Top Stories

political-news-img

ధరణి అక్రమాలపై దర్యాప్తునకు సిట్.. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం..!

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో లేఖ రాయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలు, తాగునీరు, సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితులను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరనుంది. అలాగే ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయనుంది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు నమోదైన నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం ఆదేశించింది. అలాగే ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా కేటాయించాలని నిర్ణయించింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కేబినెట్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని, వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎల్‌నినో ప్రభావంపై నివేదిక రూపొందించాలని సూచించింది. రాష్ట్ర పరిస్థితులకు అనువైన పంటలు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, పశుసంరక్షణ చర్యలపై సిఫార్సులు చేయాలని కోరింది. అన్ని జిల్లాల్లో అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని కూడా నిర్ణయించింది. ప్రకృతి విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2. ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రికార్డులు, క్రయవిక్రయాలకు సంబంధించిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందం (SET) ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించింది. ఇప్పటికే నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో దాదాపు 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించింది. ధరణి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన IL&FS సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో లోపాలపై కూడా విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చినప్పటికీ, పాత సాఫ్ట్‌వేర్‌లోని లోపాల కారణంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్న మంత్రివర్గం, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక విచారణ బృందం ద్వారా వారిని గుర్తించాలని నిర్ణయించింది. 3. ఇంజినీరింగ్ పనులకు యూనిఫైడ్ విధానం ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల్లో అంచనా వ్యయాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలు, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపుల వరకు ఏకీకృత విధానం రూపొందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికోసం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ తదితర అన్ని దశలను సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించింది. 4. మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లో సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5. గ్రామపంచాయతీ నిధుల నిర్వహణ గ్రామపంచాయతీ నిధులను ఇకపై ట్రెజరీతో పాటు సమీపంలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6. హైస్పీడ్ రైల్ కారిడార్లు హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–అమరావతి–తిరుపతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ అండ్ బీ శాఖ కేబినెట్‌కు వివరించింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మూడు బుల్లెట్ రైల్ కారిడార్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. 7. ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మిగిలిన పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పూర్తయిన పనులను సమీక్షించి, మిగిలిన పనులకు అవసరమైన ఆమోదం ఇచ్చింది. Telangana Cabinet meeting, El Nino, CM Revanth reddy, Dharani Portal, SIT, High-speed rail corridors

Publish Date: Jul 17, 2026 9:34PM

political-news-img

జూబ్లీహిల్స్‌లో తాగునీటితో వాకిలి కడిగిన యజమానికి షాక్..!

హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న వేళ తాగునీటిని వృథా చేసిన ఓ ఇంటి యజమానికి జలమండలి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఇంటి వాకిలిని తాగునీటితో శుభ్రం చేస్తూ నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి, రోడ్ నెం.33లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్ నెం.33లోని ఓ ఇంటి యజమాని తాగునీటితో ఇంటి ఆవరణను కడుగుతూ పెద్ద మొత్తంలో నీటిని వృథా చేస్తున్నాడు. ఒకవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బిందెడు మంచినీటి కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. విచారణలో ఫిర్యాదు నిజమేనని తేలడంతో ఇంటి యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసు అందజేశారు. అలాగే ఏడు రోజులలోపు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జలమండలి అధికారులు మాట్లాడుతూ.. నగరంలో తాగునీటి కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు. తాగునీటిని ఇళ్ల ప్రాంగణాలు కడగడం, వాహనాలు శుభ్రం చేయడం వంటి అవసరం లేని పనులకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటిని వృథా చేస్తున్న వారిపై స్థానికులు సమాచారం అందించాలని కోరారు. ఇటీవల నగరంలో నీటి వృథాపై ప్రత్యేక దృష్టి సారించిన జలమండలి అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై వరుసగా చర్యలు చేపడుతున్నారు. Hyderabad, Jubilee Hills, HMWSSB, Drinking Water, Water Wastage, ₹5,000 Fine, Water Inspection, GHMC, CM Revanth reddy

Publish Date: Jul 17, 2026 9:20PM

political-news-img

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు అసలు కారణమిదే..!

జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఈ సున్నితమైన అంశంపై మీడియా ప్రతినిధులతో జరిగిన ప్రత్యేక చిట్-చాట్‌లో పాల్గొన్న ఆయన, తెరవెనుక అసలు ఏం జరిగిందనే సత్యాలను కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో, ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆయన ఈ సందర్భంగా దేశ రాజకీయ నాయకులకు మరోసారి స్పష్టం చేశారు. జ్ఞానేష్ కుమార్ వ్యాఖ్యల ప్రకారం.. ఎన్నికల నిబంధనలు అనేవి అందరికీ ఒకేలా వర్తిస్తాయి. నామినేషన్ పత్రంలో అడిగిన ప్రతి ఒక్క నిలువు వరుసను (కాలమ్) అభ్యర్థులు కచ్చితంగా, నిర్భయంగా భర్తీ చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు పోటీ చేయాలనుకునే వారు ఏ ఒక్క చిన్న సమాచారాన్ని దాచాలని చూసినా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అది మొత్తం నామినేషన్ చెల్లుబాటునే ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మానవీయ కోణంలో చూసీచూడనట్లు వ్యవహరించినా, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆ లొసుగులను అస్సలు వదులుకోరని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో కూడా ప్రత్యర్థి పార్టీల నాయకులు ఈ తప్పును గుర్తించి, అధికారికంగా గట్టిగా ఫిర్యాదు చేయడంతోనే రిటర్నింగ్ అధికారి నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.అసలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణమైన తెలంగాణ కోర్టు కేసు వివరాల సమర్పణపై కూడా సీఈసీ కీలక విషయాలు వెల్లడించారు. అఫిడవిట్‌లో ఆ కోర్టు కేసు వివరాలను సమర్పించి, తప్పును సరిదిద్దుకోవడానికి రిటర్నింగ్ అధికారి (RO) ఆమెకు తగిన సమయాన్ని కేటాయించారని తెలిపారు. అయితే, ఆ అమూల్యమైన అవకాశాన్ని ఆమె సరైన సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోయారని సీఈసీ వివరించారు. ఎన్నికల చట్టాల ప్రకారం.. నామినేషన్ పత్రాలను పరిశీలించి ఒక ముగింపునకు వచ్చిన తర్వాత రిటర్నింగ్ అధికారి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నేరుగా జోక్యం చేసుకోలేదని, తమ పరిధిని దాటి ఏమీ చేయలేమని సీఈసీ వివరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని మరియు అందులోని చట్టబద్ధతను పూర్తిగా సమర్థించిందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ గుర్తు చేశారు. నామినేషన్ దరఖాస్తులలో తప్పులు ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజకీయ నాయకులు తమ నామినేషన్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదంతం తెలియజేస్తోందని ఆయన వివరించారు.

Publish Date: Jul 17, 2026 9:01PM

political-news-img

రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి : సీఎం చంద్రబాబు

నరసరావుపేట రుణ వితరణ మేళాలో పాల్గొన్న నిర్మాలాసీతారామన్..! ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించటం గర్వకారణమని, బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములన్నారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కలలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనంతా సమస్యల సుడిగుండమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ రుణాల్ని కేంద్ర సహకారంతో రీ -షెడ్యూలు చేసి రూ.1,538 కోట్లు ఆదా చేశామని అన్నారు. పలనాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్ధిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి (క్రెడిట్ అవుట్ రీచ్) కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలనాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను అందజేశారు. ఇందులో భాగంగా 15 వేల మంది డ్వాక్రా మహిళలకు,13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ "పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి. పలనాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు. రైతులు, విద్యార్ధులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా అర్హులైన వారందరికీ రుణం అందించటమే లక్ష్యం. మహిళా సాధికారతకు ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా ప్రయోజనాలు చేకూరతాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రం అంతా సమస్యల సుడిగుండంలో ఉంది. ఏపీలో ఆర్ధిక విధ్వంసం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరాయి. వీబీజీ రామ్ జీ కింద కేంద్రం నుంచి రూ.7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఆర్ధిక సహకారం అందిస్తుంది.ప్రైవేటు పెట్టుబడులతో కలిపి ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తాం." అని సీఎం వివరించారు. నిర్మలా సీతా రామన్ సంస్కరణల వాది.. "మహిళలందరికీ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 లక్షల డ్వాక్రా సంఘాలు రూ.29 వేల కోట్ల పొదుపుతో దేశంలోనే మేటిగా నిలిచాయి. రుణాల రీ పేమెంట్ లో 99.5 శాతంతో డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. బ్యాంకింగ్ లో నిర్మలా సీతా రామన్ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. నష్టాల్లో ఉన్న చిన్న బ్యాంకులను విలీనం చేసి సమర్థ బ్యాంకింగ్ వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం, జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది బ్యాంకు ఖాతాలు, జీఎస్టీ శ్లాబ్ లను కుదించి పారదర్శక విధానం తెచ్చారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా చాలా సంస్కరణలు కేంద్ర మంత్రి నిర్మల తీసుకొచ్చారు. ఈ తరహా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాల్ని 6 జిల్లాల్లో నిర్వహించేందుకు తక్షణమే అంగీకరించారు. త్వరలోనే 3 నెలలకు ఒకటి చొప్పున ఈ తరహా కార్యక్రమాలు చేపడతాం." అని ముఖ్యమంత్రి అన్నారు చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం-కేంద్ర మంత్రి.. దేశంలోని ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని గుర్తుచేశారు. చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన ప్రధాని మోదీ.. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తెచ్చారని వివరించారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెగా రుణమేళాలో భాగంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రుణ మంజూరు పత్రాలను, చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.42.16 లక్షల విలువైన అంబులెన్స్‌ను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అలాగే నాబార్డు సౌజన్యంతో డీసీసీబీ (DCCB) కి రూ.25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థినులకు రూ.17.80 లక్షల విలువైన 301 సైకిళ్లను పంపిణీ చేశారు. పర్యాటక శాఖకు గ్రామీణ బ్యాంక్ తరపున రూ.14 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందించారు. వీటిని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. సభకు ముందు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Publish Date: Jul 17, 2026 8:48PM

