వాళ్ళ అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు.. జాన్వీకపూర్ సంచలన వ్యాఖ్యలు
అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi)నటవారసురాలు జాన్వీకపూర్(Janhvi Kapoor)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో జతకడుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ 'శ్రీలంక'(Srilanka)లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో చరణ్, జాన్వీ కపూర్ పై సాంగ్స్ ని చిత్రీకరించనున్నారు. రీసెంట్ గా జాన్వీకపూర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో'(Too much with kajol and twinkle show)కి ప్రముఖ దర్శకుడు , నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి గెస్ట్ గా వెళ్ళింది. ఈ ప్రోగ్రాం కి ఒకప్పటి అగ్ర హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు.