కియారా భాబీ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్స్!
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మా పర్మనెంట్ బుకింగ్ అయిపోయింది అంటూ సిద్, కియారా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకరి బుగ్గపై ఒకరు ముద్దుపెట్టుకుని ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 7న జై సల్మేర్లో వీరి వివాహం జరిగింది. ఫిబ్రవరి 4నే వధూవరులు కుటుంబసభ్యులతో అక్కడికి చేరుకున్నారు. మెహందీ, హల్దీ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. దాదాపు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. పెళ్లికి కొన్ని రోజుల ముందుకూడా సిద్ ఈ విషయం గురించి నోరు విప్పలేదు...