గత వైసీపీ పాలనలో 2032 దేవాలయాలపై దాడులు : సీఎం చంద్రబాబు

Publish Date:Feb 24, 2026

Advertisement

 

ఎన్డీయే సమావేశంలో టీటీడీ కల్తీ నెయ్యి అంశాన్ని జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఆధారంగానే ప్రస్తావించానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన పరిణామాలను వివరించారు.

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా దేవసంగీతం నియామకం, యూనివర్సిటీలో వేంకటేశ్వర స్వామి చిత్రాల తొలగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. టీటీడీ గ్రాంట్స్‌తో నడిచే పద్మావతి యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్‌ను వీసీగా నియమించడంపై, ఆమె హయాంలో బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ పరిణామాలపై హిందూ మఠాలు, పీఠాధిపతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. రాఘవేంద్ర మఠం, చక్రపీఠం తదితర సంస్థలు లేఖలు రాశాయని చెప్పారు.

టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని, అన్యమతస్తులను చైర్మన్లుగా నియమించారని విమర్శించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఇతర మత చిహ్నాలు దర్శనమిచ్చిన ఘటనలపై కూడా ప్రస్తావించారు. ఈ అంశాలపై వచ్చిన కథనాలకు ప్రతిగా వంద కోట్ల రూపాయల డిఫమేషన్ కేసులు వేశారని, ఆ కేసులను వాదించేందుకు సుబ్రమణ్య స్వామి వంటి వారు వచ్చారని తెలిపారు.

హెరిటేజ్ సంస్థ తమ కుటుంబ వ్యాపారమని, ప్రభుత్వం ఎక్కడా హెరిటేజ్ ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనలేదన్నారు. నెయ్యి వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ డెయిరీతో ముడిపెట్టారని ఆరోపించారు. పూణేలోని ఇందాపూర్ డెయిరీ అనేక ప్రముఖ కంపెనీలకు కో-మ్యానుఫాక్చరింగ్ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటనపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుందని తెలిపారు. హిందూ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించామని, శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం పదార్థాల కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అన్నప్రసాదం నాణ్యత మెరుగుపర్చామని, భక్తులకు 24 గంటలూ పాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. దర్శన వ్యవస్థలో మార్పులు చేసి సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కల్పించామని ముఖ్యమంత్రి వివరించారు.2019-24 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 2032 దేవాలయాలపై దాడులు జరిగాయని, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం, అంతర్వేది, బిట్రగుంట రథాల దగ్ధం, దుర్గగుడి వెండి సింహాల చోరీ వంటి ఘటనల్లో ఒక్కరిపైనా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 

దేశవ్యాప్తంగా 200 దేవాలయాల జీర్ణోద్ధరణ, 60 టీటీడీ దేవాలయాల్లో రూ.700 కోట్లతో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. తిరుమలలో గ్రీన్ కవర్ పెంపు, దివ్య ఔషధ వనం ప్రాజెక్టు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణం, అన్నదానం–ప్రాణదానం కార్యక్రమాల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. హిందూ మనోభావాలను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

By
en-us Political News

  
అమ్మ మాతృత్వానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్న నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నర్, టీసీఎస్ , ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐబీఎం సిట్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అంతథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి.
భార్యపై అనుమానంతో పథకం ప్రకారం భార్యను భర్త హత్య చేశాడు.
నను అనేక మంది టార్గెట్ చేసుకున్నారనీ, ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని వ్యాఖ్యానించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ గా గుర్తించారు.కుటుంబమంతా ఒకేసారి ప్రాణాలు తీసుకోవ డం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేరళ అసెంబ్లీ మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో కేరళం అని పిలుస్తారని సీఎం విజయన్ గత ఏడాది తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా తెలిపారు. మలయాళ ప్రజలందరి కోసం ఐక్య కేరళ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ఉండేదని గుర్తు చేశారు.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో డబ్బులు, నగలు దోచుకుంటున్న మల్కాజిగి రికి చెందిన చిన్న రంగా నాయక్ అలియాస్ రామ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి షాదీ డాట్‌కామ్‌లో వేర్వేరు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.