రసవత్తరంగా గూడెం రాజకీయాలు

Publish Date:Mar 13, 2014

Advertisement

 

తాడేపల్లిగూడెం.. ఈ పట్టణం పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయాలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ మునిసిపల్ చైర్మన్ దగ్గర్నుంచి ఎమ్మెల్యే వరకు ఏ ఎన్నిక జరిగినా రాజకీయాలు రసవత్తరంగా మారుతూనే ఉంటాయి. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 85లో ఎర్రా నారాయణస్వామి, 89, 94లలో పసల కనకసుందరరావు, మళ్లీ 99లో ఎర్రా నారాయణస్వామి ఇక్కడ టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో 99 ఎన్నిక బాగా ఉత్కంఠభరితంగా సాగింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ బాగా బలమైన అభ్యర్థి అని ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తర్జనభర్జన పడి.. నారాయణ స్వామిని పిలిపించి మరీ పోటీ చేయించారు. అప్పటికి ఆయనతో పోలిస్తే కొట్టు సత్యనారాయణ యువకుడు కావడం, ప్రచారం ఉధృతంగా చేయడంతో ఫలితాలను ఎవరూ ఊహించలేపోయారు. చివరకు ఎర్రా నారాయణస్వామే గెలిచారు.

 

తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైఎస్ హవాతో కొట్టు సత్యనారాయణ గెలిచారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా ఈలి నాని, కాంగ్రెస్ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, టీడీపీ నుంచి ముళ్లపూడి బాపిరాజు పోటీపడ్డారు. ముగ్గురికీ 40వేల ఓట్లకు పైగానే వచ్చాయి. బాపిరాజుకు 41282 ఓట్లు రాగా, కొట్టు సత్యనారాయణకు 45727 వచ్చాయి. 3020 ఓట్ల తేడాతో.. అంటే 48747 ఓట్లు సాధించిన ఈలి నాని విజేత అయ్యారు. తర్వాత పీఆర్పీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడంతో ఇప్పుడాయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. అయితే.. ప్రస్తుత రాజకీయం మరింత చిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అటు కొట్టు సత్యనారాయణ గానీ, ఇటు ఈలి నాని గానీ సుముఖంగా లేరు. ఒక దశలో జగన్ పార్టీలోకి కొట్టు వెళ్తారనుకున్నా, అక్కడ అప్పటికే తోట గోపికి టికెట్ దాదాపుగా ఖరారు కావడంతో ఊరుకున్నారు.

 

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోనన్న విషయం మంచి ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా పోరాడిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీ టికెట్ కోసం కొట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెం టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి బాపిరాజు, ఎర్రా నారాయణస్వామి మనవడు ఎర్రా నవీన్ లకు ఈ రాజకీయాలతో దిమ్మ తిరిగిపోతోంది.

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.