ఇరాన్, అమెరికా యుద్ధం ఎండ్ కార్డ్ ఆశలు మళ్లీ ఆవిరి?

Publish Date:May 25, 2026

Advertisement

ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం సుదీర్ఘంగా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖరారైందనీ, ఇక యుద్ధానికి ఎండ్ కార్డేనన్న వార్తల వినవచ్చాయి. అయితే.. ఆ ఒప్పందంలో అమెరికా విధించిన షరతులకు తాము అంగీకరించలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలను తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్  తెలిపింది.  ఇరాన్  తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశం నుంచి తరలించడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియాకు చెందిన  అల్ హదత్  మీడియా ప్రచురించిన కథనాన్ని తస్నిమ్  ఖండించింది. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.

అమెరికా, ఇరాన్ మధ్య జరగబోయే అవగాహన ఒప్పందం వివరాలు అంటూ.. అల్ హదత్ ప్రచురించిన నివేదిక పూర్తిగా అవాస్తవమని, ఇది అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమని తస్నిమ్  పేర్కొంది.  ఇప్పటివరకు ఉన్న ఒప్పంద ప్రతిపాదనలో అణు పదార్థాల తరలింపునకు సంబంధించిన నిబంధనలేవీ లేవని స్పష్టం చేసింది. శుద్ధి చేసిన యురేనియం తరలింపునకు ఇరాన్ అంగీకరించలేదని  తస్నిమ్ తన కథనంలో విస్పష్టంగా పేర్కొంది. 

 ఇలా ఉండగా, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ సోమవారం (మే 25)   వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను నిరాశపరచాలంటే దేశంలో ఐక్యత, సంఘీభావం అవసరమన్నారు.

కాగా, అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అంతకుముందు చెప్పారు.  14 క్లాజులతో కూడిన ఈ ఒప్పందంపై 30 నుంచి 60 రోజుల్లో తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని ఆపడం, నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఈ ఒప్పందంలో కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు. 

By
en-us Political News

  
దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది.
ముఖ్యంగా ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేళాడుతోంది. టీ20 ఫార్మాట్‌లో నాయకుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జట్టు ఓటమికి కెప్టెన్ బాధ్యత వహించక తప్పదు. ఈ నేపథ్యంలో మూడు జట్ల కెప్టెన్లు ఆ బాధ్యతల నుంచి వైదొలగడమో, ఉద్వాసనకు గురి కావడమో తప్పదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
11 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఆరు రూపాయలు పెరిగింది. మే 15న కిలో సీఎన్జీ పై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్‌లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది.
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.