పవన్ కళ్యాణ్ సమస్యలు పరిష్కరించే స్పెషలిస్టా?

Publish Date:Aug 30, 2017

Advertisement

 

పార్ట్ టైమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మరోసారి పోరాటం చేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ  కళాశాల డిగ్రీ   విద్యార్థులు తమకు సంబంధించిన సమస్యల చిట్టాని తీసుకుని పవన్ కళ్యాణ్ సార్ అడ్రస్ కనుక్కుని మరీ హైదరాబాద్‌లో వున్న ఆయన దగ్గరకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్‌ని కలిసిన  వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెట్టేశారు. వ్యవసాయ అధికారుల నియామకం అంశం మీద ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 24ని రద్దు చేసి, గతంలో  వున్న జీవో నంబర్ 16ని కొనసాగించాలని కోరారు. దాంతో మన వాగ్దాన కర్ణుడు పవన్ కళ్యాణ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేస్తానని హామీ ఇచ్చేశారు.  వ్యవసాయ విద్యార్థుల సమస్యలని ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసేశారు. వ్యవసాయ విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం మొదలు పెట్టేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు.

 

అసలు సదరు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? ఆ సమస్యలో సహేతుకత వుందా? గతంలో వున్న 16వ నంబర్ జీవోని పక్కన పెట్టి ప్రభుత్వం 24వ నంబర్ జీవోని ఎందుకు తీసుకొచ్చింది? దాని వెనుక ప్రత్యేక కారణాలు ఏవైనా వున్నాయా? పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళిన విద్యార్థులు కోరినట్టుగా చేస్తే వేరే ఎవరికైనా నష్టం జరిగే అవకాశం వుందా? తన దగ్గరికి ఎవరొచ్చి ఏం మొర పెట్టుకున్నా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయిపోతుందా? ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధికారులు కానీ పవన్ కళ్యాణ్ తరహాలో ఆలోచించలేక కొత్త జీవో తీసుకొచ్చారా? ఈ ఇష్యూలో ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. మరి పది మంది విద్యార్థులు తన దగ్గరకి వచ్చి మొరపెట్టుకోగానే ప్రభుత్వాన్ని హెచ్చరించేసిన పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి సందేహాలు కలిగాయో లేదో మరి!

 

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఉద్దానం కిడ్నీ బాధితుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల వరకు పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయించారు. ప్రస్తుతం చాలామంది ఏదైనా సమస్య వుంటే పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళి చెప్పుకోవాలన్న ధోరణిలో వున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో! ఆయన దగ్గరకి వెళ్తే సమస్య పరిష్కారమైపోతుందన్న నమ్మకం కూడా ఎందుకు కలుగుతోందో!

 

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్నో, ప్రజా ప్రతినిధులనో, అధికారులనో సంప్రదించడం సాధారణంగా ఎవరైనా చేసే పని. కానీ కొంతమంది అలా ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదా? ప్రభుత్వం పరిష్కరించదనుకుంటే ప్రతిపక్షం సహకారాన్ని తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించడం లేదంటే ఇప్పుడు ఏపీలో వున్న ప్రతిపక్షం చేతగాని ప్రతిపక్షమన్న అభిప్రాయం జనంలో వుందా? అధికార, ప్రతిపక్షాలని కాకుండా  ప్రజాక్షేత్రంలో నిలవని, ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎందుకు కలుస్తున్నారు? ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే స్పెషలిస్టనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందా? సినిమాల్లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించే హీరోగారు రిజల్ లైఫ్‌లో కూడా అలాగే పరిష్కరిస్తారని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయిస్తున్న వారి తీరుగానీ, అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరుగానీ ఇలాంటి ఎన్నో సందేహాలను కలిగిస్తోంది.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.