English | Telugu

శ్రీముఖి కి స్వయంవరం...గెలిచింది ఎవరు!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో మొత్తం హిస్టారికల్ థీమ్ తో క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. శ్రీముఖి స్వయంవరం ఈ ఎపిసోడ్ లో నిర్వహించబోతున్నారు. దాంతో అవినాష్, హరి కలిసి శ్రీముఖిని బాగా ఎలివేట్ చేశారు. "పరివారం దేశపు యువరాణి..148 ఎపిసోడ్లుగా ప్రయాణం చేస్తున్న అలుపెరగని యోధురాలు..ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందగత్తె.. మా శ్రీముఖి యువరాణి వచ్చేస్తున్నారహో" అని చెప్పారు. దాంతో శ్రీముఖి యువరాణి కాస్ట్యూమ్ మెరిసిపోతూ స్టేజి మీదకు వచ్చింది. ఆ పక్కనే రోహిణి కూడా అదే గెటప్ లో వచ్చింది. దాంతో అవినాష్ "యువరాణి అమ్మగారికి నా ప్రణామాలు" అన్నాడు. "ఆవిడ నా అమ్మగారు కాదు" అంది శ్రీముఖి. "ఇంత అందమైన బొమ్మను చూసి అమ్మా అందువా" అంటూ రోహిణి డైలాగ్ వేసింది. "మరీ చూడడానికి మాసిపోయినట్టు ఉంది" అంటూ కౌంటర్ వేసాడు అవినాష్. "మిమ్మల్ని చూసుకోవడానికి ఎంతో మంది యువరాజులు పక్క రాజ్యం నుంచి వస్తున్నారు" అంటూ శ్రీముఖి స్వయంవరం నిర్వహించారు అవినాష్, హరి.

శ్రీదేవి డ్రామా కంపెనీలో అంజలి సీమంతం..కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ, రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ప్రోమోలో అంజలిపవన్ కి సీమంతం చేసే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ సీమంతం చేసింది ఎవరో కాదు హోస్ట్ తమ్ముడు రవి..."నేను చందమామ కలిసి మా అక్కకు సీమంతం చేస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు. భార్య సీమంతం సందర్భంగా పవన్ ఐతే ఫుల్ జోష్ తో యమా స్పీడ్ తో డాన్స్ చేసాడు. కానీ ఆ స్పీడ్ డాన్స్ తనకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళ నాన్న పరువు తీసేసింది చందమామ. ఇక శ్రీ సత్య, చందమామ కలిసి "చల్ల గాలి" సాంగ్ కి ఐ-ఫీస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత సెట్ లో ఉన్నవాళ్ళంతా కలిసి వచ్చి అంజలికి సీమంతం చేసారు. ఇక పవన్ తన భార్యకు గాజులు తొడిగాడు. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని ఈ గాజులు వేస్తున్నా అని చెప్పాడు. తర్వాత రవి ఒక స్కిట్ వేసాడు. ప్రతీ ఇంట్లో మామఅల్లుడు ఎలా ఉంటారో తెలిపే రిలేషన్ ని ఈ స్కిట్ లో చూపించారు.

మాస్టర్ ని పట్టుకుని విజ్జు అనేసిందేంటి జానులిరి

ఢీ 20 ఇది సర్ మా బ్రాండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ విలేజ్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఈ ప్రోమోలో జానులిరి విజయ్ బిన్నీ మాష్టర్ ని పట్టుకుని పెద్ద మాటే అనేసింది. "ఈరోజు ఎట్లైతే అట్లా విజ్జుని నా వాడిని చేసుకోవాలి" అంటూ జాను ఇంకో డాన్సర్ కూడా విజయ్ బిన్నీ మాస్టర్  వైపు కొంటెగా చూస్తూ పెళ్లి కలలు కనేసారు. "వన్నెలాడి వన్నెలాడి" అంటూ ఆ సాంగ్ వచ్చింది. ఇక హోస్ట్ నందు ఐతే "మేము పిలవచ్చా విజ్జు అని లేదంటే వన్నెలాడి, టిక్కులాడే పిలవాలా" అని అడిగాడు. "నన్ను విజ్జు అని నా భార్యే ఇప్పటి వరకు పిలవలేదు" అని విజయ్ బిన్నీ మాస్టర్ ఇచ్చేసరికి నందు, జాను ఇద్దరూ తెగ నవ్వేసుకున్నారు.

సుధీర్, గెటప్ శీను లేకుండా ఒక్కడినే స్టేజి ఎక్కినప్పుడు గుండె ఆగిపోయిన్నట్టుగా ఉంది

సర్కార్ సీజన్ 5 ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఎందుకు అంటే ఈ వీక్ ఎపిసోడ్ కి వచ్చింది జబర్దస్త్ టీమ్. అంటే సుధీర్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ. వీళ్లందరి అల్లరి మాములుగా లేదు. కింద పడి దొర్లి దొర్లి జోక్స్ వేసుకున్నారు. ఇక సుధీర్ ఐతే ఒక టైంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో స్పైసీ ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగేసరికి..రాంప్రసాద్ చెప్తూ ఏడ్చినంత పని చేసాడు. "సీరియస్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏడ్చింది లేదు. ఒక్కసారి నేను మీ ఇద్దరూ లేకుండా ఒక షో కోసం స్టేజి ఎక్కా..కుడి భుజం, ఎడం భుజం లేకుండా అంటారు కదా అలా కూడా కాదు. నాకు మెదడు, గుండె పని చేయనంతలా ఐపోయింది.

లక్ష రూపాయలు ఇవ్వబోతున్న శుభశ్రీ ? ఎందుకు ? ఎప్పుడు ? ఎలా ?

ఈరోజున చారిటీ చేయడం అంటే ఎంతో కష్టమైన పని. కానీ కష్టాల్లో ఉన్నవారిని తెలుసుకుని నిజంగా తోచినంత సాయం చేయడం ఈరోజుల్లో ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇంతకు ఈ చారిటీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా.. శుభశ్రీ రాయగురు ఆమె బెటర్ హాఫ్ అజయ్. బిగ్ బాస్ సీజన్ 7  కంటెస్టెంట్ ఈమె. త్వరలో పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఆమె కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేద్దామని అనుకుంటున్నట్టు ప్రకటించింది. "నా పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక పది మందికి ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున ఇద్దామనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో కానీ డి.ఎంలో కానీ మీ రిక్వయిర్మెంట్ ఏముందో చెప్పండి. కానీ అది జెన్యూన్ గా ఉండాలి.

అయ్యబాబోయ్ సమీరా..సుధీర్ ని రసికుడు, పశుపతి అనేసిందేంటి...

సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో వాళ్ళు తెగ ఆడేసుకుంటున్నాడు. రీసెంట్ గ సుధీర్ ని సమీరా భరద్వాజ్ సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమోలో ఫుల్ ఫ్రై చేసి పారేసింది. గుణలో కమలహాసన్ చెప్పే కవితను సాంగ్ గా రాసే రేఖ సీన్ గుర్తుంటే చాలు. ఈ ప్రోమోలో కూడా అలాగే జరిగింది. సమీరా స్టేజి మీదకు రాగానే "నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తే మీరేమన్నా రాసిస్తే" అంటూ సుధీర్ సమీరాని అడిగాడు. "నీ మనసులో ఫీలింగ్స్ ఒక పేపర్ లో సరిపోతాయా" అని అడిగింది. "రాయి" అన్నాడు సుధీర్ "ఏంటి" అంది సమీరా. "లెటర్" అన్నాడు సుధీర్ "ఎవరికీ" అంది సమీరా "అమ్మాయిలకు అన్నాడు సుధీర్ 'ఓహో మీరు పార్కులో ప్యాంప్లెట్స్ పంచినట్టు పంచుదామని డిసైడ్ అయ్యారా ఈ ప్రేమ లేఖను" అని కౌంటర్ వేసింది సమీరా. "నా ప్రియా..ప్రేమతో" అని సుధీర్ చెప్తుండగా సమీర్ అచ్చం గుణ మూవీ హీరోయిన్ రేఖలా నవ్వింది. "ఇంకా అక్కడ నువ్వెంత ఏమీ లేదు" అని సమీరా పరువు తీసేసాడు సుధీర్. "కమ్మని నీ ప్రేమ లేఖలే రాసాడు రసికుడే..ప్యాంటు షర్టు వేసిన పశుపతొచ్చేలే.." అంటూ రాసింది. అంటే సుధీర్ ఫేస్ మాడిపోయింది.

సుధీర్ కి ప్రపోజ్ చేసింది...రష్మీనా?

సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ముందుగా శివ్ కుమార్, ప్రియాంక జైన్ వచ్చారు. రాగానే ప్రేమలో మునిగి తేలిపోయారు. వీళ్ళు ఎక్కడికి వచ్చి ప్రేమ, ప్రేమ మాటలు, ప్రేమ గులాబీలు ఇవి తప్ప ఇంకో మాట ఉండదు. "ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి వీళ్ళు డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక షో అన్న విషయం మర్చిపోయి ప్రేమలో డాన్సుల్లో మునిగి తేలుతున్న వీళ్లకు బ్రేక్ వేస్తూ సుధీర్ వచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చాడు. ఇక ఆ గులాబీని శివ్ ప్రియాంకకు ఇచ్చి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక వాళ్ళు ప్రేమలో మునిగితేలుతున్న టైంలో సుధీర్ అబ్బా అనుకున్నాడు. "కెమిస్ట్రీ అనేది నాకు అర్ధం కావట్లేదు" అని సుధీర్ శివ్ ని అడిగాడు.

Illu illalu pillalu : తన కష్టంతో నాన్నకి షర్ట్ కొనుక్కెళ్ళిన కొడుకు.. ప్రేమ వల్ల ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -208 లో... ధీరజ్ గురించి రామరాజు బాధపడతాడు. వాడు నేను చెప్పినట్టు వినకుండా ఫుడ్ డెలివరీ చేస్తూ కష్టపడుతున్నాడు. పాపం వాడు ఏమైనా తిన్నాడో లేదో అని తిరుపతితో  రామరాజు అంటాడు అప్పుడే ధీరజ్ వస్తుంటాడు. వాడు వస్తున్నాడు బావ.. నువ్వే అడుగు అనీ తిరుపతి అంటాడు. రామరాజు దగ్గరికి ధీరజ్ వచ్చి.. నాన్న నేను ఫుడ్ డెలివరి ఫాస్ట్ గా చేసినందుకు ఇంటెన్సివ్ ఇచ్చారు. అందుకే మీకు షర్ట్ తీసుకొని వచ్చాను తీసుకోండని ధీరజ్ అంటాడు.