కార్యకర్తలే లోకేష్ ధ్యాస.. శ్వాస!

Publish Date:Apr 17, 2026

Advertisement

సాధార‌ణంగా ఒక్కో నాయ‌కుడికి గ్రౌండ్ ఒక్కోలా ప‌రిచ‌యం అవుతుంది. జ‌గ‌న్ లాంటి  కొంద‌రికి స్కాముల ద్వారా రాజ‌కీయాల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతుంటాయి. ఆయ‌న కెరీర్ మొద‌లైందే క్విడ్ ప్రోకోతో. బ‌డా బాబుల‌కు ప‌నులు చేసి పెట్టి.. వారి ద్వారా ఎలాంటి  ల‌బ్ధి పొందాలి? అన్న‌దే జ‌గ‌న్ మైండ్ సెట్ లో ఎక్కువ‌గా తిరుగుతుంటుంద‌ని అంటారు. ఆయ‌న‌కు నిజ‌మైన కార్య‌క‌ర్త అంటే ఎవ‌రు?  వారి బాగోగులేంటి?  వారి స‌మ‌స్య‌లేంటి? అన్న విష‌య‌మే తెలీదు. తాను అధికారంలోకి వ‌చ్చినా కూడా అదే నిర్ల‌క్ష్యం.   దీంతో గ‌త ఎన్నిక‌ల్లో దారుణ‌మైన‌ ఓట‌మి ఎదురైన ప‌రిస్థితులు. ఇప్పుడు కూడా  ఆయ‌నేమీ సుత‌రాయించ‌లేదు. ఆయ‌న‌కు అధికారం అంటే కేవ‌లం అక్ర‌మ మార్గంలో సంపాదించే వెస‌లుబాటు  అంతే.. ఇంకేం లేదు.

అదే లోకేష్  విషయానికి వస్తే.. ఆయన అలాక్కాదు. ఆయ‌న 2013లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిందే. కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన అంశంలో. ఈ విష‌యంలో లోకేష్ క‌న్నా  కార్య‌క‌ర్త‌లే ఎంతో లక్కీ. కార్య‌క‌ర్త‌లను,  వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్..  వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని   వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.

లోకేష్ ఎప్పుడూ ఫోన్లో చూసేది ఏంటో తెలిస్తే షాకై  పోతాం. జ‌గ‌న్ అదే ఫోన్లో ప‌బ్జీ గేమ్స్ ఆడుతుంటే లోకేష్ మాత్రం ఏయే కార్య‌క‌ర్త‌ల నుంచి ఎలాంటి సందేశ‌మొచ్చిందో చూస్తూ ఉంటారు. ఎవ‌రైనా కార్య‌క‌ర్త‌కు బాగోలేక పోయినా, వారి కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రైనా ఆస్ప‌త్రి పాలైనా.. మంచి చెడ్డ‌లు చూడ్డంలో లోకేష్ ముందుంటారు. ఎన్ని ప‌నులున్నా ప‌క్క‌న పెట్టి ఫ‌స్ట్ ఆ ప‌ని చేయ‌మ‌ని త‌న మ‌నుషుల‌ను పుర‌మాయిస్తుంటారు. 

లోకేష్ నోటి నుంచి త‌ర‌చూ వ‌చ్చే మాట‌.. నేనున్నా, నేను చూసుకుంటా.. నువ్వేం భ‌య‌ప‌డ‌కు! ఈ మాట‌ల‌ను న‌మ్మి ఎంద‌రో వారి వారి ఆశ‌ల‌ను తిరిగి పున‌రుజ్జీవం చేసుకున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌న్నీ కార్య‌క‌ర్త‌ల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే మీరు కావాలంటే చూడొచ్చు.. నాయ‌కుల‌తో అయినా సీరియ‌స్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తారేమో తెలీదు కానీ, కార్య‌క‌ర్త‌ల‌తో మీటింగ్ అంటే చాలు ఆయ‌న‌కు ఎక్క‌డ లేని సంతోషం వ‌చ్చేస్తుంది. వారిని ఎప్పుడెప్పుడు క‌లుద్దామా? అని ఎదురు చూస్తుంటారు.

లోకేష్ న‌మ్మే  సిద్దాంతం అల్లా ఒక్క‌టే.. కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే.. త‌మ త‌మ సొంత‌ సొమ్ముతో పార్టీకి విశేష  సేవ‌లందిస్తుంటారు. వారికి ఇదేదో వ‌స్తుంది.. అదేదో రాబోతుంది అన్న ఆలోచ‌న‌లేం ఉండ‌వు. వారి ఆలోచ‌న‌ల్లా ఒక్క‌టే పేదోడి బ‌తుకు బాగు ప‌డాలి. త‌న అక్క‌న ప‌క్క‌న ఉన్న వారు చ‌ల్ల‌గా ఉండాలి. అందుకే వారు ఎంత దూరంలో పార్టీ కార్య‌క్ర‌మం ఉంటే.. సొంత తిండి  ఖ‌ర్చు, పెట్రోల్ ఖ‌ర్చు పెట్టుకుని వ‌స్తుంటారు. త‌న యువ‌గ‌ళం కూడా అలాగే హిట్ అయ్యింద‌ని లోకేష్ కి బాగా తెలుసు. అందుకే వారంటే ఆయ‌న‌కు తెగ‌ని అనుభంధం, అంతులేని అభిమానం. అంతే కాదు త‌న  కార్యకర్తలను కలుసుకుంటే.. తోబుట్టువుల‌ను క‌లుసుకున్నంత సంబ‌రంగా ఫీల‌వుతారు.

అస‌లు ఇలాంటి వారి స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ తీసుకొచ్చింది తొలుత లోకేషే. కానీ దాన్ని  కూడా తన ఘ‌న‌తే అని గ‌ప్పాలు కొట్టుకుంటారు అవ‌త‌ల పార్టీ ప్ర‌ముఖులు. కానీ లోకేష్ ఎక్క‌డా ఇలాంటి వాటికి స్పందించ‌రు. ఎందుకంటే  స‌గ‌టు కార్య‌క‌ర్త బాగున్న‌పుడే పార్టీ బాగుంటుంద‌ని ఆయ‌న బ‌లంగా విశ్వ‌సిస్తారు. అందుకు త‌గిన‌ట్టుగానే త‌న ప‌థ‌క  ర‌చ‌న చేస్తారు. ఒక కార్య‌క‌ర్త‌కు ఏదైనా ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశ‌ముంటే వెంట‌నే వ‌చ్చేలా చేస్తారు. ఎందుకంటే త‌న కెరీర్ మొద‌లైందే అక్క‌డి నుంచి. వారి తో సావాసం చేసి ఎన్నో గ్రౌండ్ లెవ‌ల్ విష‌యాల‌ను తెలుసుకున్నారాయ‌న‌. అందుకే ఆ రైతు మ‌ట్టిని న‌మ్మిన‌ట్టు.. లోకేష్.. త‌న పుట్టింటి మ‌నుషులైన కార్య‌క‌ర్త‌ల‌ను ఎక్కువ‌గా విశ్వ‌సిస్తారు. వారితోటిదే జీవితంగా గ‌డ‌పాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తారు.

ప్ర‌స్తుతం లోకేష్ కి ప్ర‌మోష‌న్ ల‌భించింది. జాతీయ కార్య‌ద‌ర్శి నుంచి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారాయ‌న‌. ఈ ప‌ద‌వి త‌న‌క‌న్నా మించి త‌న వాళ్ల‌కు, త‌న కార్య‌క‌ర్త‌ల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ ప‌డాల‌ని కోరుకుంటారు లోకేష్. ఎందుకంటే ఒక పార్టీ నాయ‌కుడిగా ఆయ‌న జ‌న్మ‌స్థానం, క‌ర్మ‌స్థానం అదే కాబ‌ట్టి.. అందుకే  కార్య‌క‌ర్తంటే కార్య‌క‌ర్త కాదు.. వారు మ‌న య‌జ‌మానుల‌ని అంటారు లోకేష్. అదీ లోకేష్ కి తెలిసిన రాజ‌కీయ క‌ర్త‌వ్యం. కాబ‌ట్టి ప్ర‌తి కార్య‌క‌ర్తా.. ఆయ‌న‌కొచ్చిన ఈ నూత‌న ప‌ద‌వీ లాభం పై ఆయ‌న‌క‌న్నా మించి సంతోషిస్తున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే  పుల‌కించి పోతున్నారనే చెప్పాలి. అందుకే లోకేష్ అంటారు.. నా క‌ర్త‌- క‌ర్మ‌- క్రియ‌.. వాళ్లే.. కార్య‌క‌ర్త‌లే అని!

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.