English | Telugu

18 నెలలు నేను భోజనం చేసాను అంటే మా ఆవిడ జీతం వల్లనే..

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి నూకరాజు, తేజస్విని గౌడ, శ్రీకర్ కృష్ణ, కెవ్వు కార్తీక్, రీతూ చౌదరి, అభినయశ్రీ, కృష్ణ కౌశిక్ వంటి బుల్లితెర నటులంతా వచ్చారు. బాచిలర్స్ వెర్సెస్ మ్యారేజర్స్ అంటూ ఒక కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఇక పెళ్లి లైఫ్ లో ఎంత ముఖ్యమో కూడా వీళ్ళు చెప్పారు. అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అంటారు కానీ నేను దాన్ని నమ్మను. కరోనా టైంలో మనమంతా ఖాళీగా ఉన్నాం. అప్పుడు మా ఆవిడ జాబ్ చేస్తోంది. నేను ఇప్పటికీ గర్వంగా చెప్తా ఆ 18 నెలలు నేను భోజనం చేసాను అంటే మా ఆవిడ జీతం వల్లనే..పెళ్లి అద్భుతం, అమోఘం." అంటూ కృష్ణ కౌశిక్ చెప్పుకొచ్చాడు. "నా లైఫ్ లో మా అమ్మకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాక ఆమె కోరుకున్నది ఒక్కటే నాకు పెళ్లి చేయాలని.

సమంతలా ఉండే నువ్వు ప్రియాఆనంద్ లా ఐపోయావ్ అన్న నెటిజన్

అష్షురెడ్డి సోషల్ మీడియా అణుబాంబు. ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టల్లో హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పద్దతిగా కూడా కనిపిస్తుంది. అలాంటి అష్షు చూడడానికి జూనియర్ సమంతలా ఉంటుంది. ఈ విషయాన్నీ నెటిజన్స్ , ఫాన్స్ అంటూ ఉంటారు. జూనియర్ సమంత అంటూనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఐతే ఈ మధ్యకాలంలో ఆమె రూపు రేఖల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. జిమ్ కి వెళ్తూ కొంచెం సన్నబడింది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక షార్ట్ డ్రెస్ లో క్యూట్ హాట్ పిక్స్ ని షేర్ చేసింది. ఐతే ఇందులో ఆమె సమంత లుక్స్ అస్సలు కనిపించడం లేదు. ఒక నెటిజన్ ఆమె గురించి ఒక చేశారు.

సుధీర్ మీతో డాన్స్ చేయనని ఏ అమ్మాయి అంటుంది చెప్పు.. క్యూ కడతారు అమ్మాయిలు

బుల్లితెర మీద నిఖిల్ - కావ్య పెయిర్ అంటే ఇష్టపడని ఆడియెన్స్ అంటూ ఎవరూ లేరు. సుధీర్ - రష్మీ జోడిని ఎంతగా ఇష్టపడతారో నిఖిల్ - కావ్య జోడిని అంతకంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఏమయ్యిందో ఏమో కానీ నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లే సమయంలో కావ్యతో బ్రేకప్ అయ్యింది. ఇద్దరూ విడిపోయారు. సోషల్ మీడియాలో కూడా వేరైపోయారు. షోస్ లో కూడా ఎక్కువగా నిఖిల్ తప్ప కావ్య కనిపించడం లేదు. కానీ సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమోకి కావ్య మంచి హాట్ డ్రెస్ లో వచ్చి సుధీర్ తో డాన్స్ చేసింది. "కొత్త కొత్తగా ఉన్నది" అనే సాంగ్ కి సుధీర్ - కావ్య మంచి సింక్రనైజేషన్ తో స్టెప్స్ వేశారు. " ఎం స్టెప్పులేయాలా ఏంటా అని ఆలోచించే లోపలే నువ్వు ఇరగ్గొట్టి అవతల పెట్టావ్" అన్నాడు సుధీర్ కావ్యని పొగుడుతూ. "మీరు పక్కన ఉన్నారు కాబట్టే నేను అలా చేయగలిగాను" అని చెప్పింది కావ్య.

డ్రామా జూనియర్స్ లో నిధి అగర్వాల్...

డ్రామా జూనియర్స్ కూడా మూవీ ప్రమోషన్స్ కి అడ్డా ఐపోయింది. ఆల్రెడీ సుమ అడ్డా, సర్కార్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి మూవీ టీమ్స్ వెళ్లి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా డ్రామా జూనియర్స్ షోని కూడా యూజ్ చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ షోకి వచ్చింది. నెక్స్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో "ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అద్భుతాలు రెండే రెండు. ఒకటి చైనా వాల్ రెండోది నిధి అగర్వాల్..నిన్ను కలవడం నా విధి, నీకోసం నా గుండెల్లో ఉందో గది, నిన్ను మించిన అందం ఏది" అంటూ కవిత చెప్పేసరికి నిధి ఫిదా ఐపోయింది. తర్వాత ఇద్దరు బుడతలు వచ్చి నిధిని పొగిడారు. "నిధి పాపే సన్నగా అరనవ్వే నవ్వగా మతితప్పి మతి తప్పి ఆడియన్స్ థియేటర్ కి వెళ్లారే..." అంటూ ఒకడు.. "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాల్లే నిధి చాల్లే" ఇంకో బుడతడు పొగిడాడు.

జులై 26 వరకు ట్రిప్స్ కు వెళ్లడాన్ని అవాయిడ్ చేయండి..

ఎండలు తగ్గిపోయి వర్షాలు కురవడం మొదలయ్యాయి. అందులోనూ ఆగకుండా రెండు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలా వాతావరణ శాఖ కూడా జులై 26 వరకు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. వరదలు వచ్చే సూచనలు ఉన్నాయంటూ కూడా ప్రజలను లేటెస్ట్ అప్ డేట్స్ ని అందిస్తూ అప్రమత్తం చేస్తోంది. ఇక సెలబ్రిటీస్ కూడా ఈ విషయంలో ఎవరికీ తోచినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక నటుడు సాయి కిరణ్ ఇదే విషయం మీద తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ అప్ డేట్ ని పోస్ట్ చేసాడు. "జులై 26 వరకు ట్రిప్స్ కు వెళ్లడాన్ని అవాయిడ్ చేయండి..

Karthika Deepam2: దీపని ఒట్టు వేయమన్న సుమిత్ర.. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి  ఎపిసోడ్ -416 లో...... దీప దగ్గరికి పారిజాతం వచ్చి..‌ ఎలాగైన ఈ ఎంగేజ్ మెంట్ నువ్వే ఆపాలి గౌతమ్ మంచివాడు కాదు.. జ్యోత్స్న జీవితం నాశనం అయితే సుమిత్ర వాళ్ళు తట్టుకోలేరని పారిజాతం ఎమోషనల్ గా దీపని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీప ఆలోచనలో పడుతుంది .అదంతా విన్న కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. నేను అంతా విన్నాను.. నానమ్మ, మనవరాలికి వేరే దారిలేక ఇదంతా చేస్తున్నారు.. నువ్వు ఎమోషనల్ అవ్వకుండా ఉండు అని దీపకి చెప్తాడు కార్తీక్.

Brahmamudi : అపర్ణకి దగ్గరైన తన మనవడు.. రేవతిని పుట్టినరోజుకి రమ్మన్నదిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -780 లో..... శ్రీను కోర్ట్ కి వచ్చి తప్పు ఒప్పుకోవడంతో అప్పు కేసు నుండి బయటపడుతుంది. థాంక్స్ బావా.. నీ వల్లే ఇదంతా అని రాజ్ తో అప్పు అంటుంది. అందరు చెప్తున్నారు కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదని కావ్యకి ఉద్దేశించి రాజ్ అంటాడు. ఆ తర్వాత యామిని వచ్చి బావ చాలా బాగా చేసావని రాజ్ ని మెచ్చుకుంటుంది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు.. కేసు నుండి కాపాడగలిగాను కానీ అసలు దీని వెనకాల ఎవరున్నారని తెలుసుకోలేకపోయానని రాజ్ అనగానే యామిని టెన్షన్ పడుతుంది.

ఆ అమ్మాయితో డేట్ కూడా చేశా...

ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో కండల వీరులే ఎక్కువగా కనిపించారు. బిగ్ బాస్ 7  కి వెళ్లి వచ్చిన గౌతమ్, యావర్, ఆదర్శ్, రమణ వంటి వాళ్ళు వచ్చారు అలాగే ఫుడ్ లవర్స్, ఫుడ్ వ్లాగర్స్ కూడా వచ్చారు..టేస్టీ తేజ, కుమారి ఆంటీ, పంచ్ ప్రసాద్ వంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐతే గౌతమ్ కృష్ణ తాను ఎందుకు అంత ఫిట్ గా ఉన్నదీ చెప్పుకొచ్చాడు. "నా కాలేజ్ ఏజ్ లో నేను 96 కేజీస్ ఉండేవాడిని. నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉండేది. ఆమెకు ప్రపోజ్ చేద్దామనుకుని అనుకునేవాడిని కానీ కాన్ఫిడెన్స్ లేక నాలో నేను మధన పడి ఆగిపోయేవాడిని. అలా జరుగుతున్నా టైములో ఒక రోజు నా ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్పాడు.

హైద్రాబాదీ మార్లిన్ మన్రో అశ్వినిశ్రీ

బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా వెలుగులోకి వచ్చింది అశ్వినిశ్రీ. ఈమె ఒక బ్యూటీ ఆటం బాంబు. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఆమె పెట్టే రీల్స్ మాములుగా ఉండవు. ఇక చెమటలు పట్టిస్తూ పోస్ట్ చేసే జిమ్ వీడియోస్ ఐతే వేరే లెవెల్. అలాగే రీసెంట్ గా ఒక చిన్న బ్లాక్ గౌన్ వేసుకుని చేతులకు ఎర్రటి గోరింటాకు పెట్టుకుని నవ్వుతూ తుళ్ళుతూ చేసిన రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోని తీసింది ఆమె సిస్టర్ అనుకుంటా హైద్రాబాదీ మార్లిన్ మన్రో అశ్వినిశ్రీ అంటూ తనకు తానె బిరుదు ఇచ్చేసుకుని పోస్ట్ పెట్టింది. "పరువం వానగా" అనే సాంగ్ మ్యూజిక్ ని బ్యాక్ గ్రౌండ్ గ పెట్టుకుంది. ఇక ఈమె కొన్ని మూవీస్ లో నటించింది. వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. నటన అంటే చాలా ఇష్టంతో ఆమె ఈ రంగంలోకి వచ్చింది.

మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2025 అందగత్తె ప్రకృతి హాట్ పిక్స్ వైరల్

ప్రకృతి కంభం సోషల్ మీడియాని తన అందంతో హాట్ పిక్స్ తో షేక్ చేసేస్తోంది. ప్రకృతి అంటే పెద్దగా తెలియకపోయినా బిగ్ బాస్ ప్రేరణ సిస్టర్ అంటే అందరికీ తెలుసు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లొచ్చి అటు కన్నడ మూవీస్ లో ఐతే తెలుగు సీరియల్స్ లో షోస్ లో నటిస్తోంది. కానీ ప్రకృతి మాత్రం ఫాషన్ షోస్ లో తన టాలెంట్ ని చూపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా డాన్స్ ఐకాన్ సీజన్ లో చిన్నారి బర్కత్ కి మెంటార్ గా ఉంది. అలాగే ఈ షోలో మరో మెంటార్ మానస్ తో తరచూ గొడవలు జరిగేవి. ఐతే ప్రకృతి లాస్ట్ ఇయర్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలిచింది. ఇక ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకుంది.

సుజాత ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే పాత సామాన్లు అమ్ముకునేది

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బుల్లితెర నటులు వచ్చారు. రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత, కీర్తి భట్ - విజయ్ కార్తీక్, నీలిమ - శేఖర్ వచ్చారు. ఇక సుమ వీళ్ళను బాగా ఆట పట్టించింది. సుమ ప్లేట్ లో చిలకలు చుట్టి రాకేష్ కి ఇచ్చి పెట్టమని చెప్పింది. "ఏంటి ఈవిడ గిలకలా ఉంది చిలకలు పెట్టాలా" అంటూ ఫన్నీ కౌంటర్ వేసాడు రాకేష్. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో రాపిడ్ ఫైర్ ఆడించింది. "సుజాత ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏ వృత్తి ఎంచుకునేది...పాత సామాన్లు అమ్ముకోవడం " అని అడిగింది సుమ. దాంతో సుజాత ఒక ప్లాస్టిక్ బిందెను నడుము మీద పెట్టుకుని "పాత ఇనప సామాన్లు కొంటాం.. చిరిగిపోయిన పుస్తకాలు కొంటాం. అరిగిపోయిన రికార్డులు కొంటాం..రావాలి బాబు రావాలి" అంటూ అరిచి మరీ చూపించింది.

కుమారి ఆంటీ జీవితంలో ఇన్ని కష్టాలా...

సోషల్ మీడియా పుణ్యమా అంటూ గతంలో హైదరాబాద్ లో ఉండే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే కుమారి ఆంటీ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాంటి కుమారి ఆంటీ లైఫ్ లో కూడా ఎన్నో ఖాతాలు ఉన్నాయి. రీసెంట్ గా ఆమె ఫామిలీ స్టార్స్ షోలో తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని చెప్పుకొచ్చింది. "మా ఇంట్లో ముగ్గురం సంతానం. అక్క, అన్నయ్య, నేను. అక్క చదువుకుంది. అన్నయ్య ఇంజనీర్. ఫస్ట్ టైం అన్నయ్యను అమెరికా తీసుకువెళతాను అని డబ్బులు కట్టమన్నాడు. అలా అన్నయ్య ఒక రోజు డబ్బులు కట్టడానికి వెళ్తుండగా రోడ్ ఆక్సిడెంట్ అయ్యింది. రెండు కాళ్ళు, నడుము పోయాయి. డబ్బులు ఎవరో కొట్టేశారు. ఐతే అన్నయ్య అమెరికా వెళ్ళడానికి చాలా మంది డబ్బు సాయం చేశారు. అప్పు కూడా ఇచ్చారు. అన్నయ్యకు ఇక జాబ్ లేదు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. డబ్బులు ఎలా ఇవ్వాలో తెలీదు. అన్నయ్యకు ఎం చేయాలో తెలీలేదు. ఆ టైములో అన్నయ్య చనిపోదామని కూడా అనుకున్నాడు. నిజంగా ఏ ఇంటికైనా సరే అమ్మ ధైర్యం, నాన్న, అన్నయ్య ఇలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు నేను చెప్పా ఈరోజు చనిపోతాము. కానీ వేరే వాళ్ళు మన కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును అప్పుగా ఇచ్చారు.

రష్మీకి ఏమయ్యింది ? ఆ పోస్ట్ వెనక అర్ధం ఏంటి ?

జబర్దస్త్ కి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి యాంకర్ ఉన్న రష్మీ గురించి అందరికీ తెలుసు. ఈమె ఈ షోస్ ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటుంది. రీసెంట్ గా జబర్దస్త్ కి రష్మీకి కో-యాంకర్ గా మానస్ వచ్చాడు. మరి రష్మీ విషయంలో ఏమయ్యిందో, ఎం జరగబోతోందో తెలీదు కానీ ఆమె పోస్ట్ చూస్తే ఆమె ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతోందా అనే ప్రశ్న రాకుండా ఉండదు. ఇంతకు ఆ పోస్ట్ లో రష్మీ ఎం చెప్పిందంటే "ఒక నెల రోజుల పాటు నాకు అవసరమైన డిజిటల్ డిటాక్సిఫికేషన్ తీసుకుంటున్నాను..వర్క్ పరంగా అలాగే పర్సనల్ గా కూడా కూడా ఇప్పుడు నాకు ఇది చాలా అవసరం అనుకుంటున్నాను.