు. మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీలో ఉండి సోనియమ్మ సేవలో తరిస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి ఆమె ఆదేశాల ప్రకారం పార్టీ నుండి బయటకి వచ్చి పార్టీ పెట్టి ఆమె ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వారు లోపలున్నారు. ఈయన బయట ఉన్నారు అంతే తేడా. ఎన్నికలు ముగియగానే ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆయనతో సహా ఆ పార్టీలో అందరూ కూడా మళ్ళీ లోపలకి వెళ్ళిపోతారు. అప్పుడు కేంద్రంలో అధికారం, పదవులు పొందుతారు. ఇదీ ఆయన కొత్త పార్టీ ప్రధాన ఎజెండా.

Can the Majilis spread their wings

Can the Majilis spread their wings?

      The Hyderabad based MIM - Majlis-e-Ittehadul Muslimeen(MIM) party has always shown its leanings towards the Congress and CPI, and for brief period stopped this because of Kiran Kumar Reddy. Now that he is no more the poster boy of Congress, the MIM have started their campaign trail slowly and steadily. But what needs to be seen is that their stronghold being the Old city which they have time and again tried to move beyond has flopped. The recent tryst to enter Gulbarga and Thane, looking at the substantial Muslim population there has led to a failure as they have been barred from entering these places. The same was in the case at Azamgarh in UP too.   The recent news is that   supremo Asaduddin Owaisi has been barred from entering Mumbra in Thane district of Maharashtra, after police claimed his visit could cause communal flare-ups in the area. He is to visit this place in February 9th and the police have served restraining orders at his home preventing him from entering this place till February 10th.His younger brother MLA Akbaruddin Owaisi‘s infamous hate speeches in 2012 disparaging Hindus and Hindu beliefs, which ultimately led to his arrest in 2013 and subsequent release on bail on 16 February 2013 has led to negative publicity against the party which has led to the hindrance of the MIM party to spread its wings further. It also needs to be seen whether Akbaruddin Owaisi who is out free and is still under trial for sedition, criminal conspiracy, spreading communal hatred, waging war against India and some other charges for inciting communal violence comes out and whether he can or will  also  contest this 2014.Now with MIM trying to forge alliances with the TRS to propagate themselves in Telangana and  the Congress in Seemandhra we need to see what bears fruit.  

pawan kalyan

పవ"నిజమేనా"?

  నిజం నిప్పులో కాలదు. నీటిలో నానదు. ఇజం మాత్రం ఎందులోనైనా ఇమిడిపోతుంది. నక్సలిజం, టెర్రరిజం, హీరోయిజం, విలనిజం ఇలా అవకాశం ఆసరాగా.. అవసరాలకు అనుగుణంగా ఇజం రూపుదిద్దుకుంటుంది. ఈ ఇజం లేకుండా పవనిజం అంతర్జాలాన్ని ఎలా ఆక్రమించింది? ఏ అదృశ్య శక్తి దీన్ని నడుపుతోంది? వీటన్నింటికి సమాధానమే పవన్ పొలిటికల్ ఎంట్రీ కథనాలు. నెటిజన్ల ద్వారా సామాన్య జనానికి వ్యాపించిన పవనిజం..హిప్నాటిజంలా మైమరిపిస్తోంది. పవనిజంపై పుస్తకాలు వచ్చాయి. ప్రత్యేక సంచికలు వెలువడ్డాయి. పవన్ అనే వ్యక్తిని అత్యంత ప్రభావవంతమైన శక్తిలా మార్చేందుకు తెర వెనుక మేధావులు చేస్తున్న మేదోమధనమే ఈ పవనిజమా? అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.. అనిపించుకున్న పవన్ చేతులు.. ఎందరికో చేయూతనిచ్చాయి.   ఒట్టి మాటలు కట్టి పెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్ అని వందేళ్ళ క్రితం గురజాడ చూపిన అడుగుజాడలో పయనించిన పవన్.. పావలా శ్యామల ఆరోగ్యం కోసం ఆర్ధిక సాయమందించాడు. ఉత్తరాఖండ్ ఉపద్రవానికి చలించిపోయి అందరి కంటే ముందుగా స్పందించి రూ. 25లక్షలు అక్కడి ప్రభుత్వానికి పంపాడు. అన్న కొడుకుతో ఆరెంజ్ అనే సినిమా తీసి ఓ రేంజ్ లో నష్టపోయిన నాగబాబును ఆర్థికంగా ఆదుకున్నాడు. ఈ విషయం నాగబాబు చెబితేనే అందరికీ తెలిసింది. గుప్తదానాలు, ఆప్తులను ఆదుకోవడాలు, ఆపద్ధర్మ సహాయాలు మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసిపోయాయి. ప్రచారానికి, ప్రసంగాలకు పవన్ దూరంగా ఉంటారు. తన సినిమా ఆడియో విడుదల వేడుకకు కూడా హాజరు కారు. తన సినిమాలకు అర్థ శతదినోత్సవాలు, శత దినోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఇష్టపడరు. ఇదంతా గతం..ప్రస్తుతం .. సినిమా వేడుకలైనా.. స్వచ్చంద కార్యక్రమాలైనా ..ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతున్నారు ;పవన్. భావోద్వేగపూరిత, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే తన ప్రసంగాల శైలినీ మార్చేశారు.   పవన్ ఎందుకు ఇంతలా మారిపోయాడో విశ్లేషించే పనిలో సినీ పండితులు, రాజకీయ విశ్లేషకులు తల మునకలయ్యారు. ఇదే సమయంలో పవనిజం చాప కింద నీరులా విస్తరించింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పవర్ స్టార్ ఇమేజ్ తో సొమ్ము చేసుకోవచ్చని, పవనిజం కూడా ప్రాంతాలకు అతీతంగా ఓట్లు కురుపిస్తుందని పవన్ ను ఒప్పించి పూర్తి స్థాయిలో రాజకీయాల తెరపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారనే వాదన వినిపిస్తోంది.   మరో పక్క ఎన్నో ఆశలతో, మరెంతో నమ్మకంతో తన అన్న చిరంజీవి వెంట వెళితే పదవులే లక్ష్యమ్.. విలీనమే మార్గంగా కాంగ్రెస్ లో ప్రజరాజ్యాన్ని కలిపేయడం పవన్ ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని అంటున్నారు గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు. అందుకే కొత్తగా పార్టీ పెట్టి తన సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు.   వీటన్నిటి కంటే..వేరే బలమైన కారణమే పవన్ పొలిటికల్ ఎంట్రీకి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల వ్యవహారశైలి, పదవులు వచ్చిన తరువాత కొంత మంది వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన పవన్ చాలా రోజుల నుంచే పోలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారట.. అందుకే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైన ఆరాధ్య నటుడు .. అభిమాన నాయకుడిగా మార్చే వ్యూహంతో పవన్ కోటరీ పవనిజంతో అభిమానుల నెట్ ఇంట్లో అడుగు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కోరుకుంటే పదవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఫాం హౌస్ ముందు మొకరిల్లుతాయి. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఒక్క సీటు అడిగితే ఓపెన్ ఆఫర్ ఇచ్చే పార్టీలు ఉన్నాయి. పవన్ కోరుకుంటే జరగని పనిలేదు. పవన్ ఒక పవర్.   అలాగని పొలిటికల్ పవర్ కావాలనుకుంటే.. పవనిజం ఒక్కటే చాలదు. అన్న మోసగించినా మోములో చిరు నవ్వు చెదరకూడదు. వ్యక్తిగత జీవితంపై విమర్శలు వెల్లువెత్తినా వీధిన పడకూడదు. ఇన్ని భావోద్వేగాలను అదుపు చేసుకుంటే పవనిజం.. నిజమయ్యే ఛాన్స్ ఉంది.   సినిమాలోలా .. రాజకీయాల్లో నీ మాటలు నువ్వే రాసుకోవాలి.. పాటలు నువ్వే పాడుకోవాలి.. అక్కడ ఒకేసారి కొడితే వందమందిని పడతారు.. ఇక్కడ ఒక్క మాటన్న తిరగబడతారు.. రీటేక్ , రీషూట్ లు ఉండవు. యాక్షన్ సీనులో డూప్ లు అసలే ఉండరు. అంతా నా ఇష్టం! అని ఒకరికి విడాకులు ఇవ్వకుండా.. విశాల దృక్పధంతో సహజీవనానికి సిద్ధపడితే ప్రతిపక్షాలు ఎన్నికల్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాయి. అదే నిజమైతే ఎన్నో కలలుగన్న ఎన్నికల రంగం నుంచి తప్పించనూ వచ్చు.. సినీమాయా ప్రపంచం నుంచి బయట పడితే.. పవనిజం.. నిజమే ఐతే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.

