English | Telugu

అసలు నేరస్థులని పట్డుకోవడానికి స్కిట్ చేస్తున్న దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -772 లో..... కావ్య ఇంకా ఫోన్ చెయ్యలేదని రాజ్ ఆలోచిస్తుంటాడు. కాసేపటికి కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్‌. అప్పుని స్టేషన్ నుండి బయటకి తీసుకొని వచ్చావా అని రాజ్ అడుగగా... తీసుకొని వచ్చానని కావ్య అంటుంది. మరి ఆ విషయం నాకు చెప్పలేదు.. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని రాజ్ అంటాడు. నేను టెన్షన్ లో ఉన్నాను.. అందుకే చెయ్యలేదని కావ్య అంటుంది.

ఇప్పుడైతే తీసుకొని వచ్చాను గానీ ఇంకా కేసు నుండి బయట పడలేదు కదా అని కావ్య అనగానే మీరేం టెన్షన్ పడకండి.. మనిద్దరం కలిసి అప్పుని కేసు నుండి బయటకు తీసుకొని వద్దామని రాజ్ అనగానే.. మీకెందుకు ఇబ్బంది అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య ఫోన్ కట్ చేసాక అపర్ణ, ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి ఎందుకు రాజ్ హెల్ప్ చేస్తానంటే వద్దని అంటున్నావని కోప్పడతారు. మరొకవైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పు ఏడుస్తుంటే కళ్యాణ్ ఓదారుస్తాడు.

మరుసటిరోజు ఇంట్లో అందరు అప్పుని ఈ కేసు నుండి ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. అప్పుని బయటకి తీసుకొని రావాలంటే ఏదో ఒక సాక్ష్యం ఉండాలని రుద్రాణి అంటుంది. కరెక్ట్ చెప్పారు అసలు స్టేషన్ లో ఏం జరిగిందో తెలియాలి . అందుకే మనం అందరం స్టేషన్ లో జరిగింది స్కిట్ రూపం లో చేద్దామని రాజ్ అంటాడు. రాహుల్ , రుద్రాణి స్టేషన్ కి వచ్చిన రౌడీ క్యారెక్టర్ అని రాజ్ అంటాడు. అప్పు అమాయకురాలు అనవసరంగా కేసులో ఇరికించావని అందరు రాహుల్, రుద్రాణీలని కొడతారు. దాంతో మాకు ఈ క్యారెక్టర్ వద్దని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.