సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు
posted on Dec 8, 2025 3:03PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ జె. శంకర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక చెల్లదని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం అందులో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్దరామయ్యకు నోటీసులిచ్చింది.
సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వరుణ అసెంబ్లీ నుంచి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం చర్చ జరుగుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.