political-news-img

కల్తీల నిరోధానికి కఠిన చట్టం.. రేవంత్ రెడ్డి.!

ఆహార‌, ఔష‌ధాల క‌ల్తీల నిరోధానికి క‌ఠిన చ‌ట్టం రూపొందించాల‌ని తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూర‌గాయ‌లు, పండ్లు, పాలు అన్ని క‌ల్తీల బారిన ప‌డుతుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ అనారోగ్యాల బారిన ప‌డుతున్నార‌న్నారు. తెలంగాణ ఆహార క‌ల్తీ, ఔష‌ధ నియంత్ర‌ణ చ‌ట్టంపై ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం (జులై 18) స‌మీక్ష నిర్వ‌హించారు. ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వ‌ర‌గా మ‌గ్గేందుకు విచ్చ‌ల‌విడిగా ర‌సాయ‌నాలు వాడుతుండడంతో ప్ర‌జ‌లు అనారోగ్యం బారిన ప‌డుతున్నారన్న సీఎం ఎరువులు, పురుగు మందుల భారీ వాడ‌కంతో పంట ఉత్ప‌త్తుల్లోనూ ర‌సాయ‌న అవ‌శేషాలు బ‌య‌ట‌ప‌డి దిగుమ‌తి చేసుకోవ‌డానికి విదేశాలు నిరాక‌రిస్తున్నాయన్నారు. మార్కెట్ లో సేంద్రియ ఉత్ప‌త్తుల పేరుతో ప‌లుర‌కాల ఉత్ప‌త్తులు అమ్ముతున్నార‌ని, అధిక ధ‌ర‌లు ప్ర‌జ‌లు వాటిని కొంటున్నా... అవి సేంద్రియ ఉత్ప‌త్తులే అని నిర్ధ‌రించేందుకు స‌రైన వ్య‌వ‌స్థ‌లు లేవ‌న్నారు. ఈ నేప‌థ్యంలో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు. దానిపై బిల్లు రూపొందించి శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ చేప‌డ‌తామ‌ని సీఎం తెలిపారు. క‌ల్తీల‌కు సంబంధించి స‌మ‌గ్ర స‌మాచార సేక‌ర‌ణ‌కు విజిల్ బ్లోయ‌ర్ల‌ను నియ‌మించాల‌ని, టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. Strict law to curb adulteration, Telangana CM Revanth Reddy, Review on Adultration

Publish Date: Jul 18, 2026 6:06PM

political-news-img

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసుల కళ్లల్లో కారం చల్లిన రైతులు.!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్‌గూడ భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గత ఐదు రోజులుగా ప్రభుత్వ భూముల అంశంపై రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా, శనివారం(జులై 18) పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతం యుద్ధ వాతావర ణాన్ని తలపించింది. శనివారం (జులై 18) ఉదయం రైతుల తో మాట్లాడిన ఆర్డీఓ శ్రీధర్, వివాదాస్పదంగా ఉన్న 650 ఎకరాలు ప్రభుత్వ భూములేనని స్పష్టం చేశారు. ఆ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టా భూములుగా మారవని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే సుమారు 400 ఎకరాలు ఇతరులకు విక్రయించా రని.. ప్రస్తుతం బయటి వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. అయితే మిగిలిన భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. అయితే అధికారులు చర్చలు కొనసాగుతుండగానే ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా సిబ్బంది జేసీబీలతో పనులు ప్రారంభించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు మళ్లీ నిరసనకు దిగారు. పనులను అడ్డుకు నేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించే క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసు కుంది. పరిస్థితి అదుపు తప్పడంతో రైతులు పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరినట్లు సమాచారం. అంతేకా కుండా కొందరు రైతులు పోలీసుల కళ్లలో కారం చల్లడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఘటనలో శంషాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు సీఐలు గాయప డ్డారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Publish Date: Jul 18, 2026 6:01PM

political-news-img

హైడ్రాకు మద్దతుగా ప్రజా గర్జన్

ప్రజా ఆస్తుల పరిరక్షణ, చెరువుల సంరక్షణ, అక్రమ ఆక్రమణల నిర్మూలనలో హైడ్రా చేపడుతున్న చర్యలకునగరంలోని పలు కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ వాసులు, సామాజిక సంస్థల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. శనివారం (జులై 18)న వీరంతా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక దీపం వరకు భారీగా సాగిన ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొని హైడ్రాకు తమ మద్దతు ప్రకటించారు. ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ అనఘారి కాలనీ, మేడి పల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టినాగులపల్లి, జయలక్ష్మి కాలనీతో పాటు నగరంలోని పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ హైడ్రా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కొత్త దిశ లభించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు తిరిగి ప్రజల ఆధీనంలోకి వస్తు న్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి హైడ్రా కాపాడిందని వెల్లడించారు. నగరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటికీ హైడ్రా చర్యలు ఎంతో ఉపయోగపడుతు న్నాయని వారు అభిప్రాయపడ్డారు. చెరువుల పునరుద్ధరణ, జలమార్గాల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వల్ల భవిష్యత్తు లో వరదల ముప్పు తగ్గడంతో పాటు నగర పర్యావరణం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. గ్రేటర్ హైదరా బాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. Public outcry in support of Hydra, Huge Rally, Hyderabad, Sloguns

Publish Date: Jul 18, 2026 5:22PM

political-news-img

గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు జాలర్లు మృతి.!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గోదావరి నదిలో శనివారం (జులై 18) విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం నదిలోకి దిగిన ఐదుగురు జాలర్లు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది జాలర్లు గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేట కోసం వెళ్లారు. ఈ క్రమంలోనే బసిబోయిన బాలరాజు (38), ఊయిక రమేష్ (38), తుర్రం భారతి (40), ఊయిక లక్ష్మి (37), ఊయిక సుశీల (37) నదిలోకి దిగారు. కానీ నది లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు జాలర్లు ఒకేసారి మృతి చెంద డంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Five fishermen die while fishing, Godavari River, Polavaram District, Gommukottagudem

Publish Date: Jul 18, 2026 5:02PM

political-news-img

ప్రశ్న రావణ్ రిమాండ్ పొడగింపు.!

సంచలన వ్యాఖ్యలు, వాదాస్పద డిజిటల్ కంటెంట్ ద్వారా వార్తల్లో నిలిచిన ప్రశ్న రావణ్ కు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత వ్యాఖ్యల ఆరోపణలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం ఉపా కింద నమోదైన కేసులో ఆయనకు లీగల్ రిలీఫ్ లభించలేదు. గన్నవరం న్యాయస్థానం శనివారం (జులై 18) రావణ్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఆయన మరికొన్ని రోజుల పాటు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా, ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు. మరో వైపు.. ప్రశ్న రావణ్ తరఫు న్యాయవాదులు తమ క్లయింట్ ఇప్పటికే తగినంత కాలం జైలులో ఉన్నాడనీ, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాడని కోర్టుకు వివరించి బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి ప్రశ్న రావణ్ బెయిలు పిటిషన్ ను తిరస్కరించి రిమాండ్ పొడిగించారు. ప్రస్తుతానికి దిగువ న్యాయస్థానంలో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో, రావణ్ న్యాయవాదులు ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వరుస కేసులు పెట్టారని, వాటన్నింటినీ పూర్తిగా కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ రావణ్ తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో పెండింగ్‌లో ఉంది. Prasna Ravan, Gannavaram Court, Remand Extension, UAPA Case, AP Police

Publish Date: Jul 18, 2026 4:54PM

political-news-img

ఇదీ డబుల్ ఇంజిన్ పవర్.!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లోకేష్.. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే రాష్ట్రానికి మెగా పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వేగంగా సాధ్యమవుతున్నాయన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను శరవేగంగా పరిగెత్తిస్తున్నదన్నారు. అమరావతిని కేవలం భవనాల నగరంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిఉద్ఘాటించారు. గతంలో భారత రైల్వే రంగంలో భద్రత, పరిశుభ్రత లోపించేవని, కానీ ప్రధాని మోడీ ముందుచూపు వల్ల దేశంలో వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో కూడిన సరికొత్త రైల్వే విప్లవం నడుస్తోందని లోకేష్ కొనియాడారు. దశాబ్దాల నాటి ఆంధ్రుల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ప్రధాని మోడీ వెంటనే మంజూరు చేసి కార్యరూపంలోకి తెచ్చారని, ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్.. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ' ప్రసాద్' పథకం కింద నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కట్టుగా పని చేస్తే నియోజకవర్గం ఎలా మారుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ఒక రూపాయి ఆదాయానికి ఒక రూపాయి నలభై పైసల ఖర్చు ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ హామీలైన తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ, మెగా జాబ్ క్యాలెండర్ వంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో పెట్టుబడులు లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందనీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలతో పాటు ఫైటర్ జెట్ తయారు చేసే అమ్కా వంటి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, పొరుగు రాష్ట్రాల యువతే ఏపీ వైపు చూసేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేర్చుకునేవాడినని, కానీ ఇప్పుడు కుప్పం నేతలు కూడా మంగళగిరిని చూసి నేర్చుకునే స్థాయికి ఇక్కడి అభివృద్ధిని తీసుకెళ్లామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిని ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. Nara Lokesh Mangalagiri, Amaravati Capital Development, AP Double Engine Government, Andhra Pradesh Mega Investments South Coast Railway Zone Vizag

Publish Date: Jul 18, 2026 4:46PM

MOVIE NEWS