political-news-img

రాయలసీమలో ఫ్యాక్షనిజం పోయింది.. ఫ్యాక్టరీలు వచ్చాయి..! : నారా లోకేష్

కడప జిల్లాప్రొద్దుటూరులో నిర్వహించిన పార్టీ అంతర్గత సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికలలో సాధించిన భారీ విజయం తర్వాత క్షేత్రస్థాయి క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని నింపడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల దిశగా కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. రాజకీయ పరిస్థితులు గతానుభవాల విశ్లేషణగత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, పార్టీ కార్యకర్తలపై నమోదైన రాజకీయ కేసులను ప్రస్తావిస్తూ లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 30 వేల మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని, అందులో 80 శాతం కేసులను ప్రస్తుతం క్లియర్ చేశామని వివరించారు. కడప జిల్లాలో గతంలో నందం సుబ్బయ్య వంటి నమ్మకమైన నాయకులను కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారని, ఆ కష్టకాలంలో పార్టీ క్యాడర్ పసుపు జెండాను గుండెలకు హత్తుకుని నిలబడిందని కొనియాడారు. 175 స్థానాలకు గాను కూటమి 164 స్థానాల్లో సాధించిన ప్రభంజనం వెనుక కార్యకర్తల త్యాగాలు, శ్రమ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి-సంక్షేమ వ్యూహాలు విపక్షాలపై విమర్శలుప్రొద్దుటూరును 'మినీ ముంబై'గా అభివర్ణిస్తూ, ఈ ప్రాంతానికి ఉన్న వ్యాపార, పారిశ్రామిక పట్టుదలను లోకేష్ అభినందించారు. రాయలసీమను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం 'గోల్డ్ హబ్'గా మారుస్తోందని, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ దీనికి ఒక నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మిణి స్టీల్స్ పేరిట వేల ఎకరాల భూములు కేటాయించినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, కానీ కూటమి అధికారంలోకి రాగానే జేఎస్డబ్ల్యూ స్టీల్స్, దాల్మియా సిమెంట్స్, ఎస్ఐఎల్ పవర్ వంటి పరిశ్రమలతో సీమలో ఫ్యాక్షనిజం స్థానంలో ఫ్యాక్టరీల యుగాన్ని తీసుకొచ్చామని వివరించారు. లీగల్ నోటీసుల పేరుతో గత పాలకులు పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి, నెలవారీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.ఆర్థికంగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నట్లు లోకేష్ వివరించారు. ఒకటో తారీఖునే 4 వేల రూపాయల పెన్షన్ పంపిణీ, జూలై 24 నాటికి 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటివి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మొదటి ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, జాబ్ క్యాలెండర్ ద్వారా మరో 10 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నామని యువతకు భరోసా ఇచ్చారు. కూటమి అంతర్గత వ్యూహం మరియు భవిష్యత్ రాజకీయ ప్రభావంలోకేష్ ప్రసంగంలో అత్యంత కీలకమైన అంశం కూటమి ఐక్యత మరియు భవిష్యత్ ఎన్నికల వ్యూహం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ (BJP)ల కూటమి కేవలం ఒకే ఒక ఎన్నిక కోసం ఏర్పడింది కాదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు కూటమి పార్టీల ముసుగులో సోషల్ మీడియా వేదికగా చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని, కార్యకర్తలు వాటిని గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాము కేవలం రాబోయే 2029 ఎన్నికల వరకే కాకుండా, కనీసం ఐదు టర్ములు (25 ఏళ్లు) కలిసికట్టుగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్‌తో జరిగిన ఫోన్ సంభాషణను ప్రస్తావిస్తూ లోకేష్ బాహాటంగా ప్రకటించారు.రాజకీయాల్లో అహంకారానికి తావులేదని, గత పాలకులకు 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోవడానికి అహంకారమే ప్రధాన కారణమని హెచ్చరించారు. ప్రతి కార్యకర్త అధికారంలో ఉన్నామనే గర్వం వీడి, ప్రతి బూత్ స్థాయిలో 'డోర్ టు డోర్' కార్యక్రమం ద్వారా ప్రజలతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకోవాలని పిలుపునిచ్చారు. 'మై టిడిపి' (My TDP) యాప్ టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయి పనితీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. గుజరాత్, ఒడిశా తరహాలో రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి సాధ్యం కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు అత్యంత ఆవశ్యకమని, దానికి ఈ కూటమి బంధం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. Nara Lokesh, Proddatur TDP meeting, Rayalaseema development, Thalliki Vandanam scheme, TDP Janasena BJP alliance, Andhra Pradesh politics, Chandrababu Naidu, Jonnagiri Gold Project, AP Mega DSC, Kadapa district politics

Publish Date: Jul 17, 2026 8:36PM

political-news-img

తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. లేదంటే కార్డు రద్దు..!

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. మీ ఇంట్లో రేషన్ కార్డు ఉందా? అయితే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న సభ్యులందరికీ ఉచితంగా ఇ-కెవైసి (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన డెడ్‌లైన్ విధించింది. ఈ నెల 31వ తేదీ, అంటే జూలై 31, 2026 నాటికే ఈ ఇ-కెవైసి ప్రక్రియను పూర్తి చేయడానికి ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఈ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కూడా e-KYC పూర్తి చేసుకోని లబ్ధిదారులకు భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరించారు. చివరి నిమిషంలో వచ్చే సర్వర్ సమస్యలు, రద్దీని తట్టుకోవడానికి ఇప్పుడే అప్రమత్తం కావడం ఎంతో ముఖ్యం. ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ లేదా ఐరిస్ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం లబ్ధిదారులు తమ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డులను తీసుకువెళ్లాలి. మీ సమీపంలో ఉన్న స్థానిక రేషన్ డీలర్ వద్ద లేదా మీ సేవ కేంద్రాలలో ఈ ప్రక్రియను ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. చాలా చోట్ల వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, లేదా కష్టపడి పనిచేసే కూలీలకు వయసు పైబడటం వల్ల వేలిముద్రలు పడటం లేదు. అలాంటి వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పౌరసరఫరాల శాఖ ఐరిస్ అంటే కంటి గుర్తింపు సౌకర్యాన్ని కూడా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి వేలిముద్రలు పడకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ప్రభుత్వం ఈ ఇ-కెవైసి ప్రక్రియను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. రాష్ట్రంలో అర్హులైన అసలైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే పవిత్ర ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గట్టి చర్యలు చేపట్టింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను వంద శాతం పెంచడానికి, నకిలీ మరియు చెల్లుబాటు కాని బోగస్ కార్డులను పూర్తిగా ఏరివేయడానికి పౌరసరఫరాల శాఖ ఈ విధానాన్ని తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డులు ఉండి, ప్రస్తుతం ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, అలాగే మరణించిన వారి పేర్లను డేటాబేస్ నుండి శాశ్వతంగా తొలగించడానికి ఈ e-KYC ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు మరింత వేగంగా, మెరుగ్గా సేవలు అందుతాయి. జూలై 31 గడువు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అందుకే లబ్ధిదారులు ఆఖరి నిమిషం వరకు వేచి చూసి ఇబ్బందులు పడకుండా, వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పనిని ముగించుకోవాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా మీ కుటుంబ సభ్యుల ఇ-కెవైసి పూర్తి చేయకపోతే, సదరు సభ్యుల పేర్లు రేషన్ కార్డు నుండి శాశ్వతంగా తొలగించబడే ప్రమాదం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో కేవలం ఉచిత రేషన్ బియ్యం మాత్రమే కాకుండా, ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అందించే ఇతర అత్యంత కీలకమైన సంక్షేమ పథకాలకు, ఆరోగ్యశ్రీ లాంటి సేవలకు కూడా పూర్తిగా దూరం కావాల్సి వస్తుందని పౌర సరఫరాల శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ రేషన్ డీలర్‌ను సంప్రదించండి. telangana ration card ekyc, tg ration card deadline, ration card e-kyc online, telangana civil supplies department, ration card aadhaar link last date, ts ration card status 2026, CM Revanth reddy

Publish Date: Jul 17, 2026 8:15PM

MOVIE NEWS