మాగంటి సునీతకు బీఫామ్ అందించిన కేసీఆర్

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. సునీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని గులాబీ బాస్ నివాసానికి వెళ్లారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల రూపాయలు చెక్కును అందించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu