ఛలో చిక్బల్లాపూర్ అంటున్న చిరు?

Publish Date:Mar 13, 2014

Advertisement

 

కాంగ్రెస్ తురుపుముక్క మడత పడిపోయిందా? సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా కాడి భుజానికెత్తుకొన్నమెగాజీవిని వీరప్ప మొయిలీ కర్ణాటకకి లాక్కుపోనున్నారా? లేక పోతే మొయిలీని తప్పించేసి ఈ జీవే అక్కడి నుండి పోటీ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కన్నడ నాట వెబ్ సైట్లలో దొరుకుతున్నాయి. జగన్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే, తాను నిలబెడతానని కాంగ్రెస్ అధిష్టానం అడక్కుండానే తొడ కొట్టి భరోసా ఇచ్చిన చిరంజీవి అంటే టెన్ జనపథ్ యజమానికి భలే అభిమానం అట!

 

ఆ అభిమానంతోనే, ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి కావలసిన అంతటి మహావ్యక్తిని అంతకు ఏమాత్రం తీసిపోని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేసింది కాంగ్రెస్ అధిష్టాన దేవత. ఆ మెగాజీవి రాష్ట విభజన నిర్ణయాన్ని పైపైన వ్యతిరేకిస్తూ, లోలోన మాత్రం తమకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు రాజమాత, యువరాజులవారు ఇరువురూ కూడా ఆయన పట్ల చాలా ప్రసన్నం అయినప్పటికీ, సరిగ్గా అదే కారణంతో సీమాంధ్ర ప్రజలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేఖత గూడు కట్టుకొని ఉందని, అందువల్ల ఆయనకు ప్రచార భాధ్యతలు అప్పగించడం వలన రివర్స్ ఎఫ్ఫెక్ట్స్ కనబడతాయని, ఆయన ఇమేజుకి తోడూ యువరాజావారి ఇమేజు కూడా తోడయితే ఇక తిరుగే ఉండదని కాంగ్రెస్ నేతలే ఒకరి చెవులు మరొకరు పరపరా కోరికేసుకొంటున్నట్లు గాలి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టమయింది గనుక ఆ జీవినే నమ్ముకొని ముందుకు వెళ్ళేలా ఉంది.

 

అయితే చిరంజీవి వచ్చి చెయ్యేస్తే చాలు మళ్ళీ నాకు యంపీ సీటు కన్ఫర్మ్ అని కేంద్ర మంత్రి వీరప్ప మోయిలీగారు ఆశలన్నీ మెగా జీవిపైనే పెట్టేసుకోన్నారుట. ఈ సారి కర్ణాటకలోని చిక్బల్లాపూరు నుండి పోటీ చేస్తున్న ఆయన ఈ చిరు జీవి అండతో ఎన్నికల వైతరిణిని దాటేయాలని ఆశడుతున్నట్లు కన్నడ వెబ్ సైట్లన్నీ కాకుల్లా గోలగోల చేసేస్తున్నాయి. అందుకు అవి మంచి రీజనింగ్ పాయింటు కూడా చెపుతున్నాయి.

 

చిరంజీవీ ఎందుకంటే.. చిక్బల్లాపూర్ లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అందులోనూ బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ వారికి చిరు గురించి ఇంకా చాలా గొప్ప అభిప్రాయాలే ఉన్నాయిట! వారు ఇంకా త్రేతాయుగంలోనే ఉండిపోయినట్లుగా నేటికీ ఆయన అభిమాన సంఘాలు, బ్లడ్ బ్యాంకులు, సమాజ సేవ, దానగుణం వగైరా సీనుల వద్దనే ఆగిపోవడంతో, విలీనమే మార్గం- కేంద్రమంత్రి పదవే లక్ష్యం, విభజనే ఆచరణీయం-ముఖ్యమంత్రి పదవే ప్రధానం వంటి తాజా కొటేషన్లను, డెవెలప్మెంట్లను బొత్తిగా గమనించలేకపోయారుట! అందువల్ల ఈ జీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ ఒడ్డుకు చేరుస్తారో తెలియక పోయినా, తనను మాత్రం తప్పకుండా ఒడ్డునపడేయగలడని మోయిలీగారి వీర నమ్మకంతో ఉన్నారు.

 

మళ్ళీ అవే వెబ్ సైట్లు కొన్ని చిరంజీవి తెలుగు ప్రజలకు హ్యండిచ్చినట్లే, మొయిలీ కూడా ఆయన హ్యండిచ్చేసి ఇంత సేఫ్ గా ఉన్న జోన్ లో తనే స్వయంగా ఎందుకు పోటీ చేయకూడదూ? అనే ఐడియాని అధిష్టానం మెదడులో నేర్పుగా జొప్పించేసినట్లు మరో నాలుగు ముక్కలు గీకి పడేశాయి. అది చూసి మోయిలీ షాకయిపోతే అధిష్టాన దేవత బలే ఇంప్రెస్స్ అయిపోయిందిట!

 

ఈ మెగాజీవిని కూడా కర్ణాటకలో పోటీకి దింపితే సినీ గ్లామర్, తెలుగువాళ్ళ ఓటు బ్యాంక్ అన్నీ కలిపేసుకొని లెక్క చూసుకొంటే కనీసం మరొక్క లోక్ సభ సీటు ఎక్సట్రాగా వచ్చినా యువరాజవారి పట్టాభిషేకానికి అదే పదివేలు అని భావిస్తోందిట. కనుక, ఏ జీవి మద్దతులేనిదే ఎన్నికలలో గెలవలేని మొయిలీని రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఆయనకు బదులు మెగాజీవినే చిక్భుల్లా పూర్ లో పోటీకి దింపితే బెటర్ కదాని ఆలోచిస్తున్నట్లు తాజా గాలివార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను అక్కడ నుండి పోటీ చేయిస్తే పనిలోపనిగా ఆయన ఎన్నికల రధాన్ని ఓ సారి కర్ణాటకలో తెలుగు వాళ్ళున్న అన్ని ప్రాంతాలలో కూడా ఓ రౌండేయించేస్తే బెటరేమో.. అని అధిష్టాన దేవతలు ఆలోచిస్తున్నారుట.

 

మన మెగాజీవి మాత్రం పాలకొల్లు పరాభవం, ఉప ఎన్నికల్లో తిరుక్షవరం కంటే, చిక్బల్లాపూరు కి జంపై పోతే మళ్ళీ ఐదేళ్ళు తిరిగి చూసుకోక్కరలేదు అని లోలోన సంతోషపడిపోతున్నట్లు ఆయన మనసులో తొంగి చూడగల కొన్ని వెన్ సైట్లు కనిపెట్టిసాయి. మరి ఈ గాలి కబుర్లు అన్నీ వినివినీ మొయిలీ హార్ట్ అయిపోయారంటే అవరూ...పాపం మొయిలీ...

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.