English | Telugu

రియల్ లైఫ్ లో చాలామంది విలన్స్ ని చూస్తున్నాను

రియల్ లైఫ్ లో చాలామంది విలన్స్ ని చూస్తున్నాను

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అలాగే కావ్య కూడా వచ్చింది. శ్రీముఖి కావ్యని ఒక ప్రశ్న అడిగింది "సీరియల్స్ లో విలన్స్ ని చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తారు వీళ్ళను చంపేస్తాను అనిపించిందా" అని అడిగింది. దానికి కావ్య "రియల్ లైఫ్ లో చాలా మంది విలన్స్ ని చూస్తున్నాను కాబట్టి సీరియల్స్ లో విలన్స్ ని చూసాక పెద్దగా ఏమీ అనిపించదు" అని రిప్లై ఇచ్చింది కావ్య. ఈ ఆదివారం రాబోయే ఎపిసోడ్ ని హీరోయిన్స్ వెర్సెస్ విలన్స్ థీమ్ తో తీసుకొచ్చారు. ఇందులో హీరోయిన్స్ అంతా రకరకాల సెక్సీ భంగిమలు పెట్టారు.

హైపర్ ఆది  : కావ్య కాలేజీలో నేను ఉండి ఉంటే 500 ల సార్లు నేనే ప్రపోజ్ చేసేవాడిని

హైపర్ ఆది  : కావ్య కాలేజీలో నేను ఉండి ఉంటే 500 ల సార్లు నేనే ప్రపోజ్ చేసేవాడిని

బుల్లితెర మీద చాలా షోస్, ఈవెంట్స్ ప్రసారమవుతూ ఉంటాయి. వీటి షూటింగ్ టైమ్స్ లో ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక షో రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా  ప్రసారమయ్యింది. అదే న్యూ ఇయర్ దావత్ లొకేషన్ హోమ్ టూర్ షో. అందులో కావ్య, రీతూ చౌదరి, ఆది మధ్య మంచి కామెడీ జరిగింది. రీతూ చౌదరి వచ్చి "హాయ్ కావ్య..వాట్సాప్..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "ఇలా ఉన్నా" అని కావ్య చెప్పేలోపు ఆది వచ్చేసాడు. "హాయ్ కావ్య..ఎలా ఉన్నావ్" అని అడిగాడు. " బాగున్నాను" అని చెప్పింది కావ్య. "ఆది నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పవు కానీ కావ్యను అడిగినప్పుడు మాత్రం వచ్చేస్తావ్" అంటూ రీతూ చౌదరి ఆది మీద అరిచింది. "కావ్య నచ్చని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరూ" అని ఆది కావ్య గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు. "నా లైఫ్ లో కావ్య అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సీరియస్ గానే చెప్తున్నా ఈ విషయం.

Karthika Deepam2 : గతం చెప్పేసిన కార్తీక్.. ప్రాణదాత తనే అని మురిసిపోయిన దీప!

Karthika Deepam2 : గతం చెప్పేసిన కార్తీక్.. ప్రాణదాత తనే అని మురిసిపోయిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -245 లో..... కార్తీక్ తన జ్ఞాపకమైన లాకెట్ వెనకాలున్న గతం గురించి దీపకు చెప్తాడు. మేము చిన్నప్పుడు  మా అత్తయ్యతో కలిసి ఒక గుడికి వెళ్ళాం.. అక్కడ కోనేరులో ఉన్న పువ్వు కావాలని అడిగింది జ్యోత్స్న. నాకు నీళ్లంటే భయమైన లోపలికి వెళ్ళాను.. నేను మునిగిపోతుంటే జ్యోత్స్న వదిలేసి వెళ్ళింది కానీ ఒక అమ్మాయి నన్ను కాపాడింది. నాకు ఇంకా గుర్తుంది.. నేను వెళ్తుంటే తన లాకెట్ నా జేబులో ఉంది. ఎప్పటికైనా తన ఋణం తీర్చుకుంటానని కార్తీక్ గతమంతా చెప్తాడు.

Eto Vellipoyindhi Manasu : అత్తతో సారీ చెప్పించుకున్న కోడలు.. భద్రం చేసే మోసాన్ని వాళ్ళు గుర్తిస్తారా!

Eto Vellipoyindhi Manasu : అత్తతో సారీ చెప్పించుకున్న కోడలు.. భద్రం చేసే మోసాన్ని వాళ్ళు గుర్తిస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -295 లో... ఒకతనికి ప్రాజెక్ట్ గురించి ఐడియా ఇచ్చినందుకు సీతాకాంత్ కి అతను డబ్బులు ఇస్తాడు. తనకి అడ్వైజర్ గా ఉండమని అడుగగా సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంటికి వెళ్ళాక ఎవరు ఎంత సంపాదించారో చూసుకుంటారు. నేను ఆటో రెంట్ పోగా వెయ్యి సంపాదించానని రామలక్ష్మి అంటుంది. నేను రెంట్ పోగా ఆరు వెయ్యలు సంపాదించానని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి ఒక్క రోజులో అంత డబ్బా అని ఆశ్చర్యంగా చూస్తుంది.

Eto Vellipoyindhi Manasu : సీఈఓ పదవి వదిలి ఆటో నడుపుకుంటున్న సీతాకాంత్.. భద్రం ఆట మొదలైందా!

Eto Vellipoyindhi Manasu : సీఈఓ పదవి వదిలి ఆటో నడుపుకుంటున్న సీతాకాంత్.. భద్రం ఆట మొదలైందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -294 లో.....సందీప్, ధన లు ఇంటికి వచ్చి ఆనందంగా అమ్మ అంటూ పిలుస్తారు. ఎంటి ఇంత హ్యాపీగా ఉన్నారని శ్రీవల్లి అంటుంది. మన ప్రాబ్లమ్ అని క్లియర్ అయ్యే అవకాశం దొరికిందని భద్రం గురించి చెప్తాడు సందీప్. అప్పుడే భద్రం వస్తాడు. మీ ప్రాబ్లమ్ అన్నిటిని నేను సాల్వ్ చేస్తానని శ్రీలతకి చెప్తాడు. ఒక్క రూపాయి మీరు పెట్టుబడి పెట్టనవసరం లేదని భద్రం అనగానే.. శ్రీలత వాళ్ళు సరే అంటారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా అంటేనే కదా.. మీరు నా మాట వింటారని భద్రం అనుకుంటాడు.

శివుడు కాలభైరవవుడి రూపంలో ఇక్కడి కుక్కలను కాపాడుతూ ఉంటాడు

శివుడు కాలభైరవవుడి రూపంలో ఇక్కడి కుక్కలను కాపాడుతూ ఉంటాడు

రేణు దేశాయ్ ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈమెకు భూతదయ చాలా ఎక్కువ. ఇలా మూగజీవాల్ని ప్రేమించే మహిళల్లో ఎవరైనా ఉన్నారు అంటే రష్మీ, సదా, రేణు దేశాయ్ ఇలా కొంతమంది ఉన్నారు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ అకీరా నందన్, ఆద్యతో కలిసి కాసి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వాళ్ళ అప్డేట్స్ ని రెగ్యులర్ గా రేణు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన స్టేటస్ లో పెట్టింది. "కుక్కల్ని కాపాడేవాళ్ళను ఆ పరమ శివుడు కచ్చితంగా రక్షిస్తాడు. శివుడు అంటే ఎవరో కాదు.. ఆ కాల భైరవుడు రూపంలో ఉండే దైవమే. ఆ కాల భైరవ రూపంలో ఉండే శివుడే కుక్కల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే అవి కూడా ఆ కాలభైరవుడిని తమ ఇష్టదైవంగా భావిస్తూ ఉంటాయి.

ఇండస్ట్రీ అనేది నీటి బుడగ.. ఎంతవరకు ఉంటుందో చెప్పలేము

బుల్లితెర మీద జబర్దస్త్ షోలో నూకరాజు కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. జడ్జ్ ఇంద్రజాను అమ్మ అమ్మ అని పిలుస్తూ కామెడీ చేస్తాడు. అప్పుడప్పుడు గెటప్ శీనులా గెటప్స్ వేస్తాడు. ఐతే నూకరాజు తన ఇండస్ట్రీ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. "నేను డిప్లొమా చేసేటప్పుడు యాదమ్మ రాజును, సద్దాంని పటాస్ షోలో చూస్తూ ఉండేవాడిని. నేను మా విజయవాడలో ఒక గల్లీ కమెడియన్ ని. ఐతే నేను కూడా ఇలాంటి వెళ్తే బాగుండేది కదా అనుకునే వాడిని. అలా పటాస్ ఆడిషన్స్ కి ట్రై చేసాను. కానీ సెలెక్ట్ కాలేదు. కానీ జీ తెలుగులో వచ్చే కామెడీ కిలాడీలు షోకి ఆడిషన్స్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ హైదరాబాద్ కి ఏదో చేసేద్దాం అని వచ్చి వారం ఉండి వెళ్ళిపోయాను. తర్వాత విజయవాడలో నా పని చేసుకుంటూ నేను ఆడిషన్స్ కి ట్రై చేస్తూ ఉండేవాడిని. నేను కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్లకు ఒక్కటే చెప్తున్నా..మొత్తం అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అంటే అవ్వదు. ఎందుకంటే ఇండస్ట్రీ నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు. మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి.