ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ఆపరేషన్...66 మంది అరెస్ట్

Publish Date:May 20, 2026

Advertisement

 

సైబర్ నేరాలకు కీలకంగా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల దందాపై హైదరాబాద్ సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో నిర్వహించిన ఈ చర్యల్లో 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు జరిపి 66 మందిని అరెస్ట్ చేసి పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించారు. గతంలో మ్యూల్ అకౌంట్లపై “ఆపరేషన్ ఆక్టోపస్ 1.0”, బ్యాంకు అధికారుల పాత్రపై “ఆపరేషన్ ఆక్టోపస్ 2.0” చేపట్టిన పోలీసులు ఇప్పుడు సైబర్ నేరాలకు వెన్నెముకగా మారిన ఘోస్ట్ సిమ్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోగా, వాటిలో 432 సీల్డ్ సిమ్‌లు, 112 యాక్టివ్ సిమ్‌లు ఉన్నాయి. అరెస్టైన వారిలో 44 మంది ఈ సిమ్‌ల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సరఫరాదారులు ఉన్నారు. వీరు దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములై సుమారు రూ.101.87 కోట్ల మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన PoS ఏజెంట్లలో వోడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.

విచారణలో బయటపడిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త సిమ్ తీసుకునేందుకు లేదా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి తెలియకుండా అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెట్‌వర్క్ సమస్యలు, సర్వర్ డౌన్ వంటి కారణాలు చూపుతూ ఒకే వ్యక్తి నుంచి పలుమార్లు బయోమెట్రిక్ తీసుకుని అనేక సిమ్‌లు యాక్టివేట్ చేస్తున్నట్లు తేలింది. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత ఇంటర్నెట్ ఇస్తామంటూ ఆశ చూపించి నిరక్షరాస్యులు, నిరుపేదల ఆధార్ వివరాలతో పెద్ద ఎత్తున సిమ్ కార్డులు సృష్టించినట్టు విచారణలో తెలిసింది. 

ఎక్కువ సిమ్‌లు అమ్మితే ఎక్కువ కమిషన్ రావడంతో పాటు సైబర్ ముఠాల నుంచి డబ్బులు అందుతుండటంతో ఈ దందా విస్తరించినట్టు పోలీసులు తెలిపారు. అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్‌లను వెంటనే ఇ-సిమ్‌లుగా మార్చి విదేశాల్లో ఉన్న ప్రధాన సైబర్ ముఠాలకు పంపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఆ ముఠాలు భారత నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరచి మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి అమాయకులను వలలో వేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయి. సెక్స్‌టార్షన్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల్లో కూడా ఇదే నంబర్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. నంబర్ భారతదేశానికి చెందినదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ త్వరలో టెలికాం సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. కేవైసీ ప్రక్రియను కఠినతరం చేయడం, PoS ఏజెంట్లపై నిఘా పెంచడం, రియల్ టైమ్ వెరిఫికేషన్ అమలు చేయడం, సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్‌లను వెంటనే డీయాక్టివేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, OTPలను ఎవరితోనూ పంచుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తమ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

By
en-us Political News

  
పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం సందర్శించారు.
ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ఇరువురి మధ్యా ఆవేశాలు తగ్గలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు.
ఆ ఇద్దరు చిన్నారుల చిత్రాల దిగువ ప్రధాని మోది.. నిన్నటి రోజున నా ఇద్దరు చిన్నారి మిత్రులు నన్ను కలవడానికి సేవా తీర్ద్ కు వచ్చారు అని చెప్పుకురావడంతో.. ఎవరా చిన్నారులు అని అంతా ఆరా తియ్యడం మొదలు పెట్టారు.
నల్లా ఛానెల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి, గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. బ్యాటర్లందరూ సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ ఈ స్కోరును సాధించగలిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ థర లీటర్ కు 2.61 రూపాయలు, డీజిల్ ధర లీటర్ కు 2.71 రూపాయలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, డీజిల్ ధర రూ.95.20కు చేరింది.
ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు
కాలినడకన తిరుమల కొండ ఎక్కిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది
నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి తిరిగి దిగివస్తున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు
బెంగళూరు నగరం ఐటీ రంగానికి, స్టార్టప్‌లకు ఎంత ప్రసిద్ధి చెందిందో, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా అంతే పేరుగాంచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.