ఇట్ ఈజ్ అఫీషియల్ నౌ.. పలాశ్ తో స్మృతి మంధానా వివాహం రద్దు

మ్యుజీషియన్ పలాశ్ ముశ్చల్ తో మహిళా క్రికెటర్ స్మృతి మంధానా వివాహం రద్దైంది. ఈ విషయాన్ని స్మృతి మంధానా స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. పలాశ్ తో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. 

ముందుగా నిర్ణయించిన మేరకు గత నెల 23న మంధానా, పలాశ్ ల వివాహం జరగాల్సి ఉంది. అయితే మంధానా  తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడిందని ఆ రోజు ప్రకటించారు. అప్పటి నుంచీ స్మృతి మంధానా వివాహంపై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ తెర దించుతూ తాజాగా స్మృతి మంధానా తమ వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.  గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఊగాహానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు పేర్కొన్న ఆమె.. తన వివాహం చుట్టూ జరిగిన చర్చ తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ఈ విషయానికి ముగింపు పలకాలని ఆమె కోరారు. తమ కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇస్తూ తన వివాహం విషయంలో ఊగాహాన సభలకు ముగింపు పలకాన్నారు.  

ఇలా ఉండగా.. ఈ వివాహం నిశ్చితార్ధం తరువాత రద్దు కావడానికి పలాశ్ ముశ్చల్ వ్యవహారమే కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పలాశ్ ముచ్చల్ పెద్దగా పెద్దగా పేరు లేని మ్యూజిక్ డైరక్టర్. చాలా కాలంగా స్మృతితో ప్రేమలో ఉన్నారు.  ఈ క్రమంలోనే వారి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తరువాత  పలాశ్ ముశ్చల్ వ్యవహారశైలిపై పలు అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఓ డాన్స్ మాస్టర్ తో ఎఫైర్, మరో మోడల్ తో అభ్యంతరకర చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆకారణంగానే పెళ్లి రద్దు అయినట్లుగా తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu