కెప్టెన్సీ నుంచి ఆ ముగ్గురికీ ఉద్వాసనేనా?

Publish Date:May 26, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్  దశ పూర్తయ్యింది.  ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్  జట్లు ప్లేఆఫ్స్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి.మిగిలిన జట్లు  ఇంటిబాట పట్టాయి. ముఖ్యంగా ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేళాడుతోంది. టీ20 ఫార్మాట్‌లో నాయకుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జట్టు ఓటమికి కెప్టెన్ బాధ్యత వహించక తప్పదు. ఈ నేపథ్యంలో మూడు జట్ల కెప్టెన్లు ఆ బాధ్యతల నుంచి వైదొలగడమో, ఉద్వాసనకు గురి కావడమో తప్పదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఆ ముగ్గురూ ఎవరంటే.. లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ రిషభ్ పంత్,  కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్.

మొదటిగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్   విషయానికి వస్తే..  లక్నో జట్టుకు సారథిగా రిషభ్ పంత్ పరిస్థితి గడిచిన రెండేళ్లుగా ఏమాత్రం బాగాలేదు. భారీ రికార్డు స్థాయి జీతంతో ఈ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టిన పంత్, ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. 2025 మరియు 2026 వరుస సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును పాయింట్ల పట్టికలో ఏడో స్థానం కంటే ముందుకు తీసుకెళ్లడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడి అతడి బ్యాటింగ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ  ఐపీఎల్ సీజన్ మొత్తంలో పంత్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తన జట్టు కాగితంపై బలంగానే ఉందని పంత్ పదే పదే చెప్పినప్పటికీ, మైదానంలో సరైన వ్యూహాలు అమలు చేయడంలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడ్డాడు.  జట్టు సహాయక సిబ్బంది నిర్ణయాల జోక్యంపై అతడు అసంతృప్తిగా ఉన్నట్లు పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ పరిస్థితుల్లో పంత్ కెప్టెన్సీ భారాన్ని పక్కనపెట్టి, కేవలం..  బ్యాటర్‌గా తన మునుపటి ముద్రను చూపిస్తేనే అతడి కెరీర్‌కు మళ్లీ పూర్వవైభవం వస్తుంది.  

అలాగే..  కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే. రహానే మైదానం వెలుపల ఒక ప్రశాంతమైన, మంచి నాయకుడిగా కనిపించినప్పటికీ, ఒక ఓపెనింగ్ బ్యాటర్‌గా మాత్రం ఈ సీజన్ లో కేకేఆర్ జట్టుకు భారంగా మారాడు. ఆధునిక టీ20 క్రికెట్ వేగంగా దూసుకుపోతుంటే, రహానే పాతకాలపు యాంకర్ రోల్ పోషిస్తూ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు.   2026 సీజన్ లో ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో రహానే కేవలం 25.77 సగటుతో, అలాగే 135.08 స్వల్ప స్ట్రైక్ రేట్‌తో కేవలం 335 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మందకొడి బ్యాటింగ్ కారణంగా జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత   వేగవంతమైన టీ20 ప్రమాణాల ప్రకారం రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడమే కష్టంగా మారింది. అందువల్ల రహానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే, జట్టుకు కొత్త రక్తం అందుతుంది. అలాగే అవసరమైన కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లలో అతడిని పించ్ హిట్టర్‌గా లేదా ఒక అనుభవజ్ఞుడైన బ్యాటర్‌గా వాడుకోవడానికి మేనేజ్‌మెంట్‌కు వీలుంటుంది.  

చివరిగా  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న సిఎస్కేను నడిపించడం అంత సులువైన విషయం కాదు. అయితే రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం 2026 ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా మిగిలిపోయింది. కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ  ఘోరంగా విఫలమయ్యాడు. లీగ్ చివరి మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 21 బంతుల్లో 15 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 22 పరుగులు,  గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో   7 బంతుల్లో 16 పరుగులు చేసి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌లలో అతడి స్ట్రైక్ రేట్ 46.15 మరియు 71.43 మాత్రమే ఉండటం అతడి పూర్ ఫామ్ ను తెలియజేస్తుంది. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా గైక్వాడ్ తన సహజసిద్ధమైన ఆటను కోల్పోతున్నాడు. కాబట్టి.. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు తమ కెప్టెన్సీని వదులుకుని, కేవలం ఆటగాళ్లుగా మైదానంలోకి దిగితేనే అటు జట్లకు, ఇటు వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఆర్సీబీ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకుని బ్యాటర్ గా అమోఘంగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
ఒప్పందంలో అమెరికా విధించిన షరతులకు తాము అంగీకరించలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలను తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశం నుంచి తరలించడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియాకు చెందిన అల్ హదత్ మీడియా ప్రచురించిన కథనాన్ని తస్నిమ్ ఖండించింది. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.
11 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఆరు రూపాయలు పెరిగింది. మే 15న కిలో సీఎన్జీ పై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్‌లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది.
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.