English | Telugu

బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు జంట సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం రాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే  ని పురస్కరించుకుని ఈ షోకి వచ్చిన వాళ్లంతా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారు. ఇక ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ షిప్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే అది బాబుమోహన్ - కోట శ్రీనివాసరావు ఫ్రెండ్ షిప్ గురించే. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అంటూ ఒక ఉదాహరణగా కూడా చూపిస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు ఆ స్నేహితుల్లో కోట గారు బాబు మోహన్ గారిని వదిలేసి వెళ్లిపోయారు. దాంతో ఆయన స్నేహితుడు లేని ఒంటరి మనిషిగా ఉన్నారు. అలాంటి ఆయన ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వచ్చారు.

చంద్రబాబు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టమా ?

సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి "సుందరకాండ" మూవీ టీమ్ రాబోతోంది. ఈ మూవీ టీమ్ లో నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వాసుకి, సునయన, విర్తి వాఘాని వీళ్లంతా వచ్చారు. ఐతే ఈ వీక్ సుమ అడ్డా కాస్తా పొలిటికల్ అడ్డాగా మారింది. ఇందులో కీలకమైన రాపిడ్ ఫైర్ రౌండ్ లో వాసుకుని, నారా రోహిత్ ని కొన్ని ప్రశ్నలు వేసింది సుమ.  " మీరు రాఖీ పండగ రోజు రాఖీ ఎవరికీ కడతారు. మీ రియల్ బ్రదర్ కా లేదా తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి" అని అడిగేసరికి వాసుకి షాకైపోయింది. తర్వాత నారా రోహిత్ వచ్చారు. "మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు..చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు" అని అడిగింది సుమ.

ఫ్రెండ్స్ అయ్యాకే సిట్టింగ్ మొదలుపెట్టాం..

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ప్రోమో వచ్చింది. ఈ షోకి సింగర్స్ రఘు కుంచె, కల్పనా వచ్చారు. ఇక శ్రీముఖి ఐతే "మీరిద్దరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్" అని అడిగింది. "ఈ ఎపిసోడ్ కి రావడానికి" అని చెప్పింది కల్పనా. తర్వాత జబర్దస్త్ కమెడియన్ అభి పాటల రచయితా అనంత శ్రీరామ్ కలిసి ఈ షోకి ఫ్రెండ్స్ గా వచ్చారు. "ఒక హాస్య కళాకారుడికి ఒక పెన్ను కళాకారుడికి ఎలా కుదిరింది ఫ్రెండ్ షిప్" అని అడిగింది శ్రీముఖి. "2016 లో యూఎస్ ప్రోగ్రాం చేసాము." అని చెప్పాడు అభి.  "ఎన్ని ట్రిప్పులు వేశారు లైఫ్ లో చెప్పండి" అని మళ్ళీ అడిగింది.

జగతి మేడం ఎంత పని చేశారు.. ఇలా చూస్తుంటే గుండె పగిలిపోయింది

జగతి మేడం.. ఈ పేరు వింటే గుప్పెడంత మనసు సీరియల్ గుర్తొచ్చేస్తుంది. రిషి తల్లిగా ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాటి జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వాజ్ ఇప్పుడు కిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక జ్యోతి లుక్స్ చూస్తే వేరే లెవెల్ లో ఉన్నాయి. ఆమె హాట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. "శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాష్టర్ పీస్" వంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పూర్వాజ్ డైరెక్షన్ లో ఈ కిల్లర్ మూవీ రాబోతోంది. పైగా ఆ డైరెక్టర్ జ్యోతి హజ్బెండ్ కూడా. వీళ్ళ కంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఒక గ్లిమ్ప్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "మౌనం మాట్లాడినప్పుడు ఈ రొమాంటిక్ సీన్ వస్తుంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పని జరుగుతోంది. చాల పవర్ ఫుల్ ఐన ఒక మూవీ రాబోతోంది. మేము రా, రియల్ , రివొల్యూషనరీ మూవీని తీసుకురాబోతున్నాం" అంటూ చెప్పింది.

ఆప్షన్స్ ఎక్కువ కావడంతోనే..డివోర్స్ లు బాగా పెరిగాయి

ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా ఇందులో పెళ్ళైన వాళ్ళను, పెళ్లి కానీ వాళ్ళను తీసుకొచ్చారు. దాంతో ఇద్దరి మధ్య పెళ్లి ఎందుకు అవసరం, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది అనే పాయింట్ మీద డిబేట్ జరిగింది. ఇక సుధీర్ కూడా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. "మనం పెళ్లి చేసుకున్నాక ఎక్కడున్నావు ఎం తిన్నావు అని అడుగుతుంటే మనం రెస్ట్రిక్టెడ్ గా ఫీలవుతున్నాం కాబట్టే మనకు అది నచ్చట్లేదు. అదే మనం మన పార్టనర్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాల హ్యాపీగా ఉంటుంది.