English | Telugu

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 కంటెస్టెంట్స్‌ వీళ్లే.. ఈసారి అంతా కలర్‌ ‘ఫుల్లే’!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా, మరెంతో ఉత్సాహంతో చూసే షో బిగ్‌బాస్‌. ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. సీజన్‌ 8 కొంత వెరైటీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ షోకి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్‌ చేసే ప్రక్రియ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు వంద మంది నుంచి 25 మందిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

సీజన్‌ 9కి హోస్ట్‌గా ఎవరు ఉంటారు అనే విషయంలో సోషల్‌ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా నాగార్జునే సీజన్‌ 9ని నిర్వహిస్తారని కన్‌ఫర్మ్‌ అయిపోయింది. కొత్త హోస్ట్‌ రాబోతున్నారనే ప్రచారంలో విజయ్‌ దేవరకొండ, బాలకృష్ణతో సహా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ సోషల్‌ మీడియాలో పుట్టుకొచ్చిన వార్తలేనని తర్వాత తేలిపోయింది. చివరికి నాగార్జుననే ఫైనల్‌ చేశారు. సీజన్‌ 9కి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్‌ చేశారు. అయితే ఈసారి కంటెస్టెంట్స్‌ ఎవరు అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రతి సీజన్‌కి ముందు కొందరి పేర్లు వినిపిస్తాయి. అందులో కొంత శాతం నిజం ఉంటుంది. అన్ని సీజన్లలోనూ ఇదే జరిగింది. తాజాగా సీజన్‌ 9కి సంబంధించి కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చేశాయి. బుల్లితెర నుంచి సాయికిరణ్‌, జబర్దస్త్‌ కమెడియన్‌ ఇమాన్యూల్‌, అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌లో రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని ఎంపికయ్యారని తెలుస్తోంది. చూడబోతే ఈసారి బిగ్‌బాస్‌ కలర్‌ఫుల్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది. వీరు కాకుండా దెబ్జానీ, సుమంత్‌ అశ్విన్‌, శివకుమార్‌, ముఖేష్‌ గౌడ, నవ్యసామిలతోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 7న ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 9 కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.