English | Telugu

అఖండ2 టికెట్‌ ధరలపై తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ.. పెంచిన టికెట్‌ రేట్లు ఇవే!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ2 తాండవం' చిత్రం ఎట్టకేలకు డిసెంబర్‌ 12న థియేటర్లలోకి రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌ తొలగిపోయి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధమైంది. డిసెంబర్‌ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 'అఖండ2' ప్రీమియర్స్‌, టికెట్‌ ధరల పెంపుకు సంబంధించిన జీ.ఓ.ను విడుదల చేసింది.


డిసెంబర్‌ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్‌ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే టికెట్ల ధరలను ఏమేరకు పెంచుకోవచ్చు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్‌ 12 నుంచి 14వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పెంచిన టికెట్‌ ధరలు అమలులో ఉంటాయి. ప్రీమియర్స్‌కి సంబంధించిన టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో పెంచిన టికెట్‌ ధరలను కూడా ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లలో రూ.100 రూపాయలు, సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.50లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.


తెలంగాణ ప్రభుత్వం ముందుగా సూచించిన విధంగా పెంచిన ధరలకు సంబంధించిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని జీ.ఓ.లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫిలిం డెవలప్‌ కార్పొరేషన్‌ ఒక ప్రత్యేక ఖాతాను తెరవనుంది. లేబర్‌ కమిషనర్‌తో కలిసి ఎఫ్‌డిసి ఈ సెపరేట్‌ ఎకౌంట్‌ను ఆపరేట్‌ చేస్తారని ప్రకటించారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.