English | Telugu

Illu illalu pillalu : అందరు మోసం చేసారని కుప్పకూలిన రామరాజు.. ప్రేమపై ధీరజ్ కోపం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -210 లో......ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పడం చూసిన సేనాపతి ఇంటికి వచ్చి రామరాజు కుటుంబంపైకి గొడవకి వెళ్తాడు. అక్కడ ప్రేమ కూడా డాన్స్ కి వెళ్తున్నానని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. నేను వద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావని రామరాజు అడుగుతాడు. ఇంకా మా ప్రేమ నగలు కూడా మీ దగ్గరే ఉన్నాయని సేనాపతి అంటాడు. లేవని రామరాజు అంటాడు. ఉన్నాయ్ అవి లాకర్ లో పెట్టానని వేదవతి అనగానే రామరాజు షాక్ అవుతాడు.

నిజాలు బయటపడ్డాక ఇప్పుడు ఎందుకు నాటకాలని భద్రవతి అంటుంది. ఆయనని ఏం అనకండి ఆయనకి ఏం తెలియదు మీరేమైన అంటే నన్ను అనండి అని వేదవతి అంటుంది. రామరాజు పై చెయ్ చేసుకుంటాడు సేనాపతి. ఆ గొడవలో రామరాజు చొక్కా చిరిగిపోతుంది. ధీరజ్ వాళ్ళు విశ్వపై గొడవకి వెళ్తారు. ఆ తర్వాత రామరాజు తన కుటుంబంతో లోపలికి వస్తాడు. అంతా కలిసి మోసం చేశారని రామరాజు బాధపడతాడు. నేనేం చెప్పిన మీకోసం కానీ మీకు అర్థం కాదని రామరాజు బాధపడతాడు.

వేదవతి మాట్లాడబోతుంటే నువ్వింకేం మాట్లాడకు.. నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదు కానీ నువ్వు కూడ నా దగ్గర నగల విషయం దాచావని రామరాజు అంటాడు. నేను మర్చిపోయానని వేదవతి అంటుంది. ఆ తర్వాత దీనంతటికి కారణం నువ్వే అసలు వద్దని చెప్పిన ఎందుకు డాన్స్ క్లాస్ కి వెళ్ళవని ప్రేమని అడుగుతుంది వేదవతి. ధీరజ్ కోసమని ప్రేమ అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ధీరజ్ కి ప్రేమ సారీ చెప్తుంటే ధీరజ్ మాత్రం ప్రేమపై కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.