English | Telugu

జోరుమీదున్న మృణాల్ ఠాకూర్‌!

జోరుమీదున్నానంటూ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు మృణాల్ ఠాకూర్‌. లాస్ట్ ఇయ‌ర్‌కి ముందు మృణాల్ అంటే ఎవ‌రో స్పెష‌ల్‌గా చెప్పాల్సి వ‌చ్చేదేమో. కానీ సీతారామం విడుద‌లైన త‌ర్వాత ఆమె గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. రీసెంట్‌గా ఉత్త‌రాదిన వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కం చేస్తున్నారు మృణాల్‌. బాలీవుడ్ న‌టుడు ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ఆమె గుమ్రా అనే సినిమా చేస్తున్నారు. ఈ టీజ‌ర్ విడుద‌ల కానుంది.  ఈ విష‌యాన్ని ఆదిత్య రాయ్ క‌పూర్ రివీల్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్న‌ట్టు తెలిపారు. ఆదిత్య రాయ్ క‌పూర్‌, మృణాల్ జంట‌కు నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది.