తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 24 గంటలు

 

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్ల లేని వారికి  సర్వ దర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu