సోము వీర్రాజుపై బొత్స కామెంట్స్ అభ్యంతరకరం : మంత్రి లోకేష్

Publish Date:Feb 24, 2026

Advertisement

 

శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇది వ్యక్తిగత దాడే  మంత్రి నారా లోకేష్ అన్నారు. శాంతిభద్రతల అంశంపై మండలిలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో చిలకలూరిపేటలో ప్రధాని సభను సరిగా నిర్వర్తించలేదని, దీంతో ఆ ఎస్పీని బదిలీ చేశారని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎత్తిచూపారు. 

దీనిపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు. సోము వీర్రాజు తన అవసరం కోసం ఎవరినో మెప్పించడానికి, భజన చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ, ప్రధాని ప్రస్తావన తీసుకురావడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యులు నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడి, లేనిపోని ఆరోపణలు చేసి వాకౌట్ చేయడాన్ని హోంమంత్రి అనిత తప్పుబట్టారు. అటు బొత్స వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. 

బొత్స వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. సభ్యులను మెప్పించడానికి మేం ఇక్కడకు రాలేదు. ఆ రోజు ప్రధాని సభలో మేమంతా పాల్గొన్నాం. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. కనీస భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయాయి. ఆనాడు ప్రధాని  మాట్లాడుతున్న సమయంలో మైక్ కూడా కట్ అయింది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీచేసి అధికారులను సస్పెండ్ చేసిన విషయం బొత్స తెలుసుకోవాలి. వాకౌట్ చేయడం ప్రతిపక్ష నేత బొత్సకు  ప్యాషన్. 

ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు. శాంతిభద్రతలపై చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత మాపై లేదా? వినాల్సిన బాధ్యత వారిపై లేదా? రెండు గంటలు కాగానే వారికి ఆకలేస్తుంది. దీంతో వాకౌట్ అని బయటకు వెళ్తారు. టైం చూశారు.. రెండు అయిందా లేదా అని. బొత్స అభ్యంతరకర పదాలను వినియోగించారు. సోము వీర్రాజు ఎవరో ఒకరిని మెప్పించాలనో, ఒక పార్టీని మెప్పించాలనో చూస్తున్నారంటూ ఆయనపై వ్యక్తిగత దాడికి దిగారని మండిపడ్డారు. ఇది సరికాదని, బొత్స వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్ ను కోరారు.

By
en-us Political News

  
40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్న నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
2019-24 సంవత్సరంలో 2032 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నర్, టీసీఎస్ , ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐబీఎం సిట్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అంతథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి.
భార్యపై అనుమానంతో పథకం ప్రకారం భార్యను భర్త హత్య చేశాడు.
నను అనేక మంది టార్గెట్ చేసుకున్నారనీ, ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని వ్యాఖ్యానించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ గా గుర్తించారు.కుటుంబమంతా ఒకేసారి ప్రాణాలు తీసుకోవ డం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేరళ అసెంబ్లీ మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో కేరళం అని పిలుస్తారని సీఎం విజయన్ గత ఏడాది తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా తెలిపారు. మలయాళ ప్రజలందరి కోసం ఐక్య కేరళ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ఉండేదని గుర్తు చేశారు.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో డబ్బులు, నగలు దోచుకుంటున్న మల్కాజిగి రికి చెందిన చిన్న రంగా నాయక్ అలియాస్ రామ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి షాదీ డాట్‌కామ్‌లో వేర్వేరు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అనుభవజ్ఞులైన అధికారుల తో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.