జగన్ విషయంలో కళ్ళు తెరిపించిన రోజా...

Publish Date:Aug 30, 2017

Advertisement

 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అని ఒక సారి పరిశీలిస్తే- జగన్ తనకి తాను నిజాయితీపరుడు, డబ్బులు లేని వాడు మరియు తదుపరి ముఖ్యమంత్రి గా ఊహించుకుంటున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే, జగన్ ఒక అవినీతిపరుడు, మూర్ఖుడు, రాజకీయ పరిజ్ఞానం లేని వాడు. ఇక సాధారణ జనం ఏమనుకుంటున్నారు అనే విషయం, నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. తాను ఏం చేస్తాడో చెప్పడం పోయి, అధికార పక్షం తప్పులు ఎత్తిచూపడం పోయి, వ్యక్తిగత దూషణకి దిగిన జగన్ అందరి విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాడు.

 

ఇక జగన్ కి అత్యంత సన్నిహితురాలు, సోదరి సమానురాలు అయిన రోజా తన అన్న గురించి మనకి తెలియని చాలా విషయాలు చెప్పి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు. ఒక రకంగా మనకు కొత్త జగన్ ని పరిచయం చేసే మహత్కార్యానికి నాంది పలికారు.

 

* జగన్ గురించి మనకు 1 శాతం కూడా తెలియదట. ఆయన రాముడు , కృష్ణుడు క్రీస్తు అల్లా అంతటి గొప్ప వాడట. అయితే, రోజా జగన్ అన్నని ఆ దేవుళ్లతో పోల్చకపోయినా, ఆయన కూడా దాదాపు గొప్పవాడు అనే సందేశం ఇచ్చారు. మీకు తెలుసా, జగన్ ప్రాణం పోతున్నా మడమ తిప్పడట. అందుకే, కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతాం అని తెలిసినా మాట తప్పకూడదు అన్న నియమంతో టికెట్లు మార్చలేదుట. వై.ఎస్.ఆర్ ని అభిమానించేవారి కోసమే సోనియాని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడుట.

 

* జగన్ నిజయతీపరుడు అని చెబుతూ... ఈ మాట మీకు నవ్వు తెప్పించొచ్చు... అని జనాల స్పందన ఎలా ఉండబోతుందో ముందే ఊహించారు రోజా గారు. జగన్ నీతిమంతుడు కాకపొతే కోట్లు చిమ్మి డబ్బుతో అబద్ద వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యేవాడు అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. అంటే, దీన్ని ఎలా తీసుకోవచ్చు- జనాలు డబ్బులు పంచిన వాళ్ళకే ఓట్లు వేస్తున్నారనా!

 

* భారతి సిమెంట్ కంపెని ప్రపంచ స్తాయిలో అవార్డ్ గెలుచుకుంది అని వివరించిన రోజా... జగన్ బాగానే సంపాదించాడు, సంపాదిస్తున్నాడు అని మనకి సూచనగా చెప్పింది. అలా అయితే, మరి జగన్ ఏంటి తనకి పంచడానికి డబ్బులు లేవంటాడు...?

 

* పవన్ కళ్యాణ్, మోడీ లని కూడా ఈ చర్చలోకి లాగిన రోజా, భలే కొసమెరుపు ఇచ్చింది. జగన్ ని పుచ్చలపల్లి సుందరయ్య తో పోల్చే ధైర్యం చేసింది. ప్రభుత్వపు వ్యక్తిగత దూషణలు దాడులను పట్టించుకోకుండా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్పవారిని తలపించే విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక కొత్త సంస్కృతిని ప్రవేశ పెట్టాడు, అని వ్యాఖ్యానించిన రోజాకి నిజంగా ఆ మహానుభావుడి గురించి కొంతయినా తెలుసా అనే సందేహం వస్తుంది.

 

* ఒక వ్యక్తిని పొగడాలి అంటే మూడు రకాలు. ఒకటి నేరుగా పొగడడం. రెండోది అవతలి వ్యక్తిని దూషించి తద్వారా తాము మెప్పుపొందే వ్యక్తిని పొగడడం. ఇక చివరిది, గొప్ప వ్యక్తితో పోల్చడం. రోజా ఆత్మపరిశీలన చేసుకోవలసిన విషయం ఏంటంటే, జగన్ ఏ విషయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారితో పోలికలున్న లేదా పోల్చదగ్గ వ్యక్తి. పుచ్చలపల్లి ఒక మంచి రెబెల్ అని ఎవర్ని అడిగినా చెబుతారు. రోజా పొరపాటున జగన్ అధికార పార్టీ నేతల్ని దూషించే విధానం చూసి, ఆయన్ని రెబెల్ గా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది కాబోలు!

 

* ఇక రోజా విషయానికి వస్తే, జగన్ అన్నని ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెబుతుంది. వాస్తవంగా తీసుకుంటే, రోజా కి కనుచూపుమేరలో అంతగా ఆదరించే మరో అన్నయ్య  కనిపించడం లేదనే చెప్పాలి. రోజా గతంలో చేసిన తీవ్ర విమర్శల దృష్ట్యా చంద్రబాబు పొరపాటున కూడా ఆమెను మళ్ళీ పార్టీలోకి తీసుకునే ఆలోచన చేయడు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మరో చెప్పుకోదగ్గ పెద్ద పార్టీ  లేదా అధికారం చేబట్టే సత్తా ఉన్న పార్టీ ప్రస్తుతానికి ఇంకోటి లేదు. ఇవన్నీ పరిశీలిస్తే, మరి రోజాకి కి జగన్ అన్న కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉందా!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.