'బడే మియా చోటేమియా' షూటింగ్ మొదలైంది!
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, బాలీవుడ్ యంగ్స్టార్ టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా 'బడేమియా చోటేమియా'. ఇద్దరు హీరోలు కలిసి ఫైనల్ గా తమ అప్కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బడే మియా చోటే మియా'ను ప్రారంభించారు. పూజ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ యంగ్ హీరో, మల్టీటాలెంటెడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.