ముగిసిన నాదెండ్ల భాస్కరరావు ప్రస్థానం

Publish Date:Apr 22, 2026

Advertisement

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లాలో 1935 జూన్ 23న జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, వృత్తిరీత్యా న్యాయవాది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా పట్టా పొందిన ఆయన, కొంతకాలం న్యాయవాదిగా సేవలందించారు.

అనంతరం రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య మంత్రివర్గాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన భాస్కరరావు, ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా నిలిచారు. 1983లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు.

అయితే 1984లో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో, రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ (ఐ) ఎమ్మెల్యేలు, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో, అప్పటి గవర్నర్ రామ్‌లాల్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదంతో భారీ ఉద్యమం చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి ‘ధర్మయుద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. ఈ ఉద్యమానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించగా, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించింది. ఉద్యమం తీవ్రతకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, గవర్నర్ రామ్‌లాల్‌ను వెనక్కి పిలిపించింది. అనంతరం ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది.

కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నాదెండ్ల భాస్కరరావు, మెజారిటీ నిరూపించలేక రాజీనామా చేయాల్సి వచ్చింది. 1984 ఆగస్టులో చోటుచేసుకున్న ఈ రాజకీయ సంక్షోభం ‘ఆగస్టు సంక్షోభం’గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన ఆయన రాజకీయ జీవితంపై ముద్ర వేసింది. అనంతరం టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కరరావు, 1998లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరినా, వయోభారం కారణంగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించలేదు.

ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మనోహర్, 2004, 2009లో తెనాలి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన, 2024లో తెనాలి నుంచి మరోసారి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాదెండ్ల మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం (23-04-2026) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.