రణ్వీర్- అలియా సినిమాకు సెన్సార్ బోర్డ్ సూచనలు
రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం `రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని`. జూలై 28న ఈ సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. ఓ వైపు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో రణ్వీర్ సింగ్, అలియా భట్, కరణ్ జోహార్ బిజీగా ఉన్నారు. మరో వైపు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 2 గంటల 48 నిమిషాల వ్యవధితో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ బోర్డ్ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే.. సినిమాలో కొన్ని చోట్లు అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించారు. దాన్ని మ్యూట్ చేయాలని లేదా మరో పదంగా మార్చాలని అన్నారు. అలాగే బ్రా అనే పదాన్ని ఐటెమ్ అని మార్చాలని సూచించారు.