English | Telugu

Karthika Deepam2:  జ్యోత్స్న పారిపోకుండా చేసిన కార్తీక్, దీప.. ఎంగేజ్ మెంట్ జరిగేనా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-415లో.. ఇంట్లో నుండి తన కార్ లో పారిపోతుంటుంది జ్యోత్స్న. నిశ్చితార్థం నుంచి ఇంత ఈజీగా బయటపడతాననుకోలేదు.. పాపం అక్కడ ఏం జరుగుతుందో తెలియక నేను పారిపోతున్నానన్న విషయం తెలియక.. రేపు నిశ్చితార్థం గురించి కలలు కంటూ నిద్రపోతుంటారు.. రేపు నేను లేనని తెలిసి అంతా తెల్లబోతారు. కారుని రైట్‌కి తిప్పి.. చక్కగా శ్రీశైలం పోదామని అనుకుంటూ కారుని రైట్‌కి తిప్పుతుంది జ్యోత్స్న. కారుని ఎందుకు రైట్‌కి తిప్పారు మేడమ్ అనే స్వరం వినిపిస్తుంది. అది ఎవరిదో కాదు మన కార్తీక్ బాబుదే. బిత్తరపోయిన జ్యోత్స్న సడన్ బ్రేక్ వేసి.. బావా నువ్వా.. నువ్వు ఎప్పుడు ఎక్కావ్ కారులో.. అంటుంది.

నాకంటే ముందే ఎక్కారు అమ్మగారు అని దీప అనగానే.. జ్యోత్స్న మరింత షాక్ అవుతుంది. ఇక ఇద్దరు కాసేపు జ్యోత్స్నని ఆడుకుంటారు. చేసేదేమీ లేక జ్యోత్స్న మళ్ళీ ఇంటికే వస్తుంది. మరోవైపు పారిజాతం కంగారుపడతుంటుంది. ఇంతలో ఇంటి కొచ్చిన జ్యోత్స్నని చూసిన పారిజాతం షాక్ అవుతుంది. నువ్వేంటే అని పారిజాతం అనగా.. రావాల్సి వచ్చింది. ఆ దీప, కార్తీక్ నన్ను పోనివ్వలేదు. కారులోనే ఉన్నారంటూ జరిగిందంతా చెప్పి తల కొట్టుకుంటుంది జ్యోత్స్న. ఇక మరునాడు నిశ్చితార్థం ఏర్పాట్లు అన్నీ జరుగుతుంటాయి. దీప, కార్తీక్‌ పనుల్లో మునిగిపోతారు. జ్యోత్స్న రెడీ అయిపోతుంది. పారిజాతం రాగానే.. మనకు ఒక్క ఛాన్స్ ఉంది గ్రానీ.. నువ్వు వెళ్లి ఆ దీప కాళ్ల మీద పడిపోమని అంటుంది.

చూడు గ్రానీ.. ఆ దీపకు మా మమ్మీ అంటే చాలా సెంటిమెంట్.. అదే విషయం గురించి మాట్లాడు.. దాన్ని రిక్వెస్ట్ చెయ్.. గౌతమ్ చెడ్డవాడని చెప్పమని రిక్వెస్ట్ చెయ్ అని దీప దగ్గరకు పంపిస్తుంది పారిజాతం. మరోవైపు మీ అమ్మ ఇంకా రాలేదేంటని కార్తీక్ ని సుమిత్ర, దశరథ్ లు అడుగుతారు. తను రాదు.. తనకు ఇంట్లో కొడుకు, కోడలు, అక్కా ఉన్నారు. వాళ్లని కూడా మీరు పిలిచి ఉంటే సంతోషంగా వచ్చేదని తెగేసి చెప్తాడు కార్తీక్. మరోవైపు దీప దగ్గరకు పారిజాతం వెళ్లి తనను రిక్వస్ట్ చేస్తుంది. నీకు సుమిత్ర రుణం తీర్చుకునే అవకాశం దీపా ఇది అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది పారిజాతం. దీప నిజంగానే కరిగిపోయినట్లుగా ఎక్స్ ఫ్రెషన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..