English | Telugu

Karthika Deepam2 : కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న.. అతనిది యాక్సిడెంట్ కాదని డౌట్ పడ్డ దీప!

Karthika Deepam2 : కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న.. అతనిది యాక్సిడెంట్ కాదని డౌట్ పడ్డ దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -260 లో..... దాస్ ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తారు. ఆ సిచువేషన్ లో దాస్ ని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతుంది. నిన్ను ఎవరు కొట్టారో వాళ్ళ చేతులు విరిగిపోను అంటూ పారిజాతం తిడుతుంటే జ్యోత్స్న రియాక్ట్ అవుతుంది. తమలో ఇలాంటి ప్రేమలు కూడా ఉన్నాయా అని జ్యోత్స్నని ఉద్దేశించి కార్తీక్ అంటాడు. మీరు వెళ్ళండి నేను ఉంటానని జ్యోత్స్న అందరిని బయటకు పంపిస్తుంది. మీ నాన్న అంటే ఎంత ప్రేమనే అని పారిజాతం అనుకుంటుంది. అందరిని వెళ్ళమని చెప్పింది నిన్ను చంపెయ్యడానికే అని జ్యోత్స్న అనుకుంటుంది.

Eto Vellipoyindhi Manasu : కొత్త వ్యక్తితో కలిసి శ్రీలత మాస్టర్ ప్లాన్.. టీవీలో వచ్చింది చూసి వాళ్ళిద్దరు షాక్!

Eto Vellipoyindhi Manasu : కొత్త వ్యక్తితో కలిసి శ్రీలత మాస్టర్ ప్లాన్.. టీవీలో వచ్చింది చూసి వాళ్ళిద్దరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో... రామలక్ష్మి ఆకలి అంటూ గట్టిగా అరుస్తుంటాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. బాగుందంటూ సీతాకాంత్ ఫాస్ట్ గా తింటుంటే మెల్లగా తినండి అంటుంది రామలక్ష్మి. మీరు ఎక్కడున్నా రాజే అండి అని పెద్దావిడ అన్న మాటలు గుర్తుచేస్తుంది రామలక్ష్మి. నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నన్ను గొప్పగా చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు.

Brahmamudi : కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెప్పేసిన ధాన్యలక్ష్మి!

Brahmamudi : కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెప్పేసిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -624 లో.....ఇంట్లో ఏం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య గురించి చెప్పమని అపర్ణ అడిగితే కావ్య చెప్పదు. దాంతో అపర్ణ కావ్యతో మాట్లాడడం మానేస్తుంది. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా కూడా అపర్ణ తీసుకోదు. అప్పుడే రాజ్ వస్తాడు. మీకు దమ్ముంటే ఈ కాఫీ తీసుకొని వెళ్లి అత్తయ్యకి ఇవ్వండి అని అంటుంది. రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ గదిలోకి వెళ్తాడు. కాసేపటికి కాఫీ కప్ పగిలిన సౌండ్ ఇంకా రాజ్ చెంప చెల్లుమనిపించిన సౌండ్ వస్తుంది. ఇక రాజ్ బయటకి వచ్చి ఏదో కవర్ చేస్తాడు. ఈసారి కావ్య వెళ్లి ఇస్తుందని రాజ్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : భద్రం మోసగాడని తెలుసుకున్న శ్రీలత... సొల్యూషన్ అదేనా!

Eto Vellipoyindhi Manasu : భద్రం మోసగాడని తెలుసుకున్న శ్రీలత... సొల్యూషన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -306 లో.....  భద్రం చేసిన మోసాన్ని శ్రీలత వాళ్ళకి చెప్తుంది రామలక్ష్మి. వాడొక పెద్ద ఫ్రాడ్.. వాడిని నమ్మి మోసపోయారని రామలక్ష్మి చెప్తుంది. రేపటి వరకు అందరి డబ్బు ఇవ్వకపోతే అందరిని తీసుకొని వచ్చి గొడవ పెడతానంటూ రామలక్ష్మి అందరికి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మురళి దగ్గరికి సీతాకాంత్ వెళ్లి భద్రం పెద్ద మోసగాడు.. కావాలంటే టెస్ట్ చెయ్యండి.. ఇప్పుడు పెట్టే పెట్టుబడి మొత్తం బ్యాంకు ట్రాన్సక్షన్స్ కావాలని అనండి అని సీతాకాంత్ చెప్పగానే..  భద్రంకి మురళి ఫోన్ చేసి అలాగే ట్రాన్సక్షన్స్ కావాలని అంటాడు. దానికి భద్రం సరే అంటాడు.

బట్టలు పొట్టిగా ఉన్నప్పుడు అలా ఎలా చేస్తారు ?

బట్టలు పొట్టిగా ఉన్నప్పుడు అలా ఎలా చేస్తారు ?

ఫ్యామిలీ స్టార్ ఈ వీక్ షోలో బులెట్ భాస్కర్ ప్రియాంక జైన్ తో సరిదిద్దుకోలేని తప్పు చేసేసాడు. వద్దన్నా వినకుండా తప్పు చేసాడు. ఆమెతో కలిసి డాన్స్ వేసాడు. ఐతే ప్రియాంక పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. కానీ డాన్స్ చేసేటప్పుడు తనను లిఫ్ట్ చేయొద్దు డ్రెస్ బాలేదు అని చెప్పింది.  అదే విషయాన్నీ పవిత్ర కూడా చెప్పింది. కానీ బులెట్ భాస్కర్ వినీ విననట్టు బిల్డప్ ఇచ్చి ఆమె ఎత్తుకుని మరీ డాన్స్ చేసాడు. దాంతో ప్రియాంకకు మండిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగా మాటల యుద్ధం జరిగిపోయింది. 'భాస్కర్ గారు మీకు రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు' అంటూ సీరియస్ గా స్టేజి దిగి వెళ్ళిపోయింది. దాంతో దొరబాబు స్టేజి మీదకు వచ్చి "ఐనా చూసుకోవాలి ఆడోల్లతో డాన్స్ చేసేటప్పుడు" అన్నాడు.

నూకరాజు - పంచ్ ప్రసాద్ కి మధ్య గొడవ...అసలేం జరిగిందంటే ?

నూకరాజు - పంచ్ ప్రసాద్ కి మధ్య గొడవ...అసలేం జరిగిందంటే ?

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో నూకరాజుకి, పంచ్ ప్రసాద్ కి పెద్ద గొడవే అయ్యింది. పంచ్ ప్రసాద్ కి ఒంట్లో బాగోనప్పుడు కానీ హాస్పిటల్ లో చేర్పించినప్పుడు కూడా నూకరాజు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. వాళ్ళతో కలిసి వీడియోస్ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టి పంచ్ ప్రసాద్ కి ఆర్థికంగా కూడా సాయం చేయమని కోరాడు. పంచ్ ప్రసాద్ కి నూకరాజు ఒక బ్యాక్ బోన్ లా ఉండి ఎంతో సాయం చేసాడు. ఇక కోలుకున్నాక కూడా నూకరాజు, ప్రసాద్ కలిసి మంచి స్కిట్స్ చేస్తున్నారు అటు జబర్దస్త్ లో, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యా గొడవొచ్చింది. "బేసిక్ గా నూకరాజు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అసలు అతను నాతో మాట్లాడడం మానేసాడు. ఎందుకు మాట్లాడ్డం లేదో నాకు తెలియాలి" అన్నాడు పంచ్ ప్రసాద్. ఆ మాటలకూ నూకరాజు స్టేజి మీదకు వచ్చి "ఒక మనిషికి దూరంగా ఉంటున్నామంటే అదేంటో నాకు తెలుసు" అన్నాడు. "తెలిసినప్పుడు చెప్పారా అన్నాడు" ప్రసాద్ . "ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడెందుకు ఆ విషయం" అన్నాడు. " హా లేదు లేదు..అందరికీ తెలియాలి ఆ విషయం" అని అన్నాడు.  

సుమ వార్నింగ్ మెసేజ్...జాగ్రత్తగా లేకపోతె అంతే

సోషల్ మీడియా ఊపు పెరిగాక బుల్లితెర స్టార్స్ ని సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్లకు ఎన్ని ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎం ఉన్నాయి వాటి ఖరీదు ఎంత ఉండొచ్చు లాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఆ ఫేక్ న్యూస్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నవ్వుకుని వదిలేస్తారు కొందరు డిబేట్స్ పెడతారు కొంతమంది సరదా వీడియోస్ చేసి ఫుల్ ఛిల్ల్ అవుతుంటారు యాంకర్ సుమలా. ఇప్పుడు చెప్తోంది ఆమె గురించే. ఆమె కూడా ఆ ఫేక్ న్యూస్ బారిన పడింది. కానీ లైట్ తీసుకుంది. ఐతే ఈ న్యూస్ ఎదో బాగుందే అనుకుందో ఏమో సరదాగా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. కేరళలో రూ.278 కోట్లతో స్టార్ యాంకర్ సుమ ఒక లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లుగ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో  ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపిస్తూ.. వెనుక ఒక వాయిస్ ఓవర్ కూడా వినిపిస్తూ ఉంటుంది.