daggubati venkateswara rao

దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరితే

  దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవే నిజమయితే వారి వలన బీజేపీకి, బీజేపీ వలన వారికి ఊహించనంత ప్రయోజనం కలగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. వారిరువురూ తెలుగుదేశంలో చేరినా అదేవిదమయిన ప్రయోజనం కలిగే అవకాశం ఉండేది. అయితే, ఈ ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేఅవకాశాలునందున బీజేపీలోకి వెళ్ళడం వలననే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరికి, ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగితే ఆమెకు మళ్ళీ అంతకంటే మంచి కీలకమయిన పదవే దక్కవచ్చును. కానీ, బీజేపీ అధికారంలోకి రాకపోయినట్లయితే, వారి ఈ నిర్ణయం వారికి రాజకీయంగా చాలా నష్టం కలిగిస్తుంది. అయితే ఇంతవరకు వెలువడుతున్న సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి గనుక వారు బీజేపీలో చేరాలనుకోవడం మంచి నిర్ణయమేనని భావించవచ్చును.   సీమాంధ్రలో బీజేపీని సమర్ధంగా ముందుకు తీసుకుపోగాల నాయకుడు కానీ, ప్రజలకు సుపరిచితమయిన మొహాలు కానీ లేకపోవడంతో ఇంతకాలం బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్ర తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడుతున్న ఈ సమయంలో బీజేపీ కూడా సీమాంధ్రకు ప్రత్యేక శాఖ ఏర్పరచడానికి సిద్దం అవుతోంది గనుక, ఒకవేళ దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరేందుకు సిద్దపడితే వారికి లోక్ సభ, శాసనసభ టికెట్స్ తో బాటు పురందేశ్వరికి సీమాంధ్ర పార్టీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదు.   రాష్ట్ర విభజన బిల్లుకి బీజేపీ మద్దతు ఇచ్చిన కారణంగా ఇంతవరకు తెదేపా ఆ పార్టీతో పొత్తుల గురించి తన అభిప్రాయం చెప్పకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు కుదుర్చుకొంటే, మిత్రపక్షమయిన బీజేపీలో దగ్గుబాటి దంపతులు చేరడం వలన తేదేపాకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ, కాంగ్రెస్-వైకాపాల నోటికి భయపడి, సీమాంధ్రలో ప్రజాగ్రహానికి గురవుతామనే భయంతోను ఒకవేళ తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొనేందుకు వెనుకాడితే, అప్పుడు పురందేశ్వరి రాకతో బలపడిన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సవాలుగా మారడం ఖాయం. అందువల్ల దగ్గుబాటి దంపతులు తెదేపా, బీజేపీలలో ఏ పార్టీలో చేరుతారనే అంశం కూడా ఆ రెండు పార్టీలను తీవ్ర ప్రభావితం చేయనుంది.

ashok gajapati raju

మరోసారి బొబ్బిలి యుద్ధం ?

  వంచనకు.. వీరత్వానికి మధ్య జరిగిన యుద్ధం అది. విదేశీయులతో చేతులు కలిపి స్వదేశీ రాజ్యాలను కబళించే కుట్రకు సాక్ష్యం ఆ రణరంగం. బొబ్బిలి యుద్ధం ఒక చరిత్ర. 1757 జనవరిలో ఫ్రెంచ్ సేనాని బుస్సీతో కలిసి బొబ్బిలిపై పోరుకు దిగారు విజయనగర రాజులు. అత్యంత బలమైన విజయనగర సైన్యం, ఫ్రెంచ్ సేనలతో పోరాడి ఓడిపోయారు బొబ్బిలి సంస్థానాధీశులు. బొబ్బిలి జమీందారు రంగారావు బావమరిది తాండ్రపాపారాయుడు విజయనగర రాజును అంతమొందించాడు. పౌరుషానికి, పోరాటానికీ ఉదాహరణగా నిలిచిన వీర బొబ్బిలి యుద్ధం మరోసారి జరగబోతోంది.   నాటి బొబ్బిలి యుద్ధం బొబ్బిలిలో జరిగితే.. నేటి యుద్ధం విజయనగరంలో జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన నేపధ్యంలో .. బొబ్బిలి పార్లమెంట్ స్థానం మాయమై విజయనగరంలో విలీనమైంది. ఎన్నికల నగారా మోగిన వేళ వీరబొబ్బిలి సమరానికి వేదిక కానుంది విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం.   విజయనగర రాజుల వారసుడు, ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ అభ్యర్ధిగా విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తెలుగుదేశం సీనియర్ నేతగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న అశోక్ ఎంపీగా పోటీ చేస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.   ఇదే స్థానం నుంచి బొబ్బిలి సంస్థానాధీశుల వారసుడు అర్వీఎస్ కె రంగారావు (బేబీ నాయన) జగన్ పార్టీ తరపున బరిలో దిగనున్నారు. ఈయన గతంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. రెండున్నర శతాబ్దాల క్రితం రాజరికంలో ఆధిపత్యం కోసం పోరాడిన విజయనగరం రాజ వంశీయులు.. పౌరుషంతో ఎదురొడ్డిన బొబ్బిలి సంస్థానాధీశుల వారసులు.. ఇన్నేళ్ళ తరువాత ప్రజాస్వామ్య క్షేత్రంలో యుద్దానికి సిద్ధమవుతున్నారు.   కాంగ్రెస్ ను వీడి జగన్ పార్టీలో చేరిన బొబ్బిలి రాజులు.. తమ తరతరాల క్రిందటి శత్రువైన విజయనగర రాజ్య వంశీయుడు అశోక్ గజపతి రాజుతో తలపడుతున్నారు. బ్యాలెట్ బాక్సింగ్ లో ఏ రాజు గెలిచినా అది మరో చరిత్ర అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఈ ఇద్దరు రాజులు యుద్ద వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. నాటి బొబ్బిలి యుద్ధాన్ని పుస్తకాల్లో చడుకోవడం, సినిమాలు చూసి తెలుసుకున్న నేటి తరానికి.. విజయనగరం పార్లమెంటు కేంద్రంగా మరోసారి అభినవ బొబ్బిలి యుద్ధాన్ని చూసే అవకాశం దక్కనుంది.   ఈ వీర బొబ్బిలి యుద్దంలో కొసమెరుపు ఏమిటంటే సిట్టింగ్ ఎంపీ, పీసీసీ చీఫ్ బొత్స భార్య కూడా ప్రేక్షకురాలిగానే మిగిలిపోవచ్చంటున్నారు విజయనగరం మరియు బొబ్బిలి ఓటర్లు.

టీడీపీని టార్గెట్ చేసిన కేసిఆర్, సోనియా!

  కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఎన్నికలకు ముందు హటాత్తుగా విభజన అంశం భుజానికెత్తుకోవడం సహజంగానే అందరికీ అనుమానాలు రేకెత్తించింది. ఈ విభజన వల్ల రాజకీయంగా ఎవరు ఎక్కువ దెబ్బతిన్నారని ఆలోచిస్తే ‘తెలుగుదేశం పార్టీ’ అని అందరూ టక్కున జవాబిస్తారు. తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తూ ఆ పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ ఆ సంగతి గట్టిగా చెప్పుకోలేక అటు తెలంగాణాలో, ఇటు సీమంద్ర రెండు ప్రాంతాలలో నష్టపోయింది. తెదేపాకు తెలంగాణా చాలా బలమయిన క్యాడర్ ఉన్నపటికీ పార్టీ అధిష్టానం కానీ, పార్టీలో తెలంగాణా నేతలు గానీ వారికి దైర్యం చెప్పి అండగా నిలబడకపోవడంతో ఇదే అదునుగా తెరాస తమ పార్టీలోకి వలసలు ప్రోత్సహించింది.   తెలంగాణాలో తెదేపాను దెబ్బతీయడం తెరాసకు ఎంత అవసరమో కాంగ్రెస్ కి కూడా అంతే అవసరం. కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు యంపీ సీట్లు కావాలి. కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అయ్యేందుకు తెరాసకు యం.యల్యే. సీట్లు కావాలి. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా చేసుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకొనేందుకు గట్టిగా పట్టు బట్టిందని అందరికీ తెలుసు. కానీ, తెరాసను విలీనం చేసుకొని తెలంగాణాలో బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాను విడిచిపెట్టడం శత్రుశేషమే అవుతుంది. కనుక ఆ ప్రయత్నంలో తెరాసపై గట్టిగా ఒత్తిడి తెచ్చి తెదేపా నేతలని, క్యాడర్ ని పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసింది. అయితే, ఎక్కడా తన పాత్ర బయటపడకుండా తనలో విలీనం కాబోతున్న తెరాసనే ముందుంచి పని కానిచ్చేయాలని ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశానికి చివరి వరకు నొక్కిపడుతూ అనేక ట్విస్టులు ఇస్తూ ప్రజలనే కాదు తెరాసను దాని అధ్యక్షుడు కేసీఆర్ ని సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టినా కూడా అది ఆమోదం పొందుతుందో లేదో తెలియని పరిస్థితులు కల్పించడంతో ఎవరికీ తల వంచని కేసీఆర్ సోనియాగాంధీ ముందు సాగిలపడినంత పని చేయడం అందరికీ తెలిసిన విషయమే.   ఆ రెండు పార్టీల మధ్య తెదేపా నలిగి నష్టపోయింది. కానీ వారు ఆశించినట్లుగా తెలంగాణాలో తెదేపాను మాత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో తెరాస కాంగ్రెస్ లో విలీనం అయిపోతే, ఇక తెలంగాణాలో తెదేపా తప్ప మరో బలమయిన ప్రతిపక్షం ఉండదు. ఇదే అదునుగా తెదేపా-తెలంగాణ నేతలయిన ఎర్రబెల్లి, రావూరి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి, రమణ తదితరులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి గట్టిగా, పట్టుపడితే నేటికీ తెదేపా మళ్ళీ బలపడి పూర్వ వైభవం పొందే అవకాశం ఉంది.   రాష్ట్ర విభజన వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశ్యం తెలంగాణాలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడమే కానీ తెదేపాను బలపడేలా చేయడం కాదు. కనుకనే, అంతవరకు ఒకరినొకరు కౌగలించుకొన్నంత పనిచేసిన కాంగ్రెస్-తెరాసలు అకస్మాత్తుగా శత్రువులుగా మారిపోయి విలీన ఒప్పందం తెంచేసుకొని ఉండవచ్చును. ఇప్పుడు కాంగ్రెస్-తెరాసలు వేర్వేరుగా తెదేపాలో బలమయిన నేతలకి, ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి వారికి టికెట్స్ ఆశ చూపి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేయవచ్చును.   తెదేపా-తెలంగాణా కమిటీ వేసిన తరువాత, పార్టీ సారధ్య బాధ్యతల కోసం, తెలంగాణా అధ్యక్ష పదవి కోసం ఎలాగూ పార్టీలో లుకలుకలు మొదలయ్యే అవకాశం ఉంది గనుక, అదే అదునుగా ఆ రెండు పార్టీలు టికెట్స్ ఎరగా వేసి వలసలను ప్రోత్సహించి తెదేపాను పూర్తిగా బలహీనపరిచే ప్రయత్నం చేయవచ్చును. మరి ఇంతవరకు అనేక అగ్ని పరీక్షలు ఎదుర్కొన్న తెదేపా ఈ అంతిమ పరీక్ష ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడవలసి ఉంది.

కాంగ్రెసోళ్లు డిసైడైపోయారు

  చూడబోతే కాంగ్రెస్ పార్టీ వాళ్లు పూర్తిగా డిసైడైపోయినట్లే కనిపిస్తోంది. ఏమిటంటారా.. అదే సీమాంధ్ర ప్రాంతంలో తమకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా అక్కర్లేదని, కనీసం డిపాజిట్లు కూడా దక్కాల్సిన అవసరం ఏమాత్రం లేదని, అంతేకాదు.. మరో దశాబ్ద కాలం పాటు అక్కడ పార్టీని కిలోమీటర్ల లోతున పాతేసుకోడానికి కూడా తమకు అభ్యంతరం లేదని వాళ్లు డిసైడైపోయినట్లే కనిపిస్తోంది. కేంద్రమంత్రి, తెలంగాణాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జీవోఎంలో కీలక సభ్యుడు, మన రాష్ట్రం కోటా నుంచి రాజ్యసభకు పదేపదే ఎంపికవుతూ వస్తున్న జైరాం రమేష్ మాటలు చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే, సీమాంధ్రులను అత్యంత నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ.. అదికూడా సొంత పార్టీ కార్యకర్తల ముందు, నాయకులు, కేంద్రమంత్రుల ముందు కూడా మాట్లాడటానికి సైతం ఆయన వెనకాడటం లేదు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి అడుగడుగునా తనకు ఎదురవుతున్న నిరసనలు చూసి తట్టుకోలేకపోయినట్లున్నారు.   సీమాంధ్రులను ఇలాగే వదిలేస్తే, చార్మినార్ లోని రెండు మీనార్లు కూడా కావాలంటారని ఆయన అన్నారు. రోజూ ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలంటూ అష్టోత్తరం, సహస్రం చదివేవారని ఎద్దేవా చేశారు. మరోవైపు టీఆర్ఎస్ తమలో విలీనం కాకపోయినా పర్వాలేదు.. కనీసం పొత్తయినా ఉంటే చాలు, ఎంతో కొంత మేర తెలంగాణా ప్రాంతంలో బతికి బట్టకడదామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర పెద్దలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

దటీజ్ కేసీఆర్

  మొత్తానికి కేసీఆర్ అనుకున్నంతా చేశారు. జీవితకాల లక్ష్యాన్ని పదిహేనేళ్లలోనే సాధించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పొగిడించుకుని, ఆయన వద్ద నాలుగు కన్నీటి చుక్కలు రాల్చి, పాదాభివందంనం చేసి.. తిరిగొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నానా గడ్డీ కరిపిస్తున్నారు. తెలంగాణ ఇస్తే చాలు, సోనియా గాంధీ కాల్మొక్కుతా, ఆమె ఇంట జాడు (చీపురుకట్ట)తో తుడుస్తా అని ముందు కావల్సినంత కాలం చెప్పి, ఇప్పుడు విలీనం లేదు, గాడిదగుడ్డు లేదు పొమ్మన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏమీ చేయలేక రకరకాల పిల్లిమొగ్గలు వేస్తోంది. దానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మాటలే నిదర్శనం. తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తానని కేసీఆరే అన్నారని.. ఇప్పుడు విలీనం చేయకపోయినా తాము చేసేది ఏమీ లేదని చెప్పారు. అయితే దింపుడు కల్లం ఆశలాగ, పొత్తుల కోసం కె.కేశవరావు నేతృత్వంలో ఆయనో కమిటీ వేశారని, వాళ్లు తీసుకునే నిర్ణయం యూపీఏకు అనుకూలంగానే ఉండొచ్చని దిగ్విజయ్ చెప్పారు. తాము ఎన్నికల తర్వాత యూపీఏ కూటమిలోనే ఉంటామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు కూడా ఇప్పుడు చెప్పుకొంటున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన విలీనం మాట ఏమైపోయిందో చెప్పలేడు గానీ, ఎన్నికల తర్వాత పొత్తుల గురించి దిగ్విజయ్ మాట్లాడుతుంటే చూసేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు.   రాష్ట్ర స్థాయిలో ఒకసారి కాంగ్రెస్ పార్టీతోను, మరోసారి తెలుగుదేశం పార్టీతోను పొత్తులు పెట్టుకుని.. ఇంకా ఫలితాలు వెలువడక ముందే ఢిల్లీ వెళ్లి కమలనాథులతో కూడా మంతనాలు సాగించిన చరిత్ర కేసీఆర్ సొంతమన్న విషయం బహుశా దిగ్విజయ్ సింగ్ మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే, ఆయనకు పెద్దవయసు వచ్చింది కాబట్టి మతిమరుపు ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే ఇంకా కేసీఆర్ మాటలు పట్టుకుని వేలాడుతున్నారు. దటీజ్ కేసీఆర్..

TRS Gulab Gang ready for April 30th

        It’s now official- the Election Commission has released the poll schedule and the Election Code of Conduct is effective from today! We have the state of Andhra Pradesh going to the polls for the last time in History as a unified Andhra only to be divided after June 2nd when it becomes Telangana and Andhra. Does it matter if it’s Seemandhra or Andhra, anyways it is the rest of Andhra. So on the 30th of April 2014 the region of Telangana  goes to vote and on May 7th 2014  Seemaandhra goes to vote. This has set the ball rolling for a historic battle between all parties who are going to fight it out for a share of this divided state. Potti Sreeramulu’s fast and ultimately his death for Andhra have gone wasted, but we have the new Telangana Gandhi who managed to survive the fast unto death at the Nizam hospital  in Hyderabad in 2009  and unleashed the whole pandemonium which led to the state bifurcation. He now wants the City of Hyderabad to be the next Pink City apparently ! Move over Jaipur. And we saw that happen when the city of Hyderabad turned pink literally with the TRS party flags and flexi banners used for welcoming him after his Delhi sojourn. Now did anyone miss him at the parliament along with his sulking partner TRS MP Vijayasanthi not speaking a word when the bill was tabled, discussed or passed? Maybe we missed all of that in the great black- out and with Ramulamma finally ditching him for the Congress which according to her is the real reason why the T Bill was passed. With Election schedule out we need to see what strategy TRS KCR and his Gulab Gang intend to do to win the 119 Assembly seats and 17 Parliamentary Seats in the T region. Calling off the alliance with Congress  because the UPA government has not acceded to a single point suggested by TRS in the T Bill, they have set up a 5-member committee headed by party Rajya Sabha member K Keshava Rao to decide on forging alliances for the coming elections. The committee also includes Nayani Narasimha Reddy, Etela Rajender, Kadiam Srihari and B Vinod. So we need to wait and see what their next move will be.