English | Telugu

బిగ్‌బాస్‌ సీజన్‌ 9 కంటెస్టెంట్స్‌ వీళ్లే.. ఈసారి అంతా కలర్‌ ‘ఫుల్లే’!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా, మరెంతో ఉత్సాహంతో చూసే షో బిగ్‌బాస్‌. ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. సీజన్‌ 8 కొంత వెరైటీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ షోకి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్‌ చేసే ప్రక్రియ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు వంద మంది నుంచి 25 మందిని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

సీజన్‌ 9కి హోస్ట్‌గా ఎవరు ఉంటారు అనే విషయంలో సోషల్‌ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా నాగార్జునే సీజన్‌ 9ని నిర్వహిస్తారని కన్‌ఫర్మ్‌ అయిపోయింది. కొత్త హోస్ట్‌ రాబోతున్నారనే ప్రచారంలో విజయ్‌ దేవరకొండ, బాలకృష్ణతో సహా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ సోషల్‌ మీడియాలో పుట్టుకొచ్చిన వార్తలేనని తర్వాత తేలిపోయింది. చివరికి నాగార్జుననే ఫైనల్‌ చేశారు. సీజన్‌ 9కి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్‌ చేశారు. అయితే ఈసారి కంటెస్టెంట్స్‌ ఎవరు అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రతి సీజన్‌కి ముందు కొందరి పేర్లు వినిపిస్తాయి. అందులో కొంత శాతం నిజం ఉంటుంది. అన్ని సీజన్లలోనూ ఇదే జరిగింది. తాజాగా సీజన్‌ 9కి సంబంధించి కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చేశాయి. బుల్లితెర నుంచి సాయికిరణ్‌, జబర్దస్త్‌ కమెడియన్‌ ఇమాన్యూల్‌, అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌లో రమ్య మోక్ష, రీతూ చౌదరి, తేజస్విని ఎంపికయ్యారని తెలుస్తోంది. చూడబోతే ఈసారి బిగ్‌బాస్‌ కలర్‌ఫుల్‌గా ఉండబోతుందనేది అర్థమవుతోంది. వీరు కాకుండా దెబ్జానీ, సుమంత్‌ అశ్విన్‌, శివకుమార్‌, ముఖేష్‌ గౌడ, నవ్యసామిలతోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 7న ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 9 కